-
FIH Player of the Year: హర్మన్ప్రీత్కు ‘ఎఫ్ఐహెచ్’ అవార్డు
న్యూఢిల్లీ: భారత స్టార్ డిఫెండర్ హర్మన్ప్రీత్ సింగ్ వరుసగా రెండో ఏడాది కూడా అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఎంపికయ్యాడు. అతను నిలకడైన ఆటతీరుతో ఇంటాబయటా జట్టు విజయాల్లో కీలకభూమిక పోషిస్తున్నాడు. ఈ భారత వైస్కెప్టెన్ 2021–22 ఎఫ్ఐహెచ్ హాకీ ప్రో లీగ్లో విశేషంగా రాణించాడు. 16 మ్యాచ్లాడిన హర్మన్ప్రీత్ 18 గోల్స్ చేశాడు. దీంతో ఒక సీజన్లో అత్యధిక గోల్స్ చేసిన భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. గతేడాది ఢాకాలో జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో అతని (6 మ్యాచ్ల్లో 8 గోల్స్) ప్రదర్శన వల్లే భారత జట్టు కాంస్యం గెలిచింది. ప్రతీ మ్యాచ్ లోనూ గోల్ చేయడం విశేషం. ఈ ఏడాది బర్మింగ్హామ్లో జరిగిన ప్రతిష్టాత్మక ‘కామన్వెల్త్ గేమ్స్’లో భారత్ రన్నరప్గా నిలువడంలోనూ అతని పాత్ర ఉంది. ‘హర్మన్ప్రీత్ ఆధునిక హాకీ క్రీడలో సూపర్స్టార్. అతని డిఫెన్స్ అద్భుతం. ప్రత్యర్థుల రక్షణపంక్తిని బోల్తా కొట్టించడంలో అతను ఘనాపాటి. తన స్టిక్కు అందిన బంతిని చకచకా ఆడిస్తూ తీసుకెళ్లే సామర్థ్యం అతని సొంతం. అదే వేగంతో గోల్పోస్ట్లోకి పంపడంలోనూ హర్మన్ దిట్ట. అందుకే వరుసగా ఈ ఏడాది కూడా అతన్నే అవార్డు వరించింది’ అని ఎఫ్ఐహెచ్ ఒక ప్రకటనలో కొనియాడింది. పురుషుల హాకీలో వరుసగా ఇలా అవా ర్డులు పొందిన నాలుగో ఆటగాడిగా హర్మన్ ఘనత వహించాడు. గతంలో డి నూయిజెర్ (నెదర్లాండ్స్), జేమీ డ్వెయర్ (ఆస్ట్రేలియా), ఆర్థర్ వాన్ డొరెన్ (బెల్జియం)లు రెండేళ్లు ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచారు. తాజా అవార్డు బరిలో ప్యానెల్... హర్మన్ ప్రీత్ సింగ్కు 29.4 పాయింట్లు ఇవ్వగా, రేసులో ఉన్న బ్రింక్ మన్ (నెదర్లాండ్స్; 23.6), టామ్ బూన్ (బెల్జియం; 23.4) వెనుకబడ్డారు. -
Womens FIH Pro League: అమెరికాపై భారత్ పైచేయి
రోటర్డామ్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) మహిళల ప్రొ లీగ్లో భారత జట్టు ఖాతాలో ఐదో విజయం చేరింది. అమెరికా జట్టుతో మంగళవారం జరిగిన మ్యాచ్లో టీమిండియా 4–2 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున దీప్ గ్రేస్ ఎక్కా (31వ ని.లో), నవనీత్ కౌర్ (32వ ని.లో), సోనిక (40వ ని.లో), వందన కటారియా (50వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. అమెరికా జట్టు డానియెలా గ్రెగా (28వ ని.లో) గోల్తో ఖాతా తెరువగా... నటాలీ కొనెర్త్ (45వ ని.లో) రెండో గోల్ అందించింది. ఈ విజయంతో భారత జట్టు ప్రొ హాకీ లీగ్లో 13 మ్యాచ్లు పూర్తి చేసుకొని 27 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. నేడు అమెరికా జట్టుతోనే భారత్ రెండో అంచె లీగ్ మ్యాచ్లో తలపడుతుంది. ఈ మ్యాచ్తో ప్రొ హాకీ లీగ్ను భారత్ ముగిస్తుంది. -
‘టాప్’లోనే టీమిండియా
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రొ లీగ్లో భారత్ తమ సత్తా చాటుకుంది. ఇంగ్లండ్తో ఆదివారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్లో టీమిండియా 4–3 గోల్స్ తేడాతో గెలిచింది. ఈ విజయంతో భారత్ తొమ్మిది జట్లు పాల్గొంటున్న ఈ లీగ్లో 21 పాయింట్లతో టాప్ ర్యాంక్లో కొనసాగుతోంది. భారత్ తరఫున హర్మన్ప్రీత్ సింగ్ (26వ, 43వ ని.లో), మన్ప్రీత్ సింగ్ (15వ, 26వ ని.లో) రెండు గోల్స్ చొప్పున సాధించారు. ఈ మ్యాచ్ ద్వారా హర్మన్ప్రీత్ కెరీర్లో 100 గోల్స్ మైలురాయిని దాటాడు. ఇంగ్లండ్ తరఫున లియామ్ సాన్ఫోర్డ్ (7వ ని.లో), డేవిడ్ కాన్డన్ (39వ ని.లో), సామ్ వార్డ్ (44వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. భారత్ ఈనెల 14, 15వ తేదీల్లో భువనేశ్వర్లోనే జర్మనీతో రెండు మ్యాచ్ల్లో తలపడుతుంది. -
‘షూటౌట్’లో భారత్ గెలుపు
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్లో భారత్ ఆరో విజయం నమోదు చేసింది. ఇంగ్లండ్తో శనివారం జరిగిన తొలి మ్యాచ్లో భారత్ ‘షూటౌట్’లో 3–2తో నెగ్గింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 3–3తో సమఉజ్జీగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించేందుకు షూటౌట్ను నిర్వహించారు. ముందుగా తొలి ఐదు షాట్లు ముగిశాక రెండు జట్లూ 2–2తో సమంగా నిలిచాయి. అనంతరం ఆరో షాట్లో ఇరు జట్ల ఆటగాళ్లు విఫలమయ్యారు. ఏడో షాట్లో భారత్ తరఫున అభిషేక్ గోల్ చేయగా... ఇంగ్లండ్ తరఫున లియామ్ విఫలం కావడంతో టీమిండియా విజయం ఖాయమైంది. ఈ గెలుపుతో తొమ్మిది జట్లు బరిలో ఉన్న ప్రొ లీగ్లో భారత్ 18 పాయింట్లతో టాప్ ర్యాంక్లోకి వచ్చింది. నేడు ఇంగ్లండ్తో ఇదే వేదికపై రెండో మ్యాచ్ ఉంది. -
జుగ్రాజ్ హ్యాట్రిక్
పాచెఫ్స్ట్రోమ్ (దక్షిణాఫ్రికా): అంతర్జాతీయ హాకీ సమాఖ్య పురుషుల ప్రొ లీగ్లో భారత జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన మ్యాచ్లో భారత్ 10–2 గోల్స్ తేడాతో నెగ్గింది. భారత్ తరఫున రెండో మ్యాచ్ ఆడుతున్న ‘డ్రాగ్ ఫ్లికర్’ జుగ్రాజ్ సింగ్ మూడు గోల్స్తో (4వ, 6వ, 23వ ని.లో) ‘హ్యాట్రిక్’ సాధించాడు. గుర్సాహిబ్జిత్ సింగ్ (24వ, 36వ ని.లో), దిల్ప్రీత్ సింగ్ (25వ, 58వ ని.లో) రెండు గోల్స్ చొప్పున చేశారు. హర్మన్ప్రీత్ సింగ్ (2వ ని.లో), అభిషేక్ (12వ ని.లో), మన్దీప్ సింగ్ (27వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. మంగళవారం ఫ్రాన్స్తో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా 5–0తో నెగ్గిన సంగతి విదితమే.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
Lok sabha elections 2024: బారామతి నుంచి మెయిన్పురి దాకా...హోరాహోరీ
బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దే..: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement