-
జన కెరటం!
-
బ్రహ్మరథం
ముగిసిన మొదటి విడత రైతు భరోసా యాత్ర - హారతులు, బాణసంచాతో స్వాగతం - ఊరూరా బారులు తీరి ఆప్యాయత పంచిన ప్రజలు - వృద్ధులు, వికలాంగుల కష్టాలు పంచుకున్న జగన్ - పొలాల్లోకి వెళ్లి రైతులతో మాట కలిపిన జననేత - గాజులపల్లె బహిరంగ సభకు పోటెత్తిన జనం ఆత్మకూరు: పంటలు పండక.. చేసిన అప్పులు తీర్చే దారి లేక ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మొదటి విడత రైతు భరోసా యాత్ర మంగళవారంతో ముగిసింది. శ్రీశైలం నియోజకవర్గంలో ఆరు రోజుల పాటు పర్యటించిన ఆయన ప్రజలతో మమేకమయ్యారు. గ్రామ గ్రామాన అనూహ్య స్పందన లభించింది. కుటుంబ సభ్యుల్లో ఒకరిగా ఆదరించిన తీరు.. వృద్ధులు, వికలాంగులు, రైతులు, కూలీలకు జీవితంపై భరోసా కల్పించగా.. అక్కాచెల్లెమ్మలను ఆశీర్వదిస్తూ.. యువతకు దిశేనిర్దేశం చేశారు. చివరి రోజు పల్లెల్లో పెద్ద ఎత్తున బాణసంచా పేలుస్తూ స్వాగతం పలకడం ఆయనకున్న జనాదరణకు అద్దం పట్టింది. మొత్తం పర్యటనలో మండుటెండలో.. రాత్రి పొద్దుపోయాక కూడా ప్రజలు బారులు తీరి స్వాగతించడం విశేషం. పంటల దుస్థితికి చలించిన ప్రతిపక్ష నేత శ్రీశైలం నియోజకవర్గంలో పర్యటించిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆయా మండలాల్లో పంటల దుస్థితిని చూసి చలించిపోయారు. శ్రీనగరం సమీపంలో పసుపు పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చెమ్మగిల్లిన కళ్లతో రైతులు మాట్లాడుతూ పంట సరిగా రాలేదని, తెగుళ్లతో పాటు గిట్టుబాటు ధర లేకపోవడంతో కనీసం కౌలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉందన్నారు. ఆ తర్వాత వరి, మిరప, పెసర పంటలను పరిశీలించి రైతుల స్థితిగతులపై ఆరా తీశారు. రైతుల బాధలు తెలుసుకున్న జగన్ వారిని ఓదారుస్తూ మన ప్రభుత్వంలో రైతుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని భరోసానిచ్చారు. 30 కిలోమీటర్లు.. 6 గంటల రోడ్షో మహానంది మండలంలో ఆరో రోజు చేపట్టిన భరోసాయాత్ర బుక్కాపురం నుంచి ప్రారంభమైంది. అడుగడుగునా ప్రజలు బారులు తీరి స్వాగతం పలుకుతుండటంతో మూడు గ్రామాల రోడ్షో 6 గంటల పాటు సాగింది. నడిచేందుకు వీలు కాని వృద్ధులు కూడా అతి కష్టం మీద కర్రల సహాయంతో ఎదురొచ్చి పలుకరించారు. వికలాంగులు కూడా ఆయనను కలిసి తమ కష్టాలను చెప్పుకున్నారు. గాజులపల్లె గ్రామంలోని ప్రభుత్వ హైస్కూల్ వద్ద జగన్ రోడ్షోను చూసి విద్యార్థులు పెద్ద ఎత్తున కేరింతలు కొట్టారు. విద్యార్థులు భారతి, నాగమణి, ఆయిషాలను బాగా చదువుకోవాలని జగన్ కోరడంతో మంచి మార్కులతో పాసవుతామంటూ బాలికలు చెప్పారు. ఈ సందర్భంగా జననేతతో కరచాలనానికి విద్యార్థులు పోటీపడ్డారు. గాజులపల్లెలో ఘన స్వాగతం.. మొదటి విడత భరోసా యాత్రలో భాగంగా చివరి రోజు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గాజులపల్లెలో యాత్ర ముగించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆయనకు ఘనస్వాగతం పలికారు. బస్సాపురం, గుండంపాడు, మాదాపురం, ఆంజనేయస్వామి కొట్టాల, పచ్చర్ల గ్రామాల్లోనూ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గత మాలలు వేస్తూ స్వాగతించారు. దారి పొడవునా యువత పెద్ద ఎత్తున బారులు తీరి ఈలలు, కేకలతో మద్దతు తెలిపారు. మల్లన్న, మహానందీశ్వర స్వాముల దర్శనం రైతు భరోసా యాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండవ రోజు శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఐదవ రోజు ఓంకారేశ్వరుడి సేవలో తరించగా.. చివరి రోజు మహానందిలో కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. మొత్తంగా నల్లమల అటవీ పరిధిలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఆయన ప్రత్యేక పూజలు చేపట్టారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, పార్టీ న్చార్జి బుడ్డా శేషారెడ్డి, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, ఎమ్మెల్యే ఐజయ్య, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, నియోజకవర్గ ఇన్చార్జీలు రాజగోపాల్ రెడ్డి, చెరుకులపాడు నారాయణ రెడ్డి, మురళీకృష్ణ, పార్టీ నేతలు కుందూరు శివారెడ్డి, ముంతల విజయభాస్కరరెడ్డి, మద్దయ్య, రాజా విష్ణవర్దన్రెడ్డి, కేవీ ప్రసాదరెడ్డి, రఘురెడ్డి, విశ్వనాథరెడ్డి, ద్వారం మాధవరెడ్డి, వెంకటేశ్వర యాదవ్, సత్యం యాదవ్, శరభారెడ్డి, లాయర్ వివేకానందరెడ్డి, మధుసూదన్, దేవ, మురళీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాధలు వింటూ..భరోసానిస్తూ
-
చీకటి జీవితాల్లో చిరునవ్వులు
ప్రజలకు చేరువగా రైతు భరోసా యాత్ర - బారులు తీరిన జనంతో నెమ్మదిస్తున్న రోడ్షో - అడుగడుగునా ఆప్యాయత పంచుతున్న జగన్ - వృద్ధులు, వికలాంగులకు కొండంత ధైర్యం - రెండు మండలాల్లో ఐదవ రోజు యాత్ర - పట్టలేని ఆనందంలో రైతులు, కూలీలు రాజన్న బిడ్డ రాక అందరి కళ్లలో ఆనందం నింపింది. ఊరు ఊరునా.. అడుగడుగునా.. కుటుంబ సభ్యున్ని చూసిన భానవ కనిపించింది. అక్కా చెల్లెమ్మలను ఆశీర్వదిస్తూ.. అన్నా తమ్ముళ్ల కష్టసుఖాలను తెలుసుకుంటూ.. ముసలవ్వల ఆవేదనను ఆలకిస్తూ.. వికలాంగులకు ధైర్యం చెబుతూ.. చీకటి నిండిన జీవితాల్లో చిరునవ్వుతో వెలుగులు నింపే ప్రయత్నం చేశారు. ఆత్మకూరు: పొలం గట్లపై పరుగు పరుగున వచ్చే రైతు కూలీలు.. దారి పొడవునా బారులు తీరిన ప్రజలు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బండిఆత్మకూరు, మహానంది మండలాల్లో సాగిన ఐదవ రోజు యాత్ర సోమవారం ఉదయం 9 గంటలకు లింగాపురం నుంచి మొదలయింది. అక్కడి నుంచి ప్రారంభమైన రోడ్షో బీసీ పాలెం, సింగవరం, సోమయాజులపల్లె, ఓంకారం, ఈర్నపాడు, కడమకాల్వ, వెంగళరెడ్డినగర్, బి.కోడూరు, అబ్బీపురం మీదుగా తిమ్మాపురం వరకు సాగింది. రెండు మండలాల్లో ప్రజలు పెద్ద ఎత్తున సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న ఇక్కట్లను జనం ఏకరువు పెట్టారు. కనిపించిన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. రైతులు, రైతు కూలీల కష్టాలు తెలుసుకున్నారు. పింఛన్లు అందలేదని.. పక్కా గృహాలు ఇవ్వడం లేదని.. ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో అవస్థ. వీరందరితో జగన్ మాట్లాడుతూ మన ప్రభుత్వం రావాలని భగవంతున్ని గట్టిగా కోరుకోవాలన్నారు. అందరి కళ్లల్లో ఆప్యాయత రాజన్న బిడ్డ రాకతో నల్లమల అటవీ ప్రాంతంలోని మారుమూల గ్రామాలు పరవశించాయి. పల్లె ప్రజల కళ్లల్లో ఆప్యాయత, అనురాగాలు వైఎస్ జగన్కు రెట్టించిన ఉత్సాహాన్నిచ్చాయి. నడవలేకపోయినా రోడ్డు మీదకొచ్చి నిల్చొన్న వృద్ధులను చూసి జగన్ వారి వద్దకు వెళ్లి పలకరించారు. యువత కేరింతలు కొడుతూ ఆయనతో కరచాలనం చేసేందుకు.. సెల్ఫీలు దిగేందుకు పోటీపడటం విశేషం. రబీకి సాగునీరివ్వాలి రైతు భరోసా యాత్రలో భాగంగా రోడ్షో నిర్వహిస్తున్న జగన్కు రైతులు, కూలీలు తమ కష్టాలను వివరించారు. రబీకి సాగు నీరు అందించేలా చూడాలని వేడుకున్నారు. పంటకు నీరందకపోతే నష్టాలు కూరుకుపోతామని, ఇప్పటికే గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుగంగ నుంచి రెండవ పంటకు సాగునీరు ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం మీ ఒక్కరితోనే సాధ్యమంటూ సోమయాజులపల్లె, బి.కోడూరు, తిమ్మాపురం రైతులు అభ్యర్థించారు. అందుకు జగన్ స్పందిస్తూ వచ్చేది రైతు రాజ్యమని, ప్రాజెక్టుల కింద మూడు పంటలు పండించుకోవచ్చని ధైర్యం చెప్పి ముందుకు కదిలారు. 30 కిలోమీటర్లు పైగా యాత్ర.. 12 గంటల రోడ్షో శ్రీశైలం నియోజకవర్గంలో కొనసాగుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా యాత్ర 5వ రోజు 30 కిలోమీటర్లు పైగా 12 గంటల పాటు సాగింది. దారిపొడవునా ప్రజలు బారులు తీరి స్వాగతం పలకడంతో రోడ్షో నెమ్మదించింది. సింగవరం, లింగాపురం గ్రామాల మధ్య గొర్రెల కాపరులు ఎదురొచ్చి మాట్లాడించారు. వారితో జగన్ మాట్లాడుతూ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గొర్రెలకు ఇన్సూరెన్స్ పథకం ఉండేదని, ప్రస్తుతం ఆ పథకం అమలవుతుందా అని ఆరా తీశారు. అందుకు వారు ఎలాంటి పథకం లేదని చెప్పారు. గొర్రెలు చనిపోతే ఎలాంటి నష్టపరిహారం అందడం లేదని, యేటా లక్షలాది రూపాయలు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు ఆయన స్పందిస్తూ మన ప్రభుత్వం వచ్చా అన్నివిధాల అండగా నిలుస్తామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, శ్రీశైలం నియోజకవర్గం ఇన్చార్జి బుడ్డా శేషారెడ్డి, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, పార్టీ రాష్ట్ర ఫ్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య, పార్టీ నియోజకవర్గాల ఇన్చార్జీలు కాటసాని రామిరెడ్డి, చెరుకులపాడు నారాయణరెడ్డి, మురళీకృష్ణ, పార్టీ నేతలు కుందూరు శివారెడ్డి, తోట వెంకటకృష్ణారెడ్డి, యుగంధర్రెడ్డి, బొంతల విజయభాస్కరరెడ్డి, రాజా విష్ణువర్దన్రెడ్డి, రాంపుల్లయ్య యాదవ్, మల్లెల రఘురెడ్డి, ప్రసాద్రెడ్డి, విశ్వనాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మీయత పంచి.. ఆత్మస్థైర్యాన్ని నింపి..
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు
డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం
చంద్రబాబూ 14 ఏళ్లు ఏం చేశావు?
నీట్కు ఏర్పాట్లు పూర్తి
‘పోస్టల్ బ్యాలెట్’ను వినియోగించుకోండి
పార్లమెంట్లో గళం వినిపిస్తా..
స్వర్ణకవచాలంకరణలో రామయ్య
హామీలపై ఆశలు..
నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement