-
ఆంధ్రలో వేగంగా క్రికెట్ అభివృద్ధి.. అద్భుతం: టీమిండియా మాజీ క్రికెటర్
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ అభివృద్ధికై రోడ్ మ్యాప్ తయారు చేశామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.ఆర్. గోపినాథ్రెడ్డి తెలిపారు. అధ్యక్షుడు పి.శరత్ చంద్రారెడ్డి ఆదేశాల మేరకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఏసీఏ 70 ఏళ్ల పండగను సోమవారం వైజాగ్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీఏ కార్యదర్శి గోపినాథ్రెడ్డి మాట్లాడుతూ.. ఆటగాళ్ల భవిష్యత్ గురించే తాము నిత్యం తపనపడుతుంటామని పేర్కొన్నారు. ఏసీఏ ఆధ్వర్యంలో దేశంలోనే మొట్ట మొదటి సారిగా వుమెన్ టీ20 మ్యాచ్ నిర్వహించినట్లు ఆయన గుర్తు చేశారు. ఆంధ్రలో వేగంగా క్రికెట్ అభివృద్ధి: టీమిండియా మాజీ క్రికెటర్ అనంతరం ఇండియా మాజీ క్రికెటర్, ఇండియన్ నేషనల్ క్రికెట్ మాజీ కోచ్ మదన్ లాల్ మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రలో ఎంతో మంది ప్రతిభ ఉన్న క్రికెటర్లు ఉన్నారు., భవిష్యత్తులో వారు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించేలా ఎదగాలి’’ అని ఆకాంక్షించారు. ఇక్కడున్న యువ క్రికెటర్లను ఇక్కడ చూడటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఏసీఏ పనితీరు అద్భుతం అని మదన్ లాల్ ఈ సందర్భంగా ప్రశంసించారు. ఏపీఎల్ సూపర్ ప్రతిభ ఉన్న యువ క్రికెటర్లను వెలికి తీసేందుకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఆంధ్రలో క్రికెట్ ఎంతో అభివృద్ధి చెందుతోందని మదన్ లాల్ ప్రశంసించారు. ఇక ఈ సమావేశంలో.. పలువురు మాజీ రంజీ ప్లేయర్లు, మాజీ ఉమెన్ సీనియర్ ప్లేయర్స్, రంజీ ట్రోఫీ కెప్టెన్లు, క్రికెట్ కమిటీ సభ్యులకు, ఏసీఏ ఉద్యోగులకు, లీగల్ కమిటీలకు గోపినాథ్ రెడ్డి, ఏసీఏ ఉపాధ్యక్షులు పి. రోహిత్ రెడ్డి, మదన్ లాల్ జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎల్ చైర్మన్ మాంచో ఫెర్రర్, ఏసీఏ సంయుక్త కార్యదర్శి ఎ. రాకేశ్, ట్రెజరర్ ఏ.వి. చలం, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు కె.వి.పురుషోత్తం, జితేంద్ర నాథ్ శర్మ, సిఈఓ ఎం.వి. శివారెడ్డి, మాజీ రాష్ట్ర కార్యదర్శులు ఎన్. వెంకట రావు, చాముండేశ్వరి నాథ్ , అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఆదివారం జరిగిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఫైనల్కు టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ హాజరైన విషయం తెలిసిందే. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియంలో జరిగిన తుదిపోరులో డిపెండింగ్ చాంపియన్ కోస్టల్ రైడర్స్ను రాయలసీమ కింగ్స్ ఓడించింది. తద్వారా ఏపీఎల్-2 విజేతగా అవతరించింది. చదవండి: 13 ఏళ్ల వయస్సులోనే అవమానాలెన్నో.. అయినా వరల్డ్ ఛాంపియన్! -
APL 2 Winner: టైటిల్ విజేత రాయలసీమ కింగ్స్
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 2 విజేతగా రాయలసీమ కింగ్స్ అవతరించింది. ఆదివారం నాటి ఫైనల్లో కోస్టల్ రైడర్స్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విశాఖపట్నంలోని డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి క్రికెట్ స్టేడియంలో రాయలసీమ కింగ్స్ ఆదివారం కోస్టల్ రైడర్స్ తో తలపడింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న రాయలసీమ కింగ్స్ కోస్టల్ రైడర్స్ ను 155 పరుగులకు కట్టడి చేసింది. రైడర్స్ బ్యాటర్లలో ఓపెనర్ ధరణి కుమార్ 30 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కింగ్స్ బౌలర్లలో షేక్ కలీముద్దీన్ మూడు వికెట్లతో చెలరేగాడు. హరీష్ శంకర్ రెడ్డి రెండు వికెట్లు తీయగా, జాగర్లపూడి రామ్, బోదాల వినయ్, కెప్టెన్ హనుమ విహారి తలా ఒక వికెట్ తీశారు. లక్ష్య ఛేదనకు దిగిన రాయలసీమ కింగ్స్ కు ఓపెనర్ తోట శ్రావణ్ 24 పరుగులతో శుభారంభం అందించాడు. మరో ఓపెనర్ కోగటం హనీష్ రెడ్డి డకౌట్ కాగా, వన్ డౌన్ బ్యాటర్ తన్నీరు వంశీకృష్ణ 3 పరుగులకే నిష్క్రమించాడు. ఇలా జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో హనుమ విహారి 29 బంతుల్లోనే 46 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. బోదాల కుమార్ 53 పరుగులతో అతడికి అండగా నిలిచాడు. ఆఖరిలో గిరినాథ్ రెడ్డి 17 బంతుల్లో 29 పరుగులతో రాణించి విహారితో కలిసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించిన నేపథ్యంలో విజేడి (వి.జయదేవన్ సిస్టం) పద్ధతి ద్వారా విజేతను నిర్ణయించారు. 16.3 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసిన రాయలసీమ కింగ్స్ ఛాంపియన్ గా అవతరించింది. డిఫెండింగ్ ఛాంపియన్ కోస్టల్ రైడర్స్ ను ఓడించి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఫైనల్ స్కోర్లు కోస్టల్ రైడర్స్- 155/8 (18 ఓవర్లు) రాయలసీమ కింగ్స్- 160/5 (16.3 ఓవర్లు) 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
APL 2: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సూపర్: 1983 విన్నర్ ప్రశంసలు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 1 అభిమానులను ఆకట్టుకుంది. స్థానిక ఆటగాళ్లలోని ప్రతిభను నిరూపించుకునేందుకు వేదిక అయింది. ఈ క్రమంలో ఏపీఎల్ రెండో ఎడిషన్ పై అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే ఆరు జట్లు పోటాపోటీగా తలపడి కావాల్సినంత వినోదం అందించాయి. ఇక ఇప్పుడు ఏపీఎల్-2 తుది అంకానికి చేరుకుంది. కోస్టల్ రైడర్స్, రాయలసీమ కింగ్స్ ఫైనల్ ఆడేందుకు అర్హత సాధించాయి. ఈ నేపథ్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో చాలా మంది సీజన్ 1 చాలా బాగా నిర్వహించారని ప్రశంసించినట్లు చెప్పారు. ఇక ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2 ఫైనల్స్ కి ముఖ్య అతిథిగా మాజీ ఇండియన్ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్ నాకు చాలా ఇష్టమైన రాష్ట్రం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టోర్నీ జరగడం చాలా ఆనందంగా ఉంది. ఆంధ్ర ప్రదేశ్ నుంచి మరి కొంత మంది క్రికెటర్లు రావాలని కోరుకుంటున్న. ఇప్పటికే ఏపీ మంచి క్రికెటర్లను అందించింది. యువ క్రికెటర్లకు మంచి అవకాశం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కల్పిస్తుంది అని పేర్కొన్నాడు. -
కోగటం రెడ్డి మెరుపు ఇన్నింగ్స్.. ఫైనల్లో రాయలసీమ కింగ్స్
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)లో రాయలసీమ కింగ్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో కింగ్స్ 3 పరుగుల తేడాతో గోదావరి టైటాన్స్పై విజయం సాధించింది. ముందుగా రాయలసీమ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీ స్కోరు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కోగటం రెడ్డి (47 బంతుల్లో 92; 7 ఫోర్లు, 8 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, గిరినాథ్ రెడ్డి (20 బంతుల్లో 43; 2 ఫోర్లు, 4 సిక్స్లు), వంశీ కృష్ణ (34 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచారు. అనంతరం గోదావరి టీమ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 215 పరుగులు చేసి పోరాడి ఓడింది. భూపతి రాజు వర్మ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్స్లు) ఒంటిచేత్తో జట్టును గెలిపించే ప్రయత్నం చేయగా, ఇతర ఆటగాళ్లనుంచి సహకారం లభించలేదు. నేడు జరిగే ఫైనల్లో కోస్టల్ రైడర్స్తో రాయలసీమ కింగ్స్ తలపడుతుంది. ముగింపు కార్యక్రమానికి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, మాజీ కెపె్టన్ కె.శ్రీకాంత్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. చదవండి: మూడో వన్డేలోను పాకిస్తాన్దే విజయం -
APL 2023: తుది అంకానికి ఏపీఎల్ సమరం.. ప్లే ఆఫ్స్ చేరిన జట్లు ఇవే
Andhra Premier League 2023: లీగ్ చివరి మ్యాచ్ ఏడు వికెట్ల తేడాతో పరాజయం పాలైన గోదావరి టైటాన్స్ ప్లే ఆఫ్ అవకాశాన్ని కోల్పోయింది. 16 పాయింట్లతో కోస్టల్ రైడర్స్ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఉత్తరాంధ్ర లయన్స్, రాయలసీమ కింగ్స్ జట్లు 12 పాయింట్లు సాధించగా.. మెరుగైన రన్ రేట్తో లయన్స్ రెండో స్థానంలో నిలిచింది. బెజవాడ టైగర్స్, గోదావరి టైటాన్స్ ఎనిమిదేసి పాయింట్లతో నిలిచినా మెరుగైన రన్రేట్తో టైగర్స్ ప్లేఆఫ్నకు అర్హత సాధించింది. దీంతో ఎలిమినేటర్ మ్యాచ్లో కింగ్స్తో టైగర్స్ తలపడనుండగా క్వాలిఫైయిర్ వన్లో రైడర్స్తో లయన్స్ తలపడనుంది. వైజాగ్ వారియర్స్ నాలుగు పాయింట్లతో రెండో సీజన్ ముగించింది. విశాఖ స్పోర్ట్స్: కోస్టల్ రైడర్స్ మరోసారి ప్లేఆఫ్నకు చేరుకుంది. ఏపీఎల్ సీజన్–2 లీగ్ చివరి మ్యాచ్లో రాయలసీమ కింగ్స్పై విజయం సాధించి 16 పాయింట్లతో టాప్లో నిలిచింది. వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో బుధవారం జరిగిన తొలి మ్యాచ్లో టాస్ గెలిచిన కోస్టల్ రైడర్స్ లక్ష్య ఛేదనకే మొగ్గు చూపింది. బ్యాటింగ్కు దిగిన రాయలసీమ కింగ్స్ 18 ఓవర్లలో 131 పరుగులు చేసింది. వరుణుడి అంతరాయం వరుణుడు 13 ఓవర్ వద్ద అంతరాయం కలిగించగా.. అప్పటికి కింగ్స్ జట్టు ఏడు వికెట్లకు 98 పరుగులు చేసింది. కెప్టెన్ హనుమ విహారి డకౌట్గా వెనుదిరగ్గా.. మరో ఓపెనర్ వీరారెడ్డి 45 బంతుల్లో 78 పరుగులు సాధించాడు. చివర్లో కమరుద్దీన్( 21 బంతుల్లో 23 పరుగులు)తో కలిసి స్కోర్ను ముందుకు నడిపాడు. తిరిగి ఆటను కొనసాగించగా కింగ్స్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేయగా.. మరోసారి వర్షం కారణంగా ఆటను నిలిపివేశారు. అబ్దుల్లా 4 వికెట్లు తీయగా స్టీఫెన్, మనోహార్ రెండేసి వికెట్లు పడగొట్టారు. చిరంజీవి అజేయ ఇన్నింగ్స్ దీంతో కోస్టల్ రైడర్స్కు డీఎల్ఎస్ పద్ధతిలో 17 ఓవర్లలో 124 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించారు. 14 ఓవర్లలోనే రెండు వికెట్లకు 127 పరుగులతో రైడర్స్ విజయం సాధించారు. ఓపెనర్ ధరణీకుమార్(18), కెప్టెన్ రషీద్(4) వికెట్లను 65 పరుగులకే రైడర్స్ కోల్పోయింది. మరో ఓపెనర్ ప్రణీత్ 64, చిరంజీవి 32 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్నందించారు. కమరుద్దీన్, హనుమ విహారి చెరో వికెట్ తీశారు. ప్లే ఆఫ్స్లో బెజవాడ టైగర్స్, ఉత్తరాంధ్ర లయన్స్ అసలు పోరులో చేతులెత్తేసిన టైటాన్స్ తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో గోదావరి టైటాన్స్ చేతులెత్తేసింది. రెండో మ్యాచ్లో టైటాన్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లు కెప్టెన్ జ్ఞానేశ్వర్(2), హేమంత్(1) ఎనిమిది పరుగులకే పెవిలియన్కు చేరారు. శ్యామ్ 11, సమన్విత్ 14, సత్యనారాయణ 16 పరుగులు చేశారు. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. మరో బంతి ఉండగానే టైటాన్స్ 77 పరుగులకే ఆలౌటైంది. పృధ్వీ, తేజస్వి మూడేసి వికెట్లు తీయగా అయ్యప్ప రెండు, అజయ్, వాసు ఒక్కో వికెట్ పడగొట్టారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఉత్తరాంధ్ర లయన్స్ ఓపెనర్ కెప్టెన్ భరత్(4), అతని స్థానంలో వచ్చిన రోహిత్ డకౌట్గా అయ్యారు. ఓపెనర్ గుల్ఫమ్(29)కు రాహుల్ తోడై మూడో వికెట్కు 50 పరుగుల భాగస్వామ్యం అందించాడు. రాహుల్(33), తపస్వి(10) అజేయంగా నిలిచి 13.4 ఓవర్లలోనే 79 పరుగుల చేసి జట్టుకు విజయాన్నందించారు. మల్లికార్జున రెండు వికెట్లు, కమిల్ ఓ వికెట్ తీశాడు. రాయలసీమ కింగ్స్ చదవండి: అక్క చేసిన ఆ పని వల్లే.. ఇలా! ఆ తల్లికేమో ‘భయం’.. అందుకే తండ్రితో పాటు! విరాట్ కోహ్లికి బీసీసీఐ వార్నింగ్.. కారణమిదే! మరోసారి అలా చేయొద్దంటూ!
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Advertisement