-
స్కిల్ ఇండియానా, నిల్ ఇండియానా!
సాక్షి, ముంబై : భారతీయ రైల్వేలో అప్రెంటీస్గా శిక్షణ పొందిన దాదాపు మూడు వేల మంది నిరుద్యోగ యువకులు మంగళవారం నాడు దాదాపు నాలుగు గంటలపాటు ముంబై నగరంలో రైలురోకో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఫలితంగా దాదార్, మాతుంగ రైల్వే స్టేషన్ల మధ్య లోకల్ రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రద్దీ ఎక్కువగా ఉండే ఉదయం ఏడు గంటల నుంచి 11 గంటల వరకు ఈ ఆందోళన కొనసాగడంతో వేలాది మంది స్కూల్ పిల్లలు, కాలేజీ విద్యార్థులు, ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆందోళన చేసిన వారంతా ‘ఆల్ ఇండియా యాక్ట్ అప్రెంటీస్ అసొసియేషన్’ సభ్యులు. భారతీయ రైల్వేలో తమకు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ.. వారు మహారాష్ట్ర, బీహార్, పంజాబ్ తదితర రాష్ట్రాలన్నీ తిరుగుతున్నారు. 2014 సంవత్సరానికి ముందు భారతీయ రైల్వేలో అప్రెంటీస్ చేసిన వారందరికి టెక్నికల్ జాబ్స్ వచ్చేవని, 2014 నుంచి తమకు ఉద్యోగాలు రావడం లేదని వారు ఆరోపిస్తున్నారు. తాము శిక్షణ పూర్తి చేసి నాలుగైదు సంవత్సరాలు పూర్తవుతున్నా ఉద్యోగాలు ఇవ్వడానికి రైల్వే అధికారలు నిరాకరిస్తున్నారని, సిఫార్సులపై అతి కొద్ది మందికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తున్నారని బీహార్ నుంచి వచ్చిన నిరుద్యోగ యువకుడు సంతోష్ కుమార్ ఆరోపించారు. ‘సెంట్రల్ అప్రెంటీస్ యాక్ట్, 1961’ కింద రైల్వే శాఖ రెగ్యులర్గా అప్రెంటీస్లకు శిక్షణ ఇచ్చి పాసైన వారికి ఉద్యోగాలిస్తూ వస్తోంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక దానికి ‘స్కిల్ ఇండియా’ అంటూ ఆ నియామకాలకు పేరు పెట్టారు. కానీ నియామకాలు మాత్రం జరుగలేదు. గత నాలుగేళ్లుగా ఉద్యోగాలు లేకపోవడంతో ఇప్పుడు వీరు ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. రెండు రోజుల్లోనే తగిన సమాధానం చెబుతామని రైల్వే శాఖ హామీ ఇవ్వడంతో నిరుద్యోగులు తమ రైల్రోకో ఆందోళన కార్యక్రమాన్ని విరమించారు. అయితే వారు తమకు సంతప్తికరమైన సమాధానం వస్తుందన్న విశ్వాసం లేదని వారు మీడియాకు తెలియజేశారు. ‘గత ఆగస్టు నుంచి మేము ఢిల్లీ, గోరఖ్పూర్లలో భారీ ప్రదర్శనలు నిర్వహించాం. 30 మందికిపైగా ఎంపీలకు లేఖలు రాశాం. చివరకు రైల్వే శాఖ మంత్రిని కూడా కలుసుకున్నాం. అందరూ హామీలు ఇచ్చిన వారే. ఎవరి మాట నెరవేరలేదు’ అని ఫిట్టర్గా 2015లో శిక్షణ పొందిన 23 ఏళ్ల యువకుడు సంతోష్ కుమార్ వివరించారు. ‘నైపుణ్య భారత్’ నినాదం కింద హామీ ఇచ్చిన ఉద్యోగాలెక్కడా ? అని ఆయన ప్రశ్నించారు. ‘స్కిల్ ఇండియానా నిల్ ఇండియానా’ అని ఆందోళనకారులు విమర్శిస్తున్నారు. అప్రెంటీస్ యాక్ట్ అంటే ఏమిటీ? వివిధ రకాల టెక్నికల్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఇంజీనీరింగ్ డిప్లమో హోల్డర్లు, ఐఐటీ గ్రాడ్యువేట్లకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 1961లో అప్రెంటీస్ యాక్ట్ను తీసుకొచ్చింది. దేశంలోనే అతిపెద్ద ఉద్యోగ కల్పనా సంస్థ అవడం వల్ల భారతీయ రైల్వేలు ఇదే చట్టంలోని నిబంధనల కింద సొంత అప్రెంటీస్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేసుకొంది. సొంత ఇంజనీరింగ్ విభాగాలు, ఎలక్ట్రిఫికేషన్, ప్రొడక్షన్ యూనిట్స్, లోకోమోటివ్, క్యారేజ్, వేగన్ షెడ్స్ విద్యార్థులకు అప్రెంటీస్ శిక్షణ ఇస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘స్కిల్ ఇండియా’ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి దేశంలోని 16 రైల్వే జోన్లలో 30 వేల అప్రెంటీస్లకు శిక్షణ ఇస్తామని ఇటీవలనే కేంద్ర రైల్వే శాఖ ప్రకటించింది. సాధారణంగా రైల్వే విభాగాల్లో అప్రెంటీస్ శిక్షణ పూర్తి చేసిన వారికి రైల్వేలో లేదా ఇతర పరిశ్రమల్లో ఉద్యోగాలు చేసేందుకు వీలుగా ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రేనింగ్’ సర్టిఫికేట్ను జారీ చేస్తాయి. ఈ సర్టిఫికేట్ సాధించిన వారందరిని ఉద్యోగాల్లోకి తీసుకోవాలంటూ చట్టంలో నిబంధనేమీ లేదు. అయితే గత ప్రభుత్వాల హయాంలో సర్టిఫికేట్ సాధించిన వారికి నియామకాల్లో ప్రాధాన్యత ఇస్తూ వచ్చాయి. ప్రస్తుత ప్రభుత్వం రైల్వేలో శిక్షణ పొందిన వారికి 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. అయినప్పటికీ ఇప్పటి వరకు నియామకాలు జరుగలేదు. అందుకే అప్రెంటీస్లు రైలు పట్టాలెక్కారు. -
ఉద్యోగాలు
స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీసెస్ ఎగ్జామినేషన్- 2015 స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీసెస్ ఎగ్జామినేషన్-2015 నోటిఫికేషన్ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) విడుదల చేసింది. విభాగం: మెకానికల్ అర్హతలు: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ప్రథమ/ద్వితీయ శ్రేణిలో ఇంటర్ ఉత్తీర్ణత లేదా బీఎస్సీ(మ్యాథ్స్/ఫిజిక్స్/కెమిస్ట్రీ) ఉండాలి. వయసు: 17 నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేది: నవంబర్ 7 రాత పరీక్ష తేది: జనవరి 18 వెబ్సైట్: http://www.upsc.gov.in/ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ తిరువనంతపురంలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్.. కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సైంటిస్ట్/ఇంజనీర్ ‘ఎస్సీ’ అర్హతలు: మెకానికల్/కెమికల్/ఇండస్ట్రియల్/ప్రొడక్షన్/ఇండస్ట్రియల్ సేఫ్టీ ఇంజనీరింగ్లో బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్ ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 31 వెబ్సైట్: http://www.lpsc.gov.in/ ఇండియన్ రైల్వేస్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నాయి. స్టెనోగ్రాఫర్/జూనియర్ స్టెనోగ్రాఫర్: ఖాళీలు: హిందీ: 376 ఇంగ్లిష్: 599 అర్హతలు: పదో తరగతితో పాటు ఇంగ్లిష్/హిందీ షార్ట్హ్యాండ్లో నిమిషానికి 80 పదాల వేగం ఉండాలి. వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. జూనియర్ ట్రాన్స్లేటర్: 82 అర్హతలు: ఇంగ్లిష్/హిందీలో మాస్టర్స్ డిగ్రీ లేదా ఏదైనా పీజీతో పాటు ట్రాన్స్లేషన్లో డిప్లొమా/సర్టిఫికెట్ ఉండాలి. డిగ్రీలో హిందీ /ఇంగ్లిష్లను ప్రధాన సబ్జెక్టులుగా చదివి ఉండాలి. స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్: 56 అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు లేబర్ వెల్ఫేర్/సోషల్ వెల్ఫేర్లో డిప్లొమా లేదా ఎల్ఎల్బీ ఉండాలి. వయసు: 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష ద్వారా మరిన్ని పోస్టుల వివరాల కోసం వెబ్సైట్ చూడొచ్చు. దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 10 వెబ్సైట్: http://rrbsecunderabad.nic.in/ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కానిస్టేబుల్: 76 విభాగం: యానిమల్ ట్రాన్స్పోర్ట్ అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణత. శారీరక ప్రమాణాలు: పురుషుల ఎత్తు 170 సెం.మీ., ఛాతీ 80 నుంచి 85 సెం.మీ. ఉండాలి. ఎంపిక: ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, రాత పరీక్ష ద్వారా దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 21 వెబ్సైట్: http://itbpolice.nic.in/
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
గర్భిణులూ జెర జాగ్రత్త..
న్యూస్రీల్
వడగండ్ల వాన
‘బీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి’
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
ఉద్యోగాలిప్పిస్తానని ఘరానా మోసం
ఎన్నికల వేళ డేగకళ్ల నిఘా
నాంచారమ్మ జాతర విజయవంతం చేయండి
క్లుప్తంగా
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement