-
నాగార్జున సాగర్లో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ!
నాగార్జున సాగర్: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో కీలక నాయకుడు మన్నెం రంజిత్ యాదవ్ పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్న ఆయన.. కారు దిగేందుకు ఇప్పటికే ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 500 మందితో కలిసి కాషాయ కండువా కప్పుకొనేందుకు ఇప్పటికే ఏర్పాట్లు సైతం పూర్తయినట్లు సమాచారం. నియోజకవర్గ, నాయకులతో కలిసి రెండు రోజులు క్రితం బీజేపీ రాష్ట్ర నాయకులతో చర్చలు జరిపినట్లు తెలిసింది. బీజేపీలోకి రావాలని పార్టీ నాయకులు ఆ యంగ్ లీడర్ను ఆహ్వానించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కీలక నేతల హామీ మేరకు బీజేపీలో చేరాలని యువ నాయకుడు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే ఆయన బీజేపీలో అధికారికంగా చేరనున్నట్లు తెలుస్తోంది. కొద్ది కాలంగా బీఆర్ఎస్లో తనకు లభించే ప్రాధాన్యత మూలంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. జనాల్లో ఆదరణ ఉన్న బీసీ నాయకుడు విదేశాల నుంచి స్వదేశానికి సేవ చేయాలనే ఆలోచనలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. యాదవ్ సామాజికవర్గం నుంచి గట్టి పట్టు ఉన్న నాయకుడు మన్నెం రంజిత్ యాదవ్ బీజేపీలోకి వస్తే పార్టీ మరింత బలపడుతుందని బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో కారు దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం అయింది. ఈ యువ నాయకుడితో పాటు పలువురు నాయకులు కూడా తనతో పాటు కమలం గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ ఇవ్వనున్నారనే చెప్పవచ్చు. దీంతో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో రాజకీయాల్లో చర్చలు మొదలయ్యాయి. మాజీ ఎమ్మెల్యే మనవడు గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ మనవడు, టీఆర్ఎస్ యువనేత మన్నెం రంజిత్ యాదవ్కు ఈసారి నాగార్జునసాగర్ నియోజకవర్గం టికెట్ దక్కే అవకాశం ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. నియోజకవర్గంలో రామ్మూర్తికి ఉన్న మంచి పేరు రంజిత్కు కలిసి వస్తుందని, ఆయనకు టికెట్ కేటాయిస్తే కారు పార్టీకే విజయం వరిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న మన్నెం రంజిత్ యాదవ్ కరోనా సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో సాగర్ నియోజకవర్గ ప్రజలు తమకు అందుబాటులో ఉండే నేతను ఎమ్మెల్యే అభ్యర్థి నిలిపితే బాగుంటుందని పలువరు స్థానికులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కానీ.. నాగార్జునసాగర్లో సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్కు అధిష్టానం టికెట్ కేటాయించింది. ఈ నేపథ్యంలో పార్టీ మార్పు వంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. -
ఆగని అసంతృప్తులు.. సాగర్ ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలని డిమాండ్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : అధికార బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులు ఆగడం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశావహులు, అసంతృప్తుల మధ్య ఫైట్ కొనసాగుతూనే ఉంది. కనీసం వారిని బుజ్జగించే చర్యలు కూడా కనిపించకపోవడంతో ఎవరి ప్రచారంలో వారు మునిగారు. అధికార పార్టీలోనే ఉంటూ తిరుగుబాటు జెండా ఎగురవేసిన అసంతృప్తులు బీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కొన్ని చోట్ల అభ్యర్థులను మార్చాలని డిమాండ్ చేస్తుండగా, మరికొన్ని చోట్ల తమకు టికెట్ ఇవ్వాలని పట్టుపడుతున్నారు. నల్లగొండ వంటి నియోజకవర్గాల్లో అధికార పార్టీ టికెట్ ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంటామంటూ ఆశావహులు తిరుగుబాటు చేస్తుండగా, ఇంకొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ రాజకీయం గందరగోళంగా మారింది. వేచి చూసే ధోరణిలో అధిష్టానం.. నియోజకవర్గాల్లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నా బీఆర్ఎస్ అధిష్టానం ఇంకా వేచిచూసే ధోరణిలోనే ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సిట్టింగ్లు పోటీలో ఉంటారంటూ అభ్యర్థుల జాబితా ప్రకటించిన నాటి నుంచి ఆశావహులు ఎవరికి వారే కార్యక్రమాలను చేసుకుంటున్నా నిలువరించిన సందర్భాలు లేవు. ఇదీ అభ్యర్థులుగా పోటీలో ఉండబోయే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. ఇటు సిట్టింగ్ అభ్యర్థులు, అటు ఆశావహులు ఎవరికి వారు ప్రచారం కొనసాగిస్తుండడంతో అసలు అధిష్టానం టికెట్ ఎవరికి ఇస్తుంది? ఇప్పుడు ప్రకటించిన వారికే వస్తుందా? ఏమైనా మార్పులు ఉంటాయా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా పైకి టికెట్ తమకేనని గంభీరంగా కనిపిస్తున్నా లోలోపల వారికి ఆందోళన తప్పడం లేదని ఓ ముఖ్య నాయకుడు ‘సాక్షి’తో పేర్కొనడం పరిస్థితికి అద్దం పడుతోంది. పలు నియోజకవర్గాల్లో ఇదీ పరిస్థితి.. ► నాగార్జునసాగర్లో సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్కు అధిష్టానం టిికెట్ కేటాయించింది. అయితే ఆశావహలు మాత్రం తమ కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉన్నారు. బుసిరెడ్డి పాండురంగారెడ్డి, మన్నెం రంజిత్ యాదవ్ టికెట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. వారి అనుచరులు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక నేత మన్నెం రంజిత్ యాదవ్కు టికెట్ ఇవ్వాలని నియోజకవర్గంలోని ప్రజలు కోరుతున్నారు. రంజిత్ యాదవ్ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ స్థానికంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పేర్కొంటూ, ఆయనకే టికెట్ ఇవ్వాలని సూచిస్తున్నారు. ► నల్లగొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డికే అధిష్టానం టికెట్ ఇస్తామని ప్రకటించింది. అయితే పట్టణానికి చెందిన కౌన్సిలర్, బీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షుడు పిల్లి రామరాజుయాదవ్ తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని ప్రకటించారు. తాజాగా తన ఫ్లెక్సీలు భూపాల్రెడ్డి వర్గం నేతలు చింపారంటూ మంగళవారం నల్లగొండలో నిరసన ర్యాలీ చేపట్టారు. ► నకిరేకల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకే టికెట్ అని అధిష్టానం ప్రకటించింది. దీంతో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయనతో మంత్రి జగదీష్రెడ్డి మాట్లాడినా ప్రయోజనం లేకుండాపోయింది. కాంగ్రెస్లో చేరేందుకు ఢిల్లీకి వెళ్లి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని కూడా కలిశారు. ► దేవరకొండలోనూ అసంతృప్తి చల్లారడం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్రకుమార్కు టికెట్ ప్రకటించక ముందు నుంచే ఆయనకు టికెట్ ఇవ్వొద్దంటూ అధిష్టానానికి స్థానిక నేతలు విన్నవించారు. మంత్రి హరీశ్రావును కలిసి తమ వ్యతిరేకతను తెలియజేశారు. దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, దేవేందర్నాయక్ వర్గం రవీంద్రకుమార్ అభ్యర్థిత్వాన్ని మార్చాలని డిమాండ్ చేసింది. దేవేందర్నాయక్ ఇటీవల తన అనుచరులతో సమావేశాలు నిర్వహించడంతోపాటు తనకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ► కోదాడలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ను మార్చాలని ఆయన వ్యతిరేకవర్గం పట్టుపడుతోంది. అక్కడి పార్టీ నేతలు శశిధర్రెడ్డి, చందర్రావు ఎమ్మెల్యేతో విభేదిస్తూ తమకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ► ఆలేరులో నియోజకవర్గానికి చెందిన మోత్కుపల్లి నర్సింహులు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఆలేరు అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డి పేరు ఖరారైన తరువాత మోత్కుపల్లికి ఉమ్మడి జిల్లాలో ఎక్కడి నుంచైనా పోటీ చేసే అవకాశం కల్పించాలని ఆయన అనుచరులు సమావేశం పెట్టి డిమాండ్ చేస్తున్నారు. పట్టించుకోవడం లేదెందుకో? వివిధ నియోజకవర్గాల్లో పార్టీ నేతలు రెండు వర్గాలుగా చీలిపోతున్నా, పార్టీలో ఉండి అధిష్టానం ప్రకటించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా పని చేస్తున్నా, ఆశావహులు తమకు అవకాశం కల్పించాలని సొంతంగా కార్యక్రమాలు చేసుకుంటున్నా.. అధిష్టానం ఎందుకు ఈ విషయంలో మిన్నకుండిపోతుందన్న దానిపైనే చర్చ సాగుతోంది. అసంతృప్తులను దారికి తెచ్చుకోవడం, లేదా పార్టీ నిబంధనలకు కట్టుబడి ఉండని వారిపై చర్యలు తీసుకోవడం వంటి కార్యాచరణను ఎందుకు అమలు చేయడం లేదన్న దానిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది సిట్టింగుల్లోనూ ఆందోళన నెలకొంది. అభ్యర్థులుగా పేర్లు ప్రకటించినా, చివరికి టికెట్ ఇస్తారా? లేదా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. మరోవైపు అధిష్టానం సర్వే చేయిస్తోందని, దాని ఫలితాలు వచ్చాకే అసంతృప్తుల విషయంలో నిర్ణయాలు తీసుకుంటుందన్న వాదనను పార్టీ వర్గాల నుంచి వస్తున్నా.. సిట్టింగ్లకు మాత్రం చికాకు తప్పడం లేదు. -
బొల్లం రవిని పరామర్శించిన బీఆర్ఎస్ నేత మన్నెం రంజిత్ యాదవ్
నల్గొండ: ఇటీవల కిడ్నీ స్టోన్స్ సమస్యతో బాధపడుతూ ఆపరేషన్ చేయించుకున్న నాగార్జునసాగర్ నియోజకవర్గం నిడమనూరు మండల బీఆర్ఎస్ నేత బొల్లం రవి యాదవ్ను ఆ పార్టీ రాష్ట్ర నాయకులు మన్నెం రంజిత్ యాదవ్ మంగళవారం పరామర్శించారు. ఆయన పాటు బీఆర్ఎస్ నేతలు ఆవుల పురుషోత్తం యాదవ్, హాలియా ఏయంసి డైరెక్టర్ పోశం శ్రీనివాస్ గౌడ్, మైనారిటీ సీనియర్ నాయకులు అబ్దుల్ హలీం, గురజాల సైదులు, కుంటిగొర్ల రాజశేఖర్, పగిడిమర్రి అనిల్ కుమార్ ఉన్నారు. -
టాటా ‘మోవస్’ @రూ. 6.99 లక్షలు
న్యూఢిల్లీ: దేశీ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ సరికొత్త ఎంట్రీలెవెల్ యుటిలిటీ వాహనం ‘మోవస్’ను మంగళవారం ఇక్కడ విడుదల చేసింది. దీని ధర రూ.6.99 లక్షల నుంచి(ఎక్స్షోరూమ్,ఢిల్లీ) ప్రారంభమవుతుం దని కంపెనీ వెల్లడించింది. ‘పెద్ద కుటుంబాల కోసం విశాలంగా ఉండటంతో పాటు, సులువైన నిర్వహణ, దగ్గర, దూర ప్రయాణాలకు అనువుగా మోవస్ను రూపొందించాం. సౌకర్యాల విషయంలో ఎలాంటి రాజీపడకుండానే అత్యుత్తమ విలువలతో ఈ వాహనం లభిస్తుంది. 2.2 లీటర్ వేరికార్ ఇంజిన్ కలిగిన ఈ వాహనం సిటీ, హైవేలు రెండింటికీ ఉపయోగకరంగా ఉంటుంది’ అని టాటా మోటార్స్ ప్రెసిడెంట్(ప్రయాణికుల వాహన విభాగం) రంజిత్ యాదవ్ పేర్కొన్నారు. మెట్రో, కొన్ని ఎంపిక చేసిన నగరాల్లోని అన్ని డీలర్షిప్ కేంద్రాల్లోనూ మోవస్ లభ్యమవుతుందని రంజిత్ యాదవ్ చెప్పారు.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
యాంకర్ శ్రీముఖికి త్వరలో పెళ్లి? రివీల్ చేసిన 'జబర్దస్త్' కమెడియన్
రాజస్తాన్ను చిత్తు చేసిన చెన్నై.. ప్లే ఆఫ్స్ రేసులో మున్ముందుకు
చంద్రబాబు, ఈనాడు, ఆర్ టీవీపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
గొప్ప మనసుకు చాటుకున్న అనంత్ అంబానీ.. ఏం చేసారో తెలుసా?
ఎన్నికల భయం.. 10 రోజుల్లో రూ. 17,000 కోట్లు వెనక్కి..
ప్రకాశం: ఎస్పీని కలిసిన బాలినేని, చెవిరెడ్డి
పల్నాడు జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ మూకలు
ఓటు వేయకపోతే ఆ దేశాల్లో ఎలాంటి శిక్షలు విధిస్తారో తెలుసా!
గౌతమ్ సింఘానియా రూ.5.91 కోట్ల కారు ఇదే!
చీరలో ముద్దుముద్దుగా జాన్వీ.. లుక్ మార్చేసిన సీరియల్ బ్యూటీ!
తప్పక చదవండి
- పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!
- నాడు చెప్పుతో కొట్టి.. నేడు ‘కాపు’ కాస్తానంటూ కాకమ్మ కబుర్లు!
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
- సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
- RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!
- దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
Advertisement