-
చెట్లను రక్షించారు
ఈ ఒడిషా మహిళలు తమ అడవులను స్మగ్లర్ల బారి నుంచి 20 సంవత్సరాలుగా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. హిందూ మహాసముద్రంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రెండు దశాబ్దాల కిందట తుడిచిపెట్టుకుపోయిన అడవిని కాపాడుకునే బాధ్యతను నెత్తిన వేసుకున్నారు. అడవులు నేలమట్టమైపోయిన నేపథ్యంలో పీర్జహానియా వన్ సురఖ్యా సమితి అనే సంస్థను స్థాపించి, అడవులను కాపాడుకుంటున్నారు. ఒడిషా, బీహార్ప్రాంతాలను తరచు తుఫాను భయం వెంటాడుతూనే ఉంటుంది. 20 ఏళ్ల క్రితం వచ్చిన తుఫాను అడవులను నిర్వీర్యం చేసేసింది. వరదలు కొన్ని చెట్లను లాగేసుకుంటే, అడవి దొంగలు మిగిలిన చెట్లను కొట్టేస్తున్నారు. ‘‘దొంగలు వచ్చినట్లు అనుమానం రాగానే మేము మా కర్రలతో గట్టిగా నేల మీద కొడతాం, పదిమందిమి కలిసి ఒకేసారి ఈలలు వేస్తాం’ అంటారు 52 సంవత్సరాల చారులత బిశ్వాల్. వారంతా వంతులవారీగా అడవిలో తిరుగుతూ కాపలా కాస్తుంటారు. ‘‘అడవులను నరకడానికి ఎవరైనా వస్తే, మా ఈలల శబ్దాలు, మా కర్రల చప్పుళ్లు విని పారిపోతున్నారు’’ అంటారు పీర్ జహానియా వన్ సురఖ్యా సమితికి సెక్రటరీగా పనిచేస్తున్న బిశ్వాల్. 2012లో ఈ సంస్థ వారు అవార్డులు అందుకున్నారు. వారి గ్రామాన్ని కాపాడుకోవడంలో వారు చూపిన బాధ్యతను గుర్తించి ఈ అవార్డులు అందించారు. అడ్డదిడ్డంగా విస్తరించిన సరుగుడు చెట్ల కొమ్మలను నరికేసి, తక్కువ పరిధిలో విస్తరించే జీడిచెట్లను నాటుతున్నారు వీరు. ‘‘తీరంలో ఉన్న మా ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి. చేతికి అందివచ్చిన పంటలు కూడా తుడిచిపెట్టుకు పోయాయి. భూములన్నీ నిస్సారమైపోయాయి. కొన్నిరోజుల పాటు తిండి లేకుండా గడపాల్సి వచ్చింది. అడవులు లేకపోవడం వల్లే ఇంత జరిగిందని అర్థమైంది. అలాగే ఇళ్ల దగ్గర కూడా చెట్లు లేకపోవడం కూడా కారణమేనని తెలిసింది. అందుకే మేమంతా అడవులను కాపాడుతామని ప్రమాణం చేశాం’’ అంటారు బిశ్వాల్.. 2001లో 70 మంది మహిళలు ఒక్క మాటగా నిలిచారు. అడవులను మేమే రక్షించుకుంటాం అని స్త్రీశక్తిని బలంగా చాటారు. ఒక్కో ఇంటి నుంచి కనీసంగా ఒకరు ముందుకు వచ్చారు. 75 హెక్టార్ల అడవిని తమ సొంత బిడ్డగా భావించుకోవడం మొదలుపెట్టారు. దేవీ నదికి దగ్గరగా ఉన్న ఈ గ్రామంలో మొత్తం 103 గృహాలు ఉన్నాయి. ఇంట్లోని మగవారంతా జీవనం కోసం సముద్రంలోకి చేపలు పట్టడానికి వెళ్తుంటారు. అందుకే మహిళలు ఈ బాధ్యతను తీసుకున్నారని చెబుతారు బెహరా. రెండు రోజులకి ఒకరు చొప్పున బాధ్యతలను సమానంగా పంచుకుంటున్నారు. ఉదయం 7.30 గంటలకు వెళ్లి, మళ్లీ మధ్యాహ్నానికి ఇంటికి వచ్చి, భోజనం చేసి, ఇంటిని చక్కదిద్దుకుని, మళ్లీ సాయంత్రం విజిల్స్ పుచ్చుకుని వెళ్లి, చీకటి పడుతుండగా ఇంటికి వస్తారు. అడవిలోకి వెళ్లడానికి మీరు భయపడరా అని ప్రశ్నిస్తే, ‘మాకెందుకు భయం, అడవి అంటే మా ఇల్లే కదా, అడవి మీద మాకు హక్కులు లేకపోయినా, దాన్ని రక్షించడం మా విధి’ అని చెబుతారు బిశ్వాల్. ప్రతి చెట్టును వీరు తమ బిడ్డగా భావిస్తూ, కంటికి రెప్పలా కాపాడుకుంటారు. బిడ్డకు ఏదైనా జరిగితే తల్లి ఎంత బాధపడుతుందో, ఈ చెట్లకి ఏం జరిగినా వీరంతా అలాగే బాధపడతారు. ఇవి వారి జీవితంలో భాగంగా మారిపోయాయి. ఇప్పుడు వారి గ్రామం పచ్చగా కళకళలాడుతోంది. స్వచ్ఛమైన తాగునీరు దొరుకుతోంది. ఉప్పు నీటిని నిరోధించే మొక్కలను పెంచటమే ఇందుకు కారణం. పొలాలు కూడా వరదలు, ఈదురు గాలుల బారిన పడకుండా ఏపుగా పెరుగుతున్నాయి. -
సగం పుర్రె తీసి.. కడుపులో దాచిపెట్టేశారు!
రోగుల ప్రాణాలు నిలబెట్టేందుకు వైద్యులు అత్యంత క్లిష్టతరమైన సర్జరీలు సైతం చేస్తారు. ముంబైలో సరిగ్గా ఇలాగే జరిగింది. 21 ఏళ్ల యువతిని కాపాడేందుకు ఆమె పుర్రెలో కొంత భాగాన్ని తీసి.. ఉదరభాగంలో దాచిపెట్టారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని, పుర్రె భాగాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి ఫిబ్రవరి రెండోవారంలో మరో సర్జరీ చేస్తామని వైద్యులు చెప్పారు. ఈ సర్జరీని 'డీకంప్రెసివ్ సర్కంఫరెన్షియల్ క్రానియెక్టమీ' అంటారు. ఇది అత్యంత అరుదైనది. మెదడులో బాగా వాపు రావడంతో.. దానివల్ల వస్తున్న ఒత్తిడిని తగ్గించేందుకు పుర్రెలో పై సగభాగాన్ని తీసేశారు. వాపు తగ్గిన తర్వాత మళ్లీ దాన్ని అక్కడే అమరుస్తారు. ఇందుకు కొంత సమయం పడుతుంది. బిహార్కు చెందిన ఆ యువతి ఒక ఐపీఎస్ అధికారి కుమార్తె. రెండునెలల క్రితం ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీకొంది. దాంతో ఆమెకు ట్రమాటిక్ బ్రెయిన్ ఇంజ్యురీ (టీబీఐ) అయ్యింది. ఆస్పత్రికి తీసుకొచ్చేసరికే ఆమె పరిస్థితి విషమంగా మారిందని వోకార్డ్ ఆస్పత్రిలోని కన్సల్టెంట్ న్యూరో-స్పైన్ సర్జన్ డాక్టర్ అజయ్ బజాజ్ తెలిపారు. గాయం కారణంగా ఆమె మెదడులోని పలు భాగాలలో విపరీతమైన వాపు వచ్చింది. అయితే అదృష్టవశాత్తు రక్తం మాత్రం ఎక్కడా పెద్దగా గడ్డకట్టలేదు. వాపు తగ్గుతుందని వైద్యులు భావించినా, అది తగ్గకపోగా మరింత పెరగసాగింది. దాంతో పుర్రెలో సగభాగాన్ని తీసేశారు. అయితే.. అలా తీసేసిన పుర్రెభాగాన్ని బయట పెడితే అది పాడవుతుంది కాబట్టి దాన్ని ఉదరభాగంలో ఉంచారు. రోగికి వాపు పూర్తిగా నయమైన తర్వాత పుర్రె రీకన్స్ట్రక్షన్ మొదలవుతుంది. కృత్రిమ పుర్రె పెట్టే అవకాశం ఉన్నా.. అసలు పుర్రెను యథాతథంగా పెడితే మంచిదని దాన్ని భద్రపరిచామన్నారు. విడిగా 8 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలో ఫ్రిజ్లో భద్రపరచొచ్చు గానీ, రోగి కోలుకోడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు కాబట్టి సహజంగానే దాన్ని భద్రపరిచామని డాక్టర్ బజాజ్ వివరించారు. ఫిబ్రవరిలో రెండో సర్జరీ కూడా అయిన తర్వాత ఆమె తిరిగి ఇంటికి వస్తుందని ఆమె తండ్రి చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
ఎండుతున్న జలకళ
షూటింగ్... పార్టీయింగ్...
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
బిందువే సిరుల సింధువు
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement