-
తండ్రీ కొడుకు.. భిన్న నేపథ్యం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్కు తండ్రీకొడుకు రెండేసిసార్లు ప్రాతినిధ్యం వహించారు. రెండుసార్లు గెలిచిన పువ్వాడ 1989లో పువ్వాడ నాగేశ్వరరావు సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కె.దుర్గానర్సింహారావుపై విజయం సాధించారు. ఆ తర్వాత 1994లో సీపీఐ అభ్యర్థిగా రెండోసారి బరిలోకి దిగి కాంగ్రెస్ అభ్యర్థి జహీర్అలీ మహ్మద్పై గెలుపొందారు. ఆ తర్వాత 1999 ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నుంచే పువ్వాడ నాగేశ్వరరావు పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. మూడోసారి బరిలో అజయ్ పువ్వాడ అజయ్కుమార్ 2014లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి..టీడీపీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుపై 5,609 ఓట్ల మెజారిట్టీతో గెలిచారు. 2018లోఇదే స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచి, టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై 10,991 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో మూడో సారి బీఆర్ఎస్ అభ్యర్థిగా పువ్వాడ అజయ్కుమార్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఖమ్మం అసెంబ్లీ చరిత్రలో మంత్రి పదవి సైతం పువ్వాడ అజయ్కుమార్నే వరించింది. -
‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దింపనున్న పార్టీ
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల కోటాలో శాసన మండలికి జరగనున్న ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం చెరో సీటుకు పోటీచేయనున్నాయి. ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఎన్నికల్లో సీపీఐ తరఫున పువ్వాడ నాగేశ్వరరావును పోటీకి నిలపాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం మఖ్దూంభవన్లో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక నల్లగొండ స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థిని పోటీకి నిలపాలని ఇటీవల జరిగిన 10 వామపక్షాల భేటీలో నిర్ణయించారు. వరంగల్ ఎంపీ స్థానానికి ఉప ఎన్నికల్లో పది వామపక్షాల తరఫున అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిని పోటీకి నిలపాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. బీజేపీ ప్రతిష్ట దిగజారుతోంది: సురవరం బీజేపీ ప్రతిష్ట దిగజారడం మొదలైందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి వ్యాఖ్యానించారు. లలిత్ మోదీ వ్యవహారంలో కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధర రాజే కూరుకుపోయారని, వ్యాపం కుంభకోణంలో మధ్యప్రదేశ్ సీఎం అప్రతిష్ట పాలయ్యారని పేర్కొన్నారు. జాతీయ స్థాయి రాజకీయ పరిణామాలను కార్యవర్గ భేటీలో సురవరం వివరించారు. -
సందడే సందడి...
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఈనెల 30న జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరిరోజైన బుధవారం జిల్లాలో రాజకీయ సందడి నెలకొంది. అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు చివరి రోజు నామినేషన్లు దాఖలు చేయడంతో నియోజకవర్గ కేంద్రాలు పార్టీల ర్యాలీలు, డప్పుచప్పుళ్లు, నినాదాలతో హోరెత్తిపోయాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఆయా పార్టీల నుంచి టికెట్టు ఆశించి భంగపడిన వారు, పలువురు ఇండిపెండెట్లు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థులుగా పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు, వైరా నుంచి మదన్లాల్, అశ్వారావుపేట నుంచి తాటి వెంకటేశ్వర్లు, కొత్తగూడెం నుంచి వనమా వెంకటేశ్వరరావు, ఇల్లెందు నుంచి డాక్టర్ రవిబాబు నాయక్, సత్తుపల్లి నుంచి డాక్టర్ మట్టా దయానంద్ నామినేషన్లు వేశారు. ఈ సందర్భంగా ఆయాప్రాంతాలలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీర్యాలీలు నిర్వహించి సందడి చేశాయి. కాగా, జిల్లా కేంద్రమైన ఖమ్మంలో నామినేషన్ల దాఖలుకు చివరిరోజున అగ్రనాయకులంతా నామినేషన్లు వేశారు. ఖమ్మం పార్లమెంటుకు... సీపీఐ అభ్యర్థిగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, టీడీపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఖమ్మం అసెంబ్లీకి టీడీపీ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ తరపున పువ్వాడ అజయ్కుమార్, టీఆర్ఎస్ నుంచి ఆర్జేసీ కృష్ణ తదితరులు నామినేషన్లు వేయడంతో జిల్లా కేంద్రంలో సందడి నెలకొంది. అయితే, నామినేషన్ల దాఖలు సమయంలో సీపీఐ, కాంగ్రెస్ పార్టీల మధ్య అవగాహన కొరవడినట్టు కనిపించింది. సీపీఐ తరపున ఎంపీ, కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే అభ్యర్థులు ఆయా పార్టీల నేతలనే వెంట తీసుకెళ్లి నామినేషన్లు వేశారు. నారాయణ దాఖలు చేసే సమయంలో ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా లేకపోవడం గమనార్హం. టీడీపీ ఎంపీ అభ్యర్థి నామా కూడా తన వర్గం నేతలను మాత్రమే వెంటబెట్టుకువెళ్లి నామినేషన్ వేశారు. తుమ్మల వర్గీయులెవరూ వెళ్లలేదు. అయితే, ఆయన మాత్రం స్వయంగా తుమ్మల నాగేశ్వరరావు నామినేషన్ కార్యక్రమానికి వెళ్లి తన చేతుల వీదుగా పత్రాలను ఎన్నికల అధికారికి అందజేయడం గమనార్హం. నామినేషన్ల చివరి రోజు హైలైట్స్ తన నామినేషన్ కార్యక్రమానికి హాజరుకావాలని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లిన నామా నాగేశ్వరరావుపై బాలసాని అనుచరులు ఫైర్ అయ్యారు. మానాయకునికి టికెట్ రాకుండా చేశావంటూ ఆయనను దూషించారు. ఇంటికి వెళ్లినా బాలసాని ఆయనను కలవలేదు. దీంతో చేసేదేమీలేక నామా వెళ్లిపోయారు. ఇల్లెందు టీడీపీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య టీఆర్ఎస్ తరపున నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు టికెట్ ఇచ్చేందుకు పార్టీ అధినేత అంగీకరించకపోవడంతో ఆయన పార్టీ మారి మళ్లీ బరిలో నిలిచారు. సత్తుపల్లి నియోజకవర్గానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన విద్యార్థి జేఏసీ నేత పిడమర్తి రవి వెంట జలగం వెంకట్రావు వర్గీయులెవరూ కనిపించలేదు. రవి మాత్రం జలగం వెంగళరావు విగ్రహానికి పూలమాలలు వేసి నామినేషన్ సమర్పించారు. భద్రాచలంలో టీఆర్ఎస్ అభ్యర్థి మారిపోయారు. మంగళవారం రాత్రి విడుదల చేసిన జాబితాలో అక్కడి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థినిగా ఝాన్సీరాణి పేరును ప్రకటించారు. కానీ బీ-ఫాం మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వెళ్లిన మానె రామకృష్ణకు ఇచ్చారు. దీంతో ఝాన్సీరాణి విలేకరుల ఎదుట తన ఆవేదనను వెళ్లబుచ్చారు. ఇల్లెందులో అత్యధికంగా రెబల్స్ బరిలోకి దిగారు. కాంగ్రెస్ నుంచి 8 మంది, టీడీపీ నుంచి ఆరుగురు, టీఆర్ఎస్ నుంచి ముగ్గురు అభ్యర్థులు రెబల్స్గా ఉన్నారు. మధిరలో నామినేషన్లు వేస్తున్న సమయంలోనే కాంగ్రెస్ అభ్యర్థి మల్లుభట్టి విక్రమార్క రోడ్డుపై మీటింగ్ ఏర్పాటు చేయడంతో భారీగా ట్రాఫిక్జామ్ అయింది. ఖమ్మం పార్లమెంటు స్థానానికి నామినేషన్ వేసేందుకు వెళుతున్న జై సమైక్యాంధ్ర అభ్యర్థి చెరుకూరి నాగార్జునరావుపై తెలంగాణవాదులు దాడి చేశారు. తెలంగాణ వ్యతిరేక పార్టీ తరపున ఎలా నామినేషన్ వేస్తావంటూ ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు హాజరుకాలేదు. రేణుక, అజయ్లు ర్యాలీలో ఉన్నా నామినేషన్ వేసే సమయంలో లేరు. సొంతపార్టీకి చెందిన సీనియర్ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు కూడా నారాయణ నామినేషన్ కార్యక్రమానికి హాజరు కాలేదు. టీడీపీకి చెందిన మాళోతు రాందాసు నాయక్ వైరా, కొత్తగూడెం రెండు స్థానాల్లో రెబల్గా నామినేషన్ దాఖలు చేశారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
Shobha Shetty: కొత్తింటి కల సాకారం చేసుకున్న బిగ్బాస్ బ్యూటీ.. ప్రియుడితో గృహప్రవేశం (ఫోటోలు)
మంచు హోటల్లో మంచి విందు! కేవలం శీతాకాలంలోనే ఎంట్రీ..!
పోలింగ్ ముగిసినా.. ‘ఆళ్లగడ్డ’లో ఆగని ఫ్యాక్షన్
ప్రియుడిని పరిచయం చేసిన ఫైమా.. ఇదేంటి రాధికా అంటూ కామెంట్లు
థాయ్లాండ్ ఓపెన్ విజేతగా సాత్విక్-చిరాగ్ జోడీ
ఆ బండరాయి.. కేవలం వేళ్లపైనే..! ఎలా అనేది నేటికీ మిస్టరీనే!
ఓటీటీకి రూ.150 కోట్ల చిత్రం.. ఈ సారైనా?
IPL 2024- SRH: నితీశ్ రెడ్డి.. పక్కా లోకల్! త్వరలోనే టీమిండియాలో..
ఇండోనేషియాలో స్టార్లింక్ సర్వీస్.. 'మస్క్' నెక్స్ట్ ప్లాన్ అదేనా!
మగవాళ్లకు స్టయిలింగ్ చేయడమే కష్టం! ఈశా భన్సాలీ
తప్పక చదవండి
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement