-
పెట్టుబడులు సిప్ చేస్తున్నారు
న్యూఢిల్లీ: ఆర్థిక పరిస్థితులపై సానుకూల అంచనాల నేపథ్యంలో క్రమాణుగత పెట్టు బడులు (సిప్) 2023–2024లో రూ. 2 లక్షల కోట్ల రికార్డ్ స్థాయికి చేరాయి. 2022–2023తో పోలిస్తే ఇది 28% అధికం. ఫండ్స్ సంస్థల సమాఖ్య యాంఫీ గణాంకాల ప్రకారం 2016–17లో రూ. 43,921 కోట్లుగా ఉన్న సిప్ పెట్టుబడులు 2022–23 నాటికి రూ. 1.56 లక్షల కోట్లకు చేరాయి. ఇవి 2020–21లో రూ. 96,080 కోట్లుగా, 2021–22లో రూ. 1.24 లక్షల కోట్లుగా ఉన్నాయి. మరోవైపు, గతేడాది మార్చి నెలలో సిప్ల రూపంలో రూ. 14,276 కోట్లు రాగా ఈ ఏడాది మార్చిలో 35 శాతం వృద్ధి చెంది ఆల్–టైమ్ గరిష్ట స్థాయి రూ. 19,270 కోట్లు వచ్చాయి. ఫిబ్రవరి, మార్చిలో వరుసగా రెండు నెలల పాటు సిప్ పెట్టుబడులు రూ. 19,000 కోట్ల మార్కును దాటాయి. -
బాప్రే.. భగభగలు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లో వేసవి ఉష్ణోగ్రతలు ఏప్రిల్లోనే రికార్డు సృష్టిస్తున్నాయి. ఏప్రిల్ నెలలో మునుపెన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి. శనివారం ఏడు జిల్లాల్లో దాదాపు 45 డిగ్రీలకు చేరువలోకొచ్చి మంట పుట్టించాయి. రాష్ట్రంలోని 670 మండలాలకు గాను 358 మండలాల్లో (సగానికి పైగా) వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు దడ పుట్టించాయి. 127 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 231 మండలాల్లో వడగాడ్పులు ప్రభావం చూపాయి. శనివారం అనకాపల్లి జిల్లా రావికమతం, నంద్యాల జిల్లా బ్రాహ్మణ కొట్కూరు, పల్నాడు జిల్లా రావిపాడు, పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ, ప్రకాశం జిల్లా తోకపల్లె, వైఎస్సార్ జిల్లా బలపనూరుల్లో రికార్డు స్థాయిలో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పల్నాడు జిల్లా రెంటచింతలలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనూ 40 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. ఆదివారం 64 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 222 మండలాల్లో వడగాడ్పులు, సోమవారం 22 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో 15, విజయనగరం 24, పార్వతీపురం మన్యంలో 11, విశాఖపట్నం 1, అనకాపల్లి 7, కాకినాడ 4, తూర్పుగోదావరి జిల్లాలోని 2 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని తెలిపింది. ఎండలు, వడగాడ్పుల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రేపట్నుంచి కాస్త చల్లదనం.. కొద్దిరోజులుగా భానుడి భగభగలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఒకింత చల్లని వార్తను మోసుకొచి్చంది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడేందుకు కూడా ఆస్కారం ఉందని పేర్కొంది. ఫలితంగా పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి కాస్త ఊరటనిస్తాయని తెలిపింది. ఉష్ణతాపం తగ్గినా పలు ప్రాంతాల్లో ఉక్కపోత, అసౌకర్య వాతావరణం మాత్రం ఉంటుందని వివరించింది. -
AP: రికార్డు స్థాయిలో పాస్పోర్ట్ సేవలు
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో పాస్పోర్టు సేవలు మెరుగయ్యాయి. ముఖ్యంగా విశాఖ రీజనల్ పాస్పోర్ట్ కేంద్రంలో గతంలో మాదిరిగా నెలల తరబడి నిరీక్షణకు చెక్ చెబుతూ.. ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తూ.. దరఖాస్తుల క్లియరెన్స్పై దృష్టిసారించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రోజు రోజుకీ దరఖాస్తులు పెరుగుతున్నాయి. ఫలితంగా.. విశాఖ ఆర్పీవో కిక్కిరిసిపోతోంది. రోజుకు 1,290 అపాయింట్మెంట్స్ అందిస్తున్నారు. 2023లో ఏకంగా 1,98,577 పాస్పోర్టులు రికార్డు స్థాయిలో జారీ చేయడం విశేషం. ఇక్కడ నుంచి 13 జిల్లాలకు పాస్పోర్టు సేవలందుతున్నాయి. ఉపాధి, ఉన్నత విద్య, ఇతర అవసరాల కోసం విదేశాలకు వెళ్లాలంటే పాస్పోర్టు పొందడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేది. రోజులు, నెలల తరబడి కాళ్లరిగేలా తిరిగినా స్లాట్లు దొరికే పరిస్థితి ఉండేది కాదు. కానీ.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీసుకున్న కీలక నిర్ణయాలతో పాస్పోర్టు సేవలు సులువయ్యాయి. దళారుల ప్రమేయం లేకుండానే.. దరఖాస్తుదారుల చేతికి సులువుగా పాస్పోర్టు లభిస్తోంది. రాష్ట్రంలోని ప్రధానమైన విశాఖపట్నం ప్రాంతీయ పాస్పోర్టు కేంద్రంలో తత్కాల్, సాధారణ అపాయింట్మెంట్లను పెంచి, కాలపరిమితిని తగ్గించడంతో పాటు శనివారం కూడా సేవలు అందిస్తుండటంతో.. పాస్పోర్టుల జారీ ప్రక్రియ కూడా వేగవంతమైంది. మరోవైపు పోలీసుల వెరిఫికేషన్ ప్రక్రియ కూడా త్వరితగతిన పూర్తి చేస్తూ.. క్లియరెన్స్ సర్టిఫికెట్స్(పీసీసీ) ఇస్తున్నారు. ఈ సంస్కరణల కారణంగా.. విశాఖపట్నం పాస్పోర్టు కేంద్రాల్లో పనితీరు జోరందుకుంది. 2023లో 1,98,577 పాస్పోర్టుల జారీ పాత నిబంధనల ప్రకారం పాస్పోర్టు కోసం, పోలీస్ విచారణ కోసం నెలల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. ప్రజల సౌలభ్యం కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు దరఖాస్తుతో పాటు నాలుగు పత్రాలుంటే వారం రోజుల్లో పాస్పోర్ట్ చేతిలో ఉంటుంది. ఆధార్కార్డు(ఇందులో డేట్ ఆఫ్ బర్త్ కచ్చితంగా ఉండాలి). ఎల్రక్టానిక్ ఫొటో ఐడెంటిటీ కార్డు, పాన్ కార్డు ఉండాలి. వీటితో పాటుగా స్థానికత, క్రిమినల్ రికార్డు, ఇంటి చిరునామాతో కూడిన వివరాలు పొందుపరిచి ఉండేలా లాయర్ అఫిడవిట్ ఉంటే చాలు. వీటిలో ఉన్న సమాచారం నిజమని నిర్ధారించుకున్న వెంటనే పాస్పోర్టు ఇస్తున్నారు. విశాఖ ప్రాంతీయ కేంద్రంలో పాస్పోర్ట్, పోలీస్ క్లియరెన్స్ సర్టీఫికేట్స్ కోసం రోజుకు సగటున 1,290 వరకూ అపాయింట్మెంట్స్ ఇచ్చి దరఖాస్తుల్ని పరిశీలిస్తున్నారు. 2023 జనవరి సమయంలో దరఖాస్తు చేసుకుంటే అపాయింట్మెంట్ 25 పనిదినాల్లోపు ఇచ్చేవారు. ఇప్పుడు కేవలం ఒక్క రోజులో ఇస్తున్నారు. పీవో పీఎస్కేల పరిధిలో విస్తృతంగా సేవలు.. ఏడాదిన్నర కిందట తపాలా కార్యాలయాల్లోనూ పాస్పోర్టు సేవలు అందుబాటులోకొచ్చాయి. విశాఖ ఆర్పీవో పరిధిలో రెండు పాస్పోర్టు సేవా కేంద్రాలతో పాటు ఏడు పోస్టాఫీస్ పాస్పోర్టు సేవా కేంద్రాలు (పీవోపీఎస్కే) ఉన్నాయి. ఈ పీవోపీఎస్కేల ద్వారానే పోలీస్ క్లియరెన్స్ సర్టీఫికెట్స్(పీసీసీ) స్లాట్లు కూడా జారీ చేస్తుండటంతో పరిశీలన ప్రక్రియ మరింత సులభంగా మారింది. విశాఖ ఆర్పీవో పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశి్చమ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, యానాం జిల్లాలున్నాయి. పారదర్శకంగా సేవలు దరఖాస్తుదారులకు సమీప తేదీల్లో అపాయింట్మెంట్ ఉండేలా చర్యలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. రెన్యువల్ కోసం చివరి తేదీ వరకూ ఆలస్యం చేస్తుండటం సరికాదు. ఆరు నెలల ముందుగానే దరఖాస్తు చేసుకుంటే.. పాత పాస్పోర్టు గడువు ముగిసేలోగా కొత్త పాస్పోర్టు మంజూరవుతుంది. ఏదైనా విచారణ కోసం ఆర్పీవోకి ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 లోపు ఎలాంటి అపాయింట్మెంట్ లేకపోయినా హాజరుకావచ్చు. – విశ్వంజలి గైక్వాడ్ విశాఖ ఆర్పీవో అధికారి -
70,000 వాలా!
ముంబై: స్టాక్ మార్కెట్ రికార్డు ర్యాలీలో భాగంగా సెన్సెక్స్ సరికొత్త మైలురాయిని తాకింది. 44 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో తొలిసారి 70,000 పాయింట్లను తాకింది. మరో సూచీ నిఫ్టీ 21,000 శిఖరానికి కేవలం 3 పాయింట్ల దూరంలో నిలిచింది. కొంతకాలంగా విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది., ఆర్బీఐ వరుసగా అయిదోసారి వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడంతో పాటు దేశీయ వృద్ధి అవుట్లుక్ను పెంచింది. అయిదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 3 రాష్ట్రాల్లో గెలుపుతో రాజకీయ స్థిరత్వం రావొచ్చనే ఆశావహ అంచనాలు నెలకొన్నాయి. ప్రాథమిక మార్కెట్లు ఐపీఓలతో కళకళలాడుతున్నాయి. దీంతో కొన్ని వారాలుగా దలాల్ స్ట్రీట్లో కొనుగోళ్ల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో సెన్సెక్స్ నిఫ్టీలు కొత్త రికార్డుల దిశగా సాగుతున్నాయి. యూఎస్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్ఓఎంసీ) నిర్ణయాలు బుధవారం వెలువడనున్న నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు స్తబ్దుగా ట్రేడవుతున్నాయి. ఒడిదుడుకులున్నా.., సరికొత్త శిఖరాలకు .... ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 100 పాయింట్లు పెరిగి 69,926 వద్ద, నిఫ్టీ నాలుగు పాయింట్లు నష్టపోయి 20,965 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. బ్యాంకింగ్, ఐటీ, మెటల్ షేర్లకు రాణించడంతో ప్రథమార్ధంలోనే 232 పాయింట్లు పెరిగి 70,000 స్థాయిపై 70,058 వద్ద, నిఫ్టీ 57 పాయింట్లు బలపడి 21,026 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. అయితే ద్వితీయార్ధంలో రికార్డు స్థాయిల వద్ద లాభాల స్వీకరణతో సూచీలు కొంతమేర లాభాలు కొల్పోయాయి. చివరికి సెన్సెక్స్ 103 పాయింట్ల లాభంతో 69,929 వద్ద, నిఫ్టీ 28 పాయింట్లు బలపడి 21,000 శిఖరానికి కేవలం 3 పాయింట్ల దూరంలో 20,997 నిలిచింది. ‘‘కొత్త ఏడాదికి సరిగ్గా 20 రోజుల ముందు సెన్సెక్స్ 70 వేల పాయింట్ల ధమాకా ఇచి్చంది. అయితే నేడు(మంగళవారం) అమెరికా, భారత్ల నవంబర్ ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ)డేటా వెల్లడి నేపథ్యంలో అప్రమత్తత వహిస్తూ లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. మరో ఏడాది కాలంలో సెన్సెక్స్ 80 వేల స్థాయిని అందుకునేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా మౌలిక, ప్రభుత్వ రంగాల షేర్లు ర్యాలీకి ప్రాతినిథ్యం వహించవచ్చు. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల ప్రభావంతో ఈక్విటీ మార్కెట్లో కొంత అస్థిరతర ఉండొచ్చు.’’ అని మార్కెట్ నిపుణుడు విజయ్ కేడియా తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ► నిధుల సమీకరణ, ఎన్ఎస్ఈ ఎక్సే్చంజీలో లిస్టింగ్ ప్రణాళికల నేపథ్యంలో స్పైస్జెట్ షేరు. బీఎస్ఈలో 10%పైగా లాభపడి రూ.60.57 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో 16% ఎగసి రూ.63.69 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. ► అమెరికా నియంత్రణ సంస్థ హైదరాబాద్ రీసెర్చ్ ఫ్యాకల్టీ యూనిట్కు 3 అభ్యంతరాలు జారీ చేయడంతో డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ 5% నష్టపోయి రూ.5,473 వద్ద స్థిరపడింది. ► ఓఎన్జీసీ నుంచి రూ.1,145 కోట్ల ఆర్డరు దక్కించుకోవడంతో మజగావ్ డాక్ షిప్బిల్డర్స్ షేరు 3% పెరిగి రూ.2118 వద్ద నిలిచింది. ► సెన్సెక్స్ 65,000 స్థాయి నుంచి 70,000 పాయింట్లకు చేరేందుకు కేవలం 110 రోజుల సమయం పట్టింది. ► 1979లో 100 పాయింట్ల వద్ద తన ప్రయాణాన్ని ప్రారంభించిన సెన్సెక్స్ ఈ ఏడాది డిసెంబర్ నాటికి 70 వేల స్థాయికి చేరుకుంది. అంటే 44 ఏళ్లలో సెన్సెక్స్ ఇన్వెస్టర్లకు 700 రెట్ల లాభాలు పంచింది. ► సెన్సెక్స్ కొత్త రికార్డు స్థాయి నెలకొల్పడంతో సోమవారం రూ.1.85 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.351.09 లక్షల కోట్లకు చేరింది. -
రూ.20,000 కోట్లు సమీకరించిన రిలయన్స్
న్యూఢిల్లీ: భారీ వ్యాపార వృద్ధి ప్రణాళికలతో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డు స్థాయిలో నిధులు సమీకరించింది. 7.79 శాతం రేటుపై పదేళ్ల కాల బాండ్లు జారీ చేయడం ద్వారా రూ.20,000 కోట్లు సమకూర్చుకుంది. కేంద్ర ప్రభుత్వం రుణ సమీకరణ రేటు కంటే రిలయన్స్ 0.40 శాతం ఎక్కువ ఆఫర్ చేసింది. 20,00,000 సెక్యూర్డ్, రెడీమబుల్, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లను (ఎన్సీడీలు), రూ.1,00,000 ముఖ విలువపై ప్రైవేటు ప్లేస్మెంట్ విధానంలో జారీ చేసినట్టు స్టాక్ ఎక్సే్ఛంజ్లకు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. కనీస ఇష్యూ సైజు రూ.10,000 కోట్లు కాగా, స్పందన ఆధారంగా మరో రూ. 10,000 కోట్లను గ్రీన్ షూ ఆప్షన్ కింద రిలయన్స్ ఇండస్ట్రీస్ నిధుల సమీకరణ చేసింది. రిలయన్స్ బాండ్ల ఇష్యూకు మొత్తం రూ.27,115 కోట్ల విలువ చేసే బిడ్లు వచ్చాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎన్సీడీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో లిస్ట్ కానున్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement