-
హుందాసాగర్లో బాలుడి గల్లంతు
మైలార్దేవ్పల్లిలోని హుందాసాగర్లో గురువారం ఓ బాలుడు గల్లంతయ్యాడు. కాటేదాన్ పరిధిలోని శాంతినగర్కు చెందిన రాజేందర్(12) అనే బాలుడు తన ఇద్దరి స్నేహితులతో కలిసి హుందాసాగర్కు ఈతకొట్టడానికి వెళ్లారు. చెరువులోకి దిగిన రాజేందర్ ప్రమాదవశాత్తూ మునిగిపోవడంతో ఇద్దరు స్నేహితులు భయపడి స్థానికుల దగ్గరికి వెళ్లి ప్రమాదవిషయం గురించి తెలిపారు. బాలుడి కోసం గాలింపు జరుగుతోంది. -
కార్మికులపై చిన్నచూపు తగదు
కోల్బెల్ట్ : సంస్థ లక్ష్యాలను అధిగమించుటకు కృషిచేసిన కార్మికులపై యాజమాన్యం చిన్నచూపు చూడటం సరికాదని సింగరేణి కాలరీస్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఐఎన్టియూసి)కేంద్రకమిటీ ఉపాధ్యక్షుడు పసునూటి రాజేందర్ అన్నారు. పట్టణంలోని బ్రాంచి కార్యాలయం లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడుతూ అధికలాభాలు వచ్చేందుకు శ్రమించిన కార్మికులకు 20 గ్రాముల బంగారు నాణాలు అందించాలని రాజేందర్ డిమాండ్ చేశారు. సమావేశంలో బ్రాంచి ఉపాధ్యక్షులు సమ్మిరెడ్డి, నాయకులు నర్సింగరావు, ధరియాసింగ్, అశోక్, రాజ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం భూపాలపల్లి బ్రాంచి కమిటీ నాయకులు బాతాల రాజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అధికలాభాలను ఆర్జించుటకు కృషిచేసిన కార్మికులకు యాజమాన్యం 10 గ్రాముల గోల్డ్ బిల్లలు అందజేయాలని, లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలను చేపడతామన్నారు. సమావేశంలో నాయకులు నామాల శ్రీనివాస్, రాళ్లబండి బాపు, జయశంకర్, కే.లింగయ్య, వైకుంఠం, ఠాగూర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో 60.3 మిలియన్ టన్నులను సాధించినందుకు కార్మికులకు 15 గ్రాముల బంగారు బిల్లలను అందజేయాలని బిఎంఎస్ భూపాలపల్లి బ్రాంచి ఉపాధ్యక్షుడు కొండపాక సాంబయ్యగౌడ్ డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు కొమురయ్య, రమేష్, మదునయ్య, బ్రహ్మచారి, స్వామి, సదానందం, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. -
కరీంనగర్ నుంచే కేజీ టు పీజీ
హుస్నాబాద్ రూరల్: ఎన్నికల హామీల్లో భాగంగా కేజీ టు పీజీ విద్యా పథకాన్ని కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభిస్తానని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. హుస్నాబాద్లోని వెంకటేశ్వర గార్డెన్లో పార్లమెంటరీ కార్యదర్శి వొడితెల సతీష్కుమార్ ఆత్మీయ సన్మాన సభ శుక్రవారం రాత్రి జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఈటెల మాట్లాడుతూ.. పద్నాలుగేళ్ల తెలంగాణ ఉద్యమంలో జైళ్లకు వెళ్లి బాధలు భరించిన తెలంగాణ బిడ్డల అభివృద్ధి కోసం, బంగారు రాష్ట్రం నిర్మాణం కోసం కృషి చేస్తామన్నారు. తమకు మంత్రి పదవులు వస్తే తెలంగాణ ప్రజలందరికీ మంత్రి పదవులు వచ్చాయనే సంతోషంతో ఉన్నామన్నారు. ఇది బీద తెలంగాణ కాదని, బీదగా మార్చబడ్డ తెలంగాణ అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రూ.17వేల కోట్ల బడ్జెట్ను రూపొందించామని నాటి పాలకులు ప్రగల్భాలు పలికారని, తెలంగాణ వస్తే రూ.లక్ష కోట్ల బడ్జెట్ను పెట్టిన ఘనత టీఆర్ఎస్ సర్కారుకే దక్కిందన్నారు. ఉమ్మడి సర్కారు హయాంలో రూ.1,030కోట్ల నిధులను పింఛన్ల కోసం వెచ్చిసే..్త తెలంగాణ సర్కారు ఇప్పటికే రూ.4వేల కోట్లు పింఛన్ డబ్బులను పంపిణీ చేయడమే కాకుండా అదనంగా మరో రూ.370కోట్లను విడుదల చేసిందన్నారు. ఏడున్నర ఎకరాల భూమి, నాలుగు గదుల ఇల్లు, ట్రాక్టరు, కారు ఉన్నప్పటికీ వారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆహార భద్రత కార్డును అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు సన్న బియ్యం సరఫరా చేసేందుకు ప్రస్తుతం రెండు లక్షల టన్నుల సన్నబియ్యం నిల్వ ఉంచామన్నారు. సచివాలయాన్ని ఎన్నడూ చూడని తెలంగాణ బిడ్డలు ఈ రోజు ధైర్యంగా వచ్చి చూస్తున్నారన్నారు. సచివాలయానికి వచ్చే వారి వద్దనుంచి చెమట వాసన వస్తున్నదని ఐఏఎస్ అధికారులు వ్యాఖ్యానిస్తే చెమట వాసన వచ్చే ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలేనని గర్వంగా సమాధానమిచ్చామని చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంటు కోసం రూ.500 కోట్లు తెలంగాణ విద్యార్థుల కోసం రూ.5వేల కోట్ల ని ధులను త్వరలోనే విడుదల చేయనున్నట్లు మంత్రి ఈటెల తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంటు గురించి కొందరు విద్యార్థులు సమావేశంలో మంత్రిని అడుగగా స్పందించిన ఆయన రేపే నిధుల విడుదల ఫైలుపై సంతకం చేయనున్నట్లు ప్రకటించడంతో విద్యార్థులు హ ర్షధ్వానాలు చేశారు. ఈ సమావేశంలో పార్లమెంటరీ కార్యదర్శి వొడితెల సతీష్కుమార్, మాజీ ఎమ్మె ల్సీ నారదాసు లక్ష్మణ్రావు, జడ్పీ వైస్చైర్మన్ రా యిరెడ్డి రాజిరెడ్డి, న గర పంచాయతీ చైర్మన్ సు ద్దాల చంద్రయ్య, మాజీ జెడ్పీటీసీ కర్ర శ్రీహరి, ఎంపీపీ భూక్య మంగ తదితరులు పాల్గొన్నారు. కమలాపూర్స్కూల్లో అదనంగా 5వ తరగతి విభాగం సాక్షి,హైదరాబాద్: కరీంనగర్ జిల్లా కమలాపూర్లోని మహత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పాఠశాలలో 5వ తరగతికి సంబంధించి అదనంగా 40 సీట్లతో మరో సెక్షన్ను ఏర్పాటుచేసేందుకు రూ.82 లక్షలకు పరిపాలనాపరమైన మంజూరు ఇచ్చారు. ఈమేరకు శనివారం రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి టి.రాధ ఆదేశాలు జారీచేశారు. -
ఇద్దరు రైతుల ఆత్మహత్య
వర్షాభావ పరిస్థితులు.. దిగుబడినివ్వని పంటలు.. తీర్చలేని అప్పులు.. వెరసి రైతు సాగులో ‘చితి’కి పోతున్నాడు. దిగుబడి లేక.. పంటకు పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో రాదోనని మనోవేదనకు గురై లక్సెట్టిపేటలోని గోపవాడకు చెందిన మంచికట్ల సంతోష్కుమార్(22), సాగుకు చేసిన అప్పులు తీర్చలేక జన్నారం మండలం లోని మురిమడుగు గ్రామానికి చెందిన జాడి రాజలింగు(52) ఆత్మహత్య చేసుకున్నారు. లక్సెట్టిపేట : వర్షాభావ పరిస్థితులతో పంట దిగుబడి రాలేదు. కనీసం పెట్టుబడి డబ్బులు కూడా వస్తాయో లేదోననే బెంగ వారిని మనోవేదనకు గురిచేసింది. మనస్తాపం చెందిన ఇద్ద రు రైతులు వేర్వేరుగా ఆత్మహత్య చేసుకున్నా రు. మండల కేంద్రమైన లక్సెట్టిపేటలోని గోపవాడకు చెందిన మంచికట్ల సంతోష్కుమార్(22) ఎకరం భూమిలో పత్తి సాగు చేశాడు. ది గుబడి సరిగా రాలేదు. పెట్టుబడి డబ్బులు కూ డా వస్తాయో రావోనని మనస్తాపం చెందాడు. బుధవారం రాత్రి ఇంటి పెరట్లో పురుగుల మందు తాగాడు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు చూసేసరికి చనిపోయాడు. మృతుడి తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై హామీద్ తెలిపారు. మురిమడుగులో.. జన్నారం : మండలంలోని మురిమడుగు గ్రామానికి చెందిన జాడి రాజలింగు(52) ఇదే గ్రామానికి చెందిన రైతు రామారావు భూమి 5.20ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. పంట కోసం రూ.2.80లక్షలు అప్పు లు చేశాడు. ఇద్దరు కుమారులను ఉపాధి కో సం ముంబయికి పంపించాడు. నెలన్నర రోజు ల క్రితం పెద్ద కుమారుడు రాజేందర్ డెంగీ జ్వరం బారినపడ్డాడు. అతడిని ముంబయి నుంచి తీసుకొచ్చి హైదరాబాద్లో చికిత్స చేయించాడు. రూ.80వేలు ఖర్చయింది. రెం డో కుమారుడు రాజేశ్ కూడా డెంగీ జ్వరం బారిన పడగా హైదరాబాద్లోనే వైద్యం చేయించాడు. రూ.లక్ష వరకు ఖర్చయింది. పంట సాగు కోసం, పిల్లల వైద్యం కోసం చేసి న అప్పులు ఎలా తీర్చేదని, వర్షాలు ఆలస్యం గా పడడంతో పంట ఆశించిన దిగుబడి రాదని మదనపడుతున్నాడు. అప్పుల భారంతో బుధవారం రాత్రి 10గంటల ప్రాంతంలో రాజలింగు పురుగుల మందు తాగాడు. జన్నారంలో ప్రథమ చికిత్స అనంతరం లక్సెట్టిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం వేకువజామున చనిపోయాడు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
‘ఈటెల'పైనే ఆశలు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బుధవారం తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. జిల్లాకు చెందిన రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఈ తొలి బడ్జెట్ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఆయనపై జిల్లా ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. విత్త మంత్రి మనోడే కావడంతో కరీంనగర్ జిల్లాను అభివృద్ధి చేసేందుకు ఏ మేరకు కేటాయింపులు చేస్తారనే అంశంపై చర్చించుకుంటున్నారు. గతంలో పనిచేసిన కేంద్ర, రాష్ట్ర ఆర్థిక మంత్రులు బడ్జెట్లో తమ సొంత జిల్లాలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. ఈటెల రాజేందర్ సైతం సొంత జిల్లాపై మమకారం చూపుతారా? లేదా? అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. - కరీంనగర్ సిటీ జిల్లాలో పెండింగ్లో ఉన్న మధ్యమానేరు, ఎస్సారెస్పీ వరద కాలువ, ఎల్లంపల్లి సాగునీటి ప్రాజెక్టులకు ఈ బడ్జెట్లో పెద్దపీట వేయనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయిస్తే సాగు, తాగునీటి కష్టాలు తీరుతాయి. ఏడాదిలోపు మధ్యమానేరు ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో అందుకోసం అవసరమైన రూ.425 కోట్లతో పాటు పరిహారం, పునరావాసం కోసం నిర్వాసితులకు చెల్లించాల్సిన రూ.360 కోట్లను ఈ బడ్జెట్లోనే కేటాయించాలని జిల్లావాసులు కోరుతున్నారు. వరదకాలువ పనులు పూర్తి చేయడంతో పాటు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం, పునరావాసం కల్పనకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. హుస్నాబాద్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు గండిపల్లి, గౌరవెల్లి, తోటపల్లి రిజర్వాయర్లను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ జలయజ్ఞంలో భాగంగా మంజూరు చేశారు. ఆయన మరణానంతరం ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో ఈ మూడు జలాశయాల పనులు అడుగు కూడా ముందుకు కదల్లేదు. టీఆర్ఎస్ సర్కారు ఈ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి, పనులు పూర్తి చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. మన ఊరు-మన ప్రణాళికలో భాగంగా జిల్లాలోని చెరువుల పునరుద్ధరణకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయించాలని స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి అయ్యే వ్యయంలో రాష్ట్ర వాటాను ఈ బడ్జెట్లో ఏ మేరకు కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు మంత్రులు జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఇప్పటికే పలు వరాలు ప్రకటించారు. బడ్జెట్లో హామీల అమలుకు తగిన కేటాయింపులు చేస్తామని వాగ్దానం చేసిన నేపథ్యంలో ఆర్థిక మంత్రి తన బడ్జెట్లో సొంత జిల్లాకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారనే ఆశాభావం ప్రజల్లో నెలకొంది. జిల్లాలో ఏకైక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కొనసాగుతున్న జగిత్యాల శాసనసభ్యుడు టి.జీవన్రెడ్డి సైతం జిల్లా సమగ్రాభివృద్ధికి పూర్తిస్థాయిలో నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగా జగిత్యాల నియోజకవర్గంలోని సారంగపూర్ మండలంలో బీపూర్ శివారులో రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునికీకరణ పనుల పూర్తికి అవసరమైన రూ.60 కోట్లు కేటాయించాలని, జగిత్యాల, రాయికల్ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి పథకానికి అవసరమైన నిధులు సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ హామీలకు మోక్షం లభించేనా? ఆగస్టు 8న సీఎం కేసీఆర్ జిల్లాకు వచ్చిన సందర్భంగా అనేక వరాలు ప్రకటించారు. కరీంనగర్ జిల్లాను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం ఇచ్చిన ప్రధాన హామీలివే.. కరీంనగర్ నగర పునర్నిర్మాణ పథకం పూర్తి నగరం చుట్టూ రింగురోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు ఎన్టీపీసీలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు కాకతీయ కెనాల్ కెపాసిటీని 12 వేల క్యూసెక్కుల నుంచి 14 వేల క్యూసెక్కులకు పెంచడం ఎస్సారెస్పీ నీటిని రీజనరేట్ చేసుకోవడానికి చర్యలు వరదకాలువ స్థాయి పెంచడం ఎస్సారెస్పీ పరిధిలో ఎత్తై ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు చిన్నపాటి లిఫ్ట్లు ఏర్పాటు రాయికల్ వద్ద గోదావరిపై బ్రిడ్జి, చెక్డ్యాం నిర్మాణం వేగురుపల్లి-నీరుకుల్ల నడుమ బ్రిడ్జినిర్మాణం మానేరు నదిపై కమాన్పల్లి, భూపాలపల్లిని కలుపుతూ వంతెన నిర్మాణం జగిత్యాలను జిల్లాగా ఏర్పాటు చేయడం కొత్తగా ఏడు వ్యవసాయ మార్కెట్లు ఏర్పాటు చేయడం మానకొండూరు చెరువును అభివృద్ధి చేయడం కరీంనగర్లో ఇండోర్ సబ్స్టేషన్ ఏర్పాటు రామగుండం నగరానికి తాగునీటి కోసం ఎల్లంపల్లి ప్రాజెక్ట్నుంచి ఒక టీఎంసీ నీటిని తీసుకురావడం రామగుండంలో సింగరేణి ఆధ్వర్యంలో ఆధునాతన హాస్పిటల్ ఏర్పాటు, మైనింగ్ పాలిటెక్నిక్ ఏర్పాటు జిల్లా ఆసుపత్రిని నిమ్స్ తరహాలో అభివృద్ధి చేయడం పెద్దపల్లిలో వందపడకల ఆసుపత్రి నిర్మాణం హుస్నాబాద్ ఆసుపత్రి స్థాయి 50 పడకలకు పెంపు మంథనిలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి స్థల సేకరణ కొండగట్టుపైన 300 ఎకరాల స్థలంలో తిరుపతి స్థాయిలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయడం ఎమ్మెల్యేల ప్రతిపాదనలకు నిధులు సమకూరే నా? ముఖ్యమంత్రి కేసీఆర్తో ఇటీవల అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు హైదరాబాద్లో సమావేశమై నియోజకవర్గాల అభివృద్ధికి పలు ప్రతిపాదనలు సమర్పించారు. ఆయా ప్రతిపాదనలన్నింటికీ ఈ బడ్జెట్లోనే నిధులు కేటాయించాలని కోరారు. నియోజకవర్గాల వారీగా పలువురు ఎమ్మెల్యేలు సమర్పించిన బడ్జెట్ ప్రతిపాదనలివే... రామగుండం బీ-థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని జెన్కో ద్వారా విస్తరింపచేయాలి. రామగుండంకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి తాగునీరు అందించేందుకు నిధులు గోదావరి పుష్కరాల దృష్ట్యా స్నానఘట్టాల నిర్మాణం, నిధులు కేటాయింపు రామగుండంలో మెడికల్ కళాశాల ఏర్పాటు అంతర్గాంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ నిర్మించాలి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ను పర్యాటక కేంద్రంగా ఏర్పాటు ఎయిర్పోర్టు, ఐటీ పార్క్ ఏర్పాటు హుజూరాబాద్ హుజూరాబాద్, జమ్మికుంట నగరపంచాతీయలకు రూ.120 కోట్లతో తాగునీరు రూ.60 కోట్లతో హుజూరాబాద్ మోడల్ చెరువును రిజర్వాయర్గా మార్చడం, ఫిల్టర్బెడ్, పైప్లైన్ల నిర్మాణం రూ.60 కోట్లతో జమ్మికుంట నాయిని చెరువు రిజర్వాయర్ రూ.40 కోట్లతో కేసీ క్యాంప్లో ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణం రూ.18 కోట్లతో హుజూరాబాద్ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మార్చడం రూ.30 కోట్లతో ఇల్లందకుంటలో సీపీడడబ్ల్యూఎస్-2 నిర్మాణం మానేరు వాగుపై 11 చెక్డ్యాంల నిర్మాణం కోరుట్ల రూ.4.75 కోట్లతో మల్లాపూర్ మండలం సోమన్నగుట్ట అభివృద్ధి, ఘాటురోడ్డు నిర్మాణం రూ.1.50 కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణం కోరుట్ల, మెట్పల్లిల్లో రూ.13.75 కోట్లతో తాగునీటి పనులు కోరుట్ల వెటర్నరీ కళాశాలను వెటర్నరీ యూనివర్సిటిగా మార్చాడం కరీంనగర్ కరీంనగర్ రెనోవేషన్కు అదనంగా రూ.25 కోట్లు యూజీడీ పనుల పూర్తికి నిధులు కమాన్ నుంచి హౌసింగ్బోర్డుకాలనీ మీదుగా సదాశివపల్లికి కొత్త బైపాస్రోడ్డు పెద్దపల్లి పెద్దపల్లి-కూనారం నడుమ రైల్వే బ్రిడ్జి ఏర్పాటు పెద్దపల్లి ఆసుపత్రిని వంద పడుకల ఆసుపత్రిగా మార్చడం సుల్తానాబాద్లో ఆసుపత్రి భవన నిర్మాణం, వైద్యులకు క్వార్టర్ల నిర్మాణం పది నూతన సబ్స్టేషన్ల నిర్మాణం ఎల్లంపల్లి ప్రాజె క్ట్ నుంచి డీ-83, డీ-86 కాలువకు అనుసంధానం చేయడం సుల్తానాబాద్-మానకొండూరు మండలాలను కలిపే నీరుకుల్ల వాగుపై బ్రిడ్జి నిర్మాణం చొప్పదండి కొంపల్లి రిజర్వాయర్ నుంచి కొండగట్టు పైకి వచ్చే పైప్లైన్కు అదనంగా రూ.కోటి నిధులు కొండగట్టుపై పీహెచ్సీ ఏర్పాటు గట్టు కింద ఆలయ భూముల్లో వాణిజ్య సముదాయం రుక్మాపూర్లో లెదర్పార్క్కు నిధులు కేటాయించాలి మోతె, నారాయణపూర్, పోతారం రిజర్వాయర్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలి కొండగట్టులో మాస్టర్ప్లాన్ ఏర్పాటు మంథని మంథని మండలం వీలోచవరం వద్ద గోదావరి నదిపై రూ.630 కోట్లతో డ్యాం, బ్రిడ్జి నిర్మాణం జేఎన్టీయూహెచ్ పూర్తిస్థాయి భవన సముదాయాలు, నిర్వహణ కోసం రూ.200 కోట్లు రూ.25 కోట్లతో సీసీ రోడ్లు, కల్వర్టుల నిర్మాణం పుష్కరాల సందర్భంగా రూ.7.10 కోట్లతో 18 రహదారుల నిర్మాణం, మరమ్మతులు రూ.5 కోట్లతో ఆరెవాగుపై బ్రిడ్జి నిర్మాణం వేములవాడ రుద్రంగి చెరువును రిజర్వాయర్గా మార్చడం వేములవాడలో వందపడకల ఆసుపత్రి ఏర్పాటు రూ.11 కోట్లతో వేములవాడ మూలవాగుపై రెండవ బ్రిడ్జి నిర్మాణం రూ.7 కోట్ల వ్యయంతో రెండు బైపాస్రోడ్ల విస్తరణ రూ.15 కోట్లతో రోడ్ల నిర్మాణం మానకొండూరు బెజ్జంకిలో 50 పడకల ఆసుపత్రి వేగురుపల్లి నుంచి నీరుకుల్ల వరకు వంతెన నిర్మాణం చెరువులు, రోడ్ల అభివృద్ధి ధర్మపురి ధర్మపురిలో బస్డిపో ఏర్పాటు మేడారం ఆసుపత్రి స్థాయి 30 పడుకలకు పెంపు గోదావరి పుష్కరాలకు రూ.500 కోట్ల నిధులు హుస్నాబాద్ నాలుగు సబ్స్టేషన్ల నిర్మాణం వరదనీటిని ఎల్లమ్మ చెరువులోకి పైప్లైన్ ద్వారా మళ్లించడం వరదకాలవు నిర్వాసితులకు పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజ
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement