-
కువైట్ బాటలో ఖతర్
మోర్తాడ్ (బాల్కొండ): ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కట్టడికి ఖతర్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. తమ దేశంలో కోవిడ్–19 కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం వైరస్ నియంత్రణకు కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఈ క్రమంలో భారత్ సహా 14 దేశాల నుంచి తమ దేశంలోకి రాకపోకలపై నిషేధం విధించింది. దీంతో ఉపాధి కోసం ఖతర్ వెళ్లే తెలంగాణవాసు లు ఇప్పట్లో అక్కడకు వెళ్లే అవకాశం లేదు. పలువురు కార్మికులకు వీసాతో పా టు ముందస్తుగానే విమాన టిక్కెట్ కొనుకున్నా, తాజా పరిణామాలతో ఆ దేశం వెళ్లలేని పరిస్థితి.. విమాన సర్వీసుల ర ద్దుపై ఆదివారం నుంచే అమలులోకి వచ్చిన నిర్ణయం తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కొనసాగనుందని తెలుస్తోంది. కాగా, కరోనా వైరస్ వల్ల తమ దేశ ప్రజలు ఇబ్బందిపడుతున్నారని గుర్తించిన కువైట్ ప్రభుత్వం కూడా ఎనిమిది దేశాలకు విమాన సర్వీసులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అదే బాటలో తాజాగా ఖతర్ ప్రభుత్వం కూడా రాకపోకలపై నిషే ధం విధించింది. ఈ నిర్ణయంతో భారత్, చైనా, బంగ్లాదేశ్, ఈజిప్టు, ఇరాన్, ఇరాక్, లెబనాన్, నేపాల్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా, శ్రీలంక, సిరియా, థాయిలాండ్ నుంచి ఖతర్కు రాకపోకలు నిలిచి పోయాయి. ఖతర్లో ఆదివారం వరకు 24 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వైరస్ ప్రభావం ఉన్న ఈ 14 దేశాల నుంచి రాకపోకలపై నిషేధం విధించారు. కాగా, ఖతర్లో ఉన్న తెలంగాణవాసులు ఒకవేళ తమ సొంత ఊళ్లకు వెళ్లాలంటే అందుబాటులో ఉన్న విమాన సర్వీసుల ద్వారా ఇతర దేశాలకు వెళ్లి అక్కడి నుంచి రాష్ట్రానికి రావాల్సి ఉంటుంది. ఖతర్లోని వివిధ నిర్మాణ కంపెనీలు, వ్యాపార, వాణిజ్య సంస్థలలో వేలాది మంది తెలంగాణ వాసులు ఉపాధి పొందుతున్నారు. రోజూ పలువురు అక్కడి నుంచి స్వదేశానికి రాకపో కలు సాగిస్తారు. తాజా పరిణామాలతో ఇబ్బందులు ఏర్పడనున్నాయి. ఇప్పట్లో రాలేం..: ఖతర్ నుంచి ఇప్పట్లో ఇండియాకు రాలేం. అలాగే మన దేశం నుంచి ఖతర్కు వచ్చే వారు కూడా కొన్ని రోజుల పాటు ఓపిక పట్టాల్సిందే. కరోనా విస్తరించకుండా ఉండడానికి ఖతర్ ప్రభుత్వం 14 దేశాల రాకపోకల పై నిషేధం విధించింది. కొత్తగా వీసాలు తీ సుకున్న వారు కూడా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. – అబ్బగోని శ్రీధర్ గౌడ్, ఖతర్ -
గుడ్న్యూస్ చెప్పిన ఖతార్
విదేశీ వర్కర్లకు ఖతార్ గుడ్న్యూస్ చెప్పింది. వివాదాస్పద ఎగ్జిట్ వీసా విధానాన్ని సవరిస్తున్నట్టు ఖతార్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆ దేశంలో పనిచేస్తున్న లక్షల మంది వలస కార్మికులకు భారీ ఊరట కలిగింది. ఈ వీసా విధానం సవరణతో, యజమానులు(ఎంప్లాయర్స్) అనుమతి లేకుండానే.. కార్మికులు ఆ దేశం విడిచి రావొచ్చు. సుదీర్ఘకాలంగా కార్మిక హక్కుల సంఘాలు చేస్తున్న ఈ డిమాండ్ను ఖతార్ ప్రభుత్వం ఆమోదించింది. ఖతార్లో పనిచేస్తున్న చాలా మంది వలస కార్మికులను ఆ దేశం విడిచి వెళ్లకుండా ఎంప్లాయర్స్ వేధిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్మికుల కాంట్రాక్ట్ సమయం అయిపోయినప్పటికీ, యజమానులు తమల్ని విడిచిపెట్టడం లేదని కార్మికులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఖతార్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విదేశీ కార్మికులకు భారీ ఊరటనిస్తోంది. ప్రస్తుతం ఖతార్లో 16 లక్షల మందికి పైగా విదేశీ కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది ఆసియా నుంచి వెళ్లినవారే. వారిలో ఎక్కువగా కూడా భారత్ నుంచి ఖతార్ వెళ్లినవారే ఉన్నారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రకటించింది. దీని వల్ల వలస కార్మికుల జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని ఆ సంస్థ తెలిపింది. ఖతార్ ప్రభుత్వంతో అంతర్జాతీయ కార్మిక సంస్థ చేసుకున్న ఒప్పందం ప్రకారం కార్మికులకు కనీస వేతనం, బకాయి వేతనాల చెల్లింపు, ఫండ్లు అందనున్నాయి. ఖతార్లోని వలస కార్మికులకు మంచి పనిని, రక్షణ కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ కార్మిక శాఖ మంత్రి ఇస్సా సాద్ అల్ జఫర్ అల్-నూమిమి తెలిపారు. 2022లో ఖతార్ ఫుట్బాల్ వరల్డ్ కప్ను నిర్వహించబోతుంది. ఈ నేపథ్యంలో ఫుట్బాల్ వరల్డ్ కప్ పనుల్లో భారీ ఎత్తున్న విదేశీ కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఖతార్లో పనిచేస్తున్నారు. అయితే ఎగ్జిట్ వీసా విధానంలో సవరణలు తీసుకొచ్చినప్పటికీ, విదేశీ కార్మికులు, ఉద్యోగాన్ని మారాలనుకుంటే, ప్రస్తుత యజమానుల వద్ద అనుమతి తీసుకోవాల్సి ఉంది. -
మెరుగైన ఉపాధికి అడ్డా.. ఖతార్
ఎన్.చంద్రశేఖర్, మోర్తాడ్ (నిజామాబాద్ జిల్లా) : గల్ఫ్ దేశాల్లో ఒకటైన ఖతార్ వలస కార్మికుల ఉపాధికి పెద్దపీట వేస్తోంది. ఒకప్పుడు వలస కార్మికులకు ఎంతో ఉపాధి కల్పించిన సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, దుబాయ్, ఒమన్, ఇరాక్ దేశాలు ఆర్థిక సంక్షోభం కారణంగా కార్మికులను క్రమంగా తిరుగు ముఖం పట్టిస్తున్నాయి. ఖతార్ మాత్రం ఆర్థిక సంక్షోభాన్ని దరిచేరనీయకుండా.. వలస కార్మికుల ఉపాధికి పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. 2022లో ఖతర్ వేదికగా నిర్వహించనున్న ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ కోసం అధునాతనమైన స్టేడియాలు, ఇతర సౌకర్యాల కోసం నిర్మాణాలు వేగవంతంగా సాగుతున్నాయి. దీనికి తోడు యూరప్ దేశాల్లోని మాదిరిగా మెట్రో రైలు సర్వీసు కోసం జోరుగా పనులు సాగుతున్నాయి. ఖతార్లోని దోహా, అల్ రయ్యన్, అల్ వక్రా, అల్ ఖోర్, రస్ లఫన్ ఇండస్ట్రియల్ సిటీ(ఆర్ఎల్ఐసీ) తదితర పట్టణాల్లో జోరుగా అభివృద్ధి పనులు సాగుతున్నాయి. దీంతో కార్మికులకు చేతినిండా పని ఉంది. స్టేడియంల నిర్మాణ పనులకు కార్మికులను సరఫరా చేసే లైసెన్స్లను పొందిన వారిలో తెలంగాణ జిల్లాలకు చెందినవారే ఉన్నారు. అయితే మనవారు ఈ పనుల కోసం బంగ్లాదేశ్, నేపాల్ కార్మికులను ఖతార్కు తరలిస్తుండటం గమనార్హం. క్రూడ్ ఆయిల్ ప్రధాన వనరు... ఖతార్కు ప్రధానమైన ఆదాయ వనరు క్రూడ్ ఆయిల్. ఇతర గల్ఫ్ దేశాల్లోనూ ఆయిల్ ఉత్పత్తి భారీగానే ఉన్నా ఖతార్లో పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉంది. తమ పొరుగు దేశాల మాదిరిగా కాకుండా క్రూడ్ ఆయిల్ విషయంలో ఖతార్ కొన్ని నియమాలను పాటిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ధరల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తుందనే పేరు ఉంది. దీనికి తోడు అక్కడి ప్రభుత్వం తమ దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తకుండా మొదటి నుంచీ పొదుపు మంత్రం పాటించడంతో గల్ఫ్ దేశాల్లో ఖతార్ ప్రత్యేకత సంతరించుకుంది. పొరుగు దేశాలతో పేచీ ఉన్నా... తీవ్రవాద దళాలకు సహకారం అందిస్తుందనే కారణంతో ఖతార్ను ఇతర గల్ఫ్ దేశాలు నిషేధించాయి. ఖతార్కు తమ దేశాల నుంచి ఎగుమతులు, దిగుమతులు లేకుండా కట్టడి విధించాయి. అంతేకాక తమ విమానాలను కూడా ఖతార్ గగనతలం నుంచి నడపకుండా, అలాగే ఖతార్ విమానాలు తమ దేశాల గగనతలంపై విహరించకుండా చర్యలను తీసుకున్నాయి. అయితే తమ భాగస్వామ్య దేశాలతో పేచీ ఉన్నా ఆ ప్రభావం ఏమాత్రం తమ దేశంలోని పౌరులు, విదేశీ కార్మికులపై పడకుండా ఖతార్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంది. ఖతర్పై నిషేధం విధించిన తొలినాళ్లలో కొంత ఇబ్బందులు ఏర్ప డినా వేగవంతమైన ఏర్పాట్ల వల్ల నిషేధం వల్ల ఏర్పడిన ప్రభావం తొలగిపోవడం గమనార్హం. వ్యాపారాలకు అనువైన దేశం... సొంతంగా వ్యాపారం నిర్వహించుకోవాలనుకునే వారికి ఖతార్ మంచి అవకాశం కల్పిస్తోంది. గల్ఫ్ దేశాల్లో సొంత ఉపాధి కోసం లైసెన్స్లు విస్తృతంగా జారీచేసే దేశంగా దుబాయ్ ముం దుంది. అయితే దుబాయ్లో ఎక్కువగా సప్లయింగ్ కంపెనీలకే అవకాశం ఉంది. ఖతార్లో మాత్రం సూపర్ మార్కెట్ల నిర్వహణ, రైస్ అమ్మకాలు, ఇతర వ్యాపారాల నిర్వహణకు లైసెన్స్లను జారీచేస్తారు. ఇప్పటికే కోరుట్ల రైస్ పేరిట ఖతార్లో ఎంతో మంది బియ్యం అమ్మకాలను సాగిస్తున్నారు. కమ్మర్పల్లి మండలంలోని బషీరాబాద్కు చెందిన పోలీసు విద్యాసాగర్ అతని సోదరులు రాధాకిషన్, రమేష్లు బియ్యంతో పాటు ఖర్జూరం, చీపుర్లు, బుట్టలు, ఇతర గృహ అలంకరణ సామగ్రి వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. వీరు దాదాపు 15 సంవత్సరాల నుంచి ఖతార్లో సొంత వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. తాజాగా పశువుల దాణాను సొంతూళ్లో ఉత్పత్తి చేసి ఖతార్కు ఎగుమతి చేస్తున్నారు. అలాగే భీమ్గల్, నిజామాబాద్లకు చెందిన వారు కూడా వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. కరీంనగర్, జగిత్యాల జిల్లా కథలాపూర్, తాండ్రా వాసులు ఎన్నో ఏళ్ల నుంచి అక్కడ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. ఇతర దేశాలకంటే ఖతార్లో నిబంధనలు అంత కఠినంగా లేకపోవడం మనవారికి కలిసి వచ్చే ఆంశం. మానసిక సమస్యలకు కౌన్సెలింగ్ దుబాయి, షార్జాలలోని ఇండియన్ వర్కర్స్ రీసోర్స్ సెంటర్ వారు వలస కార్మికుల మానసిక సమస్యలకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. యూఏఈ దేశంలో నివసిస్తున్న భారతీయులు మానసిక ఒత్తిడికి గురైన సందర్భంలో ‘ఐడబ్ల్యూఆర్సీ’ వారి 24 గంటల హాట్లైన్ నంబర్ 800 46342కు కాల్ చేసి ఉచితంగా నిపుణుల సహాయం పొందవచ్చు. తమ సమస్యలను ఇ–మెయిల్ ఐడి help@iwrcuae.inకు గానీ, మొబైల్ నంబర్ 00971 55 870 3725కు ఎస్ఎంఎస్ ద్వారా తెలుపుకోవచ్చు. ఖతార్లో ఉద్యోగాలకు ఆటంకం లేదు ఖతార్లో ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందీ లేదు. నేను డిప్లోమెట్ క్లబ్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఇతర గల్ఫ్ దేశాలతో పోల్చితే ఖతార్లో పరిస్థితి బాగుంది. 2022 ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ కోసం విస్తృతమైన ఏర్పాట్లు సాగుతున్నాయి. కార్మికులకు పని బాగుంది. ఆఫీస్ బాయ్స్, క్లీనింగ్ సెక్షన్లలో మాత్రం పాతవారే కొనసాగుతున్నారు. – ఏశాల నర్సారెడ్డి, ఖతర్ (తొర్తి వాసి) సొంత వ్యాపారం కోసం ప్రయత్నం చేస్తున్నాం నేను ఎంబీఏ పూర్తి చేశాను. బంధు, మిత్రుల సహకారంతో ఖతార్లో సొంతంగా వ్యాపారం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. రెండు నెలల క్రితం ఆ దేశానికి వెళ్లి వచ్చాను. మిగతా గల్ఫ్ దేశాల కంటే ప్రస్తుతం ఖతార్లో ఉపాధి అవకాశాలు బాగున్నాయి. సొంతంగా వ్యాపారం చేసుకోవడానికి ఖతార్ అనువైన ప్రదేశం. – ఉప్పగండ్ల వెంకటేష్, వేంపేట్ (జగిత్యాల జిల్లా) కంపెనీల్లో చేసే వారికి వేతనాలు బాగున్నాయి ఖతార్లోని కంపెనీలలో పని చేసేవారికి వేతనాలు బాగున్నాయి. హౌస్ డ్రైవర్ చేసేవారికి పని బాగా లేదు. యజమాని ఆర్థిక స్థోమత బాగుంటేనే డ్రైవర్లకు మంచి వేతనాలు ఇస్తున్నారు. కొంత మందికి మెరుగైన వేతనం ఉంది. కొంత మందికి మాత్రం తక్కువ జీతం ఉంది. పొరుగు దేశాలతో పోల్చితే ఖతార్లో మాత్రం కార్మికులకు అనుకూలమైన వాతావరణం ఉంది. – కొట్టూరి రాకేష్, ఖతార్ (తొర్తి వాసి) -
రిటర్న్ టు హోం
ఖతర్లో సంక్షోభం - వెనుదిరిగిన కార్మికులు మోర్తాడ్ (బాల్కొండ): ఖతర్లో ఏర్పడిన సంక్షోభ ప్రభావం తెలంగాణ కార్మికులపై పడుతోంది. పొట్ట చేతపట్టుకొని అక్కడికి వెళ్లిన కార్మికులు ఇంటి ముఖం పట్టాల్సి వస్తోంది. రెండు రోజుల వ్యవధిలో తెలంగాణకు చెందిన సుమారు ఆరు వందల మంది ఖతర్ నుంచి ఇళ్లకు తిరిగి వచ్చారు. ఇంకా, చాలామంది కార్మికులు కొద్ది రోజుల్లోనే ఇళ్లకు చేరుకునే అవకాశం ఉందని ఇటీవల ఖతర్ నుంచి తిరిగి వచ్చిన కార్మికులు చెబుతున్నారు. తీవ్రవాదానికి ఊతమిస్తోందనే కారణంతో ఖతర్పై తోటి గల్ఫ్ దేశాలు ఆంక్షలను విధించి, సహాయ సహకారాలను నిలిపివేయటంతో అక్కడి ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా, ఖతర్ ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో సంక్షోభం మరింత తీవ్రమైంది. ఆర్థికభారం పడటంతో కంపెనీలను నిర్వహించడం సాధ్యం కాదని యాజమాన్యాలు కార్మికులను పనుల నుంచి తొలగిస్తున్నాయి. కొన్ని కంపెనీలు వీసా గడువు ముగిసిపోయినా రెన్యువల్ చేయకుండా ఇంటికి పంపిస్తున్నాయి.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement