-
వైఎస్సార్ సీపీ జిల్లా ఇన్చార్జీగా రాఘవరెడ్డి
నిజామాబాద్ : జిల్లాలో పార్టీ బలోపేతంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం జిల్లా ఇన్చార్జీల నియామకం చేపట్టారు. నిజామాబాద్ జిల్లా ఇన్చార్జీగా కొండా రాఘవరెడ్డిని నియమించినట్లు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా.గట్టు శ్రీకాంత్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన రాఘవరెడ్డి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. అలాగే వైఎస్సార్ సీపీ నిజామాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్లగా నాయుడు ప్రకాష్ను నియమించినట్లు గట్టు శ్రీకాంత్రెడ్డి ప్రకటించారు. -
హరీశ్ రాజీనామా చేయాలి
♦ మంత్రిగా ఉండి బెదిరింపులా..: వైఎస్సార్సీపీ ♦ ఏపీ ప్రయోజనాల కోసం జగన్ దీక్ష చేస్తున్నారు ♦ వీలైతే ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి ♦ అంతేగానీ దబాయింపులకు దిగడమేమిటని ప్రశ్న ♦ వైఎస్సార్సీపీ కార్యాలయాలపై దాడులను ఖండించిన ♦ నల్లా సూర్యప్రకాశ్, కొండా రాఘవరెడ్డి సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టులు, నీటి వినియోగంపై తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సంధించిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి హరీశ్రావు సమాధానం చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కమిటీ డిమాండ్ చేసింది. జగన్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా... మానుకోట చేస్తా అంటూ హరీశ్రావు బెదిరింపులకు దిగడమేమిటని నిలదీసింది. మంత్రి హోదాలో ఉండి శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా హెచ్చరికలు చేస్తున్న హరీశ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. మంగళవారం హైదరాబాద్లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైఎస్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు, గత రెండేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల కోసం ఎంత బడ్జెట్ విడుదల చేశాయో ప్రకటించాలన్నారు. మహబూబ్నగర్లో పార్టీ కార్యాలయంపై దాడిని, హైదరాబాద్లో పలు చోట్ల వైఎస్సార్సీపీ జెండా గద్దెలను ధ్వంసం చేయడాన్ని ఖండించారు. ఈ ఘటనలకు బాధ్యులైన వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాచరికం అనుకుంటున్నారా?: నల్లా ‘సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావులు రాష్ట్రంలో రాచరిక వ్యవస్థ కొనసాగుతున్నదని అనుకుంటున్నారా? తామేమైనా అభినవ నిజాం నవాబు అనుకుంటున్నారా..’ అని నల్లా సూర్యప్రకాశ్ ప్రశ్నించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి మంత్రి అయిన హరీశ్రావు రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చి మానుకోట పునరావృతమవుతుందంటూ హెచ్చరికలు చేయడం... రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని మండిపడ్డారు. హరీశ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తమ ప్రాంత ప్రయోజనాల పరిరక్షణకు జగన్ దీక్ష చేస్తుంటే.. ఆయన లేవనెత్తుతున్న ప్రశ్నలకు జవాబు చెప్పకుండా రెచ్చగొట్టే ప్రకటనలు చేయడమేమిటని నిలదీశారు. మహబూబ్నగర్లో వైఎస్సార్సీపీ కార్యాలయంపై దాడి, జెండా గద్దెల కూల్చివేతను ఖండించారు. వైఎస్ చేపట్టిన ప్రాజెక్టులపై శ్వేతపత్రం ఇవ్వాలి: రాఘవరెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన ప్రాజెక్టులపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో వైఎస్ ప్రారంభించిన 36 ప్రాజెక్టుల్లో ఆరు పూర్తికాగా, 9 నిర్మాణదశలో ఉన్నాయని.. 21 ప్రాజెక్టులు పాక్షికంగా పూర్తయ్యాయన్నారు. ఇప్పుడు రూ.10వేల కోట్లు కేటాయిస్తే వాటన్నింటినీ పూర్తి చేసి ఏకంగా 49 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు ఇవ్వొచ్చన్నారు. కానీ అవి పూర్తయితే వైఎస్కు పేరు వస్తుందన్న ఉద్దేశంతోనే పక్కన పెట్టారని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల వల్ల ఏపీకి నష్టం జరుగుతుందని జగన్ దీక్ష చేస్తున్నారని... ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమివ్వకుండా మానుకోట పునరావృతం అవుతుందంటూ హరీశ్ హెచ్చరికలు చేయడం సరికాదని పేర్కొన్నారు. వీలైతే జగన్ ప్రశ్నలకు సమాధానాలివ్వాలని.. అలాగాకుండా ఏవేవో మాట్లాడడం సమంజసం కాదన్నారు. పచ్చకామెర్ల రోగులకు లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్నట్లుగా టీఆర్ఎస్ నాయకులు ప్రవర్తిస్తున్నారని రాఘవరెడ్డి విమర్శించారు. ఏ ఎన్నికలు వచ్చినా మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు దిగిపోయి, డబ్బు వెదజల్లి గెలిచే ప్రయత్నం చేస్తున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా వ్యాఖ్యానించారు. సోమవారం జేఏసీ పేరిట కొందరు హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంపై దాడికి ప్రయత్నించడాన్ని ఖండించారు. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగితే.. తాము ముందుండి అఖిలపక్షంతో కలసి ప్రభుత్వానికి అండగా నిలుస్తామని చెప్పారు. -
అటకెక్కిన సంక్షేమ పథకాలు
వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి సాక్షిప్రతినిధి, ఖమ్మం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పాలనలో ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్, పింఛన్లు, రేషన్, 108, 104, ఇంది రమ్మ ఇళ్ల పథకాలను ఈ ప్రభుత్వం అటకెక్కించిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతి నిధి కొండా రాఘవరెడ్డి విమర్శించారు. ఖమ్మంలోని ప్రెస్క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కమీషన్లు దండుకోవడానికే సీఎం కేసీఆర్ ప్రాజెక్టులకు రీ డిజైన్ చేయిస్తున్నారని, రాష్ర్టంలో ఈ రెండేళ్లలో ఒక్క ప్రాజెక్టునైనా పూర్తిచేసి సాగునీటిని అందించారా? అని ప్రశ్నించారు. మాటల గారడీ చేస్తూ.. పూటకోమాట చెబుతున్న కేసీఆర్ పాలనకు కాలం చెల్లే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఒక్క సంక్షేమ పథకం కూడా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని, ఇప్పటికే ప్రజల్లో దీనిపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయన్నారు. ఇప్పుడు కొత్త జిల్లాలంటూ మళ్లీ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ముందుగా జలయజ్ఞంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాం డ్ చేశారు. మంత్రి తుమ్మల ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని, తుమ్మలను పాలేరు ఎన్నికలో పోటీలోకి దించడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీ, టీడీపీ మద్దతునిచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సుచరితారెడ్డి విజయం ఖాయమన్నారు. -
నేడు చేవెళ్లలో..వైఎస్సార్సీపీ సమావేశం
చేవెళ్ల: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయలేక టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతూ కాలయాపన చేస్తోందని వైఎస్సార్ సీపీ కేంద్ర కమిటీ సభ్యులు కొండా రాఘవరెడ్డి అన్నారు. చేవెళ్లలో ఆదివారం జరుగనున్న వైఎస్సార్ సీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం ఏర్పాట్లను ఆయన శనివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు.. అడిగిన ప్రతి ఒక్కరికీ పింఛన్లు పంపిణీ చేశారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం అర్హుల పేరిట గ్రామానికి 100 నుంచి 200 పింఛన్లు తొలగించిందని ఆరోపించారు. సర్వేల పేరుతో కాలయాపన చేయడమే తప్ప ఆచరణలో ప్రజలకు ఈ ఆరునెలల కాలంలో ప్రభుత్వం చేసిందేమీ లేదని పేర్కొన్నారు. తెల్లరేషన్కార్డులను ఏరివేసే పనిలో కూడా అధికార యంత్రాంగం నిమగ్నమైందని, సుమారుగా 30శాతం వరకు ఆ కార్డులను ప్రభుత్వం తొలగిస్తోందని ప్రజలే చెబుతున్నారని స్పష్టంచేశారు. ప్రజాసమస్యలపై పోరాటం కోసమే తెలంగాణలోని ప్రతి జిల్లాలో వైఎస్సార్ సీపీ సమావేశాలు నిర్వహిస్తున్నదని వివరించారు. తెలంగాణలో మొదట చేవెళ్లలో వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ విస్తృత సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. చేవెళ్ల సభకు పార్టీ శ్రేణులు, వైఎస్సార్ అభిమానులు పెద్దఎత్తున తరలిరావాలని కొండా రాఘవరెడ్డి కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు మహిపాల్రెడ్డి, అమృతాసాగర్, పి.నాగిరెడ్డి, ఎం.రాజయ్య, పుష్పలత, ఎండీ ఖాజాపాష, జగన్, కంజర్ల శివయ్య, మోహన్కుమార్, శ్రీకాంత్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు. ఏర్పాట్ల పరిశీలన... చేవెళ్లలో ఆదివారం నిర్వహిస్తున్న జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర కమిటీ నాయకులు కొండా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు మహిపాల్రెడ్డి, నాగిరెడ్డి, అమృతాసాగర్, ఎం.రాజయ్య తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. హైదరాబాద్ నగరం నుంచి మొయినాబాద్ మీదుగా చేవెళ్లవరకు దారిపొడవునా భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు, బ్యానర్లు, పోస్టర్లను ఏర్పాటుచేస్తున్నారు. తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఉదయం 9 గంటలకు నాంపల్లి దర్గాలో ప్రార్థనలు చేసి బయలుదేరుతారు. మార్గమధ్యంలో బండ్లగూడ వద ్దగల ఆర్మీమైసమ్మ దేవాలయం, చిలుకూరు బాలాజీ దేవాలయంలో పూజలు, మొయినాబాద్ చర్చిలో ప్రార్థనలు చేసి చేవెళ్లకు చేరుకొని సమావేశంలో పాల్గొంటారు. -
తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ను బలోపేతం చేస్తాం
వికారాబాద్: తెలంగాణలోని 10 జిల్లాలకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఈ నెల 9న చేవెళ్లలో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లేదని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ తెలంగాణలోని ప్రతి గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అభిమానులున్నారని, వైఎస్ఆర్ అడుగుజాడల్లోనే తమ పార్టీ నడుస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పునరువైభవాన్ని సంతరించుకునే రోజులు వస్తాయని స్పష్టం చేశారు.తెలంగాణ ప్రాంతంలో ఏ రాజకీయ నాయకుడికీ లేనంత ఆదరణ వైఎస్ఆర్కు ఉందని, ఆ మహానేత ఆశయాలను వైఎస్ జగన్మోహ న్రెడ్డి సాధిస్తారనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలో జనవరి నెలలో వైఎస్ఆర్ తనయురాలు, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల పర్యటించనున్నట్లు చెప్పారు. తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం సాధించే రోజులు త్వరలోనే వస్తాయన్నారు. 9న చేవెళ్లలో నిర్వహించే సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు చెప్పారు. ఉదయం 11 గంటలకు నిర్వహించే ఈ సమావేశానికి పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరు కావాలని కోరారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను తుంగలో తొక్కిందన్నారు. అర్హులను కూడా అనర్హులుగా ప్రకటించి సంక్షేమ పథకాలకు దూరం చేస్తోందని ఆరోపించారు. ప్రజల పక్షాన పోరాడం చేయడానికి తమ పార్టీ అన్ని వేళలా ముందుంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు నాగరాజు, గోవర్ధన్రెడ్డి, మురళీధర్రెడ్డి, శంకర్, రమేష్, ఎన్నెపల్లి గోపాల్, బెనర్జీ, రాంరెడ్డి, రాఘవరెడ్డి, చారి తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement