-
అమెజాన్ శుభవార్త! అలాంటి వారికి ట్రైనింగ్తోపాటు జాబ్స్..
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా (Amazon) దివ్యాంగులకు (PwDs) శుభవార్త చెప్పింది. వీరికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలతో అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది. (Google: ప్రభుత్వ ఉద్యోగులకు గూగుల్ బంపరాఫర్..) దివ్యాంగులకు శిక్షణ ఇచ్చి వారిని ప్రధాన శ్రామిక స్రవంతిలోకి తీసుకురావడానికి 2026 వరకు ఐదు రాష్ట్ర ప్రభుత్వాలతో ఎంఓయూ అమలులో ఉంటుందని, ఈ ఐదు రాష్ట్రాల్లోని పీడబ్ల్యూడీ అభ్యర్థులకు నైపుణ్యం, ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా ఈ చొరవ తీసుకున్నట్లు అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది. (Airbus jobs: గుడ్ న్యూస్.. ఎయిర్బస్లో భారీగా ఉద్యోగాలు) అమెజాన్ ఇండియా ఆపరేషన్స్ పీపుల్ ఎక్స్పీరియన్స్ అండ్ టెక్నాలజీ (PXT) డైరెక్టర్ లిజు థామస్ మాట్లాడుతూ.. "అమెజాన్ ఇండియాలో వృద్ధికి అనుకూలమైన సంస్కృతిని ప్రోత్సహిస్తున్నాం. ప్రతిఒక్కరూ తమ సామర్థ్యాలను నిరూపించుకునేలా సమాన అవకాశాలను కల్పిస్తున్నాం" అన్నారు. ఈ చొరవ కింద అమెజాన్ ఇండియా ఆపరేషన్స్ నెట్వర్క్లో మూడు సంవత్సరాల వ్యవధిలో దివ్యాంగులకు నైపుణ్యం, జీవనోపాధి కల్పించడంపై అమెజాన్ దృష్టి పెట్టింది. అమెజాన్ ఆపరేషన్స్ నెట్వర్క్ పరిధిలోని ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు, సార్టేషన్ కేంద్రాలు, డెలివరీ స్టేషన్లలో దివ్యాంగులకు స్టోవింగ్, పికింగ్, ప్యాకింగ్, సార్టింగ్ వంటి ఉద్యోగాలను కల్పించనున్నారు. -
గతుకుల రోడ్లే కారణమంటే ఎలా; మంత్రి అసహనం
ముంబై : గతుకుల రోడ్డు వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి అనడం సమంజసం కాదంటున్నారు మహారాష్ట్ర పీడబ్ల్యూడీ మినిస్టర్ చంద్రకాంత్ పాటిల్. విలేకరుల సమావేశంలో భాగంగా ‘ఈ మధ్య కాలంలో ముంబైలో జరుగుతున్న యాక్సిడెంట్లకు గతుకుల రోడ్లే కారణమంటున్నారు దీనిపై మీ అభిప్రాయం తెలపండని’ అడగ్గా చంద్రకాంత్ ఇలా అసహనం ప్రదర్శించారు. గత నెల రోజుల్లో గతుకుల రోడ్ల వల్ల ఆరుగురు ముంబై వాసులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఐదుగురు కళ్యాణి ప్రాంతానికి చెందిన వారు కాగా మరొకరు నావీ ముంబై వాసి. వీరందరు రోడ్డు మీద ఉన్న గతుకుల కారణంగానే పట్టు తప్పి ప్రమాదాలకు గురయ్యారు. ఈ మధ్య కాలంలో ముంబైని భారీ వర్షాలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా రోడ్డు మీద ఉన్న గతుకులు నీటితో నిండిపోయి, కనిపించకుండా అయిపోయాయి. దాంతో అక్కడ గుంత ఉందనే విషయం ప్రయాణికులకు తెలిసే అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా పట్టు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలు బారిన పడుతున్నది ఎక్కువగా ద్విచక్ర వాహనదారులే కావడం గమనార్హం. ఈ విషయం గురించి విలేకరులు చంద్రకాంత్ను అడగ్గా ‘ఆయన మీరు గతుకుల రోడ్ల వల్లనే ఈ ప్రమాదాలు జరిగాయని అంటున్నారు. కానీ అదే రోడ్ల మీద ప్రతిరోజు 5 లక్షల మంది నిత్యం తిరుగుతుంటారు. మరి వారంతా క్షేమంగానే ఉన్నారు కదా. కేవలం రోడ్ల మీద ఉన్న గతుకుల కారణంగానే ప్రమాదాలు జరిగాయనడం సబబు కాదు’ అన్నారు. మరి సోషల్ మీడియాలో ప్రజలు ఈ గతుకుల రోడ్ల గురించి మాట్లాడుకుంటున్నారని అడగ్గా ‘ఈ మధ్య కాలంలో ప్రతి చిన్న విషయం గురించి ప్రతికూలంగా మాట్లడటం ఫ్యాషన్ అయింది. అయినా పోనుపోను వాళ్లే వారి అభిప్రాయాన్ని మార్చుకుంటారని’ తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం త్వరలోనే ఎక్స్గ్రేషియా అందిస్తుందని తెలిపారు. -
పీడబ్ల్యూడీ స్కాంలో కేజ్రీవాల్ బంధువు అరెస్ట్
న్యూఢిల్లీ: ప్రజాపనుల విభాగం(పీడబ్ల్యూడీ) డ్రెయినేజీ పనుల్లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మేనల్లుడిని ఏసీబీ అరెస్ట్ చేసింది. వాయవ్య ఢిల్లీ ప్రాంతంలో డ్రెయినేజీ వ్యవస్థ నిర్మాణ బాధ్యతలను రేణు కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ చేపట్టింది. సుమారు రూ.3.1 కోట్ల విలువైన పనులను పీడబ్ల్యూడీ అధికారులతో కుమ్మక్కై ఈ కంపెనీ నాసిరకంగా చేపట్టిందని ఏసీబీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. రేణు కన్స్ట్రక్షన్స్ కంపెనీలో సీఎం మేనల్లుడు వినయ్ బన్సల్కు సగం వాటా ఉంది. వినయ్ బన్సల్ను గురువారం అదుపులోకి తీసుకున్న ఏసీబీ ఢిల్లీ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచగా ఒక రోజు జ్యుడీషియల్ కస్టడీకి అనుమతించింది. çఆప్ను వేధించడమే కేంద్రం పనిగా పెట్టుకుందని ఢిల్లీ డిప్యూటీ సీఎం ఆరోపించారు. -
ఉండవల్లిలో అధికారుల అత్యుత్సాహం
సాక్షి, గుంటూరు : గుంటూరు జిల్లా ఉండవల్లిలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పీడబ్ల్యూడీ వర్క్ షాపు ఉన్న వద్ద ఇళ్లను ఖాళీ చేయించడానికి అధికారులు సిద్ధం అయ్యారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలోని ఇళ్లకు విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేశారు. దీంతో తమకు ప్రత్యామ్నయం చూపాలంటూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. నిర్వాసితుల ఆందోళనుకు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, వామపక్ష నేతలు మద్దతు తెలిపారు. కోర్టులో కేసు నడుస్తుండగా ఇళ్లను ఎలా తొలగిస్తారని మండిపడ్డారు. ఒక్కొక్కరికి 5 సెంట్ల స్థలం, రూ.5 లక్షల నగదు ఇవ్వాలని ఎమ్మెల్యే ఆర్కే డిమాండ్ చేశారు. -
ఆన్లైన్లో కమ్యూనిటీ హాళ్ల బుకింగ్
న్యూఢిల్లీ: ఇప్పటి వరకూ నగరవాసులు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు వేదికలను బుక్ చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వ్యయప్రయాసాలకు తట్టుకొని ఫంక్షన్హాళ్లను బుక్ చేసుకోవాల్సి వచ్చేది. ఇక ఆ ఇబ్బందులు తొలగిపోనున్నా యి. ఇది ఢిల్లీవాసులకు పీడబ్ల్యూడీ విభాగం తెలియజేస్తున్న శుభవార్త. ఫంక్షన్ హాళ్లను బుక్ చేసుకోవడానికి ఆన్లైన్ బుకింగ్ ప్రాజెక్టును ప్రారంభించింది. అవసరమైన ప్రజలు పీడబ్ల్యూ వెబ్సైట్లో కమ్యూనిటీ హాళ్లను బుక్ చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. బుకింగ్ పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. అందుబాటులో ఇవే..: పీడబ్ల్యూడీకి చెందిన కమ్యూనిటీ హాళ్లు, బహిరంగ ప్రదేశాలు, పార్కులతోపాటు గులాబి బాగ్లో మూడు ఫంక్షన్హాళ్లు, కార్కాడూమా, కల్యానవాస్, తిమర్పూర్లలోని ఫంక్షన్ హాళ్ల సమాచారాన్ని తన వెబ్సైట్లో ఉంచింది. ప్రస్తుతం బుక్ చేసుకోవడంతోపాటు నగదు చెల్లింపులు కూడా ఆన్లైన్ ద్వారానే చెల్లించుకోవచ్చన్నారు. సమయం ఆదా..: ఇంతకు ముందు ఢిల్లీ వాసులు ఢిల్లీ సెక్రటేరియట్కు వచ్చి కమ్యూనిటీ హాళ్లను బుక్ చేసుకోవడం వల్ల సమయం వృథా అయ్యేదని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్ సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. ఈ పద్ధతి ద్వారా సమయం ఆదా అవుతోందని, సాధారణ ప్రజలు తమ కార్యక్రమానికి అనుకూలంగా ఇంటర్నెట్లో ఫంక్షన్హాళ్ల ఖాళీల వివరాలు తెలుసుకొని నిర్ణయించిన కాలపరిమితి (పెళ్లి కోసమైతే..45 రోజుల ముందు) బుక్ చేసుకోవచ్చు. ఇతర కార్యక్రమాలు పార్టీలు, పుట్టిన రోజు వాటికి నగరానికి చెందిన ఆమె/అతడు 20 రోజుల ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధ ంగా రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నిబంధనలు వర్తించవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైతే (పెళ్లికోసం-90 రోజుల ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం లేదా ఇతర రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులైతే (పెళ్లి కోసం-60 రోజుల ముందుగానే ఫంక్షన్హాళ్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని పీడ బ్ల్యూడీ అధికారులు పేర్కొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
Advertisement