-
కలకలం రేపిన అపరిచితుడు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం, బత్తలపల్లి: అపరిచితుడు కలకలం రేపాడు. సంజీవపురం సమీపంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లోకి ఆదివారం అర్ధరాత్రి అపరిచిత వ్యక్తి చొరబడి ఆరో తరగతి విద్యార్థిని గొంతు పట్టుకుని నులిమాడని, అయితే ఆ విద్యార్థి అరవడంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడని తోటి విద్యార్థినులు తెలిపారు. నైట్వాచ్మన్, టీచర్ విద్యార్థినుల వద్దకు వెళ్లి విచారణ చేశారు. సోమవారం ఉదయం స్పెషలాఫీసర్ మాధవి సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. అందులో ఎక్కడా అపరిచితుడు వచ్చినట్లు ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో వెంటనే ఆమె ధర్మవరం రూరల్ సీఐ శివరాముడు, ఎస్ఐ హారున్బాషాలకు సమాచారమందించారు. అనంతరం బత్తలపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. విద్యార్థినులు కలలుకంటూ భయాందోళన చెంది ఉంటారని, అపరిచిత వ్యక్తి సంచరించిన ఆనవాళ్లు పరిసరాల్లో ఎక్కడా లభించలేదని కొట్టిపారేశారు. -
ఆకర్షణ.. వ్యామోహం..ప్రేమ పేరుతో ఉన్మాదం
సాక్షి, సిటీబ్యూరో: గతేడాది అమీన్పూర్ గుట్టల్లో ఇంటర్మీడియట్ విద్యార్థిని చాందినిజైన్.. లాలాగూడ ప్రాంతంలో సంధ్యారాణి. గత నెలలో కూకట్పల్లిలో జానకి.. ప్రేమోన్మాదానికి బలయ్యారు. అనుబంధ వారధిగా ఉండాల్సిన ప్రేమ ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తోంది. ప్రేమ ముసుగులో మగాళ్ల ఉన్మాదం రంకెలు వేస్తోంటే... అభంశుభం తెలియని అభాగినులు అసువులు బాస్తున్నారు. పరిపక్వత లేని ప్రేమలే ఈ దారుణాలకు కారణమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జీవితం అంటే ఏమిటి? దాని విలువల ఏమిటి? అనేవి పూర్తిగా అవగతం కాని పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయిల్లో పుట్టే ఆకర్షణే దారుణాలకు దారి తీస్తోంది. తెలిసీ తెలియని వయస్సులో ఆకర్షణ, వ్యామోహంలో పడి దాన్నే ప్రేమగా భావిస్తున్నారు. తర్వాత ఇద్దరిలో ఎవరో ఒకరు అసలు విషయాన్ని గుర్తించి జాగ్రత్తపడితే... రెండోవాళ్లు రెచ్చిపోతున్నారు. అయితే ఆత్మహత్య చేసుకోవడమో, లేదంటే హత్యకు తెగబడడమో జరుగుతోంది. ఒక్కో సందర్భంలో బెదిరింపులు, బ్లాక్ మెయిల్, దాడులకు పాల్పడి కటకటాల్లోకీ చేరి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈ ధోరణి ఎక్కువగా మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వర్గాల్లోనే కనిపిస్తోంది. తేలికైన పరిచయాలు... ఇటీవల కాలంలో వ్యక్తిగత ఫోన్లు, సోషల్ మీడియాల కారణంగా పరిచయం తేలికవుతోంది. ఒకప్పుడు కేవలం బంధువులు, స్నేహితులు లేదా పరిచయస్తుల ద్వారా మాత్రమే కొత్తవారు పరిచయం అయ్యేవారు. అలా కాదంటే విద్యాసంస్థలు, ఉద్యోగం చేసే ప్రాంతాల్లోనే పరిచయాలు ఏర్పడేవి. అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రభావం కారణంగా ఏమాత్రం సంబంధం లేనివాళ్లు స్నేహితులుగా మారిపోతున్నారు. కొన్నాళ్లకు ఇదే ప్రేమగా మారి ఆపై ‘దెబ్బతింటోంది’. అటకెక్కిన యువజన విధానం... సమాజంలో మహిళలకున్న సమున్నత స్థానం, వారి హక్కులను యువతకు క్షుణ్నంగా బోధించాలన్న ఉద్దేశంతో కొన్నేళ్ల క్రితం రూపొందినదే జాతీయ యువజన వి«ధానం. మహిళలపై యువజనులు గౌరవంగా మసలుకొనేలా వారికి అవసరమైన కౌన్సెలింగ్ ఇవ్వాలని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఆ లక్ష్యాలు నెరవేరేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకున్న దాఖలాలే లేవు. యువజనులను 13–19, 20–35 ఏళ్ల మధ్య వయసుల వారీగా రెండు గ్రూపులుగా విభజించారు. యవ్వన దశలో కీలకమైన 13–19 ఏళ్ల మధ్య వారికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని అందులో నిర్దేశించారు. ప్రేమోన్మాదులు, వారి బారినపడుతున్న వారిలో అత్యధికులు ఈ పాతికేళ్లలోపు వారే. జాతీయ యువజన విధానంలో పొందుపరిచిన విధంగా ఇక్కడి సమాజంలో స్త్రీల స్థానం, వారికున్న హక్కులపై మగపిల్లలకు అవగాహన కల్పించడంలో గానీ, మహిళల విషయంలో గౌరవంగా మసలుకొనేలా కౌన్సెలింగ్ ఇవ్వడంలో గానీ ప్రభుత్వాలు ఎంతటి ‘చిత్తశుద్ధిని’ చూపిస్తున్నాయో తెలుస్తూనే ఉంది. తల్లిదండ్రులూ మారాలి... ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకోవడం వెనక పరోక్షంగా తల్లిదండ్రుల పాత్ర సైతం ఉంటుందని ప్రముఖ మానసిక నిపుణులు రాజశేఖర్ అభిప్రాయపడ్డారు. ‘యుక్తవయసు పిల్లల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ సమయంలో వారిపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం యాంత్రిక జీవితంలో పిల్లలపై శ్రద్ధ తగ్గింది. ఫలితంగా యూత్ పెడదారి పడుతోంది. సినిమా, టీవీల ప్రభావంతో ఒక్కోసారి హద్దులు మీరి ఇలాంటి ఉదంతాలకు పాల్పడుతున్నారు. మరోవైపు యువతీ యువకులు మాట్లాడుకుంటే అపార్థం చేసుకోవడమూ.. వారిలో లేని ఆలోచనలు రేకెత్తించినట్టే. పిల్లలను చేరదీసి జీవితం, భవిష్యత్తు విలువలను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటే ఇలాంటి ఉదంతాలు పునరావృతం కావ’ని అన్నారు. -
విశాఖలో సైకో భయోత్పాతం
- బాలిక మృతి, మరొకరికి గాయాలు విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా కైలాసపురంలో ఓ సైకో భయోత్పాతం సృష్టించాడు. తాగిన మైకంలో కత్తితో దాడి చేయడంతో ఓ పదేళ్ల బాలిక మృతిచెందింది. పక్కనే ఉన్న మరో ఎనిమిదేళ్ల బాలికకు తీవ్రగాయాలయ్యాయి. బాలిక పరిస్థితి విషమంగా ఉంది. కంచరపాలెం పోలీసులు సైకోను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
Advertisement