-
HCA: మద్యం సేవిస్తూ.. మహిళా క్రికెటర్లను బూతులు తిడుతూ!
Hyderabad Cricket Association: హైదరాబాద్ మహిళా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. కోచ్ జై సింహా అసభ్య ప్రవర్తన కారణంగా వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తమ పట్ల అనుచితంగా ప్రవర్తించిన జై సింహా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేశారు. కాగా మ్యాచ్ ఆడే నిమిత్తం ఉమెన్ టీమ్ హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో విమానంలో రావాల్సి ఉండగా.. కోచ్ జై సింహా ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేశాడు. ఫ్లైట్ మిస్ అవడంతో టీమ్తో సహా బస్లో హైదరాబాద్కు బయల్దేరాడు. ఈ క్రమంలో బస్లో మహిళా క్రికెటర్ల ముందే జై సింహా మద్యం సేవించగా.. వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కోపోద్రిక్తుడైన జై సింహా మహిళా క్రికెటర్లను బూతులు తిట్టాడు. ఆ సమయంలో సెలక్షన్ కమిటీ మెంబర్ పూర్ణిమరావు జై సింహాకు అడ్డు చెప్పలేదు. పైగా అతడిని ఎంకరేజ్ చేశారు. ఈ మేరకు ఆరోపణలు చేస్తూ.. జై సింహా, పూర్ణిమరావుపై చర్యలు తీసుకోవాలని మహిళా క్రికెటర్లు నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)కి ఫిర్యాదు చేశారు. వేటు పడింది ఈ నేపథ్యంలో.. తమను జట్టు నుంచి తప్పిస్తామని కోచ్ బెదిరింపులకు గురిచేస్తున్నాడంటు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వార్తలు మీడియాలో ప్రచారం కావడంతో హెచ్సీఏ చర్యలకు పూనుకుంది. మహిళల హెడ్కోచ్గా జై సింహాను తప్పిస్తూ వేటు వేసింది. ఈ విషయంపై హెచ్సీఏ అధ్యక్షుడు స్పందిస్తూ.. ‘‘కోచ్ జై సింహ మీద వచ్చిన ఆరోపణలపై విచారణ చేస్తున్నాము. విచారణ ముగిసే వరకు అతడిని సస్పెండ్ చేస్తున్నాం’’ అని తెలిపారు, -
పూర్ణిమా రావుకు షాక్
⇒భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్ పదవి నుంచి తొలగింపు ⇒కొత్త కోచ్గా తుషార్ అరోథే హైదరాబాద్: మరో రెండు నెలల్లో జరిగే ప్రపంచ కప్కు భారత మహిళల క్రికెట్ జట్టు సన్నద్ధమవుతున్న దశలో జట్టు కోచ్ విషయంలో బీసీసీఐ అనూహ్య నిర్ణయం తీసుకుంది. జట్టు హెడ్ కోచ్ పదవి నుంచి పూర్ణిమా రావును తప్పిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. పూర్ణిమ స్థానంలో బరోడా మాజీ క్రికెటర్ తుషార్ అరోథేను బోర్డు ఎంపిక చేసింది. పూర్ణిమ కోచ్గా ఉన్న సమయంలోనే వరల్డ్ కప్కు భారత జట్టు అర్హత సాధించగా... ఇప్పుడు ప్రధాన టోర్నీకి ముందు ఆమెను తొలగించడం ఊహించని పరిణామం. బీసీసీఐ దీనికి సంబంధించి పూర్ణిమకు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. తనను తప్పిస్తున్నట్లు ఆమెకు కూడా మీడియా ద్వారానే తెలిసింది. కీలక సమయంలో బీసీసీఐ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలేమిటనే దానిపై స్పష్టత లేదు. 114 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన తుషార్కు ఇంతకుముందు భారత మహిళల జట్టుకు కోచ్గా పని చేసిన అనుభవం ఉంది. నన్ను అవమానించారు... హైదరాబాద్కు చెందిన పూర్ణిమా రావు భారత్ తరఫున 5 టెస్టులు, 33 వన్డేలు ఆడారు. తొలిసారి 2014 ఫిబ్రవరిలో భారత్ కోచ్ పదవి చేపట్టారు. అయితే టి20 ప్రపంచకప్లో జట్టు విఫలమైన తర్వాత ఆమెపై వేటు పడింది. ఆ తర్వాత జూన్ 2015 నుంచి రెండోసారి ఆమె కోచ్గా కొనసాగుతున్నారు. పూర్ణిమ కోచ్గా ఉన్న సమయంలో భారత జట్టు తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై ద్వైపాక్షిక సిరీస్లో విజయం సాధించి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత బ్యాంకాక్లో ఆసియా కప్ను గెలుచుకుంది. ఇటీవలే క్వాలిఫయర్స్లో విజేతగా నిలిచి వరల్డ్ కప్కు అర్హత సాధించింది. ‘కోచ్గా నేను చాలా మంచి ఫలితాలు సాధించాను. గత రెండేళ్లలో ఎనిమిది సిరీస్ విజయాల్లో భాగంగా ఉన్నాను. కనీస సమాచారం లేకుండా, నాకు మాట మాత్రం చెప్పకుండా నన్ను తొలగించారు. ప్రపంచకప్కు కొద్ది రోజుల ముందు ఒక విజయవంతమైన టీమ్ విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే దేశం గురించి, జట్టు గురించి మీరు ఏ మాత్రం ఆలోచించడం లేదని అర్థం. ఈ చర్య జట్టుపై ప్రభావం చూపించరాదని కోరుకుంటున్నాను’ అని పూర్ణిమా రావు వ్యాఖ్యానించారు. ప్రపంచకప్లో జట్టు బాగా ఆడేందుకు తాము అనేక ఆలోచనలు, వ్యూహాలతో తలమునకలై ఉన్న దశలో ఇలాంటి పరిణామంతో తాను నిర్ఘాంతపోయానని ఆమె అన్నారు. ‘బోర్డు నాకు ఎంత మొత్తం చెల్లించినా ఎప్పుడూ అసంతృప్తికి గురి కాలేదు. ఇచ్చిందే తీసుకున్నాను. నన్ను తప్పించేం దుకు బీసీసీఐ ఎలాంటి కారణం చెప్పలేదు. కనీసం నాకు సమాచారం ఇచ్చే ధైర్యం కూడా వారికి లేదు. జట్టు ఓడినప్పుడు నన్ను తీసుకొచ్చారు. ఇప్పుడు గెలిచాక పొమ్మంటున్నారు. ఇది నన్ను తీవ్రంగా నిరాశపర్చడమే కాదు. అవమానించినట్లుగా భావిస్తున్నా’ అని పూర్ణిమ ఆవేదన వ్యక్తం చేశారు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రాణదాత ఆ పోలీసు
నూకాంబిక హుండీ ఆదాయం రూ.66.69 లక్షలు
ఈ పాపం ఎవరిది?
సికింద్రాబాద్–ఖుర్దారోడ్ మధ్య స్పెషల్ రైళ్లు
అవినీతి శ్రీశైలం కొండంత
బీజేపీ అభ్యర్థిపై ‘ఆప్’ ఆంక్షలు.. తగ్గేదే లేదన్న క్యాండిడేట్!
చంద్రబాబు బాటలోనే రెండు కళ్ల సిద్ధాంతం అంది పుచ్చుకున్న బిజెపి
జిల్లాలో 14,162 వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగం
సింహగిరి.. భక్త ఝరి
ఎన్నికల విధుల్లో ట్రైనీ ఐపీఎస్ అధికారులు
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- నాడు తిట్లు.. నేడు కౌగిలింతలు!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement