-
బస్సులో వెళ్తుండగా గుండెపోటు.. కనికరించని డ్రైవర్, కండెక్టర్
సాక్షి, చైన్నె: బస్సులో వెళ్తున్న సమయంలో గుండెపోటుకు గురైన ఓ వంట మాస్టరు పట్ల ఆ బస్సు డ్రైవర్, కండెక్టర్ నిర్దయగా వ్యవహరించారు. మార్గం మధ్యలో ఆసుపత్రులు ఉన్నా పట్టించుకోకుండా బలవంతంగా రోడ్డు పక్కన ఓ టీ కొట్టు వద్ద బస్సు ఆపి దించేసి వెళ్లిపోయారు. దీంతో సకాలంలో చికిత్స అందక, సాయం చేసే వారు లేక రోడ్డుపైనే వంట మాస్టర్ గుండె ఆగింది. కాగా ఆ బస్సులోని ఓ ప్రయాణికుడు ఇచ్చిన సమాచారంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు.. విరుదునగర్ జిల్లా శ్రీవిళ్లిపుత్తూరు నల్ల కుట్రాలం ప్రాంతానికి చెందిన జ్యోతి భాస్కర్(55) వంట మాస్టర్, శంకరన్ కోయిల్లోని ఓ హోటల్లో పనిచేస్తాడు. రోజూ శ్రీవిళ్లిపుత్తూరు – శంకరన్ కోయిల్ మధ్య బస్సు ప్రయాణంతో విధులకు వెళ్లేవాడు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎప్పటిలాగే వేకువజామున ఇంటి నుంచి శంకరన్ కోయిల్కు తిరునల్వేలి వైపుగా వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో బయలుదేరాడు. ఈ మార్గంలో చైన్నె వంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు అనధికారికంగా ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్లడం సహజం. కనికరం లేకుండా.. ఈ బస్సులో ప్రయాణించే సమయంలో మార్గం మధ్యలో రాజ పాళయం వద్దకు జ్యోతి భాస్కర్కు ఛాతినొప్పి రావడంతో తల్లడిల్లిపోయారు. సమీపంలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఉన్నా, డ్రైవర్, కండెక్టర్ మహేశ్, గోపాల్ కనికరించ లేదు. మానవత్వాన్ని మరిచి వ్యవహరించారు. కనీసం ప్రథమచికిత్స కూడా అందించకుండా శంకరన్ కోయిల్కు వెళ్లకుండా క్రాస్ రోడ్డులో బస్సును ఆపేశారు. ఛాతి నొప్పితో తల్లడిల్లుతున్న వంట మాస్టర్ను బలవంతంగా బస్సు నుంచి దించేశారు. రోడ్డు పక్కగా ఉన్న ఓ టీ దుకాణం వద్ద కూర్చోబెట్టి బస్సును లాగించేశారు. నిద్రలో ఉన్న ప్రయాణికులు పెద్దగా ఎవ్వరూ ఈ ఘటనను పట్టించుకోలేదు. అయితే, బస్సులో ఉన్న ఓ యువకుడు ఎవరినో బలంతంగా కిందకు దించుతుండడాన్ని గుర్తించాడు. అయితే, అతడికి ఛాతినొప్పి విషయం తెలియనట్లుంది. చివరకు ఆ టీ కొట్టు వద్ద గుండె నొప్పితో కొట్టుకుని వంట మాస్టారు మరణించాడు. కాసేపటికి ఈ సమాచారం శంకరన్ కోయిల్ పరిసరాల్లో వ్యాపించింది. ఈ సమాచారం విన్న శంకరన్ కోయిల్ వరకు బస్సులో ప్రయాణించిన ఓ యువకుడి ద్వారా డ్రైవర్, కండెక్టర్ల దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. రోడ్డు పక్కగా భాస్కర్ను వదిలి పెట్టి వెళ్లిన ట్రావెల్స్ బస్సు, కండెక్టర్, డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మానవత్వం మరిచిన ఈ ఇద్దరిన కఠినంగా శిక్షించాలని ఆ ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు. -
ప్రకాశం జిల్లా మేడిపి వద్ద రోడ్డు ప్రమాదం
కర్నూలు (టౌన్)/త్రిపురాంతకం: ప్రకాశం జిల్లా మేడిపి వద్ద బుధవారం తెల్లవారు జామున ప్రైవేటు ట్రావెల్ బస్సు, ఎదురుగా వస్తున్న లారీ ఢీకొని ఒకరు మృతిచెందగా మరో 16 మంది గాయపడ్డారు. కడప నుంచి విజయవాడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు త్రిపురాంతకం బైపాస్ ఫ్లైఓవర్ వద్ద అదుపు తప్పి డివైడర్ను ఢీకొని ఆగిపోయింది. దీంతో అందులో నుంచి మార్కాపురానికి చెందిన భీమిశెట్టి మానస, కడపకు చెందిన శివలక్ష్మి, మరో మహిళ అటుగా వస్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఎక్కారు. కర్నూలు నుంచి మెప్మా ట్రైనింగ్ కోసం 22 మంది ఆ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో విజయవాడకు వెళ్తున్నారు. ట్రావెల్స్ బస్సు త్రిపురాంతకం మండలం మేడపి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీని అదుపు తప్పి ఢీకొంది. ఈ ఘటనలో మార్కాపురం చెందిన భీమిశెట్టి మానస (22) అక్కడికక్కడే మృతిచెందగా, అదే ట్రావెల్స్ బస్సు రెండో డ్రైవర్ రాజేష్ రెండు కాళ్లు విరిగాయి. ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న కర్నూలుకు చెందిన బి. శానవ్, స్రవంతి, వెంకటేశ్వరమ్మ, హేమలతారెడ్డి, రామలక్ష్మి, షఫీ ఉన్నీస, జ్యోతి, శివగంగ, మరో ఏడుగురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సుమన్ తన సిబ్బందితో వెళ్లి క్షతగాత్రులను నాలుగు అంబులెన్స్ల్లో పల్నాడు జిల్లా వినుకొండ, గుంటూరుకు మెరుగైన వైద్య సేవల కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న దర్శి డీఎస్పీ అశోక్వర్ధన్, ఆర్ధ్రో అమరనాథ్, ఎంవీఐ మాధవరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పరామర్శించిన మెప్మా సిటీ మేనేజర్ ప్రమాదం విషయం తెలియగానే కర్నూలు మెప్మా ఆఫీసుకు చెందిన సిటీ మేనేజర్ మురళీ, కమ్యూనిటీ ఆర్గనైజర్లతో కలిసి హుటాహుటిన వినుకొండకు బయలు దేరారు. పీడీ నాగశివలీల ఆదేశాల మేరకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన రీసోర్స్ పర్సన్లు, టీఎల్ఎఫ్ ఆఫీస్ బేరర్లు, జిల్లా మహిళా సమాఖ్యల అధ్యక్షులను ఆయన పరామర్శించారు. -
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో అగ్ని ప్రమాదం
-
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేటు బస్సు
విశాఖపట్నం: జాతీయరహదారిపై నక్కపల్లి సమీపంలో ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరో 14 మంది తీవ్రగాయాల పాలయ్యారు. డ్రైవరు అతి వేగంగా బస్సును నడపడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. పార్వతీపురం నుంచి గుంటూరు వెళ్తున్న సాయికృష్ణ ప్రైవేటు ట్రావెల్ బస్సులో సుమారు 40 మంది ప్రయాణిస్తున్నారు. వీరంతా వేర్వేరు ప్రాంతాలకు వెళ్లేందుకు పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లిలలో బస్సు ఎక్కారు. బస్సు అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో నక్కపల్లి దాటిన తర్వాత కిలోమీటరు దూరంలో మనబానవానిపాలెం రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టినట్లు ప్రయాణికులు తెలిపారు. అనకాపల్లిలో జరిగిన వివాహానికి హాజరై తిరిగి వెళ్తున్న విజయవాడ సమీపంలో గొల్లపూడి గ్రామానికి చెందిన బైపాన రమేష్ (35) బస్సులోనే చిక్కుకుని అక్కడికక్కడే మరణించారు. ఇదే ప్రమాదంలో ఆయన భార్య బైపాన కుమారి, కుమారుడు మోక్షిత్ (ఆరు నెలలు)తోపాటు 14మంది గాయపడ్డారు. బస్సు ముందు భాగంలో కూర్చున్న రమేష్ సీట్లో ఇరుక్కొని అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. క్షతగాత్రులను అంబులెన్స్లలో నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్వల్ప గాయాలైన వారిని ప్రాథమిక చికిత్స అనంతరం వారి ప్రాంతాలకు పంపించారు. ఆరు నెలల మోక్షిత్æ తలకు బలమైన గాయాలయ్యాయి. ఇతని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విశాఖ తరలించారు. సంఘటన స్థలాన్ని నర్సీపట్నం ఏఎస్పీ అదిరాజ్సింగ్ రాణా, నక్కపల్లి సీఐ అప్పన్న పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి నుంచి వివరాలు సేకరించారు. మృతుడి భార్య కుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల వివరాలివి.. గొర్ల బలరామం (దేవరపల్లి, బొబ్బిలి), ఎ.గణే‹Ùకుమార్ (పార్వతీపురం), ఎస్.వెంకటవరప్రసాద్ (బొబ్బిలి), చిలకంట నరేంద్ర (బెంగళూరు), చంద్ర (బెంగళూరు), అల్లు శాంతారాం (పార్వతీపురం), గొల్ల శిరీష (పార్వతీపురం), ముప్పాల వర్షిత (బొబ్బిలి), మున్నం దేముడమ్మ (పెందుర్తి), ఆకోటి ధరణి (సాలూరు) అల్లు సావత్రిమ్మ (పార్వతీపురం), పి.కోటేశ్వరమ్మ (పార్వతీపురం) -
పరిమితికి మించి ప్రయాణికులను తరలించడంతో మూడు ట్రావెల్స్ సీజ్
ఆదిలాబాద్టౌన్: పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్న మూడు ట్రావెల్స్లను రవాణ శాఖాధికారులు సోమవారం అర్ధరాత్రి సీజ్ చేశారు. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను ఆర్టీసీ బస్టాండ్లో దింపారు. హైదరాబాద్ నుంచి ఛత్తీస్ఘడ్కు కార్మికులను తీసుకెళ్తున్నారు. ఒక్కో బస్సులో 30వరకు పరిమితి ఉండగా వంద మంది వరకు ప్రయాణికులను తరలిస్తున్నారు. ఈ క్రమంలో తనిఖీలు చేపట్టిన రవాణ శాఖాధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆ ట్రావెల్స్లను సీజ్ చేసి ఆర్టీసీ డిపోలో ఉంచారు. అందులో ప్రయాణిస్తున్న వారిని బస్టాండ్లో దింపడంతో వారు ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం రవాణ శాఖాధికారులు ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా వారికి భోజనం ఏర్పాటు చేయించారు. వీరిని ఛత్తీస్ఘడ్కు తరలించేందుకు ఆ బస్సుల యజమానుల నుంచి డబ్బులు రాబట్టి రెండు ఆర్టీసీ బస్సుల ద్వారా వారి గమ్యస్థానాలకు చేర్చేవిధంగా చర్యలు చేపట్టారు. మిగిలిన మరికొంత మంది కోసం మరో బస్సును ఏర్పాటు చేస్తామని డీటీసీ పుప్పాల శ్రీనివాస్ తెలిపారు. ఇదిలా ఉండగా రెండుమూడు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి ఛత్తీస్ఘడ్కు వెళ్తున్న రెండు బస్సులను సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆదిలాబాద్: ప్రయాణికుల సౌకర్యం కోసం అల్పాహారం పంపిణీ చేయడం అభినందనీయమని ఆదిలాబాద్ ఆర్టీసీ ఆర్ఎం జానీ రెడ్డి, డీటీసీ పుప్పాల శ్రీనివాస్ అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్న మూడు ప్రైవేటు ట్రావెల్స్లను సోమవారం సీజ్ చేశారు. ఆదిలాబాద్ ఆర్టీసీ డిపోలో బస్సులను నిలుపగా, ప్రయాణికులు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలోనే నిరీక్షించాల్సిన పరిస్థితి. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అల్పాహారాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంవీఐ శ్రీనివాస్, డీఎం కల్పన పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement