-
రాగులపాడు లిఫ్ట్ ముట్టడిని విజయవంతం చేయండి
ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి వజ్రకరూరు: ఉరవకొండ నియోజకవర్గంలోని 80 వేల ఎకరాలకు హంద్రీనీవా కాలువ ద్వారా సాగు నీరు అందించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న తలపెట్టిన రాగులపాడు లిప్ట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం చిన్నహోతురు, పొట్టిపాడు గ్రామాల్లో ఆయన రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హంద్రీనీవా ఆయకట్టుకు సాగు నీటి సాధనకు ప్రతి ఒక్క రైతు నడుం బిగించాలన్నారు. నాలుగేళ్ల నుంచి హంద్రీనీవాకు కృష్ణా జలాలు వస్తున్నా ఆయకట్టుకు మాత్రం నీరు అందించలేదని అన్నారు. మన కళ్లేదుటే హంద్రీనీవా కాలువలో కృష్ణా జలాలు పారుతున్నా మనం ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నామన్నారు. ఆయకట్టు సాగు నీటి సాధనకు ప్రభుత్వంపై పోరాడితే తప్ప సాగునీటిని సాధించలేమన్నారు. ప్రభుత్వం వెంటనే సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన రాగులపాడు పంప్హౌస్ ముట్టడి కార్యక్రమానికి రైతులు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. వెనుకబడిన ప్రాంతాలపై ఇంత నిర్లక్ష్యమా..? వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. ఒక పక్క నిధులు లేవంటూనే తాత్కాలిక సచివాలయంలో వాస్తు పేరుతో కోట్ల రుపాయలు ఖర్చు పెడుతున్నారని విమర్శించారు. రెండు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన జిల్లాలకు రూ. 750 కోట్లు ఇచ్చిందని, అయితే ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలు మాని గ్రామాల్లో తిరిగితే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయన్నారు. -
పరుగులు తీస్తున్న కృష్ణమ్మ
వజ్రకరూరు : మండలపరిధిలోని రాగులపాడు గ్రామసమీపంలోని హంద్రీనీవా ప్రధాన కాలువలో కృష్ణాజలాలు పరుగులు తీస్తున్నాయి. ఈ నెల10న కర్నూలు జిల్లా మాళ్యాలనుంచి కృష్ణా జలాలు రాగులపాడులిఫ్ట్కు చేరుకున్నాయి. అప్పటినుంచి లిఫ్ట్ ద్వారా జీడిపల్లి రిజర్వాయర్కు పంపుతున్నారు. లిఫ్ట్కు నీటి ఉధృతి పెరగడంతో అధికారులు మంగళవారం నాలుగు పంపులద్వారా నీటిపంపింగ్ చేపడుతున్నారు. ఒక్కో పంపు నుంచి 350 క్యూసెక్కులమేర నీరు వెళుతున్నట్లు అధికారులు తెలిపారు. హంద్రీనీవా కాలువలో కృష్ణాజలాలు ప్రవహిస్తుండటంతో పొట్టిపాడు, పీసీ.ప్యాపిలి, రాగులపాడు, కడమలకుంట పరిసర ప్రాంతాల్లో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేసిన కన్నప్ప టీం!
జూన్ 4 తర్వాత 'గూగుల్ పే' బంద్.. ఎక్కడంటే?
TS Cabinet Meet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
రతన్టాటా.. అణువణువూ ఆదర్శమే..!
తెలుగులో ఫస్ట్ మూవీనే సూపర్ హిట్.. కానీ ఆ తర్వాతే.. ఈమెని గుర్తుపట్టారా?
ఎన్నికలు vs ఏఐ
ఇన్సూరెన్స్ సేవల్లోకి ప్రముఖ సంస్థ
ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం.. భారత్లో రేపు సంతాపదినం
ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శి, బిల్ కలెక్టర్..
హోండా 0 సిరీస్ ఎలక్ట్రిక్ కార్లు.. 500 కిమీ టార్గెట్!
తప్పక చదవండి
- ఎన్నికలు vs ఏఐ
- ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం.. భారత్లో రేపు సంతాపదినం
- చరిత్రాత్మకం! సౌదీలో తొలిసారిగా స్విమ్వేర్ ఫ్యాషన్ షో!
- కారుతో ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి.. గంటల్లోనే బెయిల్
- అప్పటికి భారతీయులు ధనవంతులవుతారా.. అసలు సమస్య ఏంటంటే?
- ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం
- కేజ్రీవాల్కు బెదిరింపులు బీజేపీ పనే: ఆప్
- రూ. 5 కోట్లు దండుగ అన్నారు.. చెత్తలో పడేసిందంటూ: యశ్ తండ్రి
- నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!
- ‘AI’తో ప్రమాదమే.. గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ వార్నింగ్
Advertisement