-
మధ్యప్రదేశ్లో అక్కడ మళ్లీ పోలింగ్!
మధ్యప్రదేశ్లో 230 స్థానాలకు నవంబర్ 17న(శుక్రవారం) ఒకే దశలో పోలింగ్ జరిగిన సంగతి తెలిసింది. సుమారు 71.16 శాతం ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. అయితే మధ్యప్రదేశ్లోని భింద్లోని కిషుపురాలో పోలింగ్ కేంద్రం నెంబర్ 71 బూత్లో కొందరు అధికారులు ఓటింగ్ నిబంధనలు ఉల్లంఘించడంతో ఎన్నికల సంఘం రీపోలింగ్కు ఆదేశించింది. ఈ నేపథ్యంలో నేడు నవంబర్ 20న(మంగళవారం) ఆ ప్రాంతంలో రీ పోలింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. ఉదయం 7 గంటలకు ఈ ఓటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రశాంతంగ సాగుతోందని, కట్టుదిట్టమైన భద్రతా చర్యల నడుమ జరుగుతోందని కలెక్టర్ సంజీవ్ శ్రీ వాస్తవ్ అన్నారు. ఇదిలా ఉండగా, మునపటి పోలింగ్లో పాల్గొన్న ఆ నలుగురు అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. వీరిలో ముగ్గర్ని విధుల నుంచి సస్పెండ్ చేయగా, నాల్గవ వ్యక్తి పర్మినెంట్ వర్కర్ అని అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా, అదే నవంబర్ 17వ తేదిన చత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల రెండోదశ పోలింగ్ ముగిసింది. ఇక ఆ ఇరు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. (చదవండి: కాంగ్రెస్కు అవినీతే పరమావధి) -
మూడు చోట్ల రీపోలింగ్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని మూడు మున్సిపాలిటీల పరిధిలోని మూడు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్కు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఆదేశిం చింది. బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మూడు చోట్ల టెండర్ ఓట్లు దాఖలైన నేపథ్యంలో ఈ పోలింగ్ కేంద్రాల్లో శుక్రవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల దాకా రీపోలింగ్ జరగనుంది. కామారెడ్డి మున్సిపాలిటీలోని 41 వార్డులోని 101వ పోలింగ్ కేంద్రంలో, బోధన్లోని 32 వార్డులోని 87వ పోలింగ్ స్టేషన్లో, మహబూబ్నగర్ మున్సిపాలిటీలోని 41 వార్డులోని 198వ పోలింగ్ కేంద్రంలో టెండర్ ఓట్లు పడటంపై సంబంధిత అధికారుల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా రీపోలింగ్కు ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం మూడు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకోవా లని జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులను ఆదేశించింది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారుల నివేదికలను పరిశీలించి కామారెడ్డి, బోధన్, మహబూబ్నగర్లలోని మూడు పోలింగ్బూత్లలో ఎన్నికల అక్రమాలు చోటుచేసుకున్నట్టుగా నిర్ధారించి, రీపోలింగ్కు ఆదేశించినట్లు ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్కుమార్ తెలిపారు. ఈ మూడు చోట్ల కూడా అసలు ఓటర్లకు బదులు గా ఇతరులు దొంగ ఓట్లు వేయడంతో, ఆ తర్వాత అసలు ఓటర్లు వచ్చి తమ ఓటును కోరడంతో సంబంధిత అధికారులు టెండర్ ఓట్లు వేయించారని పేర్కొన్నారు. మహబూబ్నగర్లో పోలింగ్ ముగుస్తున్న సందర్భంగా కొందరు బురఖా ధరించిన ఓటర్లు వచ్చి టెండర్ ఓట్లు వేయడం, కామారెడ్డిలో కూడా బురఖా ధరించిన ఒక మహిళ బదులు మరో మహిళ ఓటేయడం, బోధన్లో ఒకరి పేరుపై మరో మహిళ ఓటు వేయడంతో టెండర్ ఓట్లు పడ్డాయని ఈ కారణంగా రీపోలింగ్కు నిర్ణయం తీసుకున్నట్టు వేర్వేరుగా జారీ చేసిన 3 నోటిఫికేషన్లలో స్పష్టం చేశారు. మహబూబ్నగర్లో ఓటర్ల గుర్తింపునకు తగిన ఆదేశాలున్నా ఎన్నికల అధికారులు సరైన చర్యలు తీసుకోలేదని, ఏజెంట్లు కూడా పట్టించుకోలేదని, కామారెడ్డి, బోధన్లలో ఒకరికి బదు లు మరొకరు దొంగ ఓటేసినా సిబ్బంది తగిన పత్రాల ద్వారా గుర్తించే ప్రయత్నం చేయలేదని, ఏజెంట్లు అభ్యంతరం తెలపలేదని తెలిపారు. దీన్నిబట్టి ఎన్నికల ఏజెంట్ల నియామకం సరిగా చేయకపోవడమో లేక వారు కుమ్మక్కుకావడం వంటివి జరిగి ఉండొచ్చునని పేర్కొన్నారు. ఐదుగురిపై వేటు.. మహబూబ్నగర్ మున్సిపాలిటీలోని 41 వార్డు 198వ పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే టెండర్ ఓట్లు పడ్డాయని ఐదుగురిని సస్పెండ్ చేశారు. పీఓ, ఏపీఓ, ఓపీఓలు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రొనాల్డ్రోస్ వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
కౌంట్డౌన్
⇒ నేడే జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ⇒ మధ్యాహ్నం 3 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం ⇒ సాయంత్రం 5 గంటల తర్వాతే ప్రకటన ⇒ మొదటి రెండు గంటల్లో 26 వార్డుల ఫలితాలు ⇒ 4 గంటల్లో పూర్తి చేయాలని యత్నం ⇒ జీహెచ్ఎంసీ కమిషనర్, ఎన్నికల అధికారి జనార్దన్రెడ్డి వెల్లడి సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల జాతకాలు శుక్రవారం తేలనున్నాయి. గెలిచేదెవరో.. ఓడేదెవరో మరికొన్ని గంటల్లో వెల్లడి కానుంది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. పురానాపూల్ వార్డుకు రీపోలింగ్ జరుగుతున్న దృష్ట్యా నిర్ణీత సమయం ముగిసే వరకు (సాయంత్రం 5 గంటలు) ఫలితాలను వెల్లడించరు. సాయంత్రం 5 గంటల తర్వాతే వార్డుల ఫలితాలు ప్రకటిస్తారు. కౌంటింగ్ ఏర్పాట్లు, ఇతర వివరాలను జీహెచ్ంఎసీ కమిషనర్, ఎన్నికల అధికారి డా.బి.జనార్దన్రెడ్డి గురువారం మీడియా సమావేశంలో వివరించారు. ఈవీఎంలను స్ట్రాంగ్రూమ్ల నుంచి లెక్కింపు కౌంటర్లకు చేర్చేటప్పటి నుంచి పూర్తయ్యే వరకు మొత్తం కౌం టింగ్ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేస్తామన్నారు. కౌం టింగ్ ఏర్పాట్లు చేసిన దాదాపు 25 ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని చెప్పారు. ప్రతి టేబుల్కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, అడిషనల్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు. వీరిని ఎన్నికల పరిశీలకులు, రిట ర్నింగ్ అధికారులు ర్యాండమ్గా నియమిస్తారు. ఓట్ల లెక్కిం పు మొత్తం ఎన్నికల పరిశీలకుల పర్యవేక్షణలో జరుగుతుంది. ఇంకా.. ⇒తొలుత మాక్ కౌంటింగ్ నిర్వహిస్తారు. ⇒మొదటి అరగంట పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. ⇒దీని కోసం రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద ప్రత్యేక టేబుల్ ఉంటుంది. ⇒నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తారు. జనరేటర్లు అందుబాటులో ఉంచుతారు. ⇒కౌంటింగ్ హాళ్లలోకి సెల్ఫోన్లు నిషిద్ధం. ⇒ఫలితాల వివరాలు తెలియజేసేందుకు మీడియా కేంద్రా లు ఉంటాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి లెక్కింపు ప్రారంభిస్తారు. ఫలితాలు తెలిసినప్పటికీ సాయంత్రం 5 గంటల వరకు వెల్లడించరు. కౌంటింగ్ మొదలైన రెండు గంటలకు తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది. ⇒ మొత్తం ఫలితాల వెల్లడికి నాలుగు గంటల సమయం పడుతుందని అంచనా. ⇒ మొత్తం 1,674 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ⇒ కౌంటింగ్ సిబ్బంది 5,626 మంది. ⇒827 రౌండ్లలో మొత్తం లెక్కింపు పూర్తవుతుంది. ⇒ లెక్కింపు కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ మీడియాను అనుమతించరు. ⇒ తొలి రెండు గంటల్లో 26 వార్డుల ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ⇒ నాలుగు గంటల్లో అన్ని వార్డుల ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ⇒ కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పాసులు ఉన్న వారికే అనుమతి. ⇒ పాసులు లేకుండా ఎవరూ రావద్దని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి. ⇒ పోలీసుల అనుమతి ఉంటేనే విజేతలు ర్యాలీలు నిర్వహించాలి. 3 నుంచి 10 రౌండ్లు కౌంటింగ్ కేంద్రాల్లోని సదుపాయాలు.. పోలింగ్ కేంద్రాలను బట్టి మూడు నుంచి పది రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుంది. మొత్తం వార్డుల సంఖ్య 150. వీటిలో 99 వార్డుల లె క్కింపు ఒకేసారి (మధ్యాహ్నం 3 గంటలనుంచి) ప్రారంభమవుతుంది. అవి పూర్తయ్యాక మరో రెండు, మూడు దఫాల్లో లెక్కింపు జరుగుతుంది. తొలి దశలో ఫలితాలు వెలువడే వార్డులు: తొలి రెండు గంటల్లో ఫలితాలు వెలువడనున్న వార్డుల్లో కాప్రా, మీర్పేట హెచ్బీ కాలనీ, చిలుకానగర్, రామంతాపూర్, అక్బర్బాగ్, రెయిన్బజార్, లలితాబాగ్, సంతోష్నగర్, ఫలక్నుమా, నవాబ్సాహెబ్కుంట, శాలిబండ, జియాగూడ, దత్తాత్రేయనగర్, లంగర్హౌస్, టోలిచౌకి, మెహదీపట్నం, హిమాయత్నగర్, కాచిగూడ, అడిక్మెట్,ముషీరాబాద్, షేక్పేట, గచ్చిబౌలి, మాదాపూర్, చింతల్, నేరేడ్మెట్ ఉన్నాయి. మూడు గంటల్లో ఫలితాలు వెలువడనున్న వార్డుల్లో సైదాబాద్, సులేమాన్నగర్, శాస్త్రిపురం, మైలార్దేవ్పల్లి, గుడిమల్కాపూర్, ఆసిఫ్నగర్, విజయనగర్ కాలనీ, అహ్మద్నగర్, రెడ్హిల్స్, జాంబాగ్, గన్ఫౌండ్రి, గోల్నాక, బాగ్అంబర్పేట, రామ్నగర్, ఖైరతాబాద్, మియాపూర్, భారతీనగర్, ఆర్సీపురం, ఓల్డ్బోయిన్పల్లి, గాజులరామారం, రంగారెడ్డినగర్, వెంకటాపురం, అడ్డగుట్ట, మెట్టుగూడ, బౌద్ధనగర్, రామ్గోపాల్పేట ఉన్నాయి.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ప్లీజ్ నన్ను ట్రోల్ చేయండి..
రాజమాత మాధవి రాజే సింధియా కన్నుమూత
లక్నోపై ఢిల్లీ గెలుపు.. ప్లే ఆఫ్స్లో రాజస్తాన్
మళ్లీ కలకలం రేపుతున్న సుచిత్ర లీక్స్..
పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
ప్రేమలు హీరోయిన్ తో ప్రేమలో పడనున్న రౌడీ..
మళ్లీ జగనే సీఎం..తేల్చేసిన కొమ్మినేని
ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
రౌడీతో రౌడీ బేబీ.. క్రేజీ కాంబినేషన్ సెట్ కానుందా..
మీసా భారతి.. రోహిణి ఆచార్య.. కూతుళ్లకు లాలూ ఈ పేర్లెందుకు పెట్టారు?
తప్పక చదవండి
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- అతనితో 16 రోజులే ఉన్నాను.. రెండో పెళ్లి చేసుకోవాలని ఉంది: ఎస్తర్
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడీ పొడగింపు
- కెనడాలో ఘనంగా పదేళ్ల తెలంగాణ ఉత్సవాలు!
- పాడెపై వెళ్లి నామినేషన్! గోరఖ్పూర్లో విచిత్రం
- రామ్-పూరీ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ ఎలా ఉందంటే?
- సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్
- 100 విమానాలు కొనుగోలు చేయనున్న ఇండిగో.. ఎందుకంటే..
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
Advertisement