-
పుష్కర ఘాట్లు.. ఇక ఫుడ్కోర్టులు
కృష్ణానది ఒడ్డున ఉన్నవారికి మళ్లీ తిప్పలు ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నంలో ప్రభుత్వం సీతానగరం (తాడేపల్లి రూరల్): కృష్ణా పుష్కరాల కోసం ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్లు త్వరలోనే ఫుడ్ కోర్టులుగా మారనున్నాయి. కృష్ణానదికి దిగువ ప్రాంతంలో విజయవాడ, సీతానగరం ప్రాంతాలలో నిర్మించిన ఈ ఘాట్లను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి 24 గంటలూ ఫుడ్ కోర్టులు నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అంతేకాకుండా ప్రకాశం బ్యారేజి నుంచి కనకదుర్గ వారధి వరకు వివిధ రకాల బోట్లు ఏర్పాటు, నీటిలో విన్యాసాలు, ప్యారాచూట్ లాంటివి ఏర్పాటు చేసి పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీని నిమిత్తం కనకదుర్గ వారధి వద్ద 12 అడుగుల మేర ఫైబర్ గేటును ఏర్పాటు చేసి, నీటిని నిల్వ చేసేందుకు ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. దాని నిమిత్తమే కనకదుర్గ వారధి వద్ద ప్రస్తుతం పది అడుగులమేర క్రాస్ బండ ఏర్పాటు చేసి, నీటినిల్వను కూడా పరిశీలించారు. ప్రభుత్వం కనుక ఈ నిర్ణయం తీసుకుంటే విజయవాడ, మహానాడు ప్రాంతాల్లో కృష్ణానది ఒడ్డున ఉన్న ఇళ్లు కూడా తొలగిస్తారనే అనుమానం వ్యక్తం అవుతోంది. ఇళ్లు తొలగించిన ప్రాంతంలో మినీ పార్కులు ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. ఈ బాధ్యతలను బెంగుళూరుకు చెందిన ఓ ప్రైవేటు పర్యాటక సంస్థకు అప్పగించనున్నట్లు సమాచారం. సదరు సంస్థ నిర్వహించేందుకు సుముఖం వ్యక్తం చేసినప్పటికీ స్థానికంగా ఉన్న ఇద్దరు మంత్రులు తమకు కూడా వాటాలు ఇవ్వాలంటూ ఒత్తిడి తీసుకువస్తున్నట్టు, సదరు సంస్థకు చెందిన వ్యక్తులు ఇందుకు నిరాకరించడంతో కొంతమేర ఆలస్యం జరుగుతున్నట్టు సమాచారం. ఏదేమైనా పర్యాటక రంగం పేరుతో ఈవెంట్లు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కొంతమంది అధికారులు దీనిని ఏపీ టూరిజానికి అప్పగిస్తే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని సలహాలు అందజేసినా ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకే ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. -
పున్నమిఘాట్లో ప్రముఖుల పుష్కర స్నానం
విజయవాడ: కృష్ణా పుష్కరాలు మంగళవారం ముగుస్తుండటంతో పుష్కరఘాట్ల వద్ద భక్తుల తాకిడి ఎక్కువైంది. మంగళవారం చివరి రోజున ఏపీ నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దంపతులు, మంత్రి సిద్ధా రాఘవరావు దంపతులు, ఎమ్మెల్సీ సోమిరెడ్డి, నటుడు సాయికుమార్, సినీ నిర్మాత అశోక్ కుమార్తో పాటు పలువురు ప్రముఖులు పున్నమిఘాట్లో పుణ్యస్నానమాచరించారు. -
భక్తజనంతో కోలాహలం
-
పుష్కర ఘాట్లకు ఆధ్యాత్మిక శోభ
-
ఆరోగ్యం జాగ్రత్త సుమా ?
విస్తరిస్తున్న విరేచనాలు గుంటూరు, బెజవాడల్లో భారీగా కేసులు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం లబ్బీపేట: పుష్కర యాత్రికలు డయోరియా (విరేచనాలు) బారిన పడుతున్నారు. విజయవాడ, గుంటూరు జిల్లాల్లో కేసులు నమోదవుతున్నారు. గుంటూరుజిల్లాలో 700లకు పైగా డయేరియా కేసులు నమోదు కాగా, విజయవాడలో సైతం పలువురు భక్తులు అస్వస్థతకు గురవుతున్నారు. వారికి పుష్కర వార్డుల్లో చికిత్స చేసి పంపిస్తున్నారు. కలుషితనీరు. ఆహారం, పారిశుద్ధ్య సమస్యకారణంగానే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నట్లు తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తుల సంఖ్య క్రమేణా పెరుగుతున్న తరుణంలో అధికారులు ఇప్పటికైన అప్రమత్తం కాకుంటే వ్యాధుల చుట్టుముట్టే అవకాశం ఉందని చెపుతున్నారు. కలుషిత జలాల వల్లే మన తాగే నీరు , తీసుకునే ఆహారం కలుషితమైనప్పుడు డయోరియా సోకుతుందని వైద్య నిపుణులు చెపుతున్నారు. ప్రస్తుతం Mýృష్ణానదిలో తక్కువ నీటి మట్టం ఉండటం, పెద్ద సంఖ్యలో భక్తులు స్నానాలు చేస్తున్నారు. దీంతో మల మూత్రాలు, ఇతరత్రా వ్యర్థాలతో కలుషితమైన నీటిని స్నానం చేసేసమయంలో పొరపాటు నోట్లోకి వెళ్లినప్పుడు మింగేస్తే డయేరియా, టైఫాయిడ్, జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయన్నారు. ప్రవాహం తక్కువుగా ఉన్న Mýృష్ణవేణి, పద్మావతి ఘాట్లలో స్నానం చేసే వారికి ఇలాంటి సమస్యలు వచ్చినట్లు ్ల చెపుతున్నారు. చర్మ సమస్యలు, కంటి, గొంతు, చెవి ఇన్ఫెక్షన్లు సోకే అవకాశముంది. పుష్కర నగర్లలో పారిశుధ్య లేమి యాత్రికులకు పుష్కరనగర్లలో ఉచితంగా అందజేస్తున్న అల్పాహారం, భోజనాలు కలుషితమైనా జబ్బులు వ చ్చే ప్రమాదముంది. అక్కడే పెద్దఎ తు ్తన టాయిలెట్స్ ఏర్పాటు చేయడం, స మీపంలోనే భోజనాలు వడ్డించడంతో ఆహారం కలుషితమవుతున్నట్లు చెపుతున్నారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరి ఆరోగ్య వంతమైన పుష్కర స్నానం కోసం,.. నదిలో మునిగే సమయంలో నోట్లోకి నీళ్లు వెళ్లకుండా చూసుకోవాలి. నదిలో స్నానమయ్యాక మరోసారి మంచినీటితో స్నానం చేయడం ఉత్తమం. పుష్కర నగర్లో పెట్టే ఆహారం పరిశుభ్రంగా ఉందో లేదో చూడాలి. ఆ ప్రాంతంలో అపరిశుభ్ర వాతావరణం ఉన్నా, దుర్గం« దం వస్తున్నా అక్కడ ఆహారం తీసుకోరాదు. వీలయినంత వరకూ మినరల్ వాటర్నే తీసుకోవాలి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement