-
ఈ యువతికి ఇంత వయసు ఉంటుందా!
బ్రిటన్ రాచకుటుంబానికి చెందిన క్వీన్ ఎలిజబెత్, కేట్ మిడిల్టన్, మేఘన్ మార్కెల్ లా.. క్వీన్ రానియా చాలామందికి తెలియకపోవచ్చు. విద్య, స్త్రీ సాధికారత, మధ్య ఆసియా దేశాల శరణార్థులు స్థితిగతుల గురించి ఆసక్తి ఉన్నవారికి మాత్రం ఈ పేరు బాగా పరిచయం. ఎందుకంటే క్వీన్ రానియా ఈ సామాజికాంశాల కోసమే పాటుపడుతూ దేశవిదేశాల్లో తన ప్రసంగాలతో అందరికీ అవగాహన కల్పిస్తూ ఉంటారు. క్వీన్ రానియా జోర్డాన్ రాజు అల్ అబ్దుల్లా బిన్ అల్–హుస్సేన్ భార్య. 1970 ఆగష్టు 31 న కువైట్లో పాలస్తీనా దంపతులకు జన్మించారు. అమెరికన్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలు అయ్యాక, అక్కడి సిటీబ్యాంక్లోని మార్కెటింగ్ విభాగంలో కొంతకాలం పనిచేశారు. తరువాత జోర్డాన్ రాజధాని అమ్మన్ లో ‘ఆపిల్’ సంస్థలో చేరారు. ఆపిల్లో పనిచేస్తున్నప్పుడే ఒక విందులో జోర్డాన్ యువరాజు అల్ అబ్దుల్లా బిన్ అల్–హుస్సేన్ పరిచయం అయ్యాడు. ఇద్దరి మధ్యా ప్రేమ అంకురించింది. 1993లో వివాహం చేసుకున్నారు. పెళ్లినాటికి ఆమె వయసు 23 ఏళ్లు. అప్పటికి రాజుగా ఉన్న కింగ్ హుస్సేన్ 1999లో మరణించడంతో ఆమె భర్త సింహాసనాన్ని అధిష్టించాడు. వెంటనే రానియాను రాణిగా ప్రకటించాడు. అప్పటినుండి రానియా క్వీన్ హోదాలో ప్రపంచ విద్యకు, సమాజ సాధికారతకు కృషి చేస్తున్నారు. మధ్య ఆసియా దేశాలనుంచి ఇతర దేశాలకు వలస వెళ్తున్న వారిపై ప్రపంచదేశాలకు కనికరం కలిగించేందుకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ‘‘వలస వచ్చే వాళ్లు యుద్ధ ప్రభావాల మూలంగా వాళ్ల ఇళ్లను, అయినవాళ్లను పోగొట్టుకుని మానసికంగా, శారీరకంగా కుంగిపోయి ఏ దిక్కూ తోచని వాళ్లే అయి ఉంటారు. అలాంటి వాళ్లను మనం చిన్న చూపు చూస్తే వాళ్లు ఉగ్రవాదులుగా మారే ప్రమాదం ఉంది. దానికంటే కూడా వాళ్లు గౌరవంగా బతకడానికి అవకాశం కల్పించి, వాళ్లకు ఒక దారి చూపిస్తే బాధ్యత గల పౌరులు అవుతారు’’ అని చెబుతుంటారు క్వీన్ రానియా. ఆమె రచయిత్రి కూడా. ముఖ్యంగా చిన్న పిల్లల మానసిక వికాసం కోసం పుస్తకాలు రాశారు. ది కింగ్స్ గిఫ్ట్, ఎటర్నల్ బ్యూటీ, మహా ఆఫ్ ది మౌంటైన్స్, ది శాండ్విచ్ స్వాప్ వాటిలో ముఖ్యమైనవి. నేటితో నలభై తొమ్మిదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న రానియా.. ‘ఏంటి! ఈ యువతికి ఇంత వయసు ఉంటుందా!’ అనిపించేలా ఉంటారు. ఓప్రా విన్ఫ్రే చేసిన ఒక ఇంటర్వ్యూలో ‘‘ఇంత అందంగా ఉన్నారు, ప్రపంచంలోని ఇన్ని అంశాల గురించి పాటుపడుతున్నారు. అసలు మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి?’’ అన్నప్పుడు ‘చాక్లెట్’ అని సమాధానమిచ్చారామె.– రేఖ పర్వతాల ది శాండ్విచ్ స్వాప్ : పిల్లల కోసం రానియా రాసిన పుస్తకం -
‘అరణియార్’కు మోక్షం
34.97 కోట్లతో {పతిపాదనలు సిద్ధం 7 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు 12 గ్రామాలకు లబ్ధి కృష్ణాపురం ప్రాజెక్టు ఆధునికీకరణకు - 43.65 కోట్లతో అంచనాలు తిరుపతి: అరణియార్, కృష్ణాపురం ప్రాజెక్టులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఎన్నో ఏళ్లుగా నిరాదరణకు గురైన ఈ ప్రాజెక్టుల ఆధునికీకరణ పనులకు జైకా (జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ) నిధులు సమకూర్చుతోంది. ఈ మేరకు అధికారులు సైతం ప్రాజెక్టు ఆధునికీకరణ కోసం ఎంతమేర నిధులు అవసరమో అంచనాలు సైతం రూపొందించి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, జైకాకు సైతం ఇప్పటికే సమర్పించారు. జపాన్ బృందం పరిశీలించాక ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలిచి వెంటనే పనులు ప్రారంభించేలా అధికారులు సన్నాహాలు పూర్తిచేశారు. అరణియార్ ప్రాజెక్టు అరుణానదిపైన 1960 సంవత్సరంలో *1.26 కోట్లతో 5,500 ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు వీలుగా అరణియార్ ప్రాజెక్ట్ను నిర్మించారు. అయితే కాలువలు పూడిపోవడంతో పాటు, ప్రాజెక్టు గేట్లు మరమ్మతులకు గురవడంతో పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరందడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా లెఫ్ట్ కెనాల్, మిడిల్ కెనాల్, రైట్ కెనాల్, ట్యాంక్ స్ప్రింగ్ కెనాల్ను పటిష్టపరచడంతోపాటు వాటిని పూర్తిగా ఆధునికీకరించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంతోపాటు నది వరద సమయంలో 24,715 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్లేందుకు వీలుగా కొత్తగా రేడియల్ గేట్లు అమర్చుతున్నారు. ఇందుకోసం అధికారులు మొత్తం *34.97 కోట్ల నిధులు అవసరమని అంచనాలు రూపొందించారు. దీని ద్వారా పిచ్చాటూరు మండలంలో శేషంపేట, రామగిరి, అప్పంబట్టు, వేలూరు, నీరువాయి, వెంగళత్తూరు, రామాపురం గ్రామాలు, నాగలాపురం మండలంలో కృష్ణాపురం, కలంగేరి, వినోభానగర్, నాగలాపురం గ్రామాల్లో దాదాపు 7వేల ఎకరాల ఆయకట్టుకు నీరందనుంది. భూగర్భ జలాలు సైతం వృద్ధి చెందనున్నాయి. కృష్ణాపురం ప్రాజెక్టు లావ నది సమీపంలో కృష్ణాపురం గ్రామం వద్ద 1981 సంవత్సరంలో 6,125 ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు వీలుగా ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టు కుడికాలువ పరిధిలో 6 చెరువులు, ఎడమ కాలువ పరిధిలో 10 చెరువులు మొత్తం 16 చెరువులకు నీరు నింపడం ద్వారా 1325 ఎకరాలు, కాలువల ద్వారా 4,800 ఆయకట్టుకు నీరందేలా ప్రాజెక్టును నిర్మించారు. కాలువలు సరిగా లేకపోవడంతో ప్రస్తుతం 1,500 ఎకరాలకు సైతం నీరందని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో డిస్ట్రిబ్యూటరీ కెనాల్ లైనింగ్, బెడ్ లైనింగ్ చేసి కాలువలు పూర్తిస్థాయిలో ఆధునికీకరించి ఇంతకు మునుపు ఆయకట్టు 6,125 ఎకరాలతో పాటు, అదనంగా 2,400 గ్యాపు ఆయకట్టుకు నీరందించేందుకు వీలుగా అధికారులు ప్రస్తుతం *43.65 కోట్లతో అంచనాలు రూపొందించారు. ప్రస్తుతం ఈ ఆయకట్టు ఆధునికీకరణ ద్వారా కేపీ అగ్రహారం, తంగమిట్ట ఎగువ, దిగువ కుచివారి పల్లె, లక్ష్మీపురం, సెకువారిపల్లె, దిగువ ముదికుప్పం, చొక్కమడుగు, భట్టువారిపల్లె, కత్తెరపల్లె గ్రామాలకు లబ్ధి చేకూరనుంది. ప్రతిపాదనలు సిద్ధం.... అరణియార్, కృష్ణాపురం ప్రాజెక్టు పనుల ఆధునికీకరణ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ఇప్పటికే అంచనాలను సైతం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాం. జపాన్ బృందం పర్యటించాక, ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నాం. -ఎస్వీ. నాగభూషణం, ఇరిగేషన్ ఈఈ తిరుపతి
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement