-
స్కూల్ బస్సు కిందపడి బాలుడు మృతి
పశ్చిమగోదావరి,టి.నరసాపురం: ప్రైవేట్ స్కూల్ బస్సు కింద పడి ఐదేళ్ల బాలుడు మృతిచెందిన ఘటన మండలంలోని గండిగూడెంలో శుక్రవారం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యానికి తమబిడ్డ బలయ్యాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. గండిగూడేనికి చెందిన కొక్కొండ కృష్ణమాచారి ఐదేళ్ల కుమారుడు కొక్కొండ పార్థ వీర ఉమాశంకర్ (5) ఈ సంఘటనలో మృతిచెందాడు. బొర్రంపాలెం జీఎన్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీకి చెందిన స్కూల్బస్సు విద్యార్థులను ఎక్కించుకుని వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ గమనించకపోవడంతో రోడ్డుపక్కన ఉన్న బాలుడు బస్సు టైరు కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటనపై బాలుడి తండ్రి కృష్ణమాచారి ఫిర్యాదుతో హెచ్సీ పి.మహేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రెండు పాఠశాలల బస్సులు ఢీ
ఓ బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలు మరో 8 మందివిద్యార్థులకు కూడా.. ఉయ్యూరు మండలం పొట్లపాడు శివారులో ఘటన బెంబేలెత్తిన విద్యార్థులు తల్లిదండ్రులు, స్థానికుల ఆగ్రహం ఉయ్యూరు : ఓ ప్రైవేటు సంస్థకు చెందిన పాఠశాల బస్సు ఎదురుగా వస్తున్న మరో స్కూల్బస్సు ను ఢీకొట్టింది. మండలంలోని పొట్లపాడు వద్ద గురువారం జరిగిన ఈ ఘటనలో పెను ప్రమాదం తప్పింది. ఓ స్కూల్ బస్సు డ్రైవర్కు కాలు విరగ్గా, ఎనిమిది మంది విద్యార్థులకు గాయాల య్యాయి. సేకరించిన వివరాల ప్రకారం.. ఉయ్యూరులోని ఓ కార్పొరేట్ విద్యాసంస్థకు చెందిన పాఠశాల బస్సు పొట్లపాడులో విద్యార్థులను ఎక్కించుకొని తిరిగి వస్తోంది. ఉయ్యూరులోనే మరో ప్రైవేటు విద్యాసంస్థకు చెందిన బస్సు కడవకొల్లు వైపు నుంచి విద్యార్ధులతో పొట్లపాడు వైపు వెళుతోంది. సింగిల్ రోడ్డు కావడం, రెండు వైపులా పంట కాలువలు ఉండటం తో బస్సులు తప్పుకోవడం కష్టమైంది. ఈ సందర్భంగా ప్రైవేటు స్కూల్ బస్సు డ్రైవర్ మేరుగ ప్రసాద్ వేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ కార్పొరేట్ పాఠశాల బస్సును ఢీకొట్టాడు. ఈ ఘటనలో కార్పొ రేట్ పాఠశాల విద్యార్థులు టి.తులసి (8వ తరగతి), టి.గోపిచంద్ (6వ తరగతి), జె.లక్కి (ఎల్కేజీ), ఎం.కమల (నర్సరీ), ఎం.వీరనాగసాయి (5వ తరగతి), శ్రావణి (రెండో తరగతి), కీర్తన, ఆ బస్ డ్రైవర్ పాముల ఆదిశేషు, మరో పాఠశాల విద్యార్థి కె.జితేంద్ర (9వ తరగతి) గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆదిశేషు కాలు విరిగింది. ప్రమాదంలో కాలు విరిగినప్పటికీ ఆదిశేషు బాధపడుతూనే బ్రేక్పై కాలు తీయకుండా వాహనం పంటబోదెలోకి దూసుకుపోకుండా అదుపు చేశాడు. గ్రామస్తులు, తల్లిదండ్రుల ఆగ్రహం రెండు బస్సుల్లోని విద్యార్థులు భయంతో కేకలు వేయడంతో గ్రామస్తులు, స్థానికులైన విద్యార్థుల తల్లిదండ్రులు హుటాహుటిన వచ్చారు. గాయపడినవారిలో కొందరిని 108లో, మిగిలినవారిని ఆటోల్లో ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ ఆదిశేషును విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం అనంతరం మరో బస్సు డ్రైవర్ మేరుగ ప్రసాద్ అక్కడినుంచి పరారవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేశారు. రూరల్ ఎస్సై యువకుమార్ సిబ్బందితో వచ్చి వివరాలు సేకరించారు. రెండు బస్సులను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. ఎవరిని పడితే వారిని డ్రైవర్లుగా చేర్చుకుని పిల్లల జీవితాలతో చెలగాటమాడుతారా ? ప్రమాదం జరిగితే పాఠశాల యాజమాన్యం ప్రతినిధులు రారా? పిల్లలను వదిలేసి డ్రైవర్ పారిపోతాడా? అంటూ బస్సులను పోలీసులు తరలించనీయకుండా అడ్డుకున్నారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్పై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని గ్రామ సర్పంచ్ యర్రపోతు అంక వరప్రసాద్, ఎంపీటీసీ సభ్యురాలు యర్రపోతు సుజాత పరామర్శించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement