-
డినకరుడు
వ్యాధి నిరోధక కవచం సూర్యరశ్మితో విటమిన్ ‘డి’ లభ్యం జిల్లావాసులకుఅందని భాగ్యం {పధానంగా కాల్షియం లోపం {Vేటర్ సిటీలో బాధితులు 80 శాతం ఎంజీఎం : అపార్ట్మెంట్ జీవనం, ఆహారపు అలవాట్లు, జీవనశైలి, అర్ధరాత్రి విధుల వంటివి జిల్లావాసులకు సూర్యకిరణాల స్పర్శ తాకనివ్వడం లేదు. ఇందులో గ్రేటర్ సిటీ ప్రజలు ముఖ్యంగా వస్తారు. సూరీడి లేత కిరాణాల నుంచి విటమిన్-డి లభిస్తుంది. విటమిన్-డి లభించకపోవడం తో 50 ఏళ్లలో వచ్చే సమస్యలు 25 ఏళ్లకే వస్తున్నారుు. ప్రధానంగా కాల్షియం సంబంధిత వ్యాధులు అధికంగా వస్తారుు. విటమిన్ లోపంతో దాదాపు 80 శాతం ప్రజలు బా దపడుతున్నారు. గ్రామీణులు ధృఢంగా ఉండటానికి ప్రధాన కారణం విటమిన్-డి. వారు ఉదయం ఐదు గంటలకే నిద్ర లేస్తారు. ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు వచ్చే సూరీడి లేలేత కిరాణాలతో విటమిన్-డి లభిస్తుంది. దీంతో వారు మానసికోల్లాసంగాను, ఉత్తేజపూరితంగాను ఉంటారు. సూర్యకిరణాలు కాల్షియంను రక్తంలో ఇనుమడింప చేసి కొవ్వు వంటి పదార్థాలను కరగదీయడానికి ఉపయోగపడతారుు. ఇలా మానవ శరీరంలో మిటమిన్-డి ఉత్తేజపూరితం చేస్తే వ్యాధులు దరిచేరవు. సూర్యకిరణాల ద్వారా 80 శాతం, ఆహార పదార్థాల ద్వారా 20 శాతం విటమిన్-డి లభిస్తుంది. మిటమిన్-డి రకాలు: మిటమిన్-డిలో మిటమిన్ డి1, డి2, డి3, డి7.. ఇలా దాదాపు పది రకాలు ఉం టారుు. వీటిలో మిటమిన్-డి2(ఎర్గో క్యాల్సిఫెరాల్), మిటమిన్-డి3(కోలీ క్యాల్సి ఫెరాల్) ముఖ్యమైనవి. మిటమిన్-డి లోపాలతో సమస్యలు సాధారణంగా ఆరోగ్యవంతుడి రక్తంలో మిటమిన్-డి 50-65 ఎన్జీ, ఎంఎల్ ఉండాలి. లేకపోతే ము ఖ్యంగా జింక్, పాస్ఫరస్ వంటి ఖనిజ లవణాల అసమతుల్యత దెబ్బతింటుంది. అత్యంత వేగంతో భావోద్వేగాలు మారడం, మానసిక ఆరోగ్యం దెబ్బతినడం జరుగుతాయి. అలాగే గ ర్భిణుల్లో పిండం ఎదుగుదల లోపించడం, కండరాల కదిలకలో సమన్వయ లోపం, ధమనుల్లో రక్తప్రసరణ, చక్కెర నియంత్రణ, ఎముకల్లో బలం లోపించడం వంటివి జరుగుతాయి. మిటమిన్-డి విశేషాలు విటమిన్-డి ఉదయం, సాయంత్రపు సూర్యరశ్మి తో లభిస్తుంది. సూర్యకిరణాలు చర్మానికి తాకడంతో అది కాలేయూనికి చేరుతుంది. మిటమిన్-డి తయారీ లో కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. ఎండ తక్కువ గా ఉండే చలికాలం నాలుగు నెలల కోసం అవసరమై న మిటమిన్-డిని కాలేయం నిల్వ చేసుకుంటుంది. సూర్యకిరణాల ద్వారా లభించే కాల్షియం శరీరంలోని ఎముకలను పటిష్టం చేస్తుంది. గర్భిణులకు తగి నంత మిటమిన్-డి లభిస్తే భవిష్యత్తులో పిల్లలు ఆ రోగ్యంగా ఉంటారు. మంచి ఎదుగుదల ఉంటుంది. విటమిన్-డి చేపల కాలేయం, వెన్న, కొడిగుడ్డు పచ్చసొన, రాగులు, జొన్నలు, ముడి బియ్యం, ఆకు కూరలు, మొలకెత్తిన ధాన్యంలో లభిస్తుంది. -
డినకరుడు
సూర్య కిరణాలతో ‘డి’ విటమిన్ లభ్యం నగర వాసులకు అందని భాగ్యం గ్రేటర్లో 60 శాతం మందికి కాల్షియం లోపం బాధితుల్లో ఎక్కువ మంది ఐటీ అనుబంధ ఉద్యోగులే మహిళల్లోనే సమస్య తీవ్రం సాక్షి, సిటీబ్యూరో: అర్థరాత్రి విధులు... అపార్ట్మెంట్ జీవితం... మారిన జీవనశైలి...ఆహారపు అలవాట్లు వెరసి గ్రేటర్ వాసుల శరీరానికి రవి కిరణాల స్పర్శ కూడా తగలనివ్వడం లేదు. సూర్యుని కిరణాల్లో పుష్కలంగా లభించే విటమిన్ ‘డి’ని అందుకోవడం లేదు. ఫలితంగా గ్రేటర్లో 60 శాతం మంది కాల్షియం లోపంతో బాధ పడుతున్నారు. వీరిలో 60 శాతం మహిళలు ఉంటే, 40 శాతం పురుషులు ఉన్నారు. సాధారణంగా 50 ఏళ్లు పైబడిన వారిలో కనిపించే ఈ లక్షణాలు ప్రస్తుతం పాతికేళ్ల యువతీ యువకుల్లో గుర్తిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. బాధితుల్లో అధిక శాతం ఐటీ, అనుబంధ రంగాల్లోని వారే కావడం గమనా ర్హం. రాత్రి విధులతో... గ్రేటర్ హైదరాబాద్లో ఐటీ, అనుబంధ రంగాల్లో ఏడు లక్షల మంది పని చేస్తున్నారు. నెలలో సగం రోజులు సగం మంది పగలు పని చేస్తే, మరో సగం మంది రాత్రి పని చేస్తున్నారు. వీరిలో 90 శాతం మందికి సూర్యరశ్మి అంటే తెలియదంటే ఆశ్చర్యపోనవసరం లేదు. సాధారణంగా మనిషి శారీరక ఎదుగుదల 20 ఏళ్లలోపే. శరీరానికి 30 ఏళ్ల వరకు కాల్షియాన్ని నిల్వ చేసుకునే శక్తి ఉంటుంది. ఆ తర్వాత పురుషులు ఏటా ఒక శాతం కాల్షియాన్ని కోల్పోతే. మహిళలు రెండు శాతం కోల్పోతున్నట్లు కొన్ని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. 60 శాతం మహిళలే అధిక శాతం మహిళలు అతి తక్కువ సందర్భాల్లోనే ఇంటి నుంచి కాలు బయట పెడుతుంటారు. సూర్య కిరణాలు సోకక పోవడంతో కాల్షియం లోపించి, చిన్న వ యసులోనే కీళ్ల నొప్పుల బారిన పడుతున్నారు. సాధారణంగా మహిళల్లో 40-45 ఏళ్లకు వచ్చే మేనోపాజ్, మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల నేడు 35 ఏళ్లకే వస్తోంది. మోనోపాజ్ తర్వాత శరీరంలో నిల్వ ఉన్న కాల్షియం ఏటా సాధారణం కన్నా ఎక్కువ తగ్గుతుంది. వైద్యుల సూచనలు పాటిస్తూ... శరీరానికి సూర్యరశ్మి తగిలేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయట పడే అవకాశం ఉంటుందని నిపుణుల మాట. పాలతో మేలు: డాక్టర్ నవీన్ పల్లా, చీఫ్ ఆర్థోస్కోపిక్ సర్జన్, శ్రీకర ఆస్పత్రి ఎముకల దృఢత్వానికి, రక్తపోటు నియంత్రణకు, గుండె రక్తనాళాల ఆరోగ్యానికి విటమిన్ ‘డి’బాగా తోడ్పడుతుంది. ఇందు కోసం పిల్లలకు ప్రతి రోజూ పావు లీటరు పాలు తాగించాలి. 45 గ్రాములు ఛీజ్, 200 గ్రాముల పెరుగుతో పాటు, ప్రతి రోజూ ఓ గుడ్డు, చేపలు, మాంసం, తాజా కూరలు, డ్రై ఫ్రూట్స్, గింజలు, నారింజ, ద్రాక్ష, వంటి ఫలాలు ఇవ్వడం ద్వారా యుక్త వయసు వచ్చే నాటికి రోజుకు 1000 ఎంజీల కాల్షియం ఉత్పత్తి అవుతుంది. ఇది ఎముకల పటుత్వాన్ని పెంచుతుంది. ప్రొటీన్, సోడియం, కెఫిన్ అతిగా తీసుకోవడం వల్ల ఎముకలు దెబ్బతింటాయి. సాధ్యమైనంతవరకూ వీటికి దూరంగా ఉండాలి. ఉదయం పూట వ్యాయామం ఉత్తమం:డాక్టర్ గురువారెడ్డి, సన్షైన్ ఆస్పత్రి ఉదయం ఏడు గంటల్లోపు సూర్య కిరణాల్లో విటమిన్ ‘డి’ పుష్కలంగా లభిస్తుంది. ఆ సమయంలో వ్యాయామం శరీరానికి ఎంతో మంచింది. రాత్రి విధుల వల్ల నగరంలో చాలా మంది మధ్యాహ్నం తర్వాత నిద్రలేస్తూ కాల్షియం లోపంతో బాధపడుతున్నారు. ఫలితంగా ఎముకల్లో పటుత్వం తగ్గిపోయి, నొప్పులతో బాధ పడుతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రికి వస్తున్న బాధితుల్లో నూటికి 80 శాతం మంది ఇదే లోపంతో బాధ పడుతున్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్లో కొత్త పోకడ
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
Advertisement