-
భగవాన్ రమణమహర్షి
‘‘నువ్వేమిటో తెలుసుకోకుండా, జగత్తును తెలుసుకోవాలనుకుంటే, అది నిన్ను చూసి వెక్కిరిస్తుంది. ముందు నీ మనస్సుని చదువు. తర్వాత జగత్తును చూడు. అప్పుడు ప్రపంచమే ఆత్మ అవుతుంది. నీకు అవగతమవుతుంది’’అంటారు భగవాన్ రమణ మహర్షి. భగవదన్వేషణలో ఎన్నెన్నో ప్రశ్నలతో రమణాశ్రమం చేరినవారికి ఆశ్చర్యకరంగా భగవానుల శక్తిమంతమైన మౌనంలోనే సంశయ నివారణ అయ్యేది. ఆయన మౌనమే వారికి మహాజ్ఞానబోధ. రమణుల సమస్త ఉపదేశసారం ఏమంటే ‘‘నిన్ను నీవు తెలుసుకో’’. నీకేది కావాలో ఆయనకు తెలుసు శివదర్శనం కోసం తహతహలాడుతున్న భక్తురాలిని చూచి భక్తిని గురించి వివరించారు రమణులు. ‘‘భగవంతుడిని శరణు వేడు. ఆయన ఇష్టానికి తలవంచు. నీ ఇష్టమొచ్చినట్లు ఆయన నడుచుకోవాలనుకోవడం శరణాగతి కాదు. నీకు ఎప్పుడు, ఏది, ఎలా చెయ్యాలో ఆయనకే బాగా తెలుసు. ఈ విషయంలో నీకిక బాధ్యతలే ఉండవు. అన్ని బాధ్యతలూ ఆయనవే. ఇదే అసలైన శరణాగతి. ఆ పరమాత్మ పేరే ‘నేను’. అన్నిటా వ్యాపించిన ఆ భావనతో కలిగే సద్భావస్థితిని ఉత్తమమైన భక్తి అంటారు. ప్రేమ, వికాసం, అనురాగం కలిగివుండటం నిజమైన భక్తుని లక్షణం‘. పరిమితులను దాటడమే పరిత్యాగం తన ఉద్యోగానికి రాజీనామా చేసి, నిరంతరం మహర్షి సాన్నిధ్యంలో ఉండాలనే తలంపుతో ఉన్న భక్తుడికి భగవాన్ ఒకనాడు కర్తవ్యాన్ని ఉపదేశించారు. ‘భగవాన్ ఎప్పుడూ మీతోనే, మీలోనే వున్నారు. ఈ విషయం బోధపడటానికి నువ్వు నీ ఉద్యోగానికి రాజీనామా చేయనవసరం లేదు. నీ బాధ్యతలనుండి తప్పుకోనక్కరలేదు. సమస్త భారాల్ని మోసే భగవంతునితో రాజీపడు. కోరికలను, మోహాలను విడిచిపెట్టు. అప్పుడు సమస్త ప్రపంచాన్ని ప్రేమించగలుగుతావు’’ వ్యక్తులనేగాదు... పశుపక్ష్యాదులను సైతం గౌరవంగా సంబోధిస్తూ వాటిపై తమ అనుగ్రహాన్ని ప్రసరింపజేసిన రమణులు అనవసరపు ఆడంబరాలను నిరాకరించి నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏమిటో తన నడవడికతో చూపించారు. అందుకే వారి ఆధ్యాత్మిక శక్తివిలాసం ఈనాటికీ ఉజ్జ్వలంగా భాసిస్తోంది. – అప్పాల శ్యామప్రణీత్ శర్మ అవధాని వేదపండితులు -
చిరస్మరణీయం
తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయం పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటి. అగ్ని లింగేశ్వరుడుగా ఆదిదేవుడు ఇక్కడ పూజలందుకుంటున్నాడు. అరుణాచలం అనే పేరే ఒక మహామంత్రంగా భావిస్తారు. వైష్ణవులు పరమపావనమైన ఈ కొండను సుదర్శనగిరిగా వ్యవహరిస్తారు. విష్ణువు హస్తభూషణమైన చక్రాయుధం గిరి రూపంగా భువిపై సాకారమైందని విష్ణు భక్తుల నమ్మకం. తిరువణ్ణామలై అంటే శ్రీకరమైన మహాగిరి అని అర్థం. అరుణగిరి రుణానుబంధాల్ని హరించివేస్తుందని అరుణాచల మహాత్మ్యం పేర్కొంది. తమిళంలో ‘గిరి వలం’ అని వ్యవహరించే అరుణాచల ప్రదక్షిణ పూర్వక విధికి ఎంతో వైశిష్ట్యం ఉంది. అరుణాచలం స్వయంగా జ్యోతిర్మయ మహాలింగం. 14 కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గంలో గిరి చుట్టూ అనేక ఆలయాలు, ఆశ్రమాలు, బృందావనాలు దర్శనమిస్తాయి. అగస్త్య తీర్థం, ఉన్నామలై తీర్థం వంటి పవిత్ర తీర్థాలకు ఈ గిరి నెలవు. ఈ కష్టాలు, బాధలు, సంతోషాలు, బంధాలు, బంధుత్వాలు మొదలైనవన్నీ మనసుకే కానీ, ఆత్మకు కావు, ఆత్మయే చిదానంద స్వరూపం. ఆత్మ గురించి తెలుసుకుని, ఆత్మస్థితిలో ఉండగలిగితే మనల్ని ఏవి బాధించలేవు అనేవారు రమణ మహర్షి. ఇంతకీ ఎవరీ రమణ మహర్షి? గురుబోధ లేకుండానే, ఆధ్యాత్మిక సత్యాలను దర్శించిన అన్వేషి. ‘నేను’ అన్న మాట మీద దృష్టిని పెట్టండి చాలు, మాయ తెరలు తొలగిపోతాయని సూచించిన జ్ఞాని. తన 16వ ఏట ఆయనకు మరణానుభవం కలిగిన దగ్గర్నుంచీ, రమణుడు సాగించిన ఆధ్యాత్మిక యాత్ర అసాధారణమైనది. వంటలు చేస్తూ భౌతిక ధర్మాలను ఆచరించినా, తల్లికి సైతం గురువుగా నిలిచి సన్యాసానికి కొత్త నిర్వచనాన్ని అందించినా... రమణ పథం చాలా భిన్నమైనది. ఆ రమణుని చెంత సేదతీరి తమ ఐహిక దుఃఖాలను, ఆధ్మాత్మిక తృష్ణను తీర్చుకునేందుకు వందలాది జనం నిత్యం అరుణాచలానికి బారులు తీరేవారు. భక్తులు అడిగే ప్రతి ప్రశ్నకూ రమణులు తనదైన శైలిలో జవాబుని అందించేవారు. వాటిలో చాలావరకూ జవాబులు ‘నిన్ను నువ్వు ముందుగా తెలుసుకో’ అన్న సూచనతో ముగిసేవి. మరికొన్ని సందర్భాలలో రమణులు తనంతట తానుగా ఏదో ఒక విషయం గురించి అభిప్రాయాన్ని వెల్లడించేవారు. వెంకట రామన్ అనే పేరున్న రమణులకు అసలు ఆ పేరెలా వచ్చిందో చూద్దాం...ఒకసారి తపస్సు కోసమని తమిళనాడులోని తిరువణ్ణామలై వెళ్లాడు కావ్యకంఠ గణపతి ముని. అక్కడ అరుణగిరిపై వెలిసిన అరుణాచలేశ్వరునీ, అపీత కుచాంబనీ దర్శించుకున్నాడు. ‘‘శక్తి, ఈశ్వరుడు ఇక్కడ నాకు పూర్ణానుగ్రహ స్వరూపులై కనిపిస్తున్నారు. నా తపస్సు ఇక్కడే సిద్ధి పొందుతుంద’’ని తన సోదరునితో చెప్పారు గణపతిశాస్త్రి. మరోసారి తిరువణ్ణామలై వెళ్లి రోజులకు రోజులు తపస్సులో నిమగ్నమయ్యాడు గణపతి. ఒకరోజు హఠాత్తుగా అరుణాచలంపై ఉన్న మౌనస్వామి గుర్తుకువచ్చారు. మూడు నాలుగేళ్లకిందట తాను స్వామిని ఒకసారి దర్శించుకున్నాడు. మళ్లీ స్వామిని దర్శించుకోవడానికి మండుటెండలో అరుణగిరి ఎక్కనారంభించారు. విరూపాక్ష గుహ బయట స్వామి ఒక్కరే ఒక తిన్నెపై కూర్చుని ఉన్నారు. ఆయన పాదాలను పట్టుకున్నాడు గణపతి. కన్నీరు కారుస్తూ.. ‘‘స్వామీ! మనసారా తపస్సు చేశాను. అయినా దేవుడు ప్రసన్నుడు కాలేదు. నా సాధనలో ఏదో లోపం ఉందనిపిస్తోంది! తపస్సు స్వరూపం ఏమిటో అనుగ్రహించండి’’ అని కోరాడు. గణపతి ప్రార్థనను ఆలకించిన మౌనస్వామి.. ‘‘నాయనా! ‘నేను’ అనే స్ఫురణ ఎక్కడి నుంచి వస్తున్నదో విచారిస్తే... మనసు అందులో అణగిపోతుంది. అదే తపస్సు. మంత్ర శబ్దోత్పత్తి ఎక్కడ జరుగుతుందో గమనిస్తే.. మనసు అందులో లీనమవుతుంది. అదే తపస్సు’’ అని ఉపదేశించాడు. ఆ ఉపదేశంతో పొంగిపోయిన గణపతి ముని... స్వామి పరిచారికుడు పళనిస్వామిని అడిగి స్వామి పేరు వెంకటరామన్ అని తెలుసుకున్నాడు. ఆ పేరుని ‘రమణ’గా సంక్షిప్తం చేశారు గణపతి. మోక్షానికి దారి చూపారు కాబట్టి ‘మహర్షి’ అనీ.. సర్వమంగళ ప్రదాత కావున ‘భగవాన్’ అనీ స్ఫురించేలా స్వామికి.. ‘భగవాన్ శ్రీ రమణ మహర్షి’ అని నామకరణం చేశారు. మహర్షిని తన గురువుగా స్వీకరించారు. ఆ తర్వాత వెంకటరామన్ పేరు ‘రమణ మహర్షి’గా స్థిరపడిపోయింది. సందేశ రమణీయం మహర్షిని దర్శించుకోవడానికి ఎందరో సాధకులు వస్తూ ఉండేవారు. వాళ్లడిగిన ప్రశ్నలు, మహర్షి ఇచ్చిన సమాధానాలతో ‘శ్రీరమణ గీత’ అనే గ్రంథాన్ని సంస్కృతంలో రాశారు గణపతి ముని. వాటిలో కొన్నింటిని ఇక్కడ చూద్దాం. ∙మనం మన మనసు చెప్పినవన్నీ నమ్మేస్తాం. అందుకే ఏదీ లేదో అదే ఉన్నదని, యథార్ధానికి ఏది ఉన్నదో అదే లేదని భావిస్తాం. మనం మనసుమాట వినకుండా, హృదయంలోనికి ప్రవేశించి అక్కడున్నదానిని చూసుకుంటే, ఇక బయట ప్రత్యేకంగా చూసుకుని ఆనందించవలసిన అవసరం లేదు. ∙‘ఈ ప్రపంచం సుఖం కోసం సృష్టించబడిందా? దుఃఖం కోసం సృష్టించబడిందా?’ అనే ప్రశ్న గురించి రమణులు ఏం చెప్పారంటే... ‘సృష్టి మంచిదీ కాదు, చెడ్డదీ కాదు. అది ఉన్నట్లే ఉన్నది. మానవుని మనస్సు దానిని తన కోణం నుంచి చూస్తూ తనకు అనుకూలమైనట్లు వ్యాఖ్యానిస్తుంది. ∙మానవుడి మనస్సే కష్టాలను సృష్టించుకుని సహాయం కోసం అలమటిస్తూ ఉంటుంది. ఒక మనిషికి కష్టాలిచ్చి మరొకడికి సుఖాలీయటానికి భగంతుడికంత పక్షపాతం ఉంటుందా? ∙సృష్టిలో అన్నిటికీ చోటు ఉంటుంది. కానీ పక్కనే రుచికరమైన తిండి ఉండగా ఒక క్షుథార్తుడు దానివైపు చేయిజాపి ఆకలి తీర్చుకోకుండా ఉన్నట్లు, మానవుడు çసృష్టిలో ఉండే మంచివాటినీ, ఆరోగ్యకరమైన వాటినీ, సుందరమైనవాటినీ వదలిపెట్టి ఊరకే దుఃఖిస్తూ ఉంటాడు. కాని మనుష్యుల అదృష్టం కొద్దీ, భగవంతుడు అనంతదయాసాగరుడై మానవుని ఎన్నడూ వదిలిపెట్టడు. ఎల్లప్పుడూ గురువులనూ, శాస్త్రాలనూ ఇచ్చి, కొత్త అవకాశాలను ఇచ్చి, మార్గం చూపించి తన తప్పులను తెలుసుకొనేలా చేసి తుదకు శాశ్వతానందాన్ని ప్రసాదిస్తాడు. ∙ చాలామంది సంతోషం బయట నుంచి వస్తుందనీ, భౌతికమైన సంపదలతో ఏర్పుడుతుందనీ అనుకుంటారు. నిజంగా సంపదకు అనుగుణంగా సంతోషం కలిగేట్లయితే సంపద పెరుగుతున్న కొద్దీ అది పెరగాలి. అలాగే సంపద ఏమాత్రం లేనివాడి దగ్గర సంతోషం అనేదే ఉండకూడదు. కానీ నిజంగా అలా జరుగదు కదా! మనిషి ఏ సంపదనీ అనుభవించలేని... కనీసం శరీరస్పృహ కూడా లేని నిద్రావస్థలో చాలా సంతోషంగా ఉంటాడు. అలాంటి స్థితి కోసమే తనకు గాఢంగా నిద్ర పట్టాలని కోరుకుంటాడు. దీనిని బట్టి సంతోషం మనిషి అంతరంగంలోనే ఉందని తేలిపోతోంది కదా! మనల్ని మనం తెలుసుకున్న రోజున, అలాంటి స్వచ్ఛమైన సంతోషాన్ని నిరంతరం పొందగలుగుతాము. – డి. పూర్ణిమాస్వాతి -
నిశ్చలత్వమే యోగం
ఆత్మీయం ఈ భౌతిక ప్రపంచంలో మంచి జరిగినా, చెడు జరిగినా తాము దాన్ని ప్రశంసించకుండా, విమర్శించకుండా ఎవరైతే ఉంటారో, ఎటువంటి భావాన్నీ వెలిబుచ్చక కలత చెందక నిశ్చలంగా ఉంటారో అటువంటి వారినే యోగులంటారు. నిలకడగల జ్ఞాని లేదా యోగి తాబేలు వంటివాడు. ఏదైనా అవసరం కలిగినప్పుడు తాబేలు తన అవయవాలను లోపలికి ముడుచుకునే సౌకర్యం ఏవిధంగా కలిగి ఉంటుందో, అదేవిధంగా తన ఇంద్రియాలను అదుపులో పెట్టుకోగలిగిన వాడే సమగ్రమైన జ్ఞాని, యోగి. సమదర్శనులు రమణమహర్షి వలె జనన మరణ స్థితులను జయించిన వారై ఉంటారు. అటువంటి సమదర్శనులయిన జ్ఞానుల చేత ఈ దేహం, సంసార బంధాలలో తగులుకోక జనన మరణ చక్రాన్ని జయించబడింది. అటువంటి వారు బ్రహ్మమువలె దోషం లేని వారయినందువల్ల బ్రహ్మములోనే ఉన్నవారు కాగలరు. అంటే అన్నింటిలోనూ సమదృష్టి గల మనస్సు, ఆత్మ సాక్షాత్కారం గల వారి çహృదయానికి ప్రతీకయే గాక సాక్షాత్తూ దేవుని వలె రాగద్వేషాలకు అతీతులం కాగలం. దోషరహితులమై ఆధ్యాత్మికానందాన్ని అనుభవించగలం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement