-
టైమ్స్ నౌ సర్వేలో ఫ్యాన్ ప్రభంజనం
-
ఇంకో యాభై ఏళ్లలో ఆ దేశం అదృశ్యం!
మరో యాభై ఏళ్లలో ఆ దేశం ఉనికిలో ఉండకపోవచ్చు. పూర్తిగా సముద్రంలో మునిగిపోవచ్చు. ఇప్పటికే ఆ దేశం క్రమంగా సముద్రంలోకి కుంగిపోతోంది. ఆ దేశం ఏమిటి? ఎక్కడుంది అనుకుంటన్నారా? ఫిజీకి ఉత్తరాన వెయ్యి కిలోమీటర్ల దరంలో పసిఫిక్ సముద్రంలో ఉన్న ఈ న్న ద్వీపదేశం పేరు ‘తువాలు’. దీని విస్తీర్ణం 25 చదరపు కిలోమీటర్లు, జనాభా 11,900. ఈ దేశానికి ఒక విమానాశ్రయం ఉంది. వారానికి మూడు విమానాలు మాత్రమే ఇక్కడి నుంచి రాకపోకలు జరుపుతాయి. విమానాల రాకపోకలు లేని సమయంలో పిల్లలు రన్వే మీద ఆటలాడుకుంటూ కనిపిస్తారు. ఈ దేశం పర్యాటకంలో అత్యంత వెనుకబడిన దేశంగా ఐక్యరాజ్య సమితి ఇటీవల ప్రకటించింది. తువాలును ఏటా సందర్శించే పర్యాటకులు సగటున 3,700 మంది మాత్రమే! ఈ దేశంలోని ప్రధాన ద్వీపంలో మనుషులు నివసిస్తుంటారు. ఈ దేశంలో భాగంగా నాలుగు పగడపు దీవులు కూడా ఉన్నాయి. ఈ దేశంలో హోటళ్లు, రెస్టారెంట్ల సంఖ్య కూడా తక్కువే! విత్రమైన ప్రదేశాలను చూడాలనుకునే ఉబలాటం గల కొద్దిమంది తప్ప వినోదయాత్రల కోసం పర్యటనలకు వెళ్లేవారెవరు ఈ దేశంవైపు చూడరు. ఈ దేశంలో ఏటీఎంలు ఉండవు. అందువల్ల డబ్బు కావాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిందే! పర్యావరణ మార్పుల కారణంగా సముద్రజలాలు పెరుగుతూ వస్తుండటంతో ఈ దేశం మరో యాభయ్యేళ్లలోగా పూర్తిగా నీట మునిగిపోతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ దేశం చుట్టుపక్కల ఉన్న కొన్ని చిన్న చిన్న దీవులు ఇప్పటికే సముద్రంలో కలిసిపోయాయి. (చదవండి: అతని వయసు 90..బాడీ పరంగా యువకుడే! ఎలాగంటే..) -
11 ఏళ్ల కనిష్టానికి జీడీపీ అంచనాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థికమందగమనంపై ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5 శాతం వృద్ధిని ప్రభుత్వం అంచనా వేయడం గమనార్హం. కేంద్ర గణాంక కార్యాలయం మంగళవారం విడుదల చేసిన మొదటి ముందస్తు అంచనాల ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత నామమాత్రపు స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిని నమోదు చేయనుంది. గత ఏడాది వృద్ధి రేటు 6.8 శాతంతో పోలిస్తే 5 శాతం వృద్ధికి పరిమితం కానుందని ప్రభుత్వ లెక్కలు తెలిపాయి. ఇది 11 ఏళ్ల కనిష్టం. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో వార్షిక ఆర్థిక వృద్ధి 4.5 శాతానికి తగ్గింది. దీంతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే నెలలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో అదనపు ఆర్థిక ఉద్దీపనలకు అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే వ్యక్తిగత పన్నుల్లో రాయితీలను, గత ఏడాది కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించిన తరువాత మౌలిక సదుపాయాల కోసం ఖర్చులను పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారులు, ఆర్థికవేత్తలు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి క్రమంగా పెరుగుతుందని ప్రైవేట్ ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. తాజా వృద్ధి సంఖ్య వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆదాయ అంచనాలను , ప్రభుత్వ వ్యయాన్ని ప్రభావితం చేస్తుందని ఢిల్లీకి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీలో ఆర్థికవేత్త ఎన్.ఆర్. భానుమూర్తి వ్యాఖ్యానించారు.అయితే 2020/21 లో వృద్ధి 6 నుంచి 6.5 శాతానికి చేరుకునే అవకాశం ఉందన్నారు. 2018-19 లో 6.9 శాతం వృద్ధితో పోలిస్తే 2019-20 లో తయారీ 2.0 శాతం పెరుగుతుందని అంచనా వేసినట్లు గణాంకాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతకుముందు సంవత్సరం 8.7 శాతంతో పోలిస్తే 2019/20 లో నిర్మాణం 3.2 శాతం పెరిగే అవకాశం ఉండగా, వ్యవసాయ రంగం 2.8 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. అంతకుముందు ఏడాది ఇది 2.9 శాతంగా ఉంది. సవరించిన పూర్తి సంవత్సర వృద్ధి అంచనాలతో పాటు, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో వృద్ధి డేటాను గణాంక మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 28 న విడుదల చేయనుంది. కాగా 2025 నాటికి భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే ప్రయత్నంలో వచ్చే ఐదేళ్లలో మౌలిక సదుపాయాల కోసం 102 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే ప్రణాళికను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఫిఫా 2018: తొలి గెలుపు ఆతిథ్య దేశానిదే!
మాస్కో: ఫిఫా ప్రపంచకప్ కొద్ది గంటల్లో అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో ఆతిథ్య జట్టు రష్యా, సౌదీ ఆరేబియాతో తలపడనుంది. అయితే ఎనిమిది నెలలుగా ఒక్క విజయం లేని రష్యా జట్టుకు, అభిమానులకు ఊరటనిచ్చే వార్త. 2010 ఫిఫా ప్రపంచ కప్లో ఆక్టోపస్ పాల్ మ్యాచ్కు ముందే ఏ జట్టు విజయం సాధిస్తుందో జోస్యం చెప్పి అందరీనీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. తాజాగా 2018 ఫిఫా ప్రపంచ కప్లో ఒక చెవిటి పిల్లి అచిల్లె వార్తల్లో నిలిచింది. మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందో ముందే చెప్పేలా కొందరు నిర్వాహకులు అచిల్లెకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మ్యాచ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు పాల్గొనే జట్ల జెండాలు, వాటి పక్కన ఆహారంతో నింపిన బాక్స్లు ఉంచుతారు. అచిల్లె ఏ జెండా పక్కన ఉన్న బాక్స్లోని ఆహారం తీసుకుంటే ఆ జట్టు గెలుస్తుందని అభిమానుల నమ్మకం. నేడు జరిగే రష్యా, సౌదీ అరేబియా జెండాలను ఉంచగా అచిల్లె రష్యా జెండా పక్కనున్న బాక్స్లోని ఆహారం తీసుకుంది. దీంతో నిర్వాహకులు నేటి మ్యాచ్ విజేత ఆతిథ్య రష్యా అని జోస్యం చెబుతున్నారు. ఇక నేటి ఆరంభ మ్యాచ్లో రష్యా గెలిస్తే అచిల్లెకు మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉంది. మరి రాత్రి 8.30 గంటలకు మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో ప్రారంభమయ్యే మ్యాచ్లో సౌదీపై రష్యాగెలుస్తుందో లేదో వేచి చూడాలి. -
ఈ రెండు నెలల్లో ట్రంప్కు ముప్పుందా?
న్యూయార్క్: అమెరికా అంతర్జాతీయ ట్రేడ్ సెంటర్పై లోహ విహంగాలు దాడి చేస్తాయని, ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులు పెరుగుతారని, సునామీ వచ్చి వేలాది మంది చనిపోతారని కచ్చితంగా జోస్యం చెప్పిన బల్గేరియా ప్రవక్త బాబా వాంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ వర్గీయుల్లో ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. అమెరికా 44వ అధ్యక్షుడిగా ఆఫ్రికన్–అమెరికన్ ఎన్నికవుతారని, ఆయనే అమెరికాకు ఆఖరి అధ్యక్షుడవుతారని మరో నాస్ట్రాడామస్గా పేరుపొందిన బాబా వాంగా వినిపించిన భవిష్యవాణి అంతరార్థం ఎమిటన్నది ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఆమె చెప్పినట్లుగానే బరాక్ ఒబామా అమెరికా 44వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మరీ ఆయన ఆఖరి అధ్యక్షుడవుతారంటే ఏమిటి? 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పటికీ ఆయన వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన పదవీ బాధ్యతలు స్వీకరిస్తారనే విషయం తెల్సిందే. అప్పటి వరకు బరాక్ ఒబామే దేశాధ్యక్షుడు. అప్పటివరకు దేశంలో ఏమైనా ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయా? ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చినందున ఇస్లామిక్ టెర్రరిస్టులు ఆయనపై దాడులు చేసే అవకాశం ఉందా? లేక ఆయనే దేశాధ్యక్ష వ్యవస్థను మార్చేసి మరో వ్యవస్థను తీసుకొస్తారా, అందుకు అమెరికా పార్లమెంట్ రాజ్యాంగ వ్యవస్థ అనుమతిస్తుందా ? రష్యాలో కొన్ని వర్గాలు భావిస్తున్నట్లుగా మూడవ ప్రపంచ యుద్ధం జరుగుతుందా? అందులో అమెరికా అధ్యక్ష వ్యవస్థ కుప్పకూలి పోతుందా? ఇంకేమీ అనూహ్య పరిణామాలు జరగవచ్చనే సందేహాలు అమెరికన్లతోపాటు పలు దేశాల ప్రజల్లో కలుగుతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు బాబా వాంగా ఇప్పుడు బతికి లేరు. గుడ్డి బాబాగా కూడా గుర్తింపు పొందిన ఆమె 1996లోనే తన 85వ ఏటా మరణించారు. ప్రపంచ పరిణామాల గురించి 1950 నుంచి ఆమె వినిపించిన భవిష్య వాణిలో 85 శాతం నిజం అయ్యాయి. దాంతో ఆమె వ్యాఖ్యలపై ఎక్కువ మంది ప్రజలకు నమ్మకం కుదిరింది. భూగోళంపైనా శీతల ప్రాంతాలు వేడెక్కుతాయి. అగ్ని పర్వతాలు మేల్కొంటాయని, సముద్ర తీరాన అతి పెద్ద వలలొచ్చి ఇళ్లను, ఊళ్లను ముంచేస్తుందని, ప్రతిదీ నీట మునిగి పోతుందని 1950వ దశకంలో వాంగా జోస్యం చెప్పారు. ఆమె జోస్యం ప్రకారమే 2004, డిసెంబర్ 26నాడు సుమత్రా దీవుల్లో (ఇండోనేషియా) సునామీ వచ్చిందని అంటారు. అప్పుడు 9.3 తీవ్రతతో భూకంపం రావడం వల్ల సముద్రపు అలలు దాదాపు వంద అడుగుల వరకు విరుచుకుపడడంతో 14 దేశాల తీర ప్రాంతాలు నీట మునిగాయి. దాదాపు 2,30,000 మంది మరణించారు. ఇప్పటి వరకు చరిత్రలోనే అదే అత్యంత ప్రళయంగా చరిత్రకారులు కూడా చెబుతున్నారు. ‘అమెరికా సోదరులపై లోహ విహంగాలు దాడి చేస్తాయి. పొదల్లో నుంచి తోడేళ్ల అరుపులు వినిపిస్తాయి. అమాయకుల రక్తపాతం జరుగుతుంది’ అని వాంగా 1989లో జోస్యం చెప్పారు. అమెరికా ట్రేడ్ సెంటర్పై జరిగిన 9–11 దాడుల గురించే ఆమె ప్రస్తావించారని అంటారు. 2016లో యూరప్ దేశాలపై ముస్లింలు దాడులు చేస్తారని కూడా ఆమె చెప్పారు. ‘దశాబ్దం అంతంలో రష్యా జలాంతర్గామిలోకి నీళ్లు జొరబడుతాయి. ప్రపంచ ప్రజలంతా తల్లడిల్లుతారు’ అని వాంగా 1980 దశకంలో జోస్యం చెప్పారు. 2000 సంవత్సరంలో కుర్స్క్ అనే రష్యా అణు జలాంతర్గామిలోకి అన్ని వైపుల నుంచి నీళ్లు జొరబడి మునిగిపోతుండగా, దాన్ని మునగకుండా రక్షించేందుకు అంతర్జాతీయ రిస్క్ టీమ్ తీవ్రంగా కృషి చేసింది. ఈ విషయంలో కూడా ఆమె జోస్యం అక్షరాల నిజమైందని అన్వయించి చెప్పేవాళ్లు, నమ్మే వాళ్లు ప్రపంచంలో ఎక్కువగానే ఉన్నారు. అమెరికా భవిష్యత్ గురించి వాంగా ఒక్కరే కాదు, ‘స్ట్రాట్ఫర్’ అనే ప్రైవేట్ ఇంటెలిజెన్స్ సంస్థ కూడా భవిష్య వాణిని వినిపించింది. ఇదివరకటిలా అమెరికా ప్రపంచ పరిణామాలపై అంతగా దృష్టిని పెట్టదని దేశ ఆర్థిక, సైనిక అంశాలపైనే ప్రధానంగా దృష్టి పెడుతుందని ఆ సంస్థ తెలిపింది. ఈ రెండు అంశాలకు తాను ప్రాధాన్యత ఇస్తానని ట్రంప్ చెప్పడం ఇక్కడ గమనార్హం. వాంగా చెప్పినట్లు ట్రంప్ విషయంలో ఏమీ జరుగకపోవచ్చు! ఎందుకంటే ఆమె చెప్పిన వాటిలో 15 శాతం నిజం కాలేదుకదా! -
భూమండలాన్ని శాసించనున్న ఏఐ
శాన్ఫ్రాన్సిస్కో: కృత్రిమ మేథస్సు (ఏఐ) మనకు కావాల్సిన వంటచేసి పెడుతుంది. కాలక్షేపానికి మనకు కబుర్లు చెబుతుంది. మనకు నచ్చే ఆట ఆడుతుంది. మనతో గెలుస్తోంది. ఈ భూమండలంపైనా ఇంటర్నెట్తో అనుసంధానించిన ప్రతి పరికరాన్ని నియంత్రిస్తోంది. ఆ రోజు ఎంతో దూరం లేదు. నేడు క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ పోటాపోటీగా అభివృద్ధిలో దిశలో దూసుకుపోతున్నాయి. కొన్ని వందల ఏళ్లకు కృత్రిమ మేథస్సుకు సహజత్వం సిద్ధించి యజమాని ఎవరో, సర్వెంట్ ఎవరో అర్థంకాని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ భవిష్యత్ వాణిని వినిపించిందీ మరెవరో కాదు. ఏఐ పరిశోధనలపై భారీ పెట్టుబడులు పెడుతున్న ఆండ్రాయిడ్ సహ వ్యవస్థాపకుడు ఆండీ రూబిన్. ఆయన కాలిఫోర్నియాలో జరిగిన బ్లూమ్బర్గ్ టెక్ సదస్సులో మాట్లాడుతూ ఈ మాటలు చెప్పారు. కృత్రిమ మేథస్సుకు సంబంధించి తాను చెబుతున్న మాటలు ప్రస్తుతానికి థియరీనేనని, కానీ సమీప భవిష్యత్తులోనే ఇది నిజమైన అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఆయన క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ అభివృద్ధి సంస్థలో 3,000 లక్షల డాలర్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు. అయితే ఆ కంపెనీ పేరును మాత్రం ఆయన వెల్లడించలేదు. కృత్రిమ మేథస్సు పెరగడం వల్ల ఐటీ పరిశ్రమలో భారీగా ఉద్యోగావకాశాలు పడిపోతాయని, ఐటీ టెక్కులు చేసే పనులను రోబోలే ఎక్కువగా చేస్తాయని ఎంతోమంది ఏఐ నిపుణులు ఇప్పటికే చెబుతున్నారు. బాస్ ఎవరో, సర్వెంట్ ఎవరో తెలియని పరిస్థితి ఏర్పడితే మాత్రం మనిషి, తాను సాధించిన సాంకేతిక ప్రగతితోనే యుద్ధం చేయాల్సి వస్తుందేమో! -
మరో ఐదు రోజులు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా మరో ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు మాత్రమే కురిశాయని వెల్లడించింది. శనివారం ఆదిలాబాద్లో అత్యధికంగా 43.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డు అయింది. మరోవైపు హైదరాబాద్లో శనివారం వాతావరణం బాగా చల్లబడింది. 34.5 డిగ్రీల గరిష్ట, 27 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు బేగంపేటలోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రాంతం ఉష్ణోగ్రత ఆదిలాబాద్ 43.3 రామగుండం 41.0 నిజామాబాద్ 40.3 మెదక్ 37.6 భద్రాచలం 35.0 నల్లగొండ 34.6 హైదరాబాద్ 34.5 హకీంపేట 33.9 ఖమ్మం 32.2 -
ఈ వేసవి చాలా హాట్
* ‘గ్లోబల్ వార్మింగ్’తో భానుడి భగభగలు.. ఫిబ్రవరి 15 నుంచే సెగలు * ఉధృతంగా వడగాలులు..పొంచి ఉన్న తాగునీటి ఎద్దడి * ఇప్పటికే గ్రామాల్లో ట్యాంకర్లతో సరఫరా * కోస్తాలో నీటి కష్టాలు * వాతావరణ శాస్త్రవేత్తల హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: ఈ వేసవిలో భానుడి భగభగలు తీవ్రరూపం దాల్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మండే ఎండలకు తోడు వడగాల్పులూ తప్పేలా లేవు. వర్షాభావం, భూతాపంతో తాగునీటి ఎద్దడి అధికం కానుంది. వర్షాభావ పరిస్థితులు.. తగ్గిపోతున్న ‘గ్రీన్ కవర్’ (పచ్చదనం).. విచ్చలవిడిగా భూగర్భ జలాలను తోడేయడం.. లాంటి కారణాలవల్ల గ్లోబల్ వార్మింగ్ తీవ్రత పెరుగుతోంది. ఫలితం గా ఈ వేసవిలో కష్టాలు తప్పవని వాతావరణ శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఫిబ్రవరి 15 నుంచే ఎండల తీవ్రత ‘ఈశాన్యం’ ముగిసిపోయింది. ఇక మార్చి, ఏప్రిల్లో అక్కడక్కడా జల్లులు మినహా చెప్పుకోతగ్గ వర్షాలు కురిసే అవకాశం లేదు. ఈ ఏడాది ఎండల తీవ్రత వచ్చేనెల 15 - 20 తేదీల నుంచే ఆరంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణవేత్తలంటున్నారు. గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో గతంకంటే ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని, దీనివల్ల హాట్ సమ్మర్ను ఎదుర్కోక తప్పదని వారు పేర్కొంటున్నారు. వర్షాభావంతో చెరువులు, జలాశయాలు, వాగులు, నదుల్లో నీరు లేకపోవడం, కాంక్రీట్ జంగిల్స్లా మారుతున్న గ్రామాలు, పట్టణాలు, ‘గ్రీన్ కవర్’ తగ్గిపోవడంవల్ల భూమి అధికంగా వేడెక్కుతోంది. దీనికి పెరిగే ఉష్ణోగ్రతలు తోడుకావడంవల్ల ఎండల తీవ్రత ఎక్కువయ్యే అవకాశం ఉంది. మండే వేసవిలో (ఏప్రిల్ - మే నెలల్లో) వడగాలుల తీవ్రత అధికం కానుంది. దీనివల్ల వృద్ధులు, పిల్లలు మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది. వడదెబ్బ మరణాల సంఖ్య గతంకంటే పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాగునీటి సమస్య ఉధృతమయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఈసారి సీమ కొంచెం మెరుగే.. గతంలో వేసవి వచ్చిందంటే రాయలసీమ జిల్లాల్లో తాగునీటి కష్టాలు అధికంగా ఉండేవి. ఈ వేసవిలో ఇందుకు భిన్నమైన పరిస్థితి ఏర్పడనుంది. గత డిసెంబరులో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండవల్ల చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు కురవడంతో భూగర్భ జలమట్టంపైకి వచ్చింది. అనంతపురం జిల్లాలోని సగం ప్రాంతంలో కూడా చెప్పుకోతగ్గ వర్షం కురిసింది. రాయలసీమకు సంబంధించి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వచ్చే వేసవిలో నీటి ఎద్దడి ప్రమాదం ఉంది. కృష్ణా, గోదావరి డెల్టాల్లో ఇప్పటికే తాగునీటి కష్టాలు తీవ్రరూపం దాల్చాయి. కోస్తా ప్రాంతంలోని ప్రకాశం, గుంటూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో భూగర్భ జలమట్టం అడుగంటుతోంది. వచ్చే ఏప్రిల్ తర్వాత తాగునీటి సమస్య ఎక్కువయ్యే పరిస్థితి ఉంది. వేసవి కష్టాలు అధిగమించేందుకు ఫిబ్రవరిలో కంటింజెన్సీ ప్లాన్ రూపొందించుకుంటామని గ్రామీణ మంచినీటి సరఫరా, పురపాలక అధికారులు అంటున్నారు. ఇప్పటికే మొదలైన కష్టాలు.. చలికాలం పూర్తికాకముందే పట్టణాలు, నగరాల్లో మంచినీటికి కటకట కట ఆరంభమైంది. గత ఏడాది నీటి కరువును దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాదైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. రాష్ట్రంలో మొత్తం 110 మున్సిపాలిటీలుండగా గత ఏడాది 60 మున్సిపాలిటీలలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. ఈ ఏడాది కనీసం 100 మున్సిపాలిటీల్లో తీవ్ర నీటి ఎద్దడి ఉంటుందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 110 మున్సిపాలిటీ పరిధిలో 11వేల బోర్లు ఎండిపోయినట్టు అంచనా. కాగా గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి అవసరాలకు 1437 సమ్మర్ స్టోరేజీ (ఎస్ఎస్) ట్యాంకులు ఉండగా.. జనవరి 15 నాటి లెక్కల ప్రకారం 86 పూర్తిగా అడుగంటాయి. మరో 495 ట్యాంకుల్లో సగానికి తక్కువ పరిమాణంలో నీరు ఉంది. నిండు శీతాకాలమైనా ఇప్పటికే రాష్ట్రంలో 252 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారానే మంచినీరు అందిస్తున్నారు. ఇక రెండు నెలల తర్వాత వచ్చే వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. ఈ ఏడాది నాగార్జున సాగర్ కాల్వలకు నీటి విడుదల లేని కారణంగా గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఎక్కువ గ్రామాలకు ఈ సీజనులోనే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుంటూరు జిల్లాలో 74 ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో 70 , ప్రకాశం జిల్లాలో 59, అనంతపురం జిల్లాలో 36 ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కొనసాగుతోంది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పరిధిలో తాగునీటి కష్టాలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. నగరానికి తాగునీరు అందించే ప్రధాన వనరులైన రైవాడ, సీలేరు జలాశయాల్లో నీరు ఇప్పటికే అడుగంటుతోంది. భూగర్భ జలమట్టం కూడా పడిపోయింది. అడుగంటిన జలాశయాలు రాష్ట్రంలో జలాశయాలు అడుగంటాయి. రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటికి ఆధారమైన శ్రీశైలం ఇప్పటికే అడుగంటింది. గరిష్ట నీటి మట్టం 885 అడుగులు, గరిష్ట నీటి నిల్వ 215.8 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 832.3 అడుగల మట్టం వద్ద 51.8 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇందులో డెడ్ స్టోరేజీని తీసేస్తే, 18 టీఎంసీలను మాత్రమే వినియోగించుకోగలమని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. నాగార్జున సాగర్ గరిష్ట నీటి మట్టం 590 అడుగులు, గరిష్ట నీటి నిల్వ 312 టీఎంసీలు. ప్రస్తుతం సాగర్లో 507.3 అడుగుల మట్టం వద్ద 127 టీఎంసీల నీటి నిల్వ ఉంది. వేసవి కాలాన్ని నెట్టుకురావడం కష్టమే. ప్రాజెక్టు నీటి మట్టం(అడుగుల్లో) నీటి నిల్వ(టీఎంసీల్లో) గత ఏడాది ప్రస్తుతం గత ఏడాది ప్రస్తుతం శ్రీశైలం 844.4 832.3 69 51.8 సాగర్ 541.2 507.3 190.84 127 ఈ వేసవిలో కష్టాలే - ‘సాక్షి’తో విశ్రాంత వాతావరణ శాస్త్రవేత్త మురళీకృష్ణ రానున్న వేసవిలో ఎండల తీవ్రతతో పాటు తాగునీటి కష్టాలు అధికంగా ఉంటాయని విశాఖపట్నానికి చెందిన విశ్రాంత వాతావరణ శాస్త్రవేత్త మురళీకృష్ణ తెలిపారు. వచ్చేనెల 15 నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపారు. రానున్న వేసవి పరిణామాలపై ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ‘‘కృష్ణా, గోదావరి బేసిన్లలో ఇప్పటికే తీవ్ర సాగునీటి సమస్య ఉంది. వర్షాభావంవల్ల భూగర్భ జలమట్టం పాతాళానికి వెళ్లింది. విశాఖ మహానగరంలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. బీచ్రోడ్డు పరిసరాల్లో సముద్రనీరు భూగర్భంలోకి చొచ్చుకు వస్తోంది. దీనినే సెలెనిటీ సమస్య అంటారు. మరికొన్ని తీర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. భూగర్భ జలమట్టం కిందకు వెళ్లేకొద్దీ ఈ ప్రమాదం ఎక్కువ. ఈశాన్య రుతుపవనాలు ముగిశాయి. ఇక ఇప్పట్లో వర్షాలకు అవకాశం లేదు. జూన్లో నైరుతీ రుతుపవనాల ద్వారానే వర్షాలు రావాల్సి ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి. వడగాల్పులూ తప్పవు. ఇష్టారాజ్యంగా భూగర్భం నుంచి నీటిని తోడేయడం వల్ల ముంబై తరహా ప్రమాదాన్ని మనమూ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలా కాకుండా ఉండాలంటే నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించాలి. బహుళ అంతస్తుల కల్చర్ను తగ్గించుకోవాలి. వర్షపు నీటిని భూమిలోకి ఇంకిపోయేలా ప్రతిఒక్కరూ తమ వంతు ప్రయత్నాలు చేయాలి. ఈ దిశగా కూడా ప్రజలకు అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టాలి.’’ అని మురళీ కృష్ణ పేర్కొన్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
బిగ్బాస్ బ్యూటీకి చేదు అనుభవం.. నెల రోజులైనా రాలేదు!
Tirupati Gangamma Jatara 2024: తిరుపతిలో ఘనంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)
క్యార్వ్యాన్లోకి వచ్చి అతడలా చేసేసరికి భయపడ్డా: కాజల్ అగర్వాల్
ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ డౌన్.. హెడ్ ఔట్
'బ్లాక్ మిర్రర్ ఎపిసోడ్'.. సత్యనాదెళ్ళ వీడియోపై మస్క్ కామెంట్
టీమిండియా హెడ్ కోచ్ పదవిపై హర్భజన్ ఆసక్తి..?
ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మా?: మంత్రి బొత్స కౌంటర్
రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
Indian 2 Paaraa Song Promo: కమల్ హాసన్ ఇండియన్-2.. ప్రోమో వచ్చేసింది!
SRH: అతడి లాగే నన్నూ ఆశీర్వదించండి: అభిషేక్ తల్లికి అర్ష్దీప్ రిక్వెస్ట్ (ఫొటోలు)
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement