-
బాసర ట్రిపుల్ఐటీలో ప్రవేశానికి నోటిఫికేషన్
బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ)లో 2018–19 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. కళాశాల ఇన్చార్జి వీసీ డాక్టర్ అశోక్కుమార్ బుధవారం కళాశాలలో నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ఆరేళ్ల బీటెక్ ఇంటిగ్రేటెడ్ కోర్సులో చేరేందుకు పదో తరగతి చదివిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానికులకు (తెలంగాణ రాష్ట్రం) 85 శాతం, స్థానికేతరులకు 15శాతం సీట్లు కేటాయించినట్లు తెలిపారు. భర్తీ కాని సీట్లను గ్లోబల్, ఎన్ఆర్ఐ కోటా కింద 5 శాతం మేర కేటాయిస్తామని పేర్కొన్నారు. ఈ కోటా కింద బయట ఇంటర్ పూర్తి చేసినవారికి నేరుగా బీటెక్ ఫస్టియర్లో ప్రవేశం కల్పించనున్నట్లు వివరించారు. ఈ నెల 28 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. విద్యార్హతలు, ధ్రువీకరణ పత్రాలను జూన్4లోపు పంపించాలన్నారు. ఎంపికైన విద్యార్థుల జాబితా జూన్ 11న ప్రకటించి, 18, 19 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. జూలై 2న ఓరియంటేషన్ నిర్వహించి, 3న తరగతులు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఇతర వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్లు www.rgukt.ac.in, http://admissions.rgukt. ac.inలలో సంపద్రించాలని సూచించారు. -
చదువుకునేందుకు వచ్చాం.. చచ్చేందుకు కాదు
భైంసా/ముథోల్, న్యూస్లైన్ : ‘సార్ మేమంతా ఇక్కడికి చదువుకోవడానికి వచ్చాం. చచ్చిపోవటానికి కాదు. ప్లీజ్ సార్.. మా మాట వినండి.. ఆడ పిల్లల ఇబ్బందులు తెలుసుకోండి సార్..’ అంటూ ఏడుస్తూ బాసర ట్రిపుల్ ఐటీ పిల్లలు తమ బాధలను రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి ఆఫ్ టెక్నాలజీ (ఆర్జేయూకేటీకే) వైస్చాన్స్లర్ రాజ్కుమార్కు మొరపెట్టుకున్నారు. సమస్యలపై సమాధానం చెప్పాలంటూ విద్యార్థులు పట్టుబట్టి వీసీని ఘెరావ్ చేశారు. ఒకింత అసహనానికిలోనై పోలీసులతో కార్యాలయానికి చేరుకున్న వీసీ రాజ్కుమార్ వెనకాలే పిల్లలంతా వెళ్లారు. కార్యాలయం ముందే కూర్చుని వీసీ కోసం ఎదురుచూశారు. తదుపరి వచ్చిన వీసీ రాజ్కుమార్కు ఇబ్బందులను, వేధింపులను విద్యార్థులు తేటతెల్లం చేశారు. వెలువెత్తిన సమస్యలు.. బాసర ట్రిపుల్ఐటీలో సమస్యల పరిష్కారం కోరుతూ ఎనిమది రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఆదివారం ట్రిపుల్ఐటీ ప్రాంగణంలో వేల మంది విద్యార్థులతో వీసీ రాజ్కుమార్, ప్రొఫెసర్ల బృందం చర్చలకు దిగింది. వీసీ రాజ్కుమార్ సమస్యలపై ట్రిపుల్ఐటీ విద్యార్థుల లక్ష్యంపై ప్రసంగంలో పలు సూచనలు చేశా రు. వేల మంది విద్యార్థులతో ఉన్న కళాశాలలో ఇబ్బం దులు ఉంటాయని, వాటిని త్వరలోనే పరిష్కారం చేస్తామని తెలిపారు. శనివారం విద్యార్థులు మాట్లాడిన తీరు తనను బాధించిందన్నారు. దీంతో అక్కడే ఉన్న ఓ వి ద్యార్థి వీసీ కాళ్లు పట్టుకుని తండ్రిలా క్షమించాలని వేడుకున్నాడు. అనంతరం విద్యార్థులు సమస్యలపై ప్రశ్నిం చారు. తీసుకునే చర్యలను ఇప్పుడే వివరించాలని విద్యార్థులు పట్టుబట్టడంతో వీసీ అసహనంతో వెళ్లిపోయారు. విద్యార్థినులంతా తమ సమస్యలు వినాలంటూ మానవహారంగా ఏర్పడి వీసీని చుట్టుముట్టారు. మళ్లీ వచ్చి చర్చలు ప్రారంభించినా ఏ సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు. చర్చలు సఫలం కాకుండానే ఎలా వెళ్లిపోతారని విద్యార్థులు వేడుకున్నా వీసీ పోలీసులతో కలిసి కార్యాలయానికి చేరుకున్నారు. వెనకాలే వెళ్లిన విద్యార్థులు చాలాసేపు అక్కడే నిరీక్షించారు. తదుపరి ఆయన వచ్చి విద్యార్థినులతో మాట్లాడారు. బాసర ట్రిపుల్ఐటీలో వీసీగా మీరు కష్టపడితే.. ఇక్కడ పనిచేసే వారు మా భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని, తాము కోరే విధంగా ఆ ఐదుగురిని శాశ్వతంగా తప్పిస్తే యూనివర్సిటీకి మంచి పేరు వస్తుందన్నారు. తల్లిదండ్రులు తమపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే తమ బతుకులు ఇలా నాశనమవుతున్నాయంటూ విద్యార్థులంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎనిమిది రోజులుగా నిద్రహారాలు మాని నిరసనలు చేపట్టామని ఆవేదన చెందారు. కమిటీ వేశాం.. సమస్యల పరిష్కారానికి ప్రొఫెసర్ల కమిటీ వేశామని, త్వరలోనే విద్యార్థులు సూచించిన విషయాలపై తమ నిర్ణయం వెల్లడిస్తామని వీసీ రాజ్కుమార్ చెప్పుకొచ్చారు. ఇక్కడే నిర్ణయం వెల్లడించాలని కోరడం సరికాదన్నారు. మెస్ నిర్వహణ విషయంలోనూ సభ్యులతో మాట్లాడుతానని, విద్యార్థులు తరగతులకు వెళ్లాలని వీసీ రాజ్కుమార్ సూచించారు. దీంతో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు వీసీతో ఆవరణలో వేలాది మంది విద్యార్థులు చేపట్టిన చర్చలు విఫలమయ్యాయి. సాయంత్రం 6 గంటల నుంచి 10 మంది విద్యార్థుల బృందాలను ఏర్పాటు చేసి మాట్లాడేందుకు వీసీ అవకాశం ఇచ్చారు. ఇలా బృందాలను కార్యాలయంలోకి పిలిపించుకుని జరిగిన విషయాలను తెలుసుకున్నారు. మీ వెంటే నేను... ఇదిలా ఉంటే.. ట్రిపుల్ఐటీకి చేరుకున్న ఎమ్మెల్యే వేణుగోపాలాచారి వీసీతో చర్చించాక విద్యార్థులతో మాట్లాడారు. ‘మీతోపాటే నేను’ ఉంటానని, ‘మీ సమస్యలు వీసీ దృష్టికి తీసుకెళ్లానని’ చెప్పారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రాంరెడ్డిని పిలిపించి మార్చి 20వరకు నీటి సమస్య తీరే లా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ఆ అధికారితో చెప్పించారు. తాత్కాలికంగా భైంసా మున్సిపాలిటీ నుం చి ట్రిపుల్ఐటీకి ట్యాంకర్లను పంపిస్తామని తెలిపారు. అత్యవసర వైద్య సేవల కోసం భైంసా ఏరియా ఆస్పత్రి లో చర్చించినట్లు వెల్లడించారు. కాగా.. ట్రిపుల్ఐటీలో విద్యార్థుల చర్చలు రాత్రి కూడా వీసీతో కొనసాగాయి. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోవడంతో విద్యార్థులు కూడా తమ నిరసన కొనసాగిస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజలు జగన్వైపే
మండే ఎండలు X మధుమేహం!
అమ్మ ఆదర్శ కమిటీలు నామమాత్రమేనా?
కామారెడ్డిలో దొంగల అలజడి
హై ఓల్టేజీతో ఎలక్ట్రానిక్ వస్తువులు దగ్ధం
వడదెబ్బతో గుర్తు తెలియని వ్యక్తి మృతి
సేల్స్టాక్స్ అధికారులమని బెదిరింపులు
ఓటు వజ్రాయుధం వంటిది
జనసభకు ఏర్పాట్లు పూర్తి
ధాన్యం సేకరణ ముమ్మరం చేయాలి
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement