-
సమగ్ర వ్యవసాయ సేవాకేంద్రాలుగా రైతు భరోసా కేంద్రాలు
-
'అనంత’ ఆత్మహత్యలు దేశానికి తెలిశాయి!
అందుకే రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి ‘అనంత’కు వచ్చారు: వైఎస్ జగన్ అనంతపురం: ‘‘రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా పోయిందని రాహుల్గాంధీ అన్నారట. వారు పెద్దోళ్లు... అవసరంకోసం ఏమైనా మాట్లాడతారు. అవసరం వస్తే దండ వేస్తారు. లేదంటే బండ వేస్తారు. కానీ ఏడాదిగా ప్రభుత్వంపై పోరాటాలు చేస్తూనే ఉన్నాం. గుంటూరు, మంగళగిరితోపాటు చాలాచోట్ల దీక్షలు చేశాం. మేం చేసిన రైతు భరోసాయాత్రతోనే అనంతపురం జిల్లాలో రైతుల ఆత్మహత్యలు ఢిల్లీకి తెలిశాయి. అందుకే విమానం ఎక్కి ఢిల్లీ నుంచి జిల్లాకు వచ్చారు’’ అని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీపై వైఎస్సార్సీపీ అధినేత, విపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. రైతుభరోసాయాత్ర నాలుగోరోజు శుక్రవారం జగన్ పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలంలో పర్యటించి, ఐదు కుటుంబాలను ఓదార్చారు. రొద్దం మండల కేంద్రంలో రైతులు, డ్వాక్రా మహిళలతో చర్చాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. తెలుగుదేశం ప్రభుత్వం రుణమాఫీ చేయకుండా మోసం చేయడంతో రాష్ట్రంలో రైతులు పిట్టల్లా రాలిపోతున్నారు. అనంతపురం జిల్లాలో 80 మందికిపైగా అన్నదాతలు, 20మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి కుటుంబాలకు ధైర్యం చెప్పాలని గత నాలుగు నెలల్లో 23 రోజులపాటు భార్య, పిల్లలను వదిలి రైతు భరోసాయాత్ర చేస్తున్నా. రెండు విడతల్లో 25 కుటుంబాలను పరామర్శించా. మూడో విడత సాగుతోంది. రైతులు, చేనేతలు ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటున్నారో ప్రభుత్వాలకు చూపించేలా తిరుగుతున్నా. ఈ యాత్రతోనే‘అనంత’ ఆత్మహత్యలు దేశానికి తెలిశాయి. అనంతపురం అనే ఓ జిల్లా ఉందని రాహుల్గాంధీకి జ్ఞానోదయమైంది. అవసరం ఉందంటే దండ.. లేదంటే బండ రాహుల్గాంధీ చాలా పెద్దవారు. అవసరం కోసం ఏదైనా మాట్లాడతారు. అవసరం లేకపోతే తీసి పక్కనపడేస్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చివరి రక్తపుబొట్టు వరకూ కాంగ్రెస్పార్టీ కోసం శ్రమించారు. వారి కోసం పోరాడారు. పోరాడుతూనే చనిపోయా రు. వైఎస్ బతికి ఉన్నపుడు గొప్పవారు... జగ న్ కూడా కాంగ్రెస్లో ఉన్నంతవరకూ గొప్పవాడే! ఇచ్చిన మాటకోసం ‘ఓదార్పు’ చేసేందుకు పార్టీని వదిలితే జగన్ చెడ్డవాడైపోయాడు... వైఎస్ కూడా చెడ్డవారైపోయారు. చివరకు టీడీపీతో కలిసి మాపై ఒక్కటై కేసులు పెట్టారు. వైఎస్ పేరు చెప్పకపోతే ఇక్కడ ఏమీ చేయలేరు. అందుకే రాహుల్గాంధీ మళ్లీ వైఎస్కు దండ వేశారు. అవసరం వస్తే దండ వేస్తారు... లేదంటే బండ వేస్తారు. రాష్ట్రాన్ని విడగొట్టొద్దని అంటే వినకుండా విడగొట్టారు. ఇప్పుడొచ్చి ప్రత్యేకహోదా రాలేదా? పోలవరం కాలేదా? అని మాట్లాడుతున్నారు. వీళ్లలా భయానక రాజకీయాలు నేర్చుకోలేదని చెప్పేందుకు సంతోషిస్తున్నా. రైతులు పిట్టల్లా రాలుతున్నా చంద్రబాబుకు పట్టలేదు ‘అనంత’లో రైతులు, చేనేతలు దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారు. చంద్రబాబు ఎన్నికలముందు రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ఇప్పడు చేయలేదు. దీంతో అప్పులబాధ తాళలేక వీరంతా ఆత్మహత్యలకు తెగిస్తున్నారు. లక్షలమంది ఉపాధికోసం బెంగళూరుకు వలస వెళుతున్నారు. ‘అనంత’లో ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నా చంద్రబాబుకు పట్టలేదు. హామీలు అమలు చేసేలా పోరాడుదాం, చంద్రబాబు మెడలు వంచుదాం. విత్తనాలు కూడా సరఫరా చేయని అన్యాయమైన పరిస్థితులున్నాయి. జిల్లాకు 5.50 లక్షల క్వింటాళ్ల వేరుసెనగ విత్తనం అవసరమైతే.. కేవలం 1.50లక్షల క్వింటాళ్లు మాత్రమే ఇచ్చారు. టీడీపీ నేతలు వాటిని అమ్ముకుంటూ పట్టుబడిన దారుణస్థితి. దీంతోపాటు ఇసుకను కూడా దోచుకుతింటున్నారు. ఇష్టాగోష్టిలో రైతులు, డ్వాక్రా మహిళల అభిప్రాయాలు చంద్రబాబు తొలగిపోతే శనిపోతుంది సార్! మాది షిరిడిసాయి గ్రూపు. మాకు రూ.1.50 లక్షల అప్పుంది. రుణ మాఫీ అవుతాదని అప్పుచెల్లించలేదు. ఇప్పుడు మీ అబ్బసొమ్మా... బాకీ కట్టండని బ్యాంకోళ్లు అంటాండారు. భిక్షగాళ్లకు వేసినట్లు మూడువేలు ఇస్తున్నారు. తిరుపతికి వెళ్లకుండానే నామాలు పెడుతున్నారు. చంద్రబాబు తొలగిపోతే ఏడేళ్ల శనిపోతుంది. - నిర్మల, చోలేమరి ఇలాంటి ప్రభుత్వాన్ని ఇప్పుడే చూశా.. సార్... నాకు రూ.1.40 లక్షల బ్యాంకు అప్పుంది. వడ్డీ రూ.30వేలైంది. రూ.14వేలే మాఫీ అయింది. ఇన్స్యూరెన్స్, ఇన్పుట్సబ్సిడీ లేదు. గత 45 ఏళ్లలో విత్తనాలు ఇవ్వని ప్రభుత్వాన్ని ఇప్పుడే సూచ్చాండా! - శ్రీరామిరెడ్డి, రొద్దం రైతులు ఆత్మహత్యలు చేసుకునేలా చేశాడు.. డబ్బులు మాఫీ అవుతాయని ఆశపడి అందరం ఓట్లేసినాం. ఇప్పుడు మూడునామాలు పెట్టిచ్చుకున్నాం. నాకు పింఛన్కూడా ఇవ్వలేదు. టీడీపీ వాళ్లకే ఇస్తాండారు. నాకు ఇచ్చినా, ఇవ్వపోయినా లెక్కలేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకునేలా సెంద్రబాబు సేసినాడు. - రత్నమ్మ, రాగిమేకలపల్లి, -
బాబు మాటలు నమ్మి నట్టేట మునిగాం
రైతు భరోసా యాత్ర నుంచి సాక్షి ప్రత్యేకప్రతినిధి: ‘‘బాబు రావాలి.. రుణమాఫీ జరగాలి.. అంటూ మా ఊళ్లో ఎన్నికల ముందు ఇంటి గోడలపై, స్కూలు బిల్డింగ్కు, బ్యాంకు వద్ద పెద్దపెద్ద అక్షరాలతో రాశారు. చంద్రబాబు ఏదో చేస్తారని, ఆయన ఇచ్చిన హామీలు అమలవుతాయని నమ్మి ఓట్లేస్తే.. రుణమాఫీ కాకపోగా 14% అపరాధ వడ్డీని బ్యాంకు అధికారులు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. బాబు మాటలు నమ్మి నట్టేట మునిగాం’’ అని రొద్దం మండలం వై.టి.రెడ్డిపల్లి గ్రామస్తులు వైఎస్ జగన్మోహన్రెడ్డికి తెలిపారు. మూడో విడత రైతు భరోసాయాత్రలో భాగంగా శుక్రవారం పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలంలోని వై.టి.రెడ్డిపల్లిలో మహిళా రైతు లక్ష్మీదేవమ్మ, పెద్దపాతన్న, గోనిమేకలపల్లిలో శ్రీనివాసులు, గోపీనాథ్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. బ్యాంకులో ఉన్న బంగారాన్ని కూతురు పెళ్లికి విడిపించలేక తన భార్య ఆత్మహత్య చేసుకుందని లక్ష్మీదేవమ్మ భర్త హనుమంతప్ప వాపోయారు. ప్రభుత్వం రూ. 1.50 లక్షల ఎక్స్గ్రేషియా మాత్రమే ఇచ్చిందని చెప్పారు. ‘‘వాళ్లు ఇష్టమొచ్చినట్లు చేస్తున్నారు. వాళ్లు ఇవ్వాలనుకుంటే ఒక రకమైన సహాయం.. ఇవ్వకూడదనుకుంటే మరోరకం సహాయం.. లేదంటే అది కూడా ఇవ్వకుండా ఉంటారు. ఇలాగైతే చనిపోయిన రైతు కుటుంబాలకు మేలు జరిగేదేలా?’’ అని సర్కారు తీరుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడికి సమీపంలోనే ఉన్న రైతు పెద్ద పాతన్న కుటుంబాన్ని పరామర్శించారు. పాతన్న కూతురు అంజలి(12) పుట్టుకతోనే మూగ, చెవిటి వైకల్యంతో బాధపడుతోందని తెలుసుకుని... ఆమెకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేయించే బాధ్యతను తీసుకున్నారు. తన భర్త మరణానికి ఎక్స్గ్రేషియా వర్తించదని అధికారులు నివేదికలు రూపొందించారని శ్రీనివాసులు భార్య సరోజమ్మ వాపోయారు. ఆమె కు న్యాయం చేస్తామని జగన్ భరోసా ఇచ్చారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement