-
సీజేఐ వద్దకు భూ పంచాయితీ
న్యూఢిల్లీ: భూసేకరణకు సంబంధించిన కేసుల విచారణకు తగిన ధర్మాసనం ఏర్పాటు చేయాలని కోరుతూ కేసును ప్రధాన న్యాయమూర్తికి సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం సిఫార్సు చేసింది. ఈ కేసులో ఫిబ్రవరి 8న వెలువరించిన తీర్పుపై బుధవారం ముగ్గురు సభ్యుల ధర్మాసనం స్టే విధించడంతో వివాదం నేపథ్యంలో ఈ అంశాన్ని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రాకు రిఫర్ చేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ అరుణ్మిశ్రా, జస్టిస్ అమితవ రాయ్తో కూడిన ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. ఈ అంశాన్ని సీజేఐకి సిఫార్సు చేయడమే సరైన నిర్ణయమని, బుధవారం నాటి ఉత్తర్వుల నేపథ్యంలో ఈ అంశంపై విచారణను కొనసాగించాలా? లేదా? అనే విషయాన్ని ఆయనే తేలుస్తారని ధర్మాసనం స్పష్టం చేసింది. నిర్దేశిత ఐదేళ్ల కాలంలో పరిహారం చెల్లించనట్లయితే దాని పేరు చెప్పి భూ సేకరణను రద్దు చేయడం చెల్లదని ఫిబ్రవరి 8న జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. పుణే మున్సిపల్ కార్పొరేషన్ కేసులో 2014లో మరో త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. అయితే దీనిపై జస్టిస్ మదన్ బి లోకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం స్పందిస్తూ.. న్యాయ వ్యవస్థ అన్ని అంశాలపై ఒకేలా వ్యవహరించాలని పేర్కొంది. ఈనెల 8న వెలువరించిన తీర్పును పరిశీలించినట్లైతే.. న్యాయ వ్యవస్థ క్రమశిక్షణలో వ్యత్యాసం కనిపిస్తోందని, అభిప్రాయభేదాలు ఉన్నందున ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి అప్పగించాలని, అలాగే హైకోర్టులు ఈ అంశంపై దాఖలైన కేసులను విచారించొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం గురువారం స్పందిస్తూ.. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే తీర్పు వెలువరించామని, తీర్పు పూర్తిగా చదవకుండానే దాడికి దిగుతారని, ముందు తీర్పు కాపీని చదివి ఆ తర్వాత మాట్లాడాలని స్పష్టం చేసింది. ఈ అంశాన్ని ఎవరు విచారించాలనేది సీజేఐ నిర్ణయిస్తారని పేర్కొంది. -
అక్బరుద్దీన్కు నో ఎంట్రీ
ఏఐఎంఐఎం కీక నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి పుణె పోలీసులు షాక్ ఇచ్చారు. పుణె మున్సిపల్ కార్పొరేషన్(పీఎంసీ) ఉప ఎన్నిక ప్రచారంలో అక్బర్ పాల్గొనేందుకు అనుమతించమని పుణె పోలీస్ కమిషనర్ శనివారం తేల్చిచెప్పారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందునే అక్బర్ను పుణెలోకి అనుమతించడంలేదని కమిషనర్ పేర్కొన్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో రెండు ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకున్న ఎంఐఎం.. స్థానిక సంస్థలపైనా పట్టు సాధించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే పీఎంసీలోని కోడ్వా వార్డులో తమ అభ్యర్థిని పోటీకి నిలిపింది. ఇక్కడ వచ్చే వారం పోలింగ్ జరగనుంది. ఈ వార్డులో 55 శాతం ఓట్లు ముస్లింలవే కావడం విశేషం. కాగా, అక్బరుద్దీన్ ఆదివారంనాడు కోడ్వాలో ప్రచారం చేయాల్సి ఉంది. పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆయన పర్యటన డైలమాలో పడినట్లయింది. బీహార్ ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్న అక్బరుద్దీన్ ప్రధాని మోదీని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, కేసు నమోదు కావటం తెలిసిందే. -
‘పాషణ్’ ఇక పరిశుభ్రం
పుణే: నగర శివారులోని పాషణ్ సరస్సుతోపాటు పరిసర ప్రాంతాల్లో పుష్పజాతుల పరిరక్షణపై పుణే మున్సిపల్ కార్పొరేషన్ దృష్టి సారించింది. ఇందులోభాగంగా ఈ సరస్సులో పెరిగిన గుర్రపుడెక్క, తామర మొక్కల తొలగింపు పనులను ఆదివారం చేపట్టింది. ఈ విషయాన్ని పీఎంసీ పర్యావరణ విభాగం అధికారి మంగేష్ దిఘే వెల్లడించారు. నెల రోజుల్లోగా ఈ పనులను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గుర్రపుడెక్కను తొలగిస్తున్నామన్నారు. ఈ పనుల్లో దాదాపు 20 మంది కార్మికులు పాలుపంచుకుంటున్నారన్నారు. ఇందుకు ఉద్యానవనం, ఆరోగ్య విభాగం, ఘన వ్యర్థాల నిర్వహణ విభాగం, జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ పునర్ నిర్మాణ పథకం (జేఎన్ఎన్యూఆర్ఎం) అధికారులు కూడా తమవంతు సహకారం అందిస్తున్నారన్నారు. ఈ సర స్సులోకి కాలుష్యాలు వచ్చిచేరకుండా చేసేందుకుగాను దీని పరిసర ప్రాంతాల్లో త్వరలో జనజాగృతి కార్యక్రమాలను నిర్వహించనున్నామన్నారు. ఈ పనులు పూర్తయితే ఈ సరస్సు పరిశుభ్రంగా మారుతుందన్నారు. ఇందువల్ల పుష్పజాతుల పరిరక్షణ జరుగుతుందన్నారు. అంతేకాకుండా ఈ సరస్సు అత్యంత సుందరంగా మారుతుందన్నారు. తత ్ఫలితంగా దీని పరిసర ప్రాంతాలకు ప్రాధాన్యం మరింత పెరుగుతుందన్నారు. కాగా ఈ సర స్సుకు వందల సంఖ్యలో దేశీయ పక్షులతోపాటు వలస పక్షులు కూడా వస్తుంటాయన్నారు. 200 నుంచి దాదాపు ఐదువేల వరకూ విదేశీ పక్షులు ఇక్కడికి వచ్చి వాలుతుంటాయన్నారు. అయితే ప్రస్తుతం కేవలం స్వల్పసంఖ్యలోనే వస్తున్నాయన్నారు. మరోవైపు పక్షుల రాక తగ్గుముఖం పట్టడానికి మానవ జోక్యం పెరిగిపోవడమేనని పక్షి ప్రేమికులు, నిపుణులు చెబుతున్నారు. గత కొద్దిసంవత్సరాలుగా ఇక్కడ మానవ జోక్యం విపరీతంగా పెరిగిపోయిందంటున్నారు. ఈ సరస్సులో తామర, గుర్రపుడెక్క విపరీతంగా పెరిగిందని, ఇది కాలుష్యానికి సంకేతమని వారంతా విచారం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఘనవ్యర్థాల నిర్వహణ విభాగం ఈ సరస్సు పరిసరాలను శుభ్రం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇందులోభాగంగానే ఈ పనులు మొదలయ్యాయి. ఇందులో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా తొలగించనున్నారు. ఈ విషయాన్ని పీఎంసీ ఘనవ్యర్థాల నిర్వహణ విభాగం ప్రధాన అధికారి సురేశ్ జగతాప్ వెల్లడించారు. -
చెత్త తొలగింపు సమస్య పరిష్కారంపైనే దృష్టి
పుణే: నానాటికీ తలనొప్పిగా పరిణమిస్తున్న చెత్త తొలగింపు సమస్య పరిష్కారంపై పుణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) దృష్టి సారించింది. ఇందుకోసం అంతర్జాతీయ సంస్థలను రంగంలోకి దింపాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్)ను జారీచేసింది. ఈ విషయాన్ని పీఎంసీ అదనపు కమిషనర్ రాజేంద్ర జగ్తాప్ వెల్లడించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘చెత్త తొలగింపు కోసం అనేక దేశాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాయి. అటువంటి నైపుణ్యాన్ని ఇక్కడ కూడా వినియోగించుకోవాలని నిర్ణయించాం’ అని అన్నారు. అనేక పత్రికల్లో ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్)కు సంబంధించిన ప్రకటనలను జారీచేశాం. కాంట్రాక్టు దక్కించుకునే సంస్థ 30 ఏళ్లపాటు చెత్త తొలగింపు, నిర్వహణ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది. సదరు సంస్థ ఇక్కడ కొన్ని ప్లాంట్లను నెలకొల్పాల్సి ఉంటుంది. కనీసం 15 ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క ప్లాంట్లో 100 నుంచి 250 టన్నుల చెత్తను ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా 500 టన్నుల చెత్తను ప్రాసెస్ చేసే సామర్థ్యం కలిగిన మరో భారీ ప్రాజెక్టును కూడా నిర్మించాల్సి ఉంటుంది. ఆసక్తి వ్యక్తీకరణపై స్పందన కోసం ఆయా అంతర్జాతీయ సంస్థలకు నెల రోజుల వ్యవధి ఇచ్చాం’ అని అన్నారు. ఇండోనేసియా, థాయ్లాండ్, జపాన్ తదితర దేశాలకు సంబంధించిన అధికారులతో పీఎంసీ సంప్రదింపులు జరుపుతోందన్నారు. ఈ మూడు దేశాలు చెత్త తొలగింపు శాస్త్రీయ ప్రక్రియను వినియోగిస్తున్నాయన్నారు. ఈ దేశాలకు ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్) ప్రతులను పంపుతామన్నారు. స్థలకొరత సమస్య పుణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) అధికారుల సమాచారం ప్రకారం నగరంలో ప్రతిరోజూ 1,600 మెట్రిక్ టన్నుల చెత్త తయారవుతుంది. స్థలాభావ సమస్య కారణంగా ఈ వ్యర్థాలను ఎక్కడ పారబోయాలనే అంశం పీఎంసీకి పెనుసవాలుగా మారింది. ప్రస్తుతం నగర శివారులోని ఫుర్సుంగి, ఉరులి గ్రామాల్లోగల ప్రాసెసింగ్ ప్లాంట్కు చెత్తను తరలిస్తున్నారు. పీఎంసీ ఇటీవల రాంటెక్డి ప్రాంతంలో మరో ప్లాంట్ను నిర్మించింది. అయితే ఇవి తమ సామర్థ్యం మేర పనిచేయకపోవడం భారీ డంపింగ్కు దారితీస్తోంది. డంపింగ్కు వ్యతిరేకంగా ఆందోళన చెత్త నుంచి వెలువడుతున్న దుర్వాసనను భరించలేక ఫుర్సుంగి, ఉరులి గ్రామాలకు చెందిన ప్రజలు ఇటీవల పీఎంసీ ఎదుట భారీస్థాయిలో ఆందోళన చేశారు. పీఎంసీకి వ్యతిరేకంగా నినదించారు. అంతటితో ఆగకుండా చెత్త లారీలు తమ గ్రామాల్లోకి రాకుండా అడ్డుకున్నారు. ఈ పరిణామాలు నగరంలో చెత్త భారీఎత్తున పేరుకుపోయేందుకు దారితీసింది. 15 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలే డంపింగ్ కేంద్రాలకు వస్తున్న వ్యర్థాల్లో ప్లాస్టిక్ సామగ్రి అధికంగా ఉంది. ఇది దాదాపు 15 శాతంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపునకు అత్యాధునిక ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు అత్యవసరంగా మారింది. మరోవైపు 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ వస్తువుల వినియోగంపై పీఎంసీ నిషేధం విధించింది. ఉత్పత్తిదారులకు జరిమానా కూడా విధించింది. -
పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు
పింప్రి, న్యూస్లైన్: పుణే నగరంలో ప్లాస్టిక్ వ్యర్థాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఈ కారణంగా స్థానికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. నగరంలో పెరుగుతున్న చెత్తలో ప్లాస్టిక్ సమస్య అధికమవుతుండడంతో దీనిని నియంత్రించడానికి తగు చర్యలు తీసుకోవాలంటూ పుణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) కమిషనర్ వికాస్ దేశ్ముఖ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను 28, మార్చి 2014 తరువాత వినియోగించే వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ప్లాస్టిక్ కవరు వినియోగిస్తూ మొట్టమొదటిసారిగా పట్టుబడ్డ వారికి రూ. 5 వేలు, రెండోసారి పట్టుబడితే రూ. 10 వేల జరిమానా విధిస్తారు. నగరంలో ప్లాస్టిక్ బ్యాగులను కూరగాయలు, పండ్లు, విక్రయదారులతోపాటు తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసేవారు ఎక్కువగా వినియోగదారులకు చేరవేస్తున్నారు. నగరంలో ప్రతి రోజూ జమ అయ్యే చెత్తలో 100 టన్నులకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయి. దీనితో నగరంలో వాతావరణ కాలుష్యం నానాటికీ పెరిగిపోతోంది. ప్లాస్టిక్ను వర్గీకరించే విషయంలో సమస్యలు అధికమవుతుండడంతో దీనిని నియంత్రించాలని నిర్ణయించారు. 50 మైక్రాన్ల కంటే ఎక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లను రూ. 15 లకు అమ్మాలని, థర్మాకోల్ గ్లాసులు, ప్లేట్లను నిషేధించాలంటూ ఇటీవల కార్పొరేషన్ సర్వ సభ్య సమావేశంలో తీర్మానించిన సంగతి విదితమే. విలీనంపై 18న నిర్ణయం చకాన్ సహా మొత్తం 20 గ్రామాల విలీనం విషయమై ఈ నెల 18వ తేదీన పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (పీసీఎంసీ) ఓ నిర్ణయం తీసుకోనుంది. పీసీఎంసీ పరిధిలోని గ్రామాలను కచ్చితంగా విలీనం చేయాల్సిందేనా లేకపోతే ఆ అవసరమేమీ లేదా అనే అంశంపై ఓ నివేదిక సమర్పించాలంటూ గత ఏడాది ఆగస్టులో పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (పీసీఎంసీ)ని రాష్ర్ట ప్రభుత్వం ఆదేశించిన సంగతి విదితమే. చ కాన్ను కొత్త మున్సిపల్ కౌన్సిల్గా మార్చేకంటే విలీనమే ఉత్తమమని అప్పట్లో ప్రభుత్వం సూచించింది. ఇందుకు స్పందించిన పీసీఎంసీ..సిటీ ఇంప్రూవ్మెంట్ కమిటీ ఈ ప్రతిపాదనపై చర్చించి, దానిని సర్వసభ్య సమావేశానికి నివేదిస్తుందంటూ జవాబిచ్చింది. అయితే హింజేవాడి, మాన్ తదితర గ్రామాలు అప్పట్లో ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రత్యేక మున్సిపల్ కౌన్సిల్ కావాలని డిమాండ్ చేశాయి. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటాం ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఓ నిర్ణయానికొస్తామని ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రకటించారు. తాతవాడే తదితర గ్రామాల విలీనాన్ని అక్కడి ప్రజలు, నాయకులు 1997లో తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. అందువల్లనే నిర్ణయం తీసుకోలేకపోయామన్నారు. అయితే ఇప్పుడు వారిలో కొంతమార్పు వచ్చిందన్నారు. 2009లో ఈ మార్పు స్పష్టంగా కనిపించిందన్నారు. కాగా పీసీఎంసీకి చెందిన అనేకమంది కార్పొరేటర్లు సైతం ఈ ప్రతిపాదనను వ్యతిరేకించిన విషయం విదితమే.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు
పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
ఎన్నికల బరిలోకి 'జస్వీర్ సింగ్ గర్హి'.. అక్కడ నుంచే పోటీ
చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్
Viral Video: స్కూల్కు ఆలస్యంగా వచ్చిందని.. టీచర్పై ప్రిన్సిపాల్ దాడి
రెండేళ్లుగా గప్చుప్.. ఊహించని వార్త చెప్పిన సింగర్
పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్
తప్పక చదవండి
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
Advertisement