-
ప్రజా ఉద్యమాల గొంతు నులిమినట్లే
ధర్నాచౌక్ రద్దుపై ప్రొ. హరగోపాల్ సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఇందిరా పార్క్ ధర్నాచౌక్ను రద్దు చేయడమంటే ప్రజా ఉద్యమాల గొంతు నులిమినట్లేన ని ప్రొఫెసర్ హరగోపాల్ అభివర్ణించారు. ఆదివారం ఆయన సీఎం కేసీఆర్కు బహి రంగ లేఖ రాశారు. రాష్ట్ర సాధనలో ధర్నా చౌక్ పాత్ర కీలకమైందని, టీఆర్ఎస్ ఆవి ర్భావం నుంచి అధికారంలోకి వచ్చేవరకూ నిచ్చెనలా నిలబడ్డ విషయాన్ని లేఖలో గుర్తు చేశారు. ఎన్నోపార్టీలు అధికారంలోకి రావచ్చు పోవచ్చని, ఏపార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండదనేది చరిత్రాత్మక సత్యమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకమైన ఉద్యమాలకు ఊపిరి పోసిన ధర్నాచౌక్ తెలంగాణ ప్రజల ప్రజాస్వామ్య సంస్కృతి, జీవితంలో అంతర్భాగ మన్నారు. ధర్నా చౌక్ రద్దు నిర్ణయం వెనుక పోలీసు యంత్రాంగం పాత్ర ఉంటుందన్నారు. -
ఓయూపై కక్ష తీర్చుకుంటున్నారు
* విద్యార్థి, నిరుద్యోగ గర్జన సభలో కేసీఆర్పై మండిపడ్డ ప్రొ. హరగోపాల్ * సీమాంధ్రుల పాలనకు కేసీఆర్ పాలనకు తేడా లేదు హైదరాబాద్: ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనకు గతంలోని సీమాంధ్రుల పాలనకు పెద్దగా తేడా లేదని సామాజికవేత్త ప్రొఫెసర్ హరగోపాల్ ఆరోపించారు. ఆదివారం ఉస్మానియా యూని వర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎదుట ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ, టీవీవీ, పీడీఎస్యూ(విజృంభణ), ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ(తిరుగుబాటు) ఆధ్వర్యంలో విద్యార్థి, నిరుద్యోగ గర్జన సభ జరిగింది. ఈ సందర్భంగా ప్రొ. హరగోపాల్ మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలలో జాప్యం, ఓయూ భూముల్లో ఇళ్ల నిర్మాణాలు, వీసీలుగా ఐఏఎస్ల నియామకాలు తదితర వ్యవహారాలతో ఓయూపైనా, విద్యార్థులపైనా సీఎం కేసీఆర్ కక్ష తీర్చుకుంటున్నట్లుగా ఉందని మండిపడ్డారు. వేలాది మంది విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకుంది ఉద్యోగాల కోసమే అని పేర్కొన్నా రు. పోరాడుతున్న విద్యార్థులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం దారుణమని, అరెస్ట్ చేసిన విద్యార్థులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ భూములను తీసుకోకుండా ఉజ్వలమైన విశ్వవిద్యాలయాలను నిర్మించాలని ప్రభుత్వానికి సూచించారు. యూనివర్సిటీలకు డిగ్రీ అర్హతతో ఐఏఎస్ అయిన అధికారులను వీసీలుగా కాక.. అనేక పరిశోధనలు చేసి పుస్తకాలు, వ్యా సాలు రాసిన నిష్ణాతులైన సీనియర్ ప్రొఫెసర్ల నే నియమించాలన్నారు. కార్యక్రమంలో విమలక్క, డాక్టర్ కాశీం, ఎస్ఎల్ పద్మ, స్టాలిన్, శేషు, ముసవీర్, నాగేశ్వర్రావు పాల్గొన్నారు. -
డా. అంబేడ్కర్ ఎవరికి చెందినవాడు?
అంబేడ్కర్ ఎవ్వరికి చెందినా, చెందకపోయినా కాంగ్రెస్కు గాని ఆ మాటకు వస్తే బీజేపీకి, దాని మతతత్వ శక్తులకు ఏ కోణం నుండి చూసినా ఆయన చెందడు. ప్రొ. హరగోపాల్ బాబాసాహెబ్ అంబేడ్కర్, ఆయన ఆలోచనా విధానం సమకాలీన భారతదేశంలో ఒక కీలకమైన దశలో ఉంది. ఆయన ఎవరికి చెందినవాడు అనే కాక ఆయన ఆలోచనా విధానానికి నిజమైన వారసులు ఎవరు అనే చర్చ కూడా జరుగుతున్నది. అంబేడ్కర్ జన్మదినాన్ని జరపడానికి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పోటాపోటీ పడుతున్నాయి. ఇది గమనించిన ఎవరికైనా లేదా కొంచెం చరిత్ర తెలిసిన వారికి తప్పక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంబేడ్కర్ స్వాతంత్య్రోద్యమ కాలంలో కాంగ్రెస్ పార్టీని, దానికంటె మించి గాంధీజీని వాళ్ళ రాజకీయాలను వ్యతిరేకించాడు. ఇది వ్యక్తిగత వ్యతిరేకం కాదు, ఒక సైద్ధాంతిక భూమిక మీద ఏర్పడ్డ భావ సంఘర్షణ. ప్రధానంగా దళిత ఉద్యమాలకు వస్తే, ఇది చాలా సున్నిత అంశంగా మారింది. ఎలాంటి చర్చ జరిగినా వివాదాస్పదమవుతున్నది. ఒక కోణం నుంచి డాక్టర్ అంబేడ్కర్ కచ్చితంగా దళిత పోరాటాలకు చెందినవాడే. దళిత వర్గాలకు ఆయన మీద, ఆయన భావజాలం మీద న్యాయమైన క్లెయిమ్ ఉంది. అయితే అంబేడ్కరిజం దళిత వర్గాలకు మాత్రమే పరిమితమా, ఆయన కేవలం దళితుల గురించే మథనపడ్డారా అని ఆలోచిస్తే, అంబేడ్కర్కు మహిళల పట్ల కూడా అంతే ప్రజాస్వామ్యమైన మానవీయమైన భావాలుండేవి. ఉన్నత కులాల మహిళల గురించి ముఖ్యంగా బ్రాహ్మణ మహిళల గురించి, వాళ్ళ విధవత్వాన్ని గురించి చాలా మథనపడ్డాడు. ప్రతినెలా మహిళలను బహిష్ఠులైనప్పుడు మూడు రోజులు ఇంటి బయట పెట్టడాన్ని అంటరానితనంతో పోల్చాడు. బౌద్ధానికి మహిళల పట్ల చిన్నచూపు అనే ఒక అంశాన్ని గురించి చాలా పరిశోధన చేసి, బుద్ధుడికి మహిళల పట్ల ఉండే గౌరవాన్ని సోదాహరణంగా విశ్లేషించాడు. అలాగే మొత్తం కులవ్యవస్థ నిర్మూలన జరగాలి, దానిని కూకటివేళ్ళతో కూల్చాలని తన (అజీజిజ్చ్టీజీౌ ౌజ ్టజ్ఛి ఛ్చిట్ట్ఛ) కుల నిర్మూలన వ్యాసంలో ప్రతిపాదించాడు. అంటే కులాన్ని వ్యతిరేకించిన ప్రతి వ్యక్తికి, సమూహానికి అంబేడ్కర్ మీద క్లెయిమ్ ఉంటుంది. అంబేడ్కర్ ఎవ్వరికి చెందినా, చెందకపోయినా కాంగ్రెస్కు గాని ఆ మాటకు వస్తే బీజేపీ, దాని మతతత్వ శక్తులకు ఏ కోణం నుండి చూసినా ఆయన చెందడు. నిజానికి అంబేడ్కర్ దళిత ఉద్యమాలకి, మహిళా ఉద్యమాలకి, ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరిగే ఏ ఉద్యమానికైనా చెందినవాడే. అలాగే కులరహిత వర్గరహిత ప్రత్యామ్నాయ సమాజం కొరకు త్యాగాలు చేస్తూ పోరాడే విప్లవ శక్తులకు కూడా ఆయన ఆత్మబంధువే! (వ్యాసకర్త పౌర హక్కుల నేత, ఫోన్: 9989021741)
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
● జిల్లాలో వరుస చోరీలు ● తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ ● ఆందోళన చెందుతున్న ప్రజలు ● నిఘా పెంచిన పోలీసులు
వసతులు కల్పించాలని హిందూవాహిని వినతి
ఏటా రెండులారీల కోడి ఎరువు
సేంద్రియ ఎరువులకు డిమాండ్
ప్యాసింజర్ రైళ్లు.. నిర్లక్ష్యం ఎన్నేళ్లు?
‘బీజేపీపై బురదజల్లే ప్రయత్నం’
జీవన సాఫల్య పురస్కారం అందుకున్న ‘నలిమెల’
పత్తి విత్తనం.. ధరలకేదీ కళ్లెం?
రైతులకు జీలుగ విత్తనాల కష్టాలు
వామ్మో.. హోటల్ ఫుడ్
తప్పక చదవండి
- ఈవీఎం ట్యాంపర్ అయిందా? లేదా?.. చెక్ లిస్ట్తో చూసుకోండిలా..
- అసలు ‘రేవ్’ రచ్చ గురించి తెలుసా?
- జూన్ 1న ఇండియా కూటమి మీటింగ్!.. కీలక విషయాలపై చర్చ
- కేకేఆర్ విజయంతో బెంగాల్లో సంబరాలు మిన్నంటాయి: సీఎం మమత
- భారతీయుడు మళ్లీ వస్తున్నాడు.. అఫీషియల్ ప్రకటన
- తిరుపతి: చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం
- IPL 2024 Final: సన్రైజర్స్కు గుండెకోత.. చరిత్ర సృష్టించిన స్టార్క్
- మోదీని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలి: సీఎం నితీష్
- ఎవరు చంపారు..? ఎందుకీ దారుణం..?
- ఈ రాశివారికి ఆత్మీయుల నుంచి కీలక సమాచారం
Advertisement