-
‘ఇండియా’ కూటమి బహిరంగ సభ వాయిదా
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో అక్టోబర్లో నిర్వహించ తలపెట్టిన ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి తొలి బహిరంగ సభ వాయిదా పడింది. మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు కమల్నాథ్ శనివారం ఈ విషయం ప్రకటించారు. బహిరంగ సభ ఎప్పుడు నిర్వహించాలన్నది ఇంకా నిర్ణయించలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా చెప్పారు. భోపాల్లో ఉమ్మడిగా భారీ సభ నిర్వహించి, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని ఇండియా కూటమి పక్షాలు ఇటీవలే నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. -
‘ఆధార్–ఓటర్ ఐడీ లింక్’పై హైకోర్టుకు వెళ్లండి
సాక్షి, న్యూఢిల్లీ: ఆధార్– ఓటరుకార్డు అనుసంధానంపై ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాలని కాంగ్రెస్ నేత రణ్దీప్ సింగ్ సూర్జేవాలాకు సుప్రీంకోర్టు సూచించింది. గతేడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టంలో వివాదాస్పద అంశాలున్నాయంటూ సూర్జేవాలా దాఖలు చేసిన పిటిషన్ సోమవారం జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం ముందుకొచ్చింది. ఆధార్తో ఓటర్ గుర్తింపు కార్డు అనుసంధానంతో పౌరులు కాని వారికి కూడా ఓటు వేసే హక్కు ఉంటుందని పిటిషనర్ పేర్కొన్నారు. విచారణ సందర్భంగా ధర్మాసనం..‘మీరు ఢిల్లీ హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదు?’ అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. వచ్చే 6 నెలల్లో మూడు రాష్ట్రాల్లో కీలకమైన ఎన్నికలు జరగనున్నందున తమ పిటిషన్ ఎంతో ముఖ్యమైందని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. పలు హైకోర్టుల్లో ప్రొసీడింగ్స్ ఉంటే కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే వాటన్నింటినీ కలిపి ఒకే హైకోర్టుకు బదిలీ చేసే ఆస్కారం ఉందని ధర్మాసనం పేర్కొంది. ‘ఎన్నికల సవరణచట్టం–2021లోని సెక్షన్లు 4, 5ల చెల్లుబాటును పిటిషనర్ సవాల్ చేశారు. ఢిల్లీ హైకోర్టులో దీనికి సమర్థవంతమైన పరిష్కారం లభిస్తుందని పేర్కొన్న ధర్మాసనం, హైకోర్టుకు వెళ్లే స్వేచ్ఛను పిటిషనర్కు ఇస్తున్నామని పేర్కొంది. -
చిక్కుల్లో కాంగ్రెస్ నేత.. వీడియో వైరల్
దేశంలో కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. సీనియర్లు ఒక్కొక్కరుగా పార్టీనీ వీడుతున్నారు. మరోవైపు.. బీజేపీపై విమర్శలు చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత చిక్కుల్లో పడ్డారు. ఆయన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల ప్రకారం.. కాంగ్రెస్ సీనియర్ నేత రణ్దీప్ సింగ్ సుర్జేవాలా గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్ధలను, ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు ఏజెన్సీలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని అన్నారు. ఈ క్రమంలో మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణాన్ని ప్రస్తావించబోయి పొరపాటున సీతాదేవి పేరును చెప్పడం వివాదాస్పదంగా మారింది. అయితే, రాజ్యాంగ వ్యవస్ధలను నిర్వీర్యం చేస్తూ వాటి ప్రాధాన్యతకు కేంద్రం తూట్లుపొడుస్తోందని సూర్జేవాలా ఆరోపించారు. ఈ క్రమంలో సీతాదేవి వస్త్రాపహరణం తరహాలోనే బీజేపీ ప్రజాస్వామ్య విలువలను ఊడదీయాలని కాషాయ పార్టీ కోరుకుంటోందని రణ్దీప్ దుయ్యబట్టారు. బీజేపీ ప్రయత్నాలు ఫలించబోవని, రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదని ఆయన కామెంట్స్ చేశారు. కాగా, కౌరవ సభలో పాండవుల సమక్షంలో ద్రౌపది వస్త్రాపహరణం గురించి ప్రస్తావించబోయిన సుర్జేవాలా పొరపాటున సీతాదేవీ పేరును పలికారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఇక, సూర్జేవాలా వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. #WATCH | Udaipur, Rajasthan | "..Truth, democracy, law & morals will win. BJP wants to do 'cheer haran' of democracy, just like 'cheer haran' of Goddess Sita. But they'll lose (in RS polls) & their masks will fall off," Congress leader Randeep Surjewala said in a press conference pic.twitter.com/xYXk2N5uJf — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 9, 2022 ఇది కూడా చదవండి: రాజ్యసభ ఎన్నికలు: ఎన్సీపీ నేతలకు షాక్.. -
కాంగ్రెస్కు బిగ్ షాకిచ్చిన ప్రశాంత్ కిషోర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బిగ్ షాకిచ్చారు. కాంగ్రెస్లో చేరాలంటూ పార్టీ అధిష్టానం అందించిన ఆఫర్ను పీకే నిరాకరించారు. తాను పార్టీలో చేరడం లేదని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రణదీప్ సింగ్ సుర్జేవాలా ధ్రువీకరించారు. పీకే నిర్ణయాన్ని గౌరవిస్తామని ఆయన పేర్కొన్నారు. కాగా కొంతకాలంగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్లో చేరనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనికితోడు ఇటీవల పీకే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఇతర నాయకులతో భేటీ అవ్వడంతో కాంగ్రెస్లో చేరిక దాదాపు ఖరారైనట్లేనని అంతా భావించారు. అంతేగాక కాంగ్రెస్లో చేరి బాధ్యతలు చేపట్టాలని పీకేను సోనియా గాంధీ ఆహ్వనించారు. ఈ మేరకు పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ కమిటీ నివేదిక ఇచ్చింది. అయితే సోనియా ప్రతిపాదనను నిర్ధ్వందంగా తిరస్కరించారు. Following a presentation & discussions with Sh. Prashant Kishor, Congress President has constituted a Empowered Action Group 2024 & invited him to join the party as part of the group with defined responsibility. He declined. We appreciate his efforts & suggestion given to party. — Randeep Singh Surjewala (@rssurjewala) April 26, 2022 -
హైదరాబాద్కు కాంగ్రెస్ ప్రముఖులు
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, వర్కింగ్ కమిటీ సభ్యుడు రణదీప్సింగ్ సూర్జేవాలా సోమవారం హైదరాబాద్కు వచ్చారు. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డి.కె.శివకుమార్, ఆ రాష్ట్ర మాజీ సీఎం సిద్ధరామయ్య కూడా విడిగా హైదరాబాద్కు చేరుకున్నారు. రాయచూర్లో జరిగే ఓ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి వెళ్తూ ఈ ముగ్గురు మార్గమధ్యలో హైదరాబాద్లో బసచేశారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, కర్ణాటక కాంగ్రెస్ సహ ఇన్చార్జి మధుయాష్కీగౌడ్ నివాసానికి వెళ్లిన వీరు కొంతసేపు అక్కడ విశ్రాంతి తీసుకుని రాయచూర్కు వెళ్లారు. వీరిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీనియర్లు ఉత్తమ్కుమార్రెడ్డి, పొన్నాల, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement