-
వచ్చే నెలలో తెలంగాణకు మళ్లీ మోదీ!
సాక్షి, హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలోనే మరోసారి రాష్ట్రానికి వచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాజీపేటలో రైల్వేశాఖ నిర్మించనున్న సరుకు రవాణా వ్యాగన్ తయారీ ఫ్యాక్టరీకి ప్రధాని శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకరణకు శంకుస్థాపన, వందేభారత్ రైలు ప్రారంభోత్సవం కోసం శనివారం హైదరాబాద్కు వస్తున్నారు. వీటితోపాటు కాజీపేట ఫ్యాక్టరీకి కూడా శంకుస్థాపన చేయాల్సి ఉంది. కానీ ప్రధాని మోదీ మరోసారి రాష్ట్ర పర్యటనకు వీలు కల్పించేలా.. ఆ కార్యక్రమాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసినట్టు తెలిసింది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కావటంతో.. గతంలో కేంద్రం కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామన్నా దానిస్థానంలో వ్యాగన్ ఓవర్హాలింగ్ వర్క్షాపును మంజూరు చేసింది. దీంతో కేంద్రంపై రాజకీయ విమర్శలను ఎక్కుపెట్టడంతో.. వర్క్షాపు స్థానంలో వ్యాగన్ తయారీ ఫ్యాక్టరీగా అప్గ్రేడ్ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అది ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా మారడంతో.. ఇతర కార్యక్రమాలతో కలిపి సింపుల్గా శంకుస్థాపన చేయటం సరికాదని కేంద్ర పెద్దలు ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలోనే విడిగా శంకుస్థాపన చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. వచ్చే నెలలో శంకుస్థాపనకు ఛాన్స్.. కాజీపేటకు తొలుత మంజూరు చేసిన పీరియాడికల్ ఓవర్హాలింగ్ వర్క్షాప్ అంచనా వ్యయం రూ.269 కోట్లు. అయితే ఇటీవల కేంద్ర బడ్జెట్ ముగిసిన తర్వాత రైల్వేశాఖ.. ఈ వర్క్షాప్ ప్రతి పాదనను వ్యాగన్ తయారీ ఫ్యాక్టరీగా మారుస్తూ, అంచనాను రూ.521 కోట్లుగా ప్రకటించింది. రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే భూమిని రైల్వేశాఖకు బదలాయించిన నేపథ్యంలో.. నిర్మాణ పనులకు వీలుగా ఏర్పాట్లను ప్రారంభించింది. వచ్చే నెలలో పనులు ప్రారంభించాలని భావిస్తోంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ వచ్చే నెలలోనే రాష్ట్ర పర్యటనకు వచ్చి.. వ్యాగన్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్నారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. -
వరంగల్ రాజకీయాలలో కాకా పుట్టిస్తున్న.. కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ
-
Kazipet: పట్టాలెక్కిన రైల్వే వ్యాగన్ వర్క్షాప్.. 2వేల మందికి పైగా ఉపాధి
సాక్షి, హైదరాబాద్: కాజీపేటలో ఏళ్లుగా ఎదురుచూపులకే పరిమితమైన రైల్వే ఫ్యాక్టరీ ఎట్టకేలకు సాకారమవుతోంది. కాజీపేటకు మంజూరై ఇటుక కూడా పడకుండానే తరలిపోయిన రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, ఆ తర్వాత ప్రకటన జరిగి ఆగిపోయిన వ్యాగన్ వీల్ ఫ్యాక్టరీల స్థానంలో.. వ్యాగన్ ఓవర్ హాలింగ్ వర్క్షాపు ఏర్పాటవుతోంది. కాజీపేట శివారులోని మడికొండలో ఏర్పాటు చేయబోతున్న ఈ ‘పీరియాడికల్ ఓవర్హాలింగ్ వ్యాగన్ వర్క్షాప్’ టెండర్ను హైదరాబాద్కు చెందిన పవర్ మెక్–టైకిషా జాయింట్ వెంచర్ సంస్థ దక్కించుకుంది. ప్రాజెక్టుకు రూ.383 కోట్ల అంచనాతో టెండర్లు పిలవగా.. ఈ సంస్థ రూ.361,79,22,000కు పనులు దక్కించుకుంది. ఈ మేరకు రైల్వే అనుబంధ సంస్థ అయిన రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) వర్క్ఆర్డర్ జారీ చేసింది. 2024 డిసెంబర్ చివరి నాటికల్లా ఫ్యాక్టరీ సిద్ధమై, పని ప్రారంభించాలని స్పష్టం చేసింది. కాంట్రాక్టు విలువలో సివిల్, ట్రాక్ పనులకు రూ.208.39 కోట్లు, మెకానికల్ పనులకు రూ.115.77 కోట్లు, ఎలక్ట్రికల్ పనులకు రూ.35.46 కోట్లు, టెలికమ్యూనికేషన్ పనులకు రూ.2.17 కోట్లు పేర్కొనగా.. జీఎస్టీయే ఏకంగా రూ.55 కోట్లు కావటం గమనార్హం. కోచ్.. వ్యాగన్ వీల్.. ఓవర్హాలింగ్.. కాజీపేటకు 1982 సమయంలోనే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరైంది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య సమయంలో సిక్కులపై ఊచకోతతో పంజాబ్లో కాంగ్రెస్పై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. దాన్ని తగ్గించే క్రమంలో నాటి కేంద్ర ప్రభు త్వం కాజీపేటకు మంజూరైన కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్లోని కపుర్తలాకు మార్చేసింది. మమతా బెనర్జీ రైల్వేమంత్రిగా ఉండగా 13 ఏళ్ల కింద కాజీపేటకు వ్యాగన్ వీల్ ఫ్యాక్టరీ మంజూరైంది. రాష్ట్ర ప్రభుత్వం కాజీపేట శివార్లలో సీతారామ స్వామి ఆలయానికి చెందిన 150 ఎకరాల భూమిని దానికి కేటాయించింది. కానీ దీనిపై కొందరు కోర్టుకు వెళ్లడంతో ఫ్యాక్టరీకి భూమి అప్పగింత ఆగిపోయింది. తీవ్ర జాప్యం జరగడంతో రైల్వేశాఖ వీల్ ఫ్యాక్టరీని మరోచోటికి బదలాయించింది. దాని స్థానంలో 2015లో వ్యాగన్ ఓవర్హాలింగ్ వర్క్షాపును మంజూరు చేసింది. రూ.383.05 కోట్ల అంచనాతో మంజూరైన ఈ ప్రాజెక్టుకు తొలుత రైల్వే బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారు. కానీ భూమి బదలాయింపు కాకపోవటంతో నిధులు విడుదల కాలేదు. తర్వాత నామమాత్రంగా కేటాయింపులు చేశారు. గత ఏడాది కోర్టు కేసు వీడిపోవడం, ధరణిలో ఏర్పడ్డ సమస్య కూడా తీరడంతో ఇటీవలే భూమి యాజమాన్య హక్కు రైల్వేపరమైంది. వర్క్షాపు పని పట్టాలెక్కింది. అయితే దీనికి మరో 11 ఎకరాల భూమి ఇవ్వాల్సి ఉంది. ఇందులో 10 ఎకరాల అంశం కొలిక్కివచ్చినా.. మరో ఎకరం స్థలం విషయంలో ఇంకా స్పష్టత రాలేదని సమాచారం. కాగా, వర్క్షాపుతో ప్రత్యక్షంగా వెయ్యి మందికి, పరోక్షంగా మరో వెయ్యి మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు చెప్తున్నారు. చదవండి: హెచ్ఎండీఏ: సర్కారీ భూముల వేలానికి మరోసారి నోటిఫికేషన్ -
వారెవ్వా ఐపాస్... ప్రగతి పట్టాలపై పారశ్రామిక పరుగు
కరోనా కారణంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన పారిశ్రామికరంగం మళ్లీ ప్రగతి పట్టాలపై పరుగులు పెడుతోంది. గత ఏడేళ్లలో పరిశ్రమల ఏర్పాటులో మేడ్చల్ అగ్రభాగాన ఉండగా..రెండో స్థానంలో రంగారెడ్డి జిల్లా నిలిచింది. రాష్ట్ర ఖజానాకు మూడో వంతు ఆదాయాన్ని సమకూర్చడమేగాకుండా నిరుద్యోగులకు ఉపాధిలోనూ ముందు వరుసలో ఉంది. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక, ఆర్థిక సర్వే–2021లో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. విద్యా, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక రంగాల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తెలంగాణలోనే టాప్లో నిలిచింది. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ అప్రూవల్ అండ్ సెల్ప్ సర్టిఫికేషన్ సిస్టం (టీఎస్ ఐపాస్) విధానంతో ఉమ్మడి జిల్లాల్లో భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఈ విధానం అమల్లోకి తెచ్చిన తర్వాత (2014–21 మధ్య) జిల్లాకు రూ.29,488 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. తద్వారా ఏర్పాటు చేసిన 5,362 కంపెనీల వల్ల 2,62,018 మందికి ఉపాధి అవకాశాలు దక్కాయి. అంతేకాదు నగరశివారులో ఏర్పాటు చేసిన ఈ సంస్థల వల్ల రాష్ట్ర ఖజానాకు భారీగా నిధులు సమకూ రాయి. ఫలితంగా జిల్లా తలసరి ఆదాయం, స్థూల ఉత్పత్తి ప్రధమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో మేడ్చల్ కొనసాగుతోంది. పరిశ్రమల ఏర్పాటు లో మాత్రం మేడ్చల్ మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. ఏడేళ్లలో మేడ్చల్ జిల్లాలో 3,805 కంపెనీలు ఏర్పాటు కాగా, రంగారెడ్డిజిల్లాలో 1,137 కం పెనీలు వచ్చాయి. వీటి ద్వారా 1,60,382 మందికి ఉపాధి లభించింది. ఉత్పత్తుల ఎగుమతుల్లో మేడ్చల్ 25.52శాతంతో మొదటి స్థానంలో ఉంటే, అదే రం గారెడ్డి 16.97 శాతంతో నాలుగో స్థానంలో నిలిచింది. దేశంలోనే ఆదర్శంగా నిలిచిన టీఎస్–ఐపాస్కు ఆన్లైన్ దరఖాస్తులతో అన్ని రకాల అనుమతులు ఏకగవాక్ష విధానంలో కేవలం నెల రోజుల వ్యవధిలోనే జారీ చేస్తూ పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది. ఫలితంగా దేశ, విదేశాలకు చెందిన కంపెనీలు ఇక్కడ పెట్టు బడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. అంతేకాదు కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రభుత్వం పలు రకాల ప్రోత్సహాకాలు ప్రకటిస్తుంది. ఫలితంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. మచ్చుకు కొన్ని.. ఇప్పటికే విమానాలు, హెలిక్యాప్టర్ విడిభాగాల ఉత్పత్తిని చేపడుతున్న జిల్లా త్వరలోనే రైల్వేకోచ్ల తయారీ, ఎగుమతులకు కేంద్రం కానుంది. శంకర్పల్లి మండలం కొండకల్ వద్ద మేద సంస్థ రూ.1000 కోట్ల పెట్టుబడితో కంపెనీ ఏర్పాటు చేసింది. ఏటా 500 రైల్వే కోచ్లు, 50 లోకోమోటివ్లను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేయనుంది. అంతేకాదు 2,200 మందికి ఉపాధి కల్పించనుంది. ట్రయల్ రన్లో భాగంగా ఇప్పటికే ఇక్కడ ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. మహేశ్వరం మండలం కేసీతండాలో ఎలక్ట్రిక్ హార్ట్వేర్ పార్క్లో రూ.300 కోట్లతో విప్రో కన్జ్యూమర్ కంపెనీ స్థాపించింది. 900 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఇటీవల ఐటీశాఖ మంత్రి కేటీఆర్ దీన్ని ప్రారంభించారు. ఐపాస్తో పెరిగిన వేగం పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రస్తుత పారిశ్రామిక వాడలను మరింత విస్తరించడంతో పాటు శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, మంఖాల్, మహే శ్వరం, షాబాద్, తదితర ప్రాంతాల్లో ఐటీ పార్కులు ఎంఎస్ఎంఈ పార్కులు, ఫుడ్ పార్కులు, ప్లాస్టిక్ అండ్ లెదర్ పార్కులు కూడా అభివృద్ధి చేస్తున్నాం. దళారుల ప్రమేయం లేకుండా, పారదర్శకంగా అనుమతులు జారీ చేస్తున్నాం. 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నాం. రవాణా, మంచినీరు, ఇతర మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తున్నాం. ఫలితంగా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. – రాజేశ్వర్రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ, అధికారి (చదవండి: హైదరాబాద్కు పాడ్ కార్స్, రోప్వేస్) -
‘కోచ్’ వచ్చే వరకు కొట్లాట
సాక్షి, హైదరాబాద్: కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ పెట్టలేమని చెప్పడం ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ద్రోహం చేసిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కె.తారక రామారావు మండిపడ్డారు. కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం రాష్ట్ర పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోచ్ ఫ్యాక్టరీ వచ్చే వరకూ కొట్లాడుతామని తెలిపారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయహోదాతోపాటు పునర్విభజన చట్టంలోని హామీల అమలులో మోదీ ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు కేటీఆర్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మోదీ ప్రభుత్వ తీరుతో ఊసరవెల్లులు కూడా ఉరేసుకుంటున్నాయి. తెలంగాణను మోసగించడంలో గత పాలకులను మోదీ సర్కార్ మించుతోంది. రైల్వేకోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం 150 ఎకరాల భూమిని సేకరించి ఇచ్చినా సానుకూలంగా స్పందించడంలేదు’అని విమర్శించారు. ప్రధాని మోదీ రాజకీయ ప్రయోజనాల కోసమే మహారాష్ట్రలోని లాతూర్కు 2018లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రకటించి రూ.625 కోట్లు విడుదల చేశారని, కేంద్రం చేసిన దగాతో కొత్తగా ఉద్యోగాలు వస్తాయని ఎదురుచూసిన ఈ ప్రాంత యువత ఆశలపై నీళ్లు చల్లారని కేటీఆర్ విమర్శించారు. కేంద్రప్రభుత్వ కుట్రపూరిత విధానాలను తెలంగాణ ప్రజలు తిప్పికొడతారని కేటీఆర్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాల పట్ల సోయి ఉంటే బీజేపీ మంత్రి, ఎంపీలు, నేతలు కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని నిలదీయాలని సూచించారు. ఇప్పటికైనా రాష్ట్ర బీజేపీ నేతలు బుద్ధి తెచ్చుకోకుంటే తెలంగాణ ప్రజలే తరిమితరిమి కొడతారు’అని కేటీఆర్ హెచ్చరించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
ఈహెచ్టీని ఢీ కొట్టిన లారీ
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
తప్పక చదవండి
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
Advertisement