-
మహాకూటమి అభ్యర్థుల నామినేషన్లు
సోలాపూర్: మహాకూటమి అభ్యర్థులు రామ్ సాత్ పూతే, రంజిత్ సింహ నింబాల్కర్ మంగళవారం సోలాపూర్, మాడా లోక్సభ నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లకు ముందుగా ధర్మవీర్ చత్రపతి శ్రీ శంభాజీ మహారాజ్కు ఇరువురు అభ్యర్ధులు ఘన నివాళులర్పించారు. అనంతరం ఛత్రపతి శ్రీ శంభాజీ మహారాజ్ చౌక్ నుంచి కార్యకర్తలు భారీ ర్యాలీగా తరలిరాగా ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో సోలాపూర్ అభ్యర్థిగా రామ్ సాత్ పూతే మాడా అభ్యరి్థగా రంజిత్ సింహ నింబాల్కర్ సోలాపూర్ కలెక్టర్, జిల్లా ఎన్నికల నిర్వహణాధికారి కుమార్ ఆశీర్వాద్కు నామినేషన్లను సమర్పించారు. ఈ ర్యాలీలో ఎంపీ జై సిద్దేశ్వర స్వామి, ఎమ్మెల్యే విజయ్ దేశ్ముఖ్, సచిన్ కళ్యాణ్ శెట్టి, సుభాష్ దేశముఖ్, యశ్వంత్ మానే, సమాధాన్ అవతాడే, భవన్ రావు షిండే, సంజయ్ షిండే, జై కుమార్ గోరే, షాహాజీ పాటిల్, మాజీ మంత్రి లక్ష్మణరావు డోబలే, మాజీ ఎమ్మెల్యే రాజన్ పాటిల్, ప్రశాంత్ పరిచారక్, దీపక్ బాబా సాలోంకే, కిషోర్ దేశ్ పాండే, విక్రం దేశముఖ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు నరేంద్ర కాలే, జిల్లా అధ్యక్షుడు చేతన సింహ కేదార్, షాజీపవార్ తదితరులు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో బీజేపీ, శివసేనలతో పాటు మహాకూటమిలోని ఇతర పార్టీల ఆఫీస్ బేరర్లు, ప్రతినిధులు, కార్యకర్తలు తమ పార్టీల జెండాలను చేతబూని ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. నాయకులందరూ ప్రత్యేక ప్రచార రథంలో నిలుచుని ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదలగా వేలాది మంది కార్యకర్తలు నినాదాలు చేస్తూ వారిని అనుసరించారు. ర్యాలీ చత్రపతి శ్రీ శంభాజీ మహరాజ్ చౌక్ నుంచి ప్రారంభమై చత్రపతి శివాజీ మహారాజ్ చౌక్, మెకానిక్ చౌక్, సరస్వతి చౌక్, చారు హుతాత్మ పూతల చౌక్కు చేరుకున్న అనంతరం శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి అలాగే అక్కడ ఉన్న నలుగురు అమర వీరుల విగ్రహాలకు, అహల్యా దేవి హోల్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు నాయకులంతా అంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రసంగిస్తూ ...ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజలు ఓటింగ్లో పాల్గొనేలా చూడాలని, కార్యకర్తల్లో ఉత్సాహం నింపేలా మార్గదర్శనం చేయాలని సూచించారు. మోదీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి వల్ల బీజేపీ ఈ రెండు స్థానాలను సునాయాసంగా గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ధైర్య శీల మోహితే పాటిల్ కూడా... మరోవైపు మాడా లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్సీపీ పవార్ పార్టీ తరపున ధైర్య శీల మోహితే పాటిల్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మాడా నియోజకవర్గం ఎన్నికల అధికారి మోనికా సింహ ఠాకూర్కు నామినేషన్ను సమర్పించారు. పాటిల్ రెండు రోజుల క్రితమే బీజేపీకి రాజీనామా చేసి ఎన్సీపీ పవార్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన సోదరుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి విజయ్ సింహ మోహితే పాటిల్ డమ్మీ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ధైర్యశీల్ మోహితే పాటిల్ సతీమణి శీతల్ దేవి, సోదరుడు జయసింహ మోహితే పాటిల్ , మాజీ ఎమ్మెల్యే నారాయణ పాటిల్, పవార్ ఎన్సీపీ జిల్లా అధ్యక్షుడు బలిరాం కాకాసాటే, సురేష్ అసాపురే, శివసేనకు చెందిన అనిల్ కోకిల్ తదితరులు పాల్గొన్నారు. -
‘లెహరాయి’ నుంచి ‘అప్సరస.. అప్సరస’సాంగ్ రిలీజ్
రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్గా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘లెహరాయి’. రామకృష్ణ పరమహంస ని దర్శకుడి గా పరిచయం చేస్తూ బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో మద్దిరెడ్డి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘అప్సరస అప్సరస’ అనే మరో సాంగ్ ను కూడా విడుదల చేశారు మేకర్స్. గేయ రచయిత శ్రీమణి రచించిన ఈ పాటని రేవంత్ ఆలపించారు.‘తీపితో తేల్చి చెప్పా.. తొలితీపి నీ పలుకని .. తారనే పిలిచి చూపా ..తొలి తారా నీ నవ్వని’లాంటి లైన్స్ మంచి ఫీల్ ను క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రంలో మొత్తం 7 సాంగ్స్ ఉన్నట్లు, మంచి ఫీల్ ఉన్న కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు దర్శకుడు రామకృష్ణ పరమహంస’ తెలిపారు. ఈ చిత్రంలో ధర్మపురి ఫేం గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
ఏప్రిల్ 28న ఏం జరిగింది?
రంజిత్, షెర్రీ అగర్వాల్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఏప్రిల్ 28న ఏం జరిగింది’. వీరాస్వామి.జి. స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రాన్ని మార్చి 5న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వీరాస్వామి జి. మాట్లాడుతూ– ‘‘ఏప్రిల్ 28న ఏం జరిగింది?’ అనే డిఫరెంట్ టైటిల్తోనే అందరిలోనూ ఆసక్తిని కలిగించింది మా చిత్రం. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్తో మరింత ఉత్కంఠను పెంచింది. నేటి తరం ప్రేక్షకులు మెచ్చే ఓ వినూత్నమైన కథతో, ట్విస్టులతో రూపొందింది. ప్రతి మలుపు ఆసక్తికరంగా, థ్రిల్లింగ్గా ఉంటుంది. థ్రిల్లర్ జోనర్లో ఇటువంటి కాన్సెప్ట్తో ఇప్పటివరకు సినిమా రాలేదు’’ అన్నారు. తనికెళ్ల భరణి, అజయ్, రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర, తోటపల్లి మధు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సందీప్, కెమెరా: సునీల్కుమార్. -
మావోయిస్టు నంబర్–2గా రంజిత్ బోస్
న్యూఢిల్లీ: సీపీఐ(మావోయిస్టు) పార్టీ అగ్రనాయకత్వంలో కీలక మార్పు చోటుచేసుకుంది. పార్టీ రెండో స్థానంలోకి బెంగాల్లోని హౌరా ప్రాంతానికి చెందిన రంజిత్ బోస్(63) అలియాస్ కబీర్ను ఎంపిక చేసుకుంది. గెరిల్లా యుద్ధతంత్రంతోపాటు భద్రతా బలగాలకు వ్యతిరేకంగా సామాన్య ప్రజలను ఏకం చేయడంలో ఈయన దిట్ట. రంజిత్ తలపై బెంగాల్, జార్ఖండ్, తెలంగాణ రాష్ట్రప్రభుత్వాలు ప్రకటించిన రివార్డు మొత్తం రూ.కోటి వరకు ఉంది. బిహార్, జార్ఖండ్లతోపాటు తూర్పు భారతంలో పార్టీ పట్టు పెంచడం, సంచలన ఘటనలకు కార్యరూపం ఇచ్చేందుకే పార్టీ ఈ మార్పు చేపట్టిందని భావిస్తున్నారు. పార్టీలో రెండో స్థానంలో ఉన్న బెంగాల్లోని మిడ్నపూర్కు చెందిన ప్రశాంత్ బోస్(74)స్థానంలో రంజిత్ నియమితులయ్యారు. అగ్ర నేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ సహా కీలక నేతలంతా ఇటీవల పశ్చిమబెంగాల్ అడవుల్లో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మావోయిస్టు పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక విభాగం పొలిట్బ్యూరోలో ప్రస్తుతం నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్, రంజిత్ బోస్, మాజీ అధిపతి గణపతి, మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్, కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్, మిసిర్ బిస్రా అలియాస్ సాగర్ ఉన్నారు. బెంగాల్లో 2007లో నందిగ్రామ్లో నానో కార్ల ఫ్యాక్టరీని స్థాపించడంతో నాడు జరిగిన వ్యతిరేకోద్యమాన్ని రంజిత్ వెనక ఉండి నడిపించారు. దీంతోపాటు 44 గ్రామాలతో కూడిన లాల్గఢ్ను విముక్త ప్రాంతంగా ప్రకటించిన వ్యక్తిగా రంజిత్ బోస్కు పేరుంది. (చదవండి: షహీన్బాగ్ షూటర్ ఆప్ సభ్యుడే) -
రాహుల్ గాంధీని పబ్లిక్లో కొట్టాలి..
ముంబై: హిందూత్వ యోధుడు వీడీ సావర్కర్ను అవమానించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ప్రజల మధ్య నిల్చోబెట్టి కొట్టాలని సావర్కర్ మనవడు రంజిత్ సావర్కర్ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కోరారు. ఎవరైనా సావర్కర్ను అవమానిస్తే పబ్లిక్లో కొట్టాలని గతంలో ఉద్ధవ్ ఠాక్రే పిలుపునిచ్చిన విషయాన్ని రంజిత్ గుర్తు చేశారు. రంజిత్ సావర్కర్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘మా తాత బ్రిటిష్ వారికి క్షమాపణ చెప్పారని రాహుల్ పదేపదే అంటున్నారు. అది నిజం కాదు. జైలు నుంచి విడుదల అయ్యేందుకు బ్రిటిష్ వారు పెట్టిన నిబంధనలకు ఆయన అంగీకరించారు. అంతేకానీ క్షమాపణ చెప్పలేదు’ అని వివరణ ఇచ్చారు. ‘పౌరసత్వం’ సావర్కర్కు భిన్నం: శివసేన బీజేపీ తీసుకొచ్చిన పౌరసత్వ చట్టం హిందూవాద నాయకుడైన వీర్ సావర్కర్ ఆలోచనలకు భిన్నమైనదని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. మహిళలకు రక్షణ లేకపోవడం, నిరుద్యోగం, వ్యవసాయ సమస్యలను కప్పిపుచ్చేందుకు బీజేపీ ‘పౌరసత్వ’ వాదనను తెరపైకి తెచ్చిందని అన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఒకే దేశం ఉండాలని సావర్కర్ ఆకాంక్షించారని, ఇప్పుడు ఆయన ఆలోచనలకు తూట్లు పొడిచేలా ఇతర దేశాల మైనారిటీలను భారత్లోకి బీజేపీ ఆహ్వాని స్తోందని అన్నారు. (చదవండి: నా పేరు రాహుల్ సావర్కర్ కాదు)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement