-
‘రూ.కోటి సిద్ధం చేసుకో లేదా..’ గ్యాంగ్స్టర్ ఫోన్.. చివర్లో అదిరే ట్విస్ట్!
చండీగఢ్: అపరిచితులు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసే సంఘటనలు చాలా సినిమాల్లో కనిపిస్తుంటాయి. అదే విధంగా ఓ గ్యాంగ్స్టర్ ఓ వ్యక్తికి ఫోన్ చేసి రూ.1 కోటి సిద్ధం చేసుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని బెదిరించాడు. చిరు వ్యాపారం చేసుకునే ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించటంతో అసలు విషయం బయటపడింది. ఆ వ్యక్తికి కాల్ చేసింది అతడి మనవడే. ఈ సంఘటన పంజాబ్లోని పటాన్కోట్లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఫిర్యాదు దారు తన దుకాణం నుంచి ఇంటికి తిరిగి వచ్చి రాత్రి 8.50 గంటల ప్రాంతంలో టీవీ చూస్తుండగా ఫోన్ కాల్ వచ్చింది. తాను ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నానని, తనకు ‘ఖోఖా’ (రూ.1కోటి) ఇవ్వాలని లేదా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని బెదిరించాడు. ఆ మాట విని ఆందోళన చెందిన పెద్దాయన వెంటనే ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఫోన్ చేశాడు. దీంతో భయాందోళన చెందిన ఆ వృద్ధుడు కుటుంబ సభ్యులకు తెలిపాడు. వారి ప్రోత్సాహంతో షాపుర్ కండీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘నేను ఆశ్చర్యపోయా, నేను పెద్ద వ్యాపారవేత్తను కాదు. నాకు భూములు, ఇతర ఆస్తులు లేవు. గ్యాంగ్ స్టర్ నాకేందుకు ఫోన్ చేశాడని ఆశ్చర్యమేసింది.’ అని బాధితుడు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఫోన్ నంబర్ ఆధారంగా గ్యాంగ్స్టర్ను గుర్తించి అరెస్ట్ చేశారు. అతడు బాధితుడి మనవడే అని తేలింది. తన తాతను బెదిరించేందుకు కొత్త సిమ్ కొనుగోలు చేసినట్లు గుర్తించామని డిప్యూటీ సబ్ ఇన్స్పెక్టర్ రాజిందర్ మంహాస్ తెలిపారు. నిందితుడిపై పలువు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ఇదీ చదవండి: పెళ్లింట విషాదం: రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి.. వరుడి పరిస్థితి విషమం -
ఒమన్లో భారతీయుడి కిడ్నాప్.. భారీ మొత్తం డిమాండ్
ఒమన్లో ఓ భారతీయ కార్మికుడు కిడ్నాప్ అయ్యాడు. అతడిని విడిపించాలంటే భారీ మొత్తం ఇచ్చుకోవాల్సి ఉంటుందని అతడి కుటుంబ సభ్యులకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కేరళకు చెందిన హనీఫా అనే వ్యక్తి రెండు రోజుల క్రితం సోహర్ నగరంలో స్నేహితులను కలవడానికి వెళ్లినప్పుడు అపహరణకు గురయ్యాడు. ఎవరో స్నేహితుల వద్దకు వెళ్లి ఉంటాడని కుటుంబ సభ్యులు కూడా ఊరుకున్నారు. అయితే.. సౌదీ అరేబియాలో నివసించే అతడి బావమరిదికి ఆ తర్వాత ఉర్దూలో మాట్లాడిన కొంతమంది బెదిరింపు ఫోన్ కాల్స్ చేశారు. దీంతో హనీఫా కిడ్నాప్ అయినట్లు బంధువులకు అర్థమైంది. అతడి విడుదలకు వారు భారీ మొత్తం డిమాండ్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తమ ఆచూకీ తెలియకుండా ఉండేందుకు వారు ఇంటర్నెట్ నుంచి ఫోన్ కాల్స్ చేస్తున్నారు. తర్వాత అవి కూడా ఆగిపోయాయి. హనీఫా వద్ద ఉన్న ఫోన్ నుంచి కాల్స్ చేయడం ప్రారంభించారు. మొదట అతడి విడుదలకు దాదాపు 3.32 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు గానీ, తర్వాత ఆ డిమాండు మరింత పెరిగింది. దాన్ని వేరే దేశంలో డిపాజిట్ చేయాలని వారు కోరారు. అయితే, పోలీసులు త్వరలోనే కేసును ఛేదిస్తారని ఓ సామాజిక కార్యకర్త చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
Advertisement