-
ప్రయాణికుల కస్సు‘బస్సు’
సాక్షి, ఒంగోలు: ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. అందులో భాగంగానే ఎన్నికల వేళ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు వ్యాపార సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పడరాని పాట్లు పడక తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతోంది. జిల్లాలో అద్దె బస్సులతో కలిపి 800 బస్సులు ఉండగా వాటిలో 600 బస్సులను ఎన్నికల విధులకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడంతో దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు స్వగ్రామాలకు వచ్చేందుకు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. బస్సులన్నీ ఎన్నికల విధులకే.. జిల్లాలో ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బందిని సంబంధిత పోలింగ్ స్టేషన్లకు తరలించడం.. ఓటింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులు కౌంటింగ్ కేంద్రాలకు తరలించడం.. అనంతరం సిబ్బందిని తిరిగి రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్న ప్రాంతానికి తరలించడం వరకు సిబ్బంది కోసం జిల్లా యంత్రాంగం ఆర్టీసీ బస్సులు అందిపుచ్చుకుంది. పల్లె వెలుగు (తెలుగు వెలుగు) సర్వీసులన్నీ ఎన్నికల విధులకు కేటాయించేశారు. బస్సులన్నీ ఈ నెల 10వ తేదీ ఉదయం 9 గంటలకల్లా రైజ్ ఇంజినీరింగ్ కాలేజీ ఆవరణలో అందుబాటులో ఉంచాలని ఆదేశాలు ఇచ్చారు. ఇక ఆర్టీసీ వద్ద మిగిలిన సర్వీసులు కేవలం 200 మాత్రమే. వాటిలో దాదాపు 150 వరకు సర్వీసులు హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, బెంగళూరు తదితర ప్రాంతాలకు నడుస్తుంటాయి. ఇక మిగిలింది కేవలం 50 బస్సులు మాత్రమే. ఈ 50 బస్సులే ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేది. ఈ బస్సులన్నీ కూడా డీలక్స్, సూపర్లగ్జరీతో పాటు ఇతర ఏసీ సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా ప్రధాన రూట్లలో మాత్రమే తిరుగుతుండటంతో పల్లెకు వెళ్లాంటే పాట్లు తప్పనిసరి. క్యాబ్లు, ఆటోలు, ట్రక్కులు తదితరాలే దిక్కుగా మారనున్నాయి. నిలువు దోపిడీ అవకాశం లభిస్తే ప్రైవేటు ఆపరేటర్ల నిలువు దోపిడీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇప్పటికే పలు ప్రైవేటు బస్సులను నెల రోజుల క్రితమే బుక్ చేసుకోవడంతో ప్రయాణికులు కాస్త ఊరట చెందారు. అలా కాకుండా కుటుంబంతో రావాలంటే ఇబ్బందులు తప్పేలా లేవు. జిల్లాకు చెందిన అనేక మంది ఇతర ప్రాంతాల్లో స్థిరపడి ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో వారంతా స్వగ్రామాలకు వచ్చి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు తిప్పకుంటే వారంతా ఇబ్బందులు పడటం ఖాయం. హైదరాబాద్కు.. హైదరాబాద్ నుంచి ఒంగోలుకు ఆర్టీసీకి నాన్ ఏసీ బస్సుకు రూ.391 వసూలు చేస్తారు. కానీ ప్రైవేటు ఆపరేటర్లు వసూలు చేస్తున్న చార్జీలను పరిశీలిస్తే ఈ నెల 7న రూ.780, 8న రూ.1090, 9న రూ.1390, 10న రూ.1490 చేరింది. చెన్నైకు.. చెన్నై నుంచి ఒంగోలుకు నాన్ ఏసీ ఆర్టీసీ చార్జీ రూ.351 మాత్రమే. ఇదే ప్రైవేటు ఆపరేటర్లు అయితే రోజుకో రేటు చొప్పున దండుకుంటున్నారు. 7,8,9 తేదీల్లో చార్జీ ధర రూ.428 ఉండగా 10న మాత్రం ఏకంగా ఇదే చార్జీ రూ.1425లకు చేరింది. బెంగళూరుకు.. బెంగళూరు నుంచి ఒంగోలుకు ఆర్టీసీ నాన్ ఏసీ చార్జీ రూ.612 మాత్రమే. ప్రస్తుతం అదనపు బస్సులు వేయాల్సిన ఆర్టీసీ మౌనం వహించడంతో ప్రైవేటు ఆపరేటర్లు చార్జీలను భారీగా పెంచేశారు. ఈ నెల 7న రూ.1290, 8న రూ.940, 9న రూ.1415, 10న రూ.1900 ధరలు నిర్ణయించడం గమనార్హం. -
బస్సుల ‘సంక్రాంతి’ దోపిడీ
♦ ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆపరేటర్లు ♦ ఆర్టీసీ 50 శాతం అదనపు చార్జీల మోత సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి సంబరం అయినవారందరితో జరుపుకోవాలని పిల్లాపాపలతో సొంతూళ్లకు పయనమవుతున్నారు నగరవాసులు. దీన్ని ఆసరాగా చేసుకొని ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు దోపిడీకి తెరలేపాయి. ప్రత్యేక బస్సుల పేరిట యాభై నుంచి వంద శాతానికి పైగా అదనపు చార్జీలతో ప్రయాణికులను నిలువునా దోచుకొంటున్నాయి. రద్దీ అధికంగా ఉన్న మార్గాల్లో హద్దూ అదుపూ లేకుండా టికెట్ల రేట్లు పెంచేసి సగటు జీవి పండుగ సంబరాన్ని ఆవిరి చేస్తున్నాయి. ప్రైవేట్ ఆపరేటర్లయితే ఇష్టారాజ్యంగా వసూళ్లు చేస్తున్నారు. మూడు రోజుల్లో పది లక్షల మంది... సంక్రాంతి పండుగ కోసం గత మూడు రోజుల్లో దాదాపు 10 లక్షల మంది నగరవాసులు సొంతూళ్లకు వెళ్లారు. దీంతో దక్షిణమధ్య రైల్వే నడుపుతున్న అరకొర రైళ్లు కిటకిటలాడుతున్నాయి. వెయిటింగ్ లిస్టు చాంతాడంత ఉంటోంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆర్టీసీ, ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు ప్రయాణికులు. పండుగ రద్దీ దృష్ట్యా ఆర్టీసీ ఏర్పాటు చేసిన 2,470 ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీ వసూలు చేస్తోంది. రెగ్యులర్ బస్సుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ.304 వరకు చార్జీ ఉంటే ప్రస్తుతం అది రూ.450 దాటింది. అన్ని ప్రధాన రూట్లలోనూ ఇదే పరిస్థితి. ఇక ప్రైవేట్ బస్సుల్లో విశాఖపట్టణానికి ఏసీ బస్సుకు సాధారణ రోజుల్లో రూ.750 వరకు చార్జీ ఉంటే ఇప్పుడు ఏకంగా రూ.1600 వరకు వసూలు చేస్తున్నారు. నలుగురు కుటుంబ సభ్యులతో సొంతూరికి పయనమవుతున్న మధ్యతరగతి వ్యక్తి విజయవాడ, వైజాగ్ వంటి ప్రాంతాలకు వెళ్లేందుకు చార్జీల రూపంలోనే రూ.3,000 నుంచి రూ.5,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఫలితంగా పండుగ ఆనందం ఆవిరైపోతోంది. ఇది అన్యాయం... ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ చార్జీలతో చుక్కలు చూపిస్తున్నాయి. సంక్రాం తికి సొంత ఊరుకు వెళ్లడం కంటే ఇక్కడే ఉండిపోతే బాగుండేదనిపిస్తుంది. పండుగ పేరిట ఇలా సామాన్య ప్రజలపై భారం మోపడం అన్యాయం. - ఫల్గుణ, మూసాపేట్ సర్వీసులు పెంచాల్సింది పండుగకు శ్రీకాకుళానికి బయలుదేరాం. కానీ ఆర్టీసీ బస్సులు కిక్కిరిసి ఉన్నాయి. ప్రైవేట్ బస్సుల్లో చార్జీల మోతమోగుతోంది. రైళ్లు కూడా చాలినన్ని లేవు. ఇంటిల్లిపాదీ కలిసి వెళ్లాలంటే భయమేస్తుంది. ఆర్టీసీ సర్వీసుల్ని పెంచాల్సింది. - గిరిడ చిన్నారావు, కూకట్పల్లి విజయవాడకు రూ.1000! ప్రైవేట్ బస్సుల్లో చార్జీలు దారుణంగా పెంచారు. సాధారణ రోజుల్లో విజయవాడకు రూ.350 తీసుకుంటారు. ఇప్పుడేమో రూ.1000కి పైనే డిమాండ్ చేస్తున్నారు. రైళ్లూ అరకొరానే. ఊరికి ఎలా వెళ్లాలో అర్థం కావడం లేదు. - శివ, కేపీహెచ్బీ
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement