-
డీఐజీ సారూ..దీనికేంచెబుతారు!
అనంతపురం: రాప్తాడు తహశీల్దార్ కార్యాలయంలో జరిగిన వైఎస్సార్సీపీ నాయకుడు శివప్రసాద్రెడ్డి హత్య అనంతరం తన అనుచరులు ప్రభుత్వ ఆస్తులపై ధ్వంసం చేస్తుంటే వారిని అడ్డుకోనందునే అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డిని అరెస్ట్ చేశామని డీఐజీ బాలకృష్ణ నిన్న విలేకరుల సమావేశంలో తెలపడం వాస్తవ విరుద్ధంగా ఉంది. సంఘటన జరిగిన రోజు ఆందోళనకారులు తహశీల్దార్ కార్యాలయం, కార్యాలయ ఆవరణలోని ద్విచక్రవాహనాలపై దాడులు చేస్తుంటే స్వయంగా మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి అడ్డుకున్నట్లు అప్పుడు తీసిన వీడియోలు, ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. గురునాథరెడ్డి ఆందోళనకారులను అడ్డుకుంటూ పక్కకు తోస్తున్నట్లు ఈ వీడియో ఫుటేజీలో కనిపిస్తున్నాయి. పోలీసులు మాత్రం ఆయన తన అనుచరులను అడ్డుకోనందునే కేసులు నమోదు చేశామని చెబుతున్నారు. పైగా తాము వీడియో రికార్డులు పరిశీలించామని అందులో గురునాథరెడ్డి, దాడి జరుగుతుంటే చూస్తూ నిలబడినట్లు స్పష్టంగా గుర్తించామని చెబుతున్నారు. మరి ఈ ఫుటేజీలకు పోలీసుల నుంచి ఏం సమాధానం వస్తుందో మరి. రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ నేత తోపుదుర్తి చంద్రశేఖర్రెడ్డి కూడా ప్రసాద్రెడ్డి మృతదేహాన్ని చూసిన అనంతరం రోడ్డు పక్కన చెట్టుకింద కూర్చున్నారని, అయినా ఆయనపైనా అక్రమంగా కేసు బనాయించారని ఆరోపిస్తున్నారు. మంత్రి సునీత సూచనల మేరకు ఈ కేసుల నమోదు చేశారనేది స్పష్టమవుతోందని పార్టీ శ్రేణులంటున్నాయి. ఈ అక్రమ అరెస్టులపై డీజీపీ, ఐజీ, ఎస్పీకి నోటీసులు జారీ చేసి విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ నారాయణరెడ్డి మానవ హక్కుల కమిషన్కు ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదు చేశారు. -
అవి సర్కారీ హత్యలే: రఘువీరా
అనంతపురం: అనంతపురం జిల్లా రాప్తాడు మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన హత్య అయితేనేమీ, కిష్టపాడు సింగిల్ విండో కార్యాలయంలో జరిగిన హత్య తీరు పరిశీలిస్తే అవి వంద శాతం సర్కారీ హత్యలే అని స్పష్టమవుతోందని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. అనంతపురం జిల్లాలో హత్యల పరంపర చూస్తుంటే ప్రభుత్వమే లెసైన్స్ ఇచ్చినట్లు అనిపిస్తోందన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో హత్య జరిగిన తరువాత చాలా సమయానికి కార్యాలయానికి నిప్పు పెట్టడంలోనూ అనుమానాలకు తావిస్తోందన్నారు. బుధవారం ఆయన అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement