-
నీకింత..నాకింత!
అంగన్వాడీ పోస్టుల భర్తీలో టీడీపీ ఎమ్మెల్యేల అవినీతి కార్యకర్త పోస్టుకు రూ.1.50 లక్షలు.. ఆయా పోస్టుకు రూ.40 వేలు అభ్యర్థులను తీసుకువచ్చిన ‘తమ్ముళ్ల’కు 20 శాతం వరకు కమీషన్ మిగిలిన సొమ్మును నొక్కేసి పోస్టులు ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు మొత్తం 758 మంది వరకూ నియామకం .. చేతులు మారిన సొమ్ము రూ. నాలుగు కోట్లకుపై మాటే .. బాబు వస్తే జాబు వస్తుందని టీడీపీ నేతలు చేసిన ప్రచారాన్ని అర్థం చేసుకున్నవారు అదృష్టవంతులుగా మారుతున్నారు. ఉద్యోగాలు పొందుతున్నారు. తెలుగు తమ్ముళ్ల ప్రకటన అర్థంకాని వారు అమాయకులుగా, నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. అదెలాగంటే...ఇటీవల జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల పోస్టుల భర్తీలో ఇది నిజమైంది. కాకపోతే నిబం‘ధనం’ వర్తించింది. తమ్ముళ్లు దళారులుగా వ్యవహరించగా, సాక్షాత్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలే పోస్టులు అమ్ముకుని వచ్చిన కోట్ల రూపాయలను ‘నీకింత నాకింత’ అనే రీతిలో పంచుకున్నట్టు తెలుస్తోంది....! గుంటూరు: అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల నియామకంలో భారీ ఎత్తున సొమ్ము చేతులు మారింది. ‘తిలాపాపం-తలాపిడికెడు’ అనే రీతిలో పాలకులు ఈ సొమ్మును వాటాలు వేసుకున్నారు. గ్రామాల్లోని టీడీపీ కార్యకర్తలు ఈ పోస్టుల నియామకానికి డబ్బులు ఇచ్చే అభ్యర్థులను గుర్తించి వారిని టీడీపీ ఎమ్మెల్యేల వద్దకు తీసుకువచ్చి రేటు నిర్ణయించారు. ఈ మొత్తంలో సింహభాగం ఎమ్మెల్యేలు తీసుకుని మిగిలిన మొత్తాన్ని కార్యకర్తలకు ఇచ్చారు. ఇలా రూ.4 కోట్లకుపైగానే సొమ్ము చేతులు మారినట్టు ఉద్యోగ, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 192 అంగన్వాడీ కార్యకర్తలు, 566 మంది అంగన్వాడీ సహాయకుల (ఆయాలు)పోస్టులను గత నెలలో భర్తీ చేశారు. వీటి ద్వారా లభించిన మొత్తాన్ని ఎమ్మెల్యేలు, కార్యకర్తలు వాటాలు వేసుకున్నట్టు తెలుస్తోంది. పార్టీకి సేవ చేసిన నాయకుల సిఫారసులను కూడా పరిగణనలోకి తీసుకోకుండా ఎవరు ఎక్కువ మొత్తం ఇస్తే వారినే నియమించారు. అంగన్వాడీ కార్యకర్తల భర్తీ : జిల్లాలో 219 అంగన్వాడీ పోస్టుల భర్తీకి అక్టోబరు 6 నుంచి 14వ తేదీ వరకు ఇంటర్వ్యూలు జరిగాయి. వీటిలో 192 పోస్టులను భర్తీ చేశారు. 20 శాతం అంటే 38 పోస్టులు రాజకీయ సిఫారసులకు వదిలేస్తే, మిగిలిన 154 పోస్టులకు ధర నిర్ణయించి అభ్యర్థుల నుంచి ఎమ్మెల్యేలు సొమ్ములు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో పోస్టుకు సగటును రూ.1.50 లక్షలు చొప్పున దాదాపు రూ.2.31 కోట్లు చేతులు మారాయి. ఈ మొత్తంలో అభ్యర్థులను తీసుకువచ్చిన కార్యకర్తలకు సుమారు 20 శాతం కమిషన్(రూ.46 లక్షలు)గా ఇచ్చి మిగిలిన మొత్తాన్ని (రూ.1.85 కోట్లు) ఎమ్మెల్యేలు తీసుకున్నారనే ఆరోపణలు బాహాటంగా వినపడుతున్నాయి. అంగన్వాడీ సహాయకుల భర్తీ ... అంగన్వాడీ సహాయకుల (ఆయాలు) పోస్టుల భర్తీని కూడా ఎమ్మెల్యేలు వదిలిపెట్టలేదు. ఒక్కొక్కరి నుంచి రూ.40 వేల చొప్పున వసూలు చేశారని, ఇందులో రూ.10 వేలు అభ్యర్థిని తీసుకువచ్చిన కార్యకర్తకు ఇచ్చి మిగిలిన రూ. 30 వేలను ఎమ్మెల్యేలు తీసుకు న్నారని చెబుతున్నారు. జిల్లాలో 913 అంగన్వాడీ సహాయకుల పోస్టుల భర్తీకి 566 మందిని ఎంపిక చేశారు. వీటికి సంబంధించి రూ.2.26 కోట్లు చేతులు మారినట్టు తెలుస్తోంది. ఎంపిక ప్రక్రియ ... గుంటూరు, తెనాలి రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఇంటర్వ్యూలు గుంటూరులోని మహిళా ప్రాంగణంలో జరిగాయి. నరసరావుపేట డివిజన్ ఇంటర్వ్యూలు నరసరావుపేటలోని ఆర్డీవో కార్యాలయం, గురజాల డివిజన్ ఇంటర్వ్యూలు గురజాలలో జరిగాయి. ఇంటర్వ్యూల్లో డివిజన్ ఆర్డీవోతోపాటు స్త్రీ, శిశు మహిళా సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ, ప్రాజెక్టు పరిధిలోని సీడీపీఓలు పాల్గొన్నారు. ఇంటర్వ్యూలు నిర్వహించడం వరకే వారు పరిమితం అయ్యారు. మిగిలిన కార్యక్రమం అంతా ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పూర్తి చేశారు. పార్టీ కార్యకర్తల నుంచీ వసూలు ... చంద్రబాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల సమయంలో నాయకులు ప్రచారం చేశారు. దీంతో అనేక గ్రామాల్లోని మహిళా కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో టీడీపీకి అనుకూలంగా పనిచేశారు. బాబు వస్తే ఈ తరహా ఉద్యోగాలు వస్తాయని వీరంతా భావి ంచారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత డబ్బు ఇస్తేనే ఉద్యోగం అంటూ నాయకులు కొత్త పాటపాడటంతో మహిళా కార్యకర్తలు బిత్తరపోయారు. వచ్చిన ఈ అవకాశాన్ని కొందరు మహిళా కార్యకర్తలు సద్వినియోగం చేసుకునేందుకు మెడల్లోని పుస్తేలు, బంగారు ఆభరణాలను తెగనమ్మేసి ఉద్యోగాలు కొనుక్కున్నారు. ఈ మొత్తాలు చెల్లించలేని మహిళా కార్యకర్తలు నాయకులు, ఎమ్మె ల్యేలను ప్రాధేయపడినా ఉపయోగం లేకపోవడంతో కన్నీటి పర్యంతమయ్యారు. భర్తీ వివరాలు .... జిల్లాలో 219 అంగన్వాడీ కార్యకర్తల పోస్టుల భర్తీకి సంబంధించి 857 మంది ఇంటర్వ్యూకు హాజరయ్యారు. వారిలో 192 మంది ఎంపికయ్యారు. 27 ప్రాంతాల్లో అభ్యర్థులు లేకపోవడం, ఒక్కొక్కరే ఇంటర్వ్యూకు హాజరుకావడంతో వాటిని భర్తీ చేయలేదు. 913 అంగన్వాడీ సహాయకుల పోస్టులకు 1061 మంది హాజరుకాగా 566 మందిని ఎంపిక చేశారు. 347 పోస్టులను వివిధ కారణాల తో భర్తీ చేయలేదు. మినీ అంగన్ వాడీ కేంద్రాల్లోని 4 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తే ముగ్గురు ఎంపికయ్యారు. -
విద్యుత్ ఏఈ నోటిఫికేషన్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో), విద్యుత్ సరఫరా సంస్థ(ట్రాన్స్కో), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్)లలో అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) పోస్టుల భర్తీకి గురువారం వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ట్రాన్స్కో, జెన్కోతో పాటు డిస్కంల నుంచి 1,427 ఏఈ పోస్టుల భర్తీకి నియామక ప్రకటనలు రావాల్సి ఉండగా.. గురవారం ట్రాన్స్కోలో 206, జెన్కోలో 856, ఎన్పీడీసీఎల్లో 164 ఏఈ పోస్టుల భర్తీకి ఆయా సంస్థల సీఎండీలు డి.ప్రభాకర్రావు, వెంకట నారాయణ నోటిఫికేషన్లు జారీ చేశారు. ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఆయా కేటగిరీల్లోని పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు అభ్యర్థుల వయో పరిమితిని పదేళ్ల వరకు సడలించారు. జెన్కో పోస్టులకు అభ్యర్థులు అక్టోబర్ 8 నుంచి 28 వరకు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష నవంబర్ 14న జరగనుంది. ట్రాన్స్కో ఏఈ పోస్టుల కోసం అక్టోబర్ 6 నుంచి 26వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. నవంబర్ 29న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్)లో 201 ఏఈ(ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి ఒకటి రెండు రోజుల్లో నియామక ప్రకటనలు విడుదల చేసే అవకాశం ఉంది. ఓపెన్ కేటగిరీ పోస్టులూ తెలంగాణ అభ్యర్థులకే.. ఓపెన్ కేటగిరీ పోస్టులను తెలంగాణ అభ్యర్థులతో భర్తీ చేయనున్నారు. లోకల్ కేటగిరీ పోస్టులకు సంబంధిత జోన్ పరిధిలోని జిల్లాల అభ్యర్థులే అర్హులు కాగా.. ఓపెన్ కేటగిరీ పోస్టులకు జోన్లతో సంబంధం లేకుండా రాష్ట్రంలో ఏ ప్రాంత అభ్యర్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్సైట్లు జెన్కో: www.genco.telangana.gov.in, http://tsgenco.cgg.gov.in ట్రాన్స్కో: ww.transco.telangana.gov.in, http://tstransco.cgg.gov.in ఎన్పీడీసీఎల్: www.tsnpdcl.in -
‘ఏఈఈ’ ఆన్లైన్ మాక్ టెస్టు
-
‘ఏఈఈ’ ఆన్లైన్ మాక్ టెస్టు
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో 931 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఈనెల 20న నిర్వహించనున్న ఆన్లైన్ పరీక్షకు సంబంధించి అభ్యర్థులు ముందుగా ప్రాక్టీస్ చేసుకునేందుకు టీఎస్ పీఎస్సీ అవకాశం కల్పించింది. అభ్యర్థులే ఆన్లైన్లో మాక్ టెస్టు ద్వారా ప్రాక్టీస్ చేసుకునేలా ప్రత్యేక లింకును ఇచ్చింది. మంగళవారమే ఈ లింకును అందుబాటులోకి తెచ్చింది. మొదటిసారిగా కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్ష (సీబీఆర్టీ) నిర్వహిస్తున్నందున అభ్యర్థులు పరీక్ష సమయంలో ఇబ్బందులు పడకుండా, ముందుగా ప్రాక్టీస్ చేసుకునేందుకు వీలుగా ఈ చర్యలు చేపడుతున్నట్లు టీఎస్ పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ వెల్లడించారు. ఆన్లైన్ పరీక్షలో ఏయే నిబంధనలు పాటించాలో ఈ మాక్ టెస్టులో కూడా అవన్నీ ఉంటాయని తెలిపారు. పాస్వర్డ్ ఎలా ఎంటర్ చేయాలి.. బహుళ ఐశ్చిక సమాధానాలను ఎలా ఎంచుకోవాలి.. అన్న నిబంధనలు ఇందులో ఉంటాయని వివరించారు. ఇందులో ముందుగా ప్రాక్టీస్ చేయడం ద్వారా పరీక్ష సమయంలో ఎలాంటి ఇబ్బంది పడకుండా బాగా పరీక్ష రాసేందుకు వీలవుతుందని తెలిపారు. అలాగే అభ్యర్థులు హాల్టికెట్లను తమ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో 99 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పరీక్ష కేంద్రాల్లో అవసరమైన అన్ని భద్రత చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. అభ్యర్థులు కూడా పరీక్షకు ఒక రోజు ముందుగానే పరీక్ష కేంద్రాన్ని చూసుకోవాలని, తద్వారా పరీక్ష రోజున కేంద్రాన్ని వెతుక్కునేందుకు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదన్నారు. ఈ పరీక్ష మొత్తం ఇంగ్లిషు మీడియంలోనే ఉంటుందని తెలిపారు. 20వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ పరీక్ష ఉంటుందని, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5 గంటల వరకు సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్టు పరీక్ష ఉంటుందని వివరించారు. ఉదయం పరీక్ష కోసం అభ్యర్థులు 8:30 గంటల నుంచి 9:15 గంటల మధ్యలో పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలని, మధ్యాహ్నం పరీక్ష కోసం మధ్యాహ్నం 1:15 గంటల నుంచి 1:45 గంటల మధ్యలో పరీక్ష కేంద్రంలోకి కచ్చితంగా ఉండాలని తెలిపారు.
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
వైఎస్సార్సీపీలోకి టీడీపీ నేతల చేరిక
జనం మెచ్చిన నేత జగనన్న
జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేద్దాం
No Headline
పోలింగ్ విధులపై శిక్షణ
ధర్మ పరిరక్షణకు కృషి
ఎన్టీఆర్ వేవ్తో ఐదుసార్లు..
సకుటుంబ సంక్షేమం
KL Rahul: జట్టు గెలవాలన్న తపనే అది: ఆసీస్ దిగ్గజం
ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్
తప్పక చదవండి
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- అయ్యయ్యో సేతిలో డబ్బులు పోయెనే.. జేబులు ఖాళీ ఆయనే
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- నవ్వుతారేమో అనుకున్నా: లాపతా లేడీస్ ప్రతిభ ఇంట్రస్టింగ్ జర్నీ
- రెడ్ లిప్స్టిక్ను ఉత్తరకొరియా ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా!
- డాగ్ లవర్స్ బీ అలర్ట్ : ప్రమాదకరమైన కుక్కలపై తమిళనాడు నిషేధం
- ఆదాయాలు రెట్టింపైనా ఉద్యోగాల్లో కోత!
- కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement