-
'మదర్స్ డే' రోజు ఓ తల్లి అడిగిన వినూత్న కానుకలు
మదర్స్ డే సందర్భంగా తల్లికి గిఫ్ట్లు ఇవ్వడానికి పిల్లలు రకరకాలుగా ప్లాన్లు చేస్తుంటారు. అయితే ఈ పంజాబీ మహిళ మాత్రం ‘మీరు ఇచ్చే గిఫ్ట్లు నాకు వద్దుగాక వద్దు’ అంటోంది. ‘అదేమిటి!’ అని ఆశ్చర్యపోయేలోపే ‘నేను అడిగిన గిఫ్ట్లు మాత్రం ఇవ్వాలి’ అన్నది. ఆమె అడిగిన గిఫ్ట్లు... సెల్ఫోన్తో గంటలు గంటలు గడపవద్దు అదే లోకంగా బతకవద్దు పొద్దుపోయాక బద్దకంగా నిద్ర లేవడం కాదు, ఉదయాన్నే హుషారుగా లేవాలి ఆన్లైన్ ఫుడ్ పార్శిల్స్ వద్దు ఇంటి తిండే ముద్దు ‘ఇవి డిమాండ్సా? గిఫ్ట్లా?’ అని ఒక యూజర్ సందేహం రైజ్ చేస్తే, మరో యూజర్ ఇలా స్పందించాడు... ‘డిమాండ్స్కు పిల్లలు ఓకే అంటే అవే గిఫ్ట్లుగా మారిపోతాయి. పిల్లల మంచి భవిష్యత్కు మించి తల్లికి కావల్సిన గొప్ప గిప్ట్ ఏదీ లేదు!’ సోనియా కత్రి అనే యూజర్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Sonia Khatri (@_punjabimom) -
పరిచయం లేని ప్రపంచంలో ఆఫీసర్ స్థాయికి..
న్యూజిలాండ్ పోలీసు విభాగంలో సీనియర్ సార్జెంట్ హోదాకు చేరుకున్న భారతదేశపు మొట్టమొదటి మహిళ మణిదీప్ కౌర్. సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగి ఏ మాత్రం పరిచయం లేని ప్రపంచంలో ఆఫీసర్ స్థాయికి ఎలా చేరిందో తెలుసుకోవాలంటే మణిదీప్ కౌర్ కథ తెలుసుకోవాలి. సంప్రదాయ పంజాబీ కుటుంబంలో పుట్టి పెరిగింది మణిదీప్ కౌర్. పద్దెనిమిదో ఏట పెళ్లి చేసేశారు ఇంట్లో. పెళ్లయిన ఏడాదికే మొదటి బిడ్డ. అర్ధంతరంగా ఆగిపోయిన కాలేజీ చదువు. ఇద్దరు పిల్లలు, బాధ్యతారాహిత్యంగా ఉండే భర్త. ప్రతిరోజూ గొడవల కాపురం. విసిగి వేసారి తొమ్మిదేళ్ల వైవాహిక జీవితానికి విడాకులిచ్చి పుట్టింటికి చేరింది ఇద్దరు పిల్లలను వెంటేసుకొని. ఆర్థికంగా ఎవరిమీదా ఆధాపడకుండా బతకాలన్న ఆశ ఆమెను ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టేలా చేసింది. సేల్స్ ఉమన్గా ఉద్యోగంలో చేరింది. ఇంటింటికీ వెళ్లి మా టెలిఫోన్ సేవలకు మారమని కస్టమర్లను ఒప్పించే పని అది. ఇంగ్లీషు మాట్లాడటం రాదు. అందుకని, చెప్పవలసిన నాలుగు మాటలను కాగితంపై రాసుకొని, కస్టమర్లకు ఇచ్చేది. పని చేసే చోట న్యూజిలాండ్లో టాక్సీ నడుపుకునైనా బాగా బతకచ్చనే మాటలు వింది. టాక్సీ డ్రైవర్గా! అలా, 27 ఏళ్ల వయసులో ఇద్దరు పిల్లలను తల్లిదండ్రుల వద్ద వదిలి, న్యూజిలాండ్కి ప్రయాణమైంది. ఆక్లాండ్లోని వైఎంసిఎ మహిళల లాడ్జిలో బస. టాక్సీడ్రైవర్గా జీవనం. ఆ లాడ్జిలో జాన్పెగ్లర్ అనే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ నైట్టైమ్ రిసెప్షనిస్ట్గా పనిచేసేవాడు. రోజూ వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు పెగ్లర్తో మాటలు కలిశాయి. కొన్ని రోజుల్లోనే ఇద్దరికీ సంభాషణ పెరిగింది. మణిదీప్ పెగ్లర్ని ‘కివి డాడ్’ అని పిలిచేది. అతను తను పోలీసాఫీసర్గా సాధించిన విజయాలు, చూసిన జీవిత కథలను చెబుతుండేవాడు. మాటల మధ్యలో ఒకరోజు పెగ్లర్తో ‘పోలీస్ ఆఫీసర్ను కావాలంటే ఏం చేయాలి..’ అని అడిగింది. దాంతో పోలీస్ ఫోర్స్లోకి వెళ్లేందుకు మణిదీప్కు పెగ్లర్ దారి చూపించాడు. కానీ, అందులో ఇమడటం ఆమెకు అంత సులభం కాలేదు. సంప్రదాయ అడ్డుగోడలను తనకై తాను తొలగించుకోవాల్సి వచ్చింది. కాళ్లు కనిపించేలా స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని ఈత నేర్చుకోవడం వంటిది అందులో ఒకటి. ఫిట్గా ఉండటానికి 20 కేజీల బరువు తగ్గాల్సి వచ్చింది. తిరస్కారానికి గురైనా మానని ప్రయత్నం 2002లో పిల్లలను న్యూజిలాండ్కు తెప్పించుకుంది. రెండేళ్ల శిక్షణ తర్వాత మణిదీప్ మొదటిసారి పోలీసు యూనిఫామ్ ధరించింది. సమయం గడిచేకొద్దీ ఎంత కష్టమైనా సరే కమాండింగ్ చేసే పొజిషన్కు రావాలనుకుంది. ముందు సెటిలర్స్ బాధితులకు మద్దతునిచ్చే సీనియర్ కానిస్టేబుల్. తరువాత, ప్రమోషన్ల కోసం ప్రతీసారీ అప్లై చేసుకుంటూనే ఉంది. ప్రతిసారీ రిజెక్ట్ అయ్యేది. కానీ, ఏ మాత్రం పట్టించుకోకుండా మళ్లీ మళ్లీ ప్రయత్నించింది. మణిదీప్ కౌర్కు సీనియర్ సార్జంట్ బ్యాడ్జ్ ఇస్తున్న అధికారులు ‘న్యూజిలాండ్ వలస వచ్చినవారికి వారికి తమ జాతి ప్రజల తరపున పోలీసు బలగాలలో ప్రాతినిధ్యం వహించడం ఎంత ముఖ్యమో పెగ్లర్ చెప్పడం నాకు బాగా గుర్తు. అందుకే, నా ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉండేదాన్ని. అలా ప్రయత్నం ఫలించి సీనియర్ సార్జెంట్ పదోన్నతి లభించింది’ అని ఆనందంగా చెబుతుంది మణిదీప్ కౌర్. న్యూజిలాండ్ పోలీసు విభాగంలో సీనియర్ సార్జెంట్ హోదాకు చేరుకున్న భారతదేశపు మొదటి మహిళ మణిదీప్ కౌర్. ఇప్పుడు ఆమె వయసు 52 ఏళ్లు. ఆమె పిల్లలు ఇద్దరూ పెద్దవారయ్యారు. మనవరాళ్ళు కూడా ఉన్నారు. కుటుంబ సభ్యులతో మణిదీప్ కౌర్ ‘మా అమ్మానాన్నలు, పిల్లలు, మా సిబ్బంది, అధికారులతో సహా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ జీవితంలో ఎదగడానికి నాకు సహాయం చేశారు. మీరూ మీ చుట్టూ గమనించండి, సహాయపడే వ్యక్తులు ఎప్పుడూ ఉంటారు. అవకాశాల కోసం వెతకండి. సాధించాల్సిన వాటిని చేరుకోండి. మీలో ఒక వైవిధ్యం చూపడానికి వాటిని పట్టుకోండి, అప్పుడు మీరు ప్రపంచానికే ఒక వైవిధ్యం చూపచ్చు’ అంటోంది మణిదీప్ కౌర్. ‘ఈ దేశాన్ని వలసదారుల పిల్లలు సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేనంత సురక్షితంగా మార్చడం నా విధుల్లో ముఖ్యమైనది’ అనే ఈ సార్జెంట్ది ఎన్నో షేడ్స్ ఉన్న స్ఫూర్తినిచ్చే కథ. ఆమె వైవాహిక జీవితం దెబ్బతింది. భర్త నుంచి పిల్లలను తెచ్చుకోవడానికి పోరాడింది. బతుకు తెరువుకై పిల్లలను కొంతకాలం విడిచిపెట్టాల్సి వచ్చింది. తల్లి మాత్రమే ఊహించగల భయంకరమైన నొప్పి అది. పరాయిదేశంలో జీవించి, ప్రతిరోజూ కష్టపడి, అనేక అసమానతలు ఉన్నప్పటికీ ధైర్యంగా ముందడుగే వేసింది. ఇక మరో దారిలేక జీవితమే ఆమె దారిలోకి వచ్చింది. ఆమెను రోల్ మోడల్గా నిలిపింది. -
ఒకే కాన్పులో ఐదుగురు ఆడపిల్లలు!
దేశంలోనే తొలిసారిగా.. పంజాబ్లో ఓ మహిళ ఒకే కాన్పులో ఐదుగురు అమ్మాయిలకు జన్మనిచ్చింది. భటిండా సమీపంలోని భుచో అనే పట్టణంలో కుల్దీప్ కౌర్ (32) అనే మహిళ ఈ ఐదుగురు ఆడ పిల్లలను కంది. ఆమె భర్త ఓ రైతు. ఈ కేసు బాగా సంక్లిష్టమైనది కావడంతో ఎవరూ కాన్పు చేసేందుకు సిద్ధం కాలేదని, ఆమె పరిస్థితి ప్రమాదకరంగా ఉందని కాన్పు చేసిన గైనకాలజిస్టు డాక్టర్ హర్కిరణ్ కౌర్ చెప్పారు. కడుపులో ఐదుగురు బిడ్డలతో.. కేవలం 5 గ్రాముల హెమోగ్లోబిన్తో ఆమె వచ్చింది. తొలుత స్కానింగులో నలుగురు పిల్లలే ఉన్నట్లు కనిపించినా, తీరా బయటకు వచ్చేసరికి ఐదుగురు అయ్యారు. కుల్దీప్తో పాటు ముగ్గురు కూతుళ్లు కూడా క్షేమంగానే ఉన్నా.. మరో ఇద్దరి పరిస్థితి మాత్రం అంత బాగోలేదు. ఏడోనెలలోనే డెలివరీ కావడంతో వాళ్లు కేవలం 850 గ్రాములు మాత్రమే బరువున్నారని, అందువల్ల వాళ్లను 24 గంటలూ పర్యవేక్షిస్తూ జాగ్రత్తగా చూసుకుంటున్నామని డాక్టర్ కౌర్ చెప్పారు. కాగా, సుఖ్పాల్ సింగ్, కుల్దీప్లకు ఇప్పటికే ఇద్దరు కూతుళ్లున్నారు. ఇప్పుడు పుట్టినవాళ్లతో కలిపి మొత్తం ఏడుగురు కూతుళ్లవుతారు. పేదరికంలో ఉన్నా కూడా.. ఇప్పుడు ఈ ఐదుగురు కూతుళ్లకు కూడా జన్మనివ్వాలనే వాళ్లు నిర్ణయించుకున్నారు. కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తేనే అబార్షన్ చేయించే ఈ రోజుల్లో.. ఇలా ఏడుగురిని పెంచేందుకు కూడా సిద్ధం కావడం ప్రశసంనీయమని వైద్యులు అంటున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలవరంపై అమిత్ షాకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement