-
మీరు పుట్టిన జిల్లా పేరు ఇవ్వండి: సీఎస్ మహంతి
కన్ఫర్డ్ ఐఏఎస్లకు సీఎస్ మహంతి ఆదేశం సాక్షి, హైదరాబాద్: కన్ఫర్డ్ ఐఏఎస్ అధికారులు తాము పుట్టిన జిల్లా పేరుతోపాటు, తల్లిదండ్రులు పుట్టిన జిల్లా సమాచారాన్ని కూడా నాలుగురోజుల్లో విధిగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 23వ తేదీలోగా ఉత్తర్వుల్లో జారీ చేసిన నమూనా పత్రం ఆధారంగా వివరాలు అందించాలని ఆయన శనివారం ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర రెవెన్యూ సర్వీసు, రెవెన్యూయేతర సర్వీసుల నుంచి ఐఏఎస్లుగా ఎంపికైన వారు ఏ సంవత్సరంలో ఐఏఎస్ కోటాలో ఎంపికయ్యారు.? పుట్టిన జిల్లా, తల్లిదండ్రులు పుట్టిన జిల్లా, పాఠశాల విద్యలో నాల్గో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఎక్కడ చదివారు..? పదవ తరగతి/తత్సమాన పరీక్ష ఏ జిల్లాల్లో ఉత్తీర్ణులయ్యారు..? ఎస్సీ/ఎస్టీ/బీసీ/అన్ రిజర్వ్డ్ కేటగిరీనా.? అన్న వివరాలను కూడా సచివాలయంలోని సాధారణ పరిపాలన విభాగం అదనపు కార్యదర్శికి అందించాలని మహంతి ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. జూన్ 2వ తేదీ నుంచి ఏర్పాటు కానున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కన్ఫర్డ్ ఐఏఎస్లను కేటాయించడానికి వీలుగా ఈ వివరాలు కోరారు. -
మహంతి పదవీ కాలం పొడిగింపుపై తీర్పు వాయిదా
హైదరాబాద్: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతి పదవీ కాలం పొడిగింపు వ్యవహారంలో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై తీర్పును వాయిదా వేస్తున్న హైకోర్టు బుధవారం ప్రకటించింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మొన్నటి వరకు సాగిన వాదనలను ఇటు పిటిషనర్లు, ఇటు ప్రభుత్వం, మహంతి రెండు పేజీలకు మించకుండా వేర్వేరుగా రాతపూర్వకంగా బుధవారం ధర్మాసనం ముందుంచారు. వీటిని పరిశీలించిన ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన ప్రసన్నకుమార్ మహంతి పదవీ కాలాన్ని పొడిగించడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్కు చెందిన ఎం.చంద్రమౌళీశ్వరరావు, విజయవాడ, పటమటకు చెందిన కన్జ్యూమర్స్ గెడైన్స్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ సి.హెచ్.దివాకర్బాబు వేర్వేరుగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
మహంతి కొనసాగింపుపై హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: పదవీ విరమణ చేసిన ప్రసన్నకుమార్ మహంతిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగించడంపై హైకోర్టు సోమవారం స్పందించింది. కేబినెట్ సిఫారసు లేకుండా మహంతిని ఎలా ప్రధాన కార్యదర్శిగా కొనసాగిస్తున్నారో వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్జ్యోతి సేన్గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్కుమార్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మహంతికి కూడా నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. మహంతిని సీఎస్గా కొనసాగించడం ఐఏఎస్ నిబంధనలకు విరుద్ధమని, అందువల్ల ఆయన కొనసాగింపు జీవోను రద్దు చేయాలని కోరుతూ విజయవాడకు చెందిన సి.హెచ్.దివాకర్బాబు, మరొకరు వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. -
కొత్త సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు?
గడువు పొడిగించుకునేందుకు మహంతి విముఖత సాక్షి, హైదరాబాద్: సమైక్య రాష్ట్రంలో కొత్త సీఎస్గా ఐవైఆర్ కృష్ణారావు నియమితులయ్యే అవకాశముంది. ఆయన ప్రస్తుతం భూ పరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ)గా పనిచేస్తున్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ప్రసన్నకుమార్ మహంతి ఈ నెల 28వ తేదీతో పదవీ విరమణ చేయనున్నారు. పదవీ విరమణ తరువాత మరో మూడు నెలలు గడువు పొడిగించుకుని కొనసాగే అవకాశం ఆయనకు ఉంది. కానీ ఇందుకు ఆయన విముఖంగా ఉన్నారు. వాస్తవానికి కేంద్ర సర్వీసులో ఉన్న మహంతి.. అప్పట్లో సీఎం కిరణ్కుమార్రెడ్డి కోరిక మేరకు రాష్ట్ర సర్వీసుకు వచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర విభజన నేపథ్యంతోపాటు తాను రాష్ట్ర సర్వీసుకు రావడానికి కారణమైన కిరణ్కుమార్రెడ్డి కూడా సీఎం పదవికి రాజీనామా చేయడంతో సీఎస్గా గడువు పొడిగించుకోవాలనే ఆలోచనను విరమించుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన ఈ నెల 28తో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆయన స్థానంలో రాష్ట్ర కేడర్కు చెందిన 1979 ఐఏఎస్ బ్యాచ్ ఐవైఆర్ కృష్ణారావు సమైక్య రాష్ట్రంలో కొత్త సీఎస్గా నియమితులవుతారని భావిస్తున్నారు. ఒకవేళ ఈ నెల 28లోగా సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన పక్షంలో.. కొత్త సీఎస్ నియామకాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుంది. లేదంటే ప్రభుత్వం లేదా గవర్నర్ కొత్త సీఎస్ను ఎంపిక చేస్తారు. మహంతి తరువాత సీనియర్గా ఐ.వి.సుబ్బారావు ఉన్నారు. అయితే ఆయన యునెస్కోలో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీసీఎల్ఏగా పనిచేస్తున్న ఐవైఆర్ కృష్ణారావు సీనియర్ కావడంతో కొత్త సీఎస్ ఆయనే కానున్నారని అధికార వర్గాల సమాచారం. కృష్ణారావు సర్వీసు 2016 జనవరి వరకు ఉంది. -
రోడ్డుకు అడ్డంగా ఉన్న ప్రార్థనా మందిరాలు తొలగించండి
సాక్షి, హైదరాబాద్: పట్టణాలు, నగరాల్లోని రహదారులపై అనుమతి లేకుండా అడ్డంగా వెలసిన ప్రార్థనా మందిరాలను నెలరోజుల్లోగా తొలగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ప్రసన్న కుమార్ మహంతి పురపాలక శాఖను ఆదేశించారు. రహదారులపై వెలసిన ప్రార్థనా మందిరాలు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పును తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఇటీవల దీనిపై నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని మెమో రూపంలో పురపాలక శాఖతోపాటు, జిల్లాల పోలీసు ఉన్నతాధికారులు, కలెక్టర్లు, అన్ని మున్సిపాలిటీల కమిషనర్లకు పంపారు. జిల్లాల్లో కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్లతో కమిటీ ఏర్పాటు చేసి పట్టణాలు, నగరాల్లోని అనధికార ప్రార్థనా సంస్థలను తొలగించడం, అడ్డంకిగా మారిన వాటిని స్థానిక ప్రజలు, మతపరమైన నాయకులను సంప్రదించి వాటిని మరోచోటకు తరలించే కార్యక్రమాలు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రతీనెలా దీనికి సంబంధించి నివేదికలను పురపాలక శాఖ సంచాలకులకు ఇవ్వాలని ఆదేశించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
Advertisement