-
పప్పు ధాన్యాల బోర్డు ఏర్పాటుపై శాసనసభలో బిల్లు
-
సబ్సిడీ పెంపుపై కేంద్రానికి నివేదిస్తా
♦ జాతీయ ఆహారభద్రత మిషన్ కన్సల్టెంట్ డాక్టర్ ఉపకార్ సదన్ ♦ అల్లీపూర్లో పప్పుదినుసుల పంటల పరిశీలన ధారూరు: జాతీయ ఆహారభద్రత మి షన్, పప్పు దినుసుల పథకం కింద కేంద్రం రైతులకు అందిస్తున్న 50 శాతం సబ్సిడీని 90 శాతానికి పెంచాలన్న తెలంగాణలోని రైతాంగం సూచనను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తానని జాతీయ ఆహారభద్రత మిషన్ కన్సల్టెంట్ డాక్టర్ ఉపకార్ సదన్ అన్నారు. గురువారం ఆయన ధారూరు మండలంలోని అల్లిపూర్ గ్రామంలో సాగుచేసిన కంది, మొక్కజొన్న అంతర పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కేంద్రం రైతులకు అం దిస్తున్న సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రా మంలో ఎంతమంది రైతులు, ఎన్ని ఎకరాల్లో పప్పుదినుసులు సాగుచేస్తున్నారని ఆయన ప్రశ్నించా రు. 50 మంది రైతులు 200 ఎకరాల్లో సాగుచేస్తున్నారని రాష్ట్ర కన్సల్టెంట్ ఫయూ మ్ తెలిపారు. తాము ముందుగా భూసార పరీక్షలు చే యించి వచ్చిన రిపోర్టు ప్రకారం సాగు చేస్తామని, ట్రైకోడటెర్మాతో విత్తనశుద్ధి చేసి విత్తనాలు వేస్తామని రైతులు చెప్పారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎన్కతల గోపాల్ మాట్లాడుతూ రైతులకు స్ప్రింక్లర్లు, పైపులను సబ్సిడీపై అందించాలని కోరారు. కందిలో ఏ రకం విత్తనాలను వాడుతున్నారని, దిగుబడిలో ఏమైనా వ్యత్యాసం ఉందా అని ఉపకార్ సదన్ రైతులను అడిగారు. ఆశా రకం విత్తనాలతో దిగుబడి అధికంగా వస్తుందని రైతులు చెప్పారు. ప్రస్తుతం కొనసాగిస్తున్న పథకం ఇంకా కొనసాగిం చాలా వద్దా అని ఆయన రైతులను ప్రశ్నించగా మూడు సంవత్సరాల నుంచి కేంద్రం ఇచ్చే సబ్సిడీతో పప్పు దినులసు పండిస్తున్నామని, అలాగే ఈ పథకాన్ని కొనసాగించాలని వారు సూచించారు. భూముల్లో ఎక్కువగా జింక్ లోపం ఉందని రైతులు ఆయన దృష్టికి తేగా జింక్ను బాగా వాడాలని, ఒకసారి వేస్తే 3 సంవత్సరాల వరకు పని చేస్తుందని చెప్పారు. ఉపకార్ సదన్ వెంట రాష్ట్ర కన్సల్టెంట్ ఫయూమ్, జిల్లా ఏడీఏ వీరప్ప, వికారాబాద్ ఏడీఏ దివ్యజ్యోతి, ఏఓ ఝాన్సీలక్ష్మి, ఏఈఓ సంజూరాథోడ్,రైతులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement