-
మన మెట్రోనే భిన్నం
మరో నాలుగు రోజుల్లో హైదరాబాద్నూ ఈ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. అన్ని నగరాల కంటే మన మెట్రో ఎన్నో ప్రత్యేకతలను సొంతం చేసుకుంది. ఒకే పిల్లర్పై ట్రాక్, స్టేషన్ల నిర్మాణం, డ్రైవర్ లేని సాంకేతికత, కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ వ్యవస్థ, ప్రీకాస్ట్ విధానం, పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో ఇది నిర్మాణమవుతోంది. అంతేకాదు పలు మెట్రో నగరాల్లో తొలివిడతగా 5 లేదా పది.. గరిష్టంగా 20 కి.మీ. మాత్రమే మెట్రో రైళ్లు తొలి విడతగా పట్టాలెక్కాయి. మన సిటీలో మాత్రం ఈనెల 28న 30 కి.మీ. మార్గంలో మెట్రో రైళ్లు పరుగులు తీయనుండడం విశేషం. మహానగరాల ప్రజా రవాణా వ్యవస్థల్లో మెట్రో రైళ్ల శకం పరుగులు పెడుతోంది. ఆయా సిటీల్లో లక్షలాది మంది సాధారణ ప్రజల(ఆమ్ ఆద్మీలు) రోజువారీగా ఏసీ బోగీల్లో సౌకర్యవంతమైన ప్రయాణం, ట్రాఫిక్ నరకం లేకుండా గమ్యం చేర్చేందుకు తనకేవీ సాటిరావని మెట్రో రైళ్లు రుజువు చేస్తున్నాయి. దేశరాజధాని ఢిల్లీతో పాటు బెంగళూరు, ముంబై, చెన్నై తదితర మహానగరాల్లో ఇప్పుడు మెట్రో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. వీటన్నింటి కంటే మన మెట్రోనే భిన్నంగా నిర్మాణమవుతోంది. ఈ తరుణంలో పలు మెట్రో నగరాల్లో అందుబాటులో ఉన్న మెట్రో రైలు ప్రాజెక్టుల విశేషాలపై ప్రత్యేక కథనం. ఢిల్లీలో ఇలా మొదలైంది.. ♦ 1998 అక్టోబరులో మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ప్రారంభం. ♦ 2002 డిసెంబరులో 25 కి.మీ. మార్గంలో తొలిదశ అందుబాటులోకి.. ♦ ప్రస్తుతం 218 కి.మీ. మార్గంలో మెట్రో రైళ్లు అందుబాటులోకి.. ♦ నిత్యం ఆరు మార్గాల్లో 24 లక్షలమంది మెట్రో రైళ్లలో ప్రయాణం. ♦ డీఎంఆర్సీ సంస్థ ఈ పనులను చేపట్టింది. ముంబై నగరంలో ఇలా.. ♦ మెట్రో రైళ్లలో రోజువారీగా 2.5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ♦ ప్రస్తుతం 11.4 కి.మీ. మార్గంలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ♦ తొలిదశ మెట్రో పనుల పూర్తికి 8 సంవత్సరాల సమయం పట్టింది. ♦ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్మాణం పనులు మొదలయ్యాయి. బెంగళూరులో.. ♦ 2015 మేలో ప్రాజెక్టు ప్రారంభమైంది ♦ 42.30 కి.మీ. మార్గంలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ♦ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. చెన్నైలో శ్రీకారం ఇలా.. ♦ చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ♦ 2009 జూన్లో ప్రారంభమయ్యాయి ♦ జూన్ 29, 2015 నాటికి తొలిదశ పూర్తయింది. ♦ తొలిదశలో కోయంబేడు– ఆలందూర్ మధ్య 27 కి.మీ. మార్గంలో 27 రైళ్లు పరుగులు. ♦ నిత్యం 3లక్షల మంది ఈ రైళ్లలో రాకపోకలు సాగిస్తున్నారు. ♦ మొత్తం 45 కి.మీ. మార్గంలో పనులు చేపడుతున్నారు. ఇందులో 21 కి.మీ. మేర ఎలివేటెడ్ (ఆకాశమార్గం), మరో 24 కి.మీ భూగర్భ మార్గంలో సాగుతున్నాయి. ♦ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.14,750 కోట్లు హైదరాబాద్ ప్రాజెక్టు ఇలా.. ♦ 2012 జూన్లో మెట్రో పనులు ప్రారంభమయ్యాయి. ♦ ఎల్బీనగర్– మియాపూర్, జేబీఎస్– ఫలక్నుమా, నాగోల్– శిల్పారామం రూట్లలో మొత్తం 72 కి.మీ. మార్గంలో మెట్రో పనులు సాగుతున్నాయి. ♦ తొలి దశలో ఈనెల 28న 30 కి.మీ మార్గంలో రైళ్లు పరుగులు తీయనున్నాయి. ♦ 2018 డిసెంబరు నాటికి మొత్తం 72 కి.మీ. మార్గం అందుబాటులోకి రానుంది. ♦ ప్రారంభంలో సుమారు 16 లక్షలు, 2020 నాటికి 24 లక్షల మంది మెట్రో రైళ్లలో ప్రయాణిస్తారని అంచనా. ♦ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.16,000 కోట్లు. ఇందులో కేంద్రం 10 శాతం, మరో 90 శాతం ఎల్అండ్టీ సంస్థలు ఖర్చు చేస్తున్నాయి. మరో రూ.1980 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ, రహదారుల విస్తరణకు వ్యయం చేస్తోంది. ♦ ప్రతి రైలులో మూడు బోగీలుంటాయి. వెయ్యి మంది సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ♦ మొత్తం మూడు కారిడార్లలో 57 మెట్రో రైళ్లు 72 కి.మీ. మార్గంలో రాకపోకలు సాగిస్తాయి. ♦ మియాపూర్, ఉప్పల్, ఫలక్నుమా ప్రాంతాల్లో మూడు మెట్రో రైలు డిపోలు ఏర్పాటు. ♦ మూడు కారిడార్లలో రాకపోకలు సాగించే మెట్రో రైళ్లను ఉప్పల్ మెట్రో డిపోలోని ఆపరేషన్ కంట్రోల్ కేంద్రం నుంచి నియంత్రిస్తారు. -
ముస్లిం నివాస ప్రాంతాల్లో సాంకేతిక శిక్షణ సంస్థలు
కేంద్ర మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ సాక్షి, హైదరాబాద్: దేశంలోని ముస్లిం నివాస ప్రాంతాల్లో పాలిటెక్నిక్, ఐటీఐ లాంటి సాంకేతిక శిక్షణ సంస్థలు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ముక్తార్అబ్బాస్ నఖ్వీ వెల్లడించారు. శుక్రవారం మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ)లో 17 ఫౌండేషన్ డేలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సంస్థల్లో సాంకేతిక శిక్షణ పొందిన ముస్లిం యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకోనున్నట్లు చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి పలు కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఉర్దూ దేశ సంస్కృతి అనీ, దీన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. మదర్సాల్లో ఆధ్యాత్మిక బోధనతోపాటు ఉర్దూ పాఠశాలల్లో ఆంగ్లం, హిందీ సబ్జెక్ట్ల్లో కూడా విద్యనందించాలని ఆయన కోరారు. మైనారిటీల సాధికారత, అభివృద్ధికి కేంద్రం కృషి దేశంలోని మైనారిటీల సాధికారిత, అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మైనారిటీలు విద్య, ఉపాధి రంగాల్లో ముందుకు వెళ్లేందుకు తాము కృషి చేస్తామన్నారు. హైదరాబాద్లోని పర్యాటక భవన్లో శుక్రవారం మైనారిటీ సంక్షేమంపై డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో 50శాతానికి పైగా మైనారిటీలు దారిద్య్రరేఖకు దిగువనే ఉన్నారని చెప్పారు. మైనారిటీలు ఎదిగేందుకు కేంద్రప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. వక్ఫ్ ఆస్తుల రక్షణకు చర్యలు చేపడుతామన్నారు. ఏ మతం చాంపియన్ అనే చర్చ అనవసరం పుట్టుకతో అందరూ ముస్లింలేనని ఇటీవల ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు నఖ్వీ నిరాకరించారు. ఏ మతం చాంపియన్ అనే అంశం జోలికి తాను వెళ్లనని, ఎవరూ మాట్లాడకూడదన్నారు. ఘర్ వాపసీ, లవ్ జిహాదీలకు కేంద్రం వ్యతిరేకమని చెప్పారు. టైస్టులకు సాయపడేలా పాకిస్తాన్ తీసుకునే చర్యలు గర్హనీయమన్నారు. టైస్టు లక్వీకి బెయిల్ ఇవ్వడాన్ని తప్పు పట్టారు. తెలంగాణలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అడిగిన ప్రశ్నకు అది రాష్ట్రాల అంశమని నఖ్వీ దాటవేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement