-
వాడుకున్నంత!
సాక్షి, మెదక్: ఇక నుంచి విద్యుత్ వినియోగదారులు ప్రతినెలా సెల్ఫోన్ రీచార్జి తరహాలోనే విద్యుత్ మీటర్ను రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. కార్డులో బ్యాలెన్స్ ఉన్నంత వరకే విద్యుత్ సరఫరా అవుతుంది. బ్యాలెన్స్ అయిపోతే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. జిల్లాలో త్వరలో ప్రీ పెయిడ్ విద్యుత్ మీటర్లను బిగించేందుకు ట్రాన్స్కో అధికారులు సిద్ధమవుతున్నారు. దీంతో విద్యుత్ బకాయిలకు చెల్లుచీటి పడనుంది. అలాగే వినియోగదారులు వినియోగించే తీరులో మార్పుతో పాటు దుబారా తగ్గనుంది. మొదటి విడతగా ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో ఈ మీటర్లను బిగించనున్నారు. ఇందుకు సంబంధించి ట్రాన్స్కో అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఉన్న విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించాలని, చెల్లించిన వెంటనే ప్రీ పెయిడ్ విద్యుత్ మీటర్లు బిగించనున్నారని ప్రభుత్వ కార్యాలయాలకు నోటీసులు జారీ చేశారు. మార్చి నాటికి ప్రీ పెయిడ్ విద్యుత్ మీటర్ల బిగింపు ప్రక్రియ పూర్తి చేయాలని సంబంధిత అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే సంగారెడ్డిలోని ట్రాన్స్కో స్టోర్స్కు ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు చేరుకున్నాయి. దుబారా తగ్గుదలకు.. ఫిబ్రవరి మొదటి వారంలో జిల్లాకు మొదట విడతగా 400 నుంచి 500 వరకు ప్రీపెయిడ్ మీటర్లు వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్లో ఇది వరకే ఈ మీటర్ల బిగింపు ప్రక్రియ విజయవంతమైనట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాల్లో సైతం ఈ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) నిర్ణయించింది. నిరంతర విద్యుత్ అందుబాటులోకి రావడంతో జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలతోపాటు గృహ విద్యుత్ వినియోగదారులు ఎడాపెడా విద్యుత్ను వినియోగిస్తున్నారు. దీంతో విద్యుత్ దుబారా పెరుగుతుంది. దీనికితోడు వినియోగించిన విద్యుత్కు సంబంధించిన డబ్బులను ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు చెల్లించడం లేదు. నెలల తరబడి బిల్లులు చెల్లించకపోవటంతో ట్రాన్స్కోపై విద్యుత్ బకాయిలు భారం పెరుగుతోంది. విద్యుత్ దుబారా, బకాయిలకు చెక్ పెట్టేందుకు వీలుగా ట్రాన్స్కో ప్రీపెయిడ్ మీటర్లు బిగించేందుకు సిద్ధం అవుతుంది. రీచార్జి చేసుకుంటేనే.. ప్రస్తుతం అన్ని సర్వీసుల్లో మెకానికల్ విద్యుత్ మీటర్లు ఉన్నాయి. మెకానికల్ విద్యుత్ మీటర్ల రీడింగ్ ఆధారంగా బిల్లులు వసూలు చేస్తోంది. ప్రతినెలా ప్రభుత్వ కార్యాలయాలు, గృహ విద్యుత్ వినియోగదారులకు బిల్లులు ఇచ్చినా వారు చెల్లించడం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రీపెయిడ్ మీటర్ల బిగించాలని నిర్ణయం తీసుకుంది. విద్యుత్ వినియోగదారులు ప్రతినెలా సెల్ఫోన్ రీచార్జి తరహాలోనే ఇకపై విద్యుత్ మీటర్ను రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. కార్డులో బ్యాలెన్స్ ఉన్నంత వరకే విద్యుత్ సరఫరా అవుతుంది. బ్యాలెన్స్ అయిపోతే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. రూ.500 నుంచి రూ.5వేల విలువతో ప్రీపెయిడ్ విద్యుత్ కార్డులు అందుబాటులో ఉంటాయి. జిల్లాలో మొదట మీ సేవ కేంద్రాల్లో ప్రీపెయిడ్ విద్యుత్ రీచార్జి కార్డులను అందుబాటులో ఉంచనున్నారు. రూ.కోట్లలో పేరుకు పోయిన బకాయిలు జిల్లాలో విద్యుత్ బకాయిలు కోట్ల రూపాయలలో పేరుకుపోయి ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలులతో పాటు గృహ వినియోగదారులు, పరిశ్రమల నుంచి పెద్ద మొత్తంలో మొండి బకాయిలున్నాయి. గృహా విద్యుత్ బకాయిలు రూ.19 కోట్లు, పరిశ్రమలు రూ.2 కోట్లు, ప్రభుత్వ కార్యాలయాలు రూ.1.13 కోట్లు, పంచాయతీ బకాయిలు రూ.122 కోట్లు చెల్లించాల్సి ఉంది. దశల వారీగా.. జిల్లాలో దశలవారిగా ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను బిగించనున్నారు. మొదటి విడతగా ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో ప్రీపెయిడ్ మీటర్లు బిగించనున్నారు. ఇందుకోసం ఇప్పటి వరకు 931 కార్యాలయాలకు ట్రాన్స్కో అధికారులు నోటీసులు ఇచ్చారు. మెదక్ డివిజన్ పరిధిలో 627 ప్రభుత్వ కార్యాలయాలు, తూప్రాన్ డివిజన్ పరిధిలో 304 ప్రభుత్వ కార్యాలయాలకు నోటీసులు అందజేశారు. ప్రీపెయిడ్ విద్యుత్మీటర్ల అమర్చేందుకు వీలుగా బకాయిలు రూ.1.13 కోట్లు ట్రాన్స్కో వసూలు చేయనుంది. డబ్బులు వసూలు అయిన వెంటనే ఈ మీటర్లను అమర్చనున్నారు. త్వరలోనే బిగిస్తాం జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో మొదటగా ఈ ప్రీపెయిడ్ మీటర్లు అమర్చుతాం. సంగారెడ్డిలోని ట్రాన్స్కో స్టోర్స్కు ఈ మీటర్లు ఇప్పడికే వచ్చాయి. త్వరలోనే జిల్లాకు మీటర్లు తీసుకువచ్చి బిగింపు ప్రక్రియ ప్రారంభిస్తాం. ప్రీ పెయిడ్ మీటర్లతో విద్యుత్ దుబారా తగ్గడంతోపాటు బకాయిల భారం తొలుగుతుంది. –శ్రీనాథ్, ట్రాన్స్కో ఎస్ఈ -
ప్రీపెయిడ్ కరెంట్
ఎంత రీచార్జ్ కార్డు కొంటే అంతే వాడకం మొదట దఫా ప్రభుత్వ కార్యాలయాల్లో మీటర్ల ఏర్పాటు విద్యుత్దుబారాకు చెక్ పెట్టేందుకే కొత్త విధానం హుజూర్నగర్ : ఇక నుంచి కరెంట్ వినియోగించాలంటే రీచార్జ్ చేయించాల్సిందే.. ఇదేమిటని ఆశ్చర్యపోతున్నారా.. అవును నిజమే మరీ. సెల్ఫోన్ల మాదిరిగా రీచార్జ్ కార్డులు ఎప్పటి కప్పుడు కొనుగోలు చేయాల్సిందే. కరెంట్ దుబారాను అరికట్టేందుకు పాలకులు నడుం బిగించారు. మొదటి దఫా ప్రభుత్వ కార్యాలయాల్లోనే మీటర్లు విధానం ఇదీ.. ఇవి సెల్ఫోన్ రీచార్జ్ విధానంలాగా ఉండడంతో ఎంత రీచార్జ్కార్డు కొంటే అంతే విద్యుత్ వినియోగించుకోవచ్చు. ముందుగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ మీటర్లను ఏర్పాటు చేయాలని అధికారులు సిద్ధమయ్యారు. ఆయా కార్యాలయాలకు ప్రతినెలా వచ్చే విద్యుత్బిల్లుల ఆధారంగా రూ.1000 నుంచి రూ.20 వేల వరకు రీచార్జ్ విద్యుత్ కార్డులను ప్రత్యేక కౌంటర్లలో విక్రయించనున్నారు. ఈ కార్డులను ఆయా ప్రభుత్వ కార్యాలయాల అధికారులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆయా కార్యాలయాలకు ఇచ్చిన ప్రీపెయిడ్ కార్డు విలువ ఆధారంగా విద్యుత్ సరఫరా జరిగి కార్డు విలువ పూర్తికాగానే ఆటోమేటిక్గా విద్యుత్ సరఫరా> నిలిచిపోతుంది. దీంతో తిరిగి రీచార్జ్ చేయించుకోగానే ఆటోమేటిక్గా కరెం టు సరఫరా జరుగుతుంది. ఈ వి«ధా నం ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ దుబారాకు నూరు శాతం అడ్డుకట్ట వేసేందుకు చక్కటి మార్గంగా నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్ బిల్లుల బకాయిలు ఏడాదికేడాది పెరిగి పోతుండటంతో విద్యుత్ రంగసంస్థలకు నష్టాలు వస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది రూపాయలు మొండిబకాయిలుగా మిగిలి పోవడంతో నూతన విధానాన్ని ప్రవేశపెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ దుబారాను తగ్గించి బకాయిలు పెరగకుండా అడ్డుకట్ట వేసేందుకు ఈ విధానం ఒక్కటే మార్గమని భావించిన విద్యుత్ రంగ నిపుణుల సలహాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ముందుగా పట్టణాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ప్రీపెయిడ్ మీటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ కార్యాలయాల సంఖ్య ఆధారంగా వాటిని ఆయా విద్యుత్ డివి జన్లకు పంపిణీ చేస్తున్నారు. ఉమ్మడి జి ల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరిలలో అత్యధికంగా ప్రభుత్వ కార్యాలయాలు ఉండటంతో సర్వీస్లు ఎక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాల పరిధిలో 3,445 ప్రభు త్వ కార్యాలయాలు, 2214 పాఠశాల లు, 211 కేంద్ర ప్రభుత్వ కార్యాలయా లు, 1312 మున్సిపల్ కార్యాలయా లు, 8,556 గ్రామపంచాయతీల వీధిలైట్ల సర్వీస్లకు దఫాల వారీగా ముం దస్తుగా ఈ ప్రీపెయిడ్ మీటర్లను ఏర్పా టు చేయనున్నారు. అయితే మొదటి దఫాగా ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ మీటర్లను ఏర్పాటు చేసేందుకు విద్యుత్ అధికారు లు,సిబ్బంది సన్నద్ధమవుతున్నారు. మొద టి దఫాగా ప్రభుత్వ కార్యాలయాలకు ఏర్పాటు చేస్తున్న ఈ మీటర్లు విజయవంతంగా నడిచినట్లయితే రానున్న రో జుల్లో అన్ని గ్రామాల్లోని సర్వీస్లకు కూడా ఈ తరహా విధానాన్ని అమలు చేసే అవకాశం ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైట్హౌస్కు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసిన భారత సంతతి ఇంజనీర్! ఎవరీమె?
రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి
టీడీపీ కార్యకర్తల దాడి అంబటి స్ట్రాంగ్ కౌంటర్
పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు
పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్
మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
తప్పక చదవండి
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement