-
వావ్.. ఇల్లు, ఆఫీసు పక్కపక్కనే! ఉద్యోగులకు బంపర్ ఆఫర్
ఒకవైపు కార్యాలయాలు, మరోవైపు గృహ నిర్మాణాలు.. ఇంకేం ఎంచక్కా నడుచుకుంటూ ఆఫీసుకు వెళ్లిపోవచ్చు. ఉదయం నడకకు బద్ధకించేవారికి ఇదొక వాకింగ్ గానూ ఉపయోగపడుతోంది. ఆరోగ్యం దృష్ట్యా సైకిల్పైనా ఆఫీసులకు వెళ్లొచ్చు కూడా. కరోనాతో కస్టమర్లలో వచ్చిన మార్పులతో నగరంలో వాక్ టు ఆఫీసు ప్రాజెక్టులకు ఆదరణ పెరుగుతోంది. కరోనా తర్వాతి నుంచి గృహ కొనుగోలుదారుల అభిరుచిలో మార్పులు వచ్చాయి. కోవిడ్తో వర్క్ ఫ్రం హోమ్ అలవాటైన ఉద్యోగస్తులు తిరిగి కార్యాలయానికి రావటానికి ఆసక్తి చూపించడం లేదు. గంటల కొద్ది ప్రయాణం చేస్తూ.. కాలుష్యం, ట్రాఫిక్ ఇబ్బందులతో ఆఫీసుకు వెళ్లేందుకు ఇష్టం పడటం లేదు. ఈ నేపథ్యంలో వాక్ టు వర్క్ ప్రాజెక్ట్లకు డెవలపర్లు శ్రీకారం చుట్టారు. ఆఫీసులకు చేరువలోనే గృహాలతో పాటు స్కూల్, ఆసుపత్రి, షాపింగ్ మాల్, పార్కు వంటి అన్ని రకాల వాణిజ్య ఏర్పాట్లు ఉండటం వీటి ప్రత్యేకత. దీంతో ఈ తరహా ప్రాజెక్ట్లకు డిమాండ్ పెరిగింది. పనిచేసే కార్యాలయానికి చేరుకోవడానికి అత్యధిక శాతం మంది తక్కువలో తక్కువ గంటసేపు బస్సుల్లోనో, లేదా ఇతరత్రా వ్యక్తిగత వాహనాల్లోనో గడిపేస్తున్నారు. దీంతో విలువైన సమయం వృథా అవుతోంది. దీంతో కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు. అయితే ఈ వాక్ టు వర్క్ ప్రాజెక్ట్స్లో ఇల్లు, ఆఫీసు, మాల్, పార్కులు, స్కూల్, ఆసుపత్రి.. ఇలా సమస్త అవసరాలూ ఒకే చోట ఉంటాయి. ఈ ప్రాజెక్ట్లతో వేగంగా అభివృద్ధి.. నడిచి వెళ్లేందుకు అనువైన దూరంలో కార్యాలయం, షాపింగ్ మాళ్లు ఉండాలని కోరుకునే వారి సంఖ్య నగరంలో రోజురోజుకూ పెరుగుతుంది. ‘‘ఈ మధ్యకాలంలో మా వద్దకు వచ్చే ఐటీ నిపుణులు చాలా మంది ఇలాంటి ఫ్లాట్లే కావాలని అడుగుతున్నారని ఫార్చూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ సీఎండీ బీ శేషగిరిరావు చెప్పారు. అయితే ఈ వాక్ టు వర్క్ ప్రాజెక్ట్ల్లో కేవలం అన్ని సౌకర్యాలు ఒకే చోట ఉంటే సరిపోదు. ఆ ప్రాంతం కూడా అభివృద్ధికి చిరునామాగా నిలవాలని పేర్కొన్నారు. అందుకే ఐటీ, బీపీఓ వంటి వాటితో గచ్చిబౌలి, మాదాపూర్లు ఎలా అయితే వృద్ధి చెందాయో అంతకు రెట్టింపు అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. నగరం నలువైపులా.. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ వంటి కొన్ని ప్రాంతాలకే పరిమితమైన వాక్ టు వర్క్ ప్రాజెక్టులు ఇప్పుడు నగరం చుట్టూ విస్తరిస్తున్నాయి. ఐటీఐఆర్ ప్రాజెక్ట్తో వాక్ టు వర్క్ ప్రాజెక్ట్లకు మరింత ఊపొచ్చింది. ఆదిభట్ల, ఉప్పల్, పోచారం, మహేశ్వరం వంటి శివారు ప్రాంతాల్లోనూ ఐటీ సంస్థలు రానున్నాయి. దీంతో ఈ ప్రాంతాలకు చుట్టూ 4 కి.మీ. పరిధిలో వాక్ టు వర్క్ ప్రాజెక్టులు నిర్మించేందుకు బిల్డర్లు ముందుకొస్తున్నారు. నగరంలోని మొత్తం రెండు లక్షల మందికి పైగా ఐటీ ఉద్యోగుల్లో అత్యధికులు మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లోనే విధులు నిర్వహిస్తుంటారు. ఇక్కడికి సిటీ నలువైపుల నుంచి వచ్చే వారు కొందరైతే, ఐదారు కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిపోయేవారు మరికొందరు. వాక్ టు వర్క్ ప్రాజెక్ట్లతో ఇప్పుడు ఈ దూరం కూడా తగ్గిపోతుంది. -
రియల్టీలో ట్రంప్ బ్రాండ్!
• 5 ప్రాజెక్ట్లతో ఒప్పందం చేసుకున్న ట్రంప్ ఆర్గనైజేషన్ • నిర్మాణ దశలోనే 60 శాతం అమ్మకాలు పూర్తి • ఇతర స్థానిక ప్రాజెక్ట్లతో పోల్చితే 30 శాతం ధరలెక్కువ డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడు. కానీ, మన దేశంలో మాత్రం టాప్ బ్రాండ్. ట్రంప్ పేరు చెబితే చాలు స్థిరాస్తి ప్రాజెక్ట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి మరి. దేశంలోని పలు నిర్మాణ సంస్థలు ట్రంప్ ఆర్గనైజేషన్తో ఒప్పందం చేసుకున్నాయి. దీంతో ఆయా సంస్థల ప్రీమియం ఫ్లాట్లు వేడి పకోడిల్లా అమ్ముడవుతుంటే.. నయా పైసా పెట్టుబడి లేకుండా ట్రంప్ ఆర్గనైజేషన్కు కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. సాక్షి, హైదరాబాద్: ముంబై, పుణె, గుర్గావ్, కోల్కతా నగరాల్లో లోధా గ్రూప్, పంచశీల్, ఐఆర్ఈఓ, ఎం3ఎం, యూనీమార్క్ సంస్థలు నిర్మించే 5 ప్రాజెక్ట్లతో ట్రంప్ ఆర్గనైజేషన్ ఒప్పందాలు చేసుకుంది. ఈ ప్రాజెక్ట్ల అభివృద్ధి విలువ సుమారు 1.5 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. ఈ ఒప్పందంతో ఆయా ప్రాజెక్ట్ల అమ్మకాల కోసం ట్రంప్ పేరును బ్రాండ్గా వినియోగించుకునే వీలు నిర్మాణ సంస్థలకుంటుంది. లైసెన్సింగ్ ఫీజు రూపంలో ట్రంప్ ఆర్గనైజేషన్కూ ఆదాయమొస్తుంది. అయితే ఈ ఒప్పందం కేవలం ఆయా ప్రాజెక్ట్లకే పరిమితమని.. పైగా వీటి నిర్మాణంలో నయా పైసా పెట్టుబడులు కూడా పెట్టలేదని ట్రంప్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. ⇔ ఇక ఆయా ప్రాజెక్ట్ల అమ్మకాలు, ధరల విషయానికొస్తే.. స్థానికంగా నిర్మించే ఇతర ప్రాజెక్ట్లతో పోలిస్తే ఈ ప్రాజెక్ట్ల అమ్మకాలు నిర్మాణ దశలోనే 60 శాతానికి పైగా పూరైతే.. ధరలూ 30 శాతం అధికంగా ఉన్నాయి. ⇔ ఆయా ప్రాజెక్ట్లు ఏంటంటే.. లోధా గ్రూప్ ముంబైలోని వర్లీలో 17.5 ఎకరాల్లో ట్రంప్ టవర్స్ను నిర్మిస్తోంది. 75 అంతస్తుల్లో మొత్తం 300 ప్రీమియం ఫ్లాట్లుంటాయి. ప్రారంభ ధర రూ.9 కోట్లు. కొనుగోలుదారులకు ట్రంప్ కార్డ్ను ఇస్తారు. దీంతో ప్రపం^è వ్యాప్తంగా ట్రంప్ హోటళ్లు, రిసార్ట్స్ల్లో ప్రత్యేక కేటాయింపులు, ఆఫర్లను అందుకోవచ్చు. ⇔ పుణెలోని కల్యానీ నగర్లో పంచశీల్ సంస్థ 2.68 లక్షల చ.అ.ల్లో ట్రంప్ టవర్ను నిర్మిస్తోంది. 2 టవర్లలో ఒక్కో టవర్ 23 అంతస్తుల్లో ఉంటుంది. ఒక్కో అంతస్తుకు ఒక్కో అపార్ట్మెంట్ దీని ప్రత్యేకత. ప్రతి ఫ్లాట్ 6,100 చ.అ. మేర విస్తరించి ఉంటుంది. ధర రూ.13 కోట్లు. ఇప్పటికే బాలీవుడ్ నటులు రిషీ కపూర్, రణబీర్ కపూర్ ఫ్లాట్లు కొనేశారు కూడా. ⇔ గుర్గావ్లోని గోల్ఫ్ ఎక్స్టెన్షన్ రోడ్లో ఐఆర్ఈఓ సంస్థ అస్కాట్ ఏరోసిటీ పేరిట కార్యాలయ సముదాయాన్ని నిర్మిస్తోంది. ఇది 6–7 లక్షల చ.అ.ల్లో రానున్న ఈ ప్రాజెక్ట్లో ఫైవ్ స్టార్ డ్యూలెక్స్ హోటల్స్, రిటైల్, షాపింగ్ సముదాయాలుంటాయి. ఇదే ప్రాంతంలో ఎం3ఎం సంస్థ భారీ నివాస సముదాయాన్ని నిర్మిస్తుంది కూడా. ⇔ కోల్కతాలో యూనీమార్క్ గ్రూప్ తూర్పు మెట్రోపాలిటన్ బైపాస్ ప్రాంతంలో ఈటర్నియా పేరిట నివాస సముదాయాన్ని నిర్మిస్తోంది. 3.5 లక్షల చ.అ.ల్లో రానున్న ఈ ప్రీమియం ప్రాజెక్ట్లో 38 అంతస్తులుంటాయి. 2,398 నుంచి 3,297 చ.అ.ల్లో 3, 4 బీహెచ్కే ఫ్లాట్లుంటాయి. ఐటీ కొనుగోళ్లు తగ్గుతాయా? దేశంలో స్థిరాస్తి అమ్మకాలు ఐటీ చుట్టూనే తిరుగుతుంటాయి. అంటే నివాస కొనుగోళ్లు ఐటీ ఉద్యోగులు, కార్యాలయాల కొనుగోళ్లు ఐటీ కంపెనీలే సింహభాగం. అయితే ఇప్పుడా కొనుగోళ్లకు ట్రంప్ గండం ఎదురుకానుంది. అదెలాగంటే.. అమెరికా వలస విధానాన్ని, హెచ్1బీ వీసా పాలసీలను సమీక్షించాల్సిన అవసరం ఉందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇదేగనక జరిగితే.. ఇన్నాళ్లు ఔట్సోర్సింగ్ సేవలందించే మన దేశ ఐటీ కంపెనీలకు కష్టాలు తప్పవు. సమీక్షకు తగ్గట్టుగా వేతనాలను పెంచలేని, సేవలను కొనసాగించలేని పరిస్థితి సంస్థలది. దీంతో ఇన్నాళ్లు అధిక వేతనాలతో స్థిరాస్తి రంగంలోకి వచ్చిన ఐటీ పెట్టుబడులు ఇప్పుడు దూరమవుతాయనేది సారాంశం. ⇔ దేశంలో లగ్జరీ రియల్టీ మార్కెట్లో విదేశీ కొనుగోలుదారులు, లావాదేవీలు ఎక్కువని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ అధ్యయనం పేర్కొంది. ఏప్రిల్ 2015 నుంచి మార్చి 2016 మధ్య కాలంలో 102.6 బిలియన్ డాలర్ల నివాస సముదాయాలను విదేశీ కొనుగోలుదారులే చేశారని పేర్కొంది. ఈ గణాంకాలే నిర్మాణ సంస్థలని కలవరపెట్టిస్తున్నాయి.. సమీప భవిష్యత్తులో ఐటీ కొనుగోళ్లు ఎలా ఉంటాయోనని! స్థిరాస్తులకు సంబంధించి మీ సందేహాలు మాకు రాయండి.realty@sakshi.com
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement