-
విస్తృత నైపుణ్యాలు పెంపొందించేలా డిగ్రీలో మార్పులు
సాక్షి, అమరావతి: విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం విస్తృత నైపుణ్యాలు పెంపొందించేలా డిగ్రీ కోర్సులను రీడిజైన్ చేసినట్లు ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ కె.రామమోహనరావు తెలిపారు. ఆయన ఆదివారం విజయవాడలోని లయోలా కాలేజీలో మీడియాతో మాట్లాడుతూ 2023–24 విద్యా సంవత్సరం నుంచి సింగిల్ మేజర్ సబ్జెక్ట్ డిగ్రీ, నాలుగేళ్ల హానర్స్ డిగ్రీలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. వీటిపై విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. సోమవారం నుంచి డిగ్రీ ప్రవేశాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లుప్రారంభమవుతున్న నేపథ్యంలో లయోలా కాలేజీలో సదస్సు ఏర్పాటు చేసినట్లు వివరించారు. నూతన విద్యా విధానం అమలులో ఏపీ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. విద్యార్థులను ఒక సబ్జెక్ట్లో నిపుణులుగా తీర్చిదిద్దడంతోపాటు మల్టీడిసిప్లినరీ విద్యను అందించేలా డిగ్రీ కోర్సులు రూపొందించామన్నారు. మేజర్ (ప్రధాన) సబ్జెక్ట్తో డిగ్రీలో చేరిన విద్యార్థి రెండో సెమిస్టర్ నుంచి మైనర్ (రెండో ప్రాధాన్యం) సబ్జెక్ట్ను ఎంచుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ మేజర్, మైనర్ సబ్జెక్టుల్లో ఏదో ఒకదానిపై డిగ్రీ అనంతరం పీజీ స్పెషలైజేషన్ చేయవచ్చని తెలిపారు. డిగ్రీ మొదటి సంవత్సరం ఉత్తీర్ణత అనంతరం చదువు ఆపేస్తే ‘సర్టిఫికేషన్ కోర్సు’, రెండో ఏడాది తర్వాత ఆగిపోతే ‘డిప్లొమా’, మూడేళ్లు పూర్తి చేస్తే ‘డిగ్రీ’, నాలుగో ఏడాది చదివి ఉత్తీర్ణత సాధిస్తే ‘డిగ్రీ విత్ హానర్స్’ను ప్రదానం చేస్తామని వివరించారు. విద్యార్థులు మూడేళ్ల డిగ్రీలో 75 శాతం మార్కులతో ఉత్తీర్ణులైతే నాలుగో సంవత్సరం ‘రిసెర్చ్ హానర్స్’ కోర్సు చేయవచ్చని చెప్పారు. ఈ కోర్సు పూర్తిచేస్తే నేరుగా పీహెచ్డీ చేసేందుకు అర్హత సాధిస్తారని పేర్కొన్నారు. అదేవిధంగా మూడేళ్ల డిగ్రీ పాసైన విద్యార్థులు నాలుగో ఏడాది హానర్స్ డిగ్రీని చేయవచ్చని, ఇది పూర్తిచేసిన వారు నేరుగా పీజీ రెండో ఏడాదిలో చేరవచ్చని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచే 150 మేజర్ సబ్జెక్టులు, ఇందులో 90 వరకు మైనర్ సబ్జెక్టులతో డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టామన్నారు. డేటాసైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ క్రైమ్, ఏఐ, మెషిన్ లెర్నింగ్, బిజినెస్ ఎనలిటిక్స్, అగ్రికల్చర్, ఫుడ్ప్రాసెసింగ్, టూరిజం వంటి అనేక మైనర్ సబ్జెక్టుల్లో డిగ్రీ విద్యను ఆన్లైన్, ఆఫ్లైన్లో అభ్యసించవచ్చన్నారు. ఆర్ట్స్ విద్యార్థులు కూడా సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించేలా డిగ్రీ కోర్సులను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఆయా కో ర్సుల వివరాలు, సిలబస్ను ఉన్నత విద్యా మండలి వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని చెప్పారు. -
విచారణ కమిషన్ ముందుకు మాజీ సీఎస్
సాక్షి ప్రతినిధి, చెన్నై: జయలలిత మరణంపై తమిళనాడు ప్రభుత్వం నియమించిన విచారణ కమిషన్ ముందు ఆ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామమోహన్రావు హాజరయ్యారు. జయలలిత సీఎంగా ఉన్న కాలంలో ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గురువారం కమిషన్ కార్యాలయానికి వచ్చి కమిషన్ చైర్మన్ ముందు హాజరయ్యారు. స్పృహలో ఉన్న స్థితిలోనే జయ ఆస్పత్రికి వచ్చారా? అడ్మిట్ చేయడానికి అసలుకారణాలేంటి? చికిత్సకు సంబంధించి తప్పుల తడకలుగా బులెటిన్లు ఎందుకు విడుదల చేశారు? తదితర ప్రశ్నలు వేసినట్లు సమాచారం. -
‘కట్టల’పాములు పట్టుబడ్డాయిలా..
ముఖ్యమైనా దాడులు డిసెంబర్ 22, నాగావ్ (అసోం): ఐటీ శాఖ దాడుల్లో ఒక వ్యాపారి నుంచి రూ. 2.35 కోట్ల కొత్త నోట్లు స్వాధీనం డి–21, చెన్నై (తమిళనాడు): రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.రామ్మోహన్రావు ఇంటిపై ఐటీ దాడిలో రూ. 18 లక్షల కొత్త నోట్లు, 2 కిలోల బంగారం స్వాధీనం డి–17, సూరత్ (గుజరాత్): కిషోర్ భాజియావాలా(టీ కొట్టు య జమాని) వద్ద రూ. 1.08 కోట్ల కొత్త నోట్లతో పాటు రూ. 4.92 కోట్ల బంగారు నగలు, రూ. 1.28 కోట్ల ఆభరణాలు, రూ. 1.28 కోట్ల వెండి, రూ.250 కోట్ల ఆస్తులు స్వాధీనం డి–16, నెల్లూరు: ఒక హోటల్లో రియల్ ఎస్టేట్ డీల్ కుదురుతోందన్న సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి.. రూ.1.54 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. అన్నీ కొత్త రూ.2వేల నోట్లే డి–16, వాషిమ్ (మహారాష్ట్ర): రూ.41 లక్షల కొత్త నోట్లు స్వాధీనం చేసుకున్నారు డి–15, డెహ్రాడూన్(ఉత్తరాఖండ్): రూ.7.39 లక్షల కొత్త నోట్లు, రూ.28 వేల పాత నోట్లు స్వాధీనం డి–15, గువాహటి: రూ.27 లక్షల కొత్త నోట్లు, రూ.2.58 లక్షల పాత నోట్లు స్వాధీనం డి–15, ధార్వాడ్(కర్ణాటక): రూ.23.20 లక్షల కొత్త నోట్లు సహా రూ.26.20 లక్షలు స్వాధీనం డి–15, ఢిల్లీ: కరోల్బాగ్ నగల దుకాణంపై దాడి లో కొత్త నోట్లు సహా రూ.30 లక్షలు పట్టుకున్నారు డి–15, ఠాణే: రూ.16 లక్షల కొత్త నోట్లు సహా రూ.21 లక్షలు పట్టుకున్నారు డి–15, గువాహటి: రూ.5.58 లక్షల కొత్త నోట్లు స్వాధీనం డి–15, నోయిడా (ఉత్తరప్రదేశ్): యాక్సిస్ బ్యాంక్ బ్రాంచిలో 20 నకిలీ ఖాతాల్లో రూ.60 కోట్ల డిపాజిట్లు గుర్తింపు డి–15, జైపూర్: రూ.35 లక్షల కొత్త నోట్లు స్వాధీనం డి–14, పుణే: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లాకర్లలో రూ.10 కోట్ల డబ్బు దొరికింది డి–14, బెంగళూరు: రూ. 2.93 కోట్ల కొత్త నోట్లు సహా రూ.3.57 కోట్లు పట్టుకున్నారు డి–14, చండీగఢ్: రూ.17.74 లక్షల కోట్లు సహా 2.18 కోట్లు స్వాధీనం డి–14, వడోదర (గుజరాత్): రూ.13 లక్షల కొత్త నోట్లు సహా రూ.19.67 లక్షలు స్వాధీనం డి–13, గోవా: రూ. 24 లక్షల కొత్త నోట్లు స్వాధీనం డి–13, హైదరాబాద్: పది మంది దొంగల ముఠా నుంచి రూ.52 లక్షల కొత్త నోట్లు స్వాధీనం డి–13, బెంగళూరు: బెంగళూరు, హైదరాబాద్లలో రూ. 17.36 లక్షల కోట్లు స్వాధీనం. బ్యాంకు, పోస్టాఫీసు అధికారులపై సీబీఐ కేసులు నమోదు డి–10, బెంగళూరు: బెంగళూరులో బాత్రూంలో దాచిన రూ.5.7 కోట్ల కొత్త నోట్లు, 32 కిలోల బంగారం, రూ.90 లక్షల పాత నోట్లు స్వాధీనం డి–10, ఢిల్లీ: ఒక న్యాయవాద సంస్థపై దాడిలో రూ.2.5 కోట్ల కొత్త నోట్లు సహా రూ.13 కోట్లు స్వాధీనం డి–9, చెన్నై: టీటీడీ మాజీ సభ్యుడు శేఖర్రెడ్డి స్థావరాలపై దాడుల్లో రూ.9.63 కోట్ల కొత్త నోట్లు సహా రూ.106.52 కోట్ల నగదు, 127 కిలోల బంగారం స్వాధీనం డి–7, గోవా: రూ.1.5 కోట్ల కొత్త నోట్లు స్వాధీనం డిసెంబర్ 6, కోల్కతా: రూ. 33 లక్షల కొత్త నోట్లు స్వాధీనం, బీజేపీ నేత అరెస్ట్ డి–4, సంబల్పూర్ (ఒడిశా): రూ.85.62 లక్షల కొత్త నోట్లు సహా రూ.1.42 కోట్లు స్వాధీనం డి–1, బెంగళూరు: రూ.4.7 కోట్ల కొత్త నోట్లు, రూ.30 లక్షల పాత నోట్లు, 7 కిలోల బంగారం స్వాధీనం నవంబర్ 26, ముంబై: విమానాశ్రయంలో రూ.2 కోట్ల బంగారం, రూ.7.5 లక్షల నగదు స్వాధీనం న–25, ఢిల్లీ: రూ.3.5 కోట్ల కొత్త నోట్లు పట్టివేత, ఇద్దరు యాక్సిస్ బ్యాంకు ఉద్యోగుల అరెస్ట్ న–13, పట్నా: రైలులో రూ. కోటి స్వాధీనం
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
చిక్కుల్లో హరియాణా సర్కారు!
తెలంగాణ మద్యం పట్టివేత
వైఎస్సార్సీపీలోకి వలసలు
మోదీ అధికారంలోకి వస్తే మళ్లీ ఎన్నికలు ఉండవు
అందరివాడికే అందలం
నర్సింగ్ వృత్తి ఎంతో పవిత్రమైనది
16,772 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
పకడ్బందీగా ఎన్నికలు
పోలింగ్ పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలు బంద్
ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
తప్పక చదవండి
- మోదీ మళ్లీ ప్రధానైతే.. దేశం ఉత్తర కొరియానే
- Lok Sabha Election 2024: ఎన్నికల సమాచారం సమస్తం... వేలి కొసలపైనే!
- జిల్లా జడ్జి నియామకాల్లో వర్టికల్ రిజర్వేషన్లు !
- జీన్స్, టీషర్ట్స్ వేసుకు రావొద్దు
- నేడు రాష్ట్రంలో అమిత్ షా ప్రచారం
- బీజేపీపై తప్పుడు ప్రచారం
- Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
- Lok Sabha Election 2024: నాలుగో విడతలోనూ... మహా వార్!
- Lok Sabha Election 2024: మాజీ దంపతుల దంగల్!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
Advertisement