-
క్యూబాలో సొంత ఆస్తిహక్కు!
హవానా: కమ్యూనిస్టు రాజ్యం క్యూబాలో వ్యక్తిగత ఆస్తిహక్కు త్వరలో సాకారం కాబోతోంది. ఇందుకు సంబంధించి సవరించిన రాజ్యాంగ బిల్లు వారం రోజుల్లో జాతీయ అసెంబ్లీ ముందుకు రానుంది. 1976లో ఫిడెల్ క్యాస్ట్రో అధ్యక్షతన ఏర్పాటైన సోషలిస్టు రాజ్యాంగం సొంత ఆస్తిహక్కుకి పూర్తిగా వ్యతిరేకం. పాత రాజ్యాంగంలో ఉన్న 137 ఆర్టికల్స్కు అదనంగా మరో 224 ఆర్టికల్స్ను కొత్త రాజ్యాంగంలో పొందుపరచాలని ముసాయిదాలో ప్రతిపాదించినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ బిల్లు సభలో ఆమోదం పొందితే క్యూబాలో వ్యక్తిగత ఆస్తిహక్కు చట్టబద్దమమవుతుంది. వ్యక్తిగత ఆస్తిని ఆమోదించడం అంటే చట్టబద్ధంగా ప్రైవేటు ఆస్తికి రక్షణనివ్వడమేననీ, తద్వారా ప్రైవేటు పారిశ్రామికవేత్తలకు ఇది ఊతమిస్తుందని ప్రభుత్వ అధికారిక పత్రిక గ్రాన్మా అభిప్రాయపడింది. రౌల్ క్యాస్ట్రో అనంతరం మిగ్వెల్ డియాజ్ కానెల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక రాజ్యాంగ సంస్కరణలు వేగం పుంజుకున్నాయి. 2011లో చేసిన చట్ట సవరణతో ఆస్తి అమ్మకాలపై నిషేధాన్ని తొలగించారు. -
ఆ ముసాయిదా బిల్లును ఆమోదించవద్దు
రాష్ట్రపతికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ లేఖ సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన భూ సేకరణ బిల్లు ముసాయిదాను ఆమోదించవద్దని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శనివారం రాష్ట్రపతికి లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా ప్రజా ప్రయోజనాలకు, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కుకు విఘాతం కలిగించేలా ఉందని పేర్కొన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం, భూ సేకరణ చేయాలంటే బహిరంగ విచారణ, సామాజిక ప్రభావ మదింపు వంటివి చేయాల్సి ఉందని, కానీ ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులో అవేవీ లేవని తెలిపారు. -
ఆస్తిహక్కుపై సుప్రీం సంచలన తీర్పు
పెళ్లయిన మహిళలకు ఆస్తి హక్కు విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కట్టుకున్న భార్యకు, ఏకైక కొడుక్కి ఏమీ ఇవ్వకుండా.. పెళ్లయిన కుమార్తెకు మొత్తం ఆస్తిని ఇచ్చేయొచ్చని సుప్రీంకోర్టు తన తీర్పులో చెప్పింది. పశ్చిమబెంగాల్ సహకార సంఘాల నిబంధనల ప్రకారం సొసైటీలోని ఒక ఫ్లాట్ ఓనర్ తన తర్వాత ఆ ఇంటిని కేవలం తన కుటుంబ సభ్యులకు మాత్రమే ఇవ్వొచ్చని ఉంది. ఈ నిబంధనను చూపిస్తూ, తన భర్త కొనుగోలు చేసిన ఫ్లాట్ యాజమాన్యాన్ని మేనేజింగ్ కమిటీవాళ్లు తమ పెళ్లయిన కుమార్తె ఇంద్రాణికి ఇవ్వడాన్ని సవాలుచేస్తూ విశ్వరంజన్ సేన్గుప్తా భార్య, కుమారుడు హైకోర్టుకెక్కారు. తన భార్య, కొడుకు తనను సరిగ్గా చూడకపోవడంతో చివరి రోజుల్లో సేన్గుప్తా తన కుమార్తె వద్దే ఉండేవారు. ఈ కేసులో ఇంద్రాణి అప్పీలు చేయగా, ఆ ఫ్లాట్ను ఆమె పేరు మీద రిజిస్టర్ చేయాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులిచ్చారు. దీనిపై ఆమె తల్లి డివిజన్ బెంచికి అప్పీలు చేశారు. మొత్తం ఆస్తిలో ఇంద్రాణి కూడా ఒక భాగస్వామి అవుతారు తప్ప మొత్తం ఆస్తికి ఏకైక హక్కుదారు కాదని డివిజన్ బెంచి తీర్పునిచ్చింది. ఆ తీర్పును సవాలుచేస్తూ ఇంద్రాణి సుప్రీంను ఆశ్రయించారు. ఈ మొత్తం అంశాన్ని పరిశీలించిన జస్టిస్ జేఎస్ ఖేకర్, జస్టిస్ సి.నాగప్పన్లతో కూడిన ధర్మాసనం తన తుది తీర్పు వెలువరించింది. సహకార సంఘంలో సభ్యుడు తనకు కావల్సినవాళ్లను నామినేట్ చేసుకోవచ్చని, ఆ సభ్యుడు మరణించిన తర్వాత సొసైటీ తప్పనిసరిగా సదరు నామినీ ప్రయోజనాలను తప్పనిసరిగా కాపాడాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement