-
రామారావ్ మహారాజ్కు ‘భారతరత్న’ ఇవ్వాలి
- తన వంతుగా పార్లమెంట్లో మాట్లాడతానన్న ఎంపీ కవిత నిజామాబాద్: లంబాడా సమాజం అభ్యున్నతికి కృషి చేసిన రామారావ్ మహారాజ్కు కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించేలా తన వంతు కృషి చేస్తానని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చెప్పారు. గురువారం నిజామాబాద్ రూరల్ నియోజక వర్గం పరిధిలోని డిచ్పల్లి మండలం దేవా తండాలో జగదాంబ మాత ఆలయాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం తెలంగాణ సేవాలాల్ మహారాజ్ పూజారుల కమిటీ అధ్య క్షుడు శివరాం మహారాజ్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో కవిత మాట్లాడుతూ రామారావుకు భారత రత్నను ప్రకటించే అంశం గురించి పార్లమెంటులో ప్రస్తావిస్తానన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు కూడా కేంద్రానికి లేఖ రాసేలా చూస్తానన్నారు. తెలంగాణ ఉద్యమంలో తనతో బతుకమ్మలాడిన లంబాడా మహిళలు బాగుండాలని జగదాంబ మాతను కోరుతున్నానన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతిలో భాగమని, అలాగే బంజారాల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన తీజ్ పండుగలో తాను కూడా పాల్గొంటున్న విషయాన్ని గుర్తుచేశారు. -
ఆశీర్వదించారు.. అందల మెక్కుతున్నారు
వినాయక్నగర్, న్యూస్లైన్ : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ప్రధాని అభ్యర్థి దేశవ్యాప్తంగా ప్రచార సభలను నిర్వహించారు. ఇందులో భాగంగా గత నెల 22 వ తేదీన నగరంలోని గిరిరాజ్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభకు ముఖ్యఅతిథిగా ఆయన వచ్చారు. ఈ సభకు బంజారాల గురువు రామారావు మహారాజ్ మహారాష్ట్ర నుంచి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సభావేదికపై నరేంద్రమోడీకి మహారాజ్ ‘విజయోస్తూ’ అంటూ ఆశీర్వదిం చారు. దేశంలో మోడీని ప్రధానిగా చూడాలని కాంక్షించిన నేపథ్యంలో ఇందూరు గడ్డపై మహారాష్ట్ర మహారాజ్ ఆశీర్వదం ఎంతగానో తోడైందని బంజారవర్గాలు చెప్పుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనంతో బీజేపీకి దేశప్రజలు అఖండ మెజారిటీని అందించారు. దీంతో ఆయన నవభారత నిర్మాణానికి పూనుకునేందకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 26న సాయంత్రం 6 గంటలకు ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
నిమ్మాడలో అచ్చెన్న కుటుంబం బరితెగింపు
చెరువులో పడి ఇద్దరు మృతి
ఇంటింటికీ వెండిభరిణి, వెయ్యి నగదు!
No Headline
సంక్షేమంలో మేటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం
● గంగపుత్రులకు వరం ఫిషింగ్ జెట్టీ...
నవరత్నాలతో నేరుగా లబ్ధి రూ.18,591.32 కోట్లు
No Headline
నేడే పోలింగ్
జగన్ పాలన ఐదేళ్లూ... జన సంక్షేమం
తప్పక చదవండి
- 5% దిగువనే రిటైల్ ద్రవ్యోల్బణం
- చీరాలలో టీడీపీ, కాంగ్రెస్ బరితెగింపు
- Lok Sabha Election 2024: నేడు వారణాసిలో మోదీ నామినేషన్
- గన్నవరంలో టీడీపీ గలాటా
- పోలింగ్ సిబ్బంది ‘పచ్చ’పాతం
- Lok Sabha Election 2024: మహిళలకు ‘మహాలక్ష్మి’ గ్యారెంటీ: సోనియా
- నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత
- పల్నాట పచ్చ మూక బీభత్సకాండ
- వెచ్చని హృదయ రాగ సందేశం
- Lok Sabha Election 2024: రాయ్బరేలీ కోసం మేము.. అదానీ, అంబానీ కోసం మోదీ
Advertisement