-
Andhra Pradesh: టెన్త్ పరీక్షలు ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 3,349 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తున్నారు. 6,64,152 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో రెగ్యులర్ అభ్యర్థులు 6,09,070 మంది కాగా, మిగిలిన వారు ఓఎస్సెస్సీ రెగ్యులర్, సప్లిమెంటరీ అభ్యర్థులు. ఉదయం 8.45 నుంచి 9.30 గంటల వరకు మాత్రమే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఒక్కో గదిలో 24 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకున్నారు. అన్ని కేంద్రాల్లోనూ పూర్తి స్థాయిలో ఫర్నీచర్, మంచి నీరు వంటి సదుపాయాలు కల్పించామని ప్రభుత్వ పరీక్షల డైరక్టర్ డి.దేవానందరెడ్డి తెలిపారు. పరీక్ష సమయాలకు అనుగుణంగా విద్యార్థుల రాకపోకలకు సమస్య లేకుండా ఆర్టీసీ యాజమాన్యం తగినన్ని బస్సులు నడుపుతోందన్నారు. పరీక్షలు జరిగే రోజుల్లో టెన్త్ విద్యార్థులు హాల్ టికెట్ చూపించి, ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. ఏడు మాధ్యమాల్లో పరీక్షలు తెలుగు, ఇంగ్లిష్, హిందీ, కన్నడ, తమిళం, ఒడియా, ఉర్దూ మాధ్యమాల్లో రోజు విడిచి రోజు ఆరు పేపర్లలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ► తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మేథ్స్, సోషల్ స్టడీస్ పరీక్షలకు 24 పేజీల బుక్లెట్, ఫిజికల్ సైన్స్, నేచురల్ సైన్స్, సంస్కృతం, వృత్తి విద్యా కోర్సులకు 12 పేజీల బుక్లెట్లను అందిస్తారు. సైన్స్కు ఒకే ప్రశ్నపత్రం, రెండు ఆన్సర్ షీట్లు ఉంటాయి. ఆయా ప్రశ్నలకు నిర్దేశిత బుక్లెట్లోనే సమాధానాలు రాయాలి. ► పేపర్ లీక్ అనేది లేకుండా పక్కాగా నిఘా ఏర్పాట్లు చేశారు. ఎక్కడైనా, ఏదైనా అవాంఛనీయ ఘటన, లీక్ జరిగితే అది ఎక్కడ జరిగిందో వెంటనే కనిపెట్టేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ► అన్ని పరీక్ష కేంద్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులే ఇన్విజిలేటర్లుగా వ్యవహరిస్తారు. పరీక్షల నిర్వహణకు 43 వేల సిబ్బందిని నియమించారు. రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్టీసీ తదితర విభాగాల సహకారం తీసుకుంటున్నారు. సమస్యాత్మకంగా గుర్తించిన 104 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అన్ని పరీక్ష కేంద్రాలనూ నో ఫోన్ జోన్లుగా ప్రకటించారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ ఆఫీసర్లు సహా ఏ ఒక్కరూ మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి తీసుకెళ్లరాదు. ► విద్యార్థులు కూడా వాచీలు, ఫోన్లు ఇతర డిజిటల్ వస్తువులను తీసుకెళ్లకూడదు. పెన్ను, పెన్సిల్, ఎరేజర్ స్కేలు వంటివి తీసుకెళ్లవచ్చు. విద్యార్థులకు ఇచ్చిన ఓఎమ్మార్ షీట్లో వివరాలు తనవో కాదో సరిచూసుకున్న తర్వాతే సమాధానాలు రాయాలి. ఏదైనా తేడా ఉంటే ఇన్విజిలేటర్కు చెప్పి సరైనది పొందాలి. ఓఎమ్మార్ షీట్ను సమాధానాల బుక్లెట్కు పిన్ చేయాలి. ► ఈ నెల 19 నుంచి 26వ తేదీ వరకు సమాధాన పత్రాల మూల్యాంకనం జరుగుతుంది. -
అసౌకర్యాల పరీక్ష
కర్నూలు(విద్య), న్యూస్లైన్: ఒక వైపు మండే ఎండలు..మరోవైపు అరకొర సౌకర్యాల మధ్య గురువారం జిల్లాలో పదోతరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పట్టణకేంద్రాల్లో చాలీచాలని బెంచీలు, పక్కపక్కనేకూర్చుని పరీక్ష రాయడం కనిపించింది. మండల కేంద్రాల్లో విద్యుత్ కోత, ఫర్నిచర్ కొరతతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరీక్ష మొదటి రోజు కావడంతో విద్యార్థులు ఉదయం 7 గంటలకే రోడ్డుపైకి వచ్చారు. అధిక శాతం నేరుగా దేవాలయాలకు చేరుకుని ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం 8.30 గంటల నుంచి వారు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. 8.45 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. 9.30 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. అయితే 9.30 గంటలు దాటి వచ్చినా 10 గంటల వరకు విద్యార్థులను అనుమతించడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. గురువారం మొదటిరోజు మొత్తం 53,340 మంది విద్యార్థులకు గాను 52, 599 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 751 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. కర్నూలు, ఆదోని, నంద్యాల వంటి పట్టణాల్లో మినహా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో అధిక శాతం విద్యార్థులు నేలపైనే కూర్చుని పరీక్ష రాయాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా కర్నూలు నగరంలో పదో తరగతి పరీక్ష కేంద్రాలను కలెక్టర్ సుదర్శన్రెడ్డి, డీఈవో కె. నాగేశ్వరరావు గురువారం తనిఖీ చేశారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
సన్ రైజర్స్ vs పంజాబ్..తారలతో నిండిన ఉప్పల్ స్టేడియం (ఫోటోలు)
ఆసీస్ యువ సంచలనానికి లక్కీ ఛాన్స్.. వరల్డ్కప్ జట్టులో చోటు!?
పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
'దేవర' ఫియర్ సాంగ్ వచ్చేసింది
హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
తారక్ అభిమానుల మంచి మనసు.. 'రా ఎన్టీఆర్ 2.0' టీమ్ రక్తదానం
నా ఆల్టైమ్ ఫేవరెట్ క్రికెటర్ అతడే: టీమిండియా స్టార్
సెంటరాఫ్ అట్రాక్షన్గా ఉండాలనే తపన ..!
14 ఏళ్ల వయస్సులోనే కల.. ఎవరీ ‘ఐస్క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’
ఎస్బీఐకి మొట్టికాయలు గట్టిగానే పడ్డాయిగా?
తప్పక చదవండి
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement