-
రెడ్ సిగ్నల్
► ఎర్రచందనం స్మగ్లర్ల భరతం పడుతున్న ఎస్పీ ► టాస్క్ఫోర్స్తో సత్ఫలితాలు ► నిన్న వెంకటరమణ..నేడు ముఖేశ్ బదాని అరెస్ట్ ► ఎర్ర దొంగల్లో గుబులు ► ‘ఎర్ర’ లింకులున్న పోలీసులపై వేటు ► ఒంటిమిట్ట ఘటనలో ఏఎస్ఐ, కానిస్టేబుల్ సస్పెన్షన్ ► సంబేపల్లి పోలీసుస్టేషన్లో ముగ్గురిపై వేటు ► చైనా స్మగ్లర్ల కోసం కొనసాగుతున్న వేట ► అటవీ ప్రాంతంలో ముమ్మరంగా సాగుతున్న కూంబింగ్ సాక్షి, కడప : ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసు యంత్రాంగం కొరడా ఝళిపిస్తోంది. అక్రమ రవాణాకు పాల్పడినా, స్మగ్లర్లకు సహకరించినా జిల్లా ఎస్పీ పోలీసు దెబ్బ రుచి చూపిస్తున్నారు. స్మగ్లింగ్ను అరికట్టడానికి ఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటైన టాస్క్ఫోర్ృ బందం ఆశించిన రీతిలో ఫలితాలు సాధిస్తోంది. ఓ వైపు కూంబింగ్ నిర్వహిస్తూనే మరో పక్క స్మగ్లర్ల ఆట కటి ్టస్తున్నారు. అంతర్జాతీయ స్మగ్లర్లను ఒక్కొక్కరినీ పట్టుకోగలుగుతున్నారు. వారి నుంచి రాబట్టిన సమాచారంతో చోటా.. మోటా స్మగ్లర్లను ఏరి పారేస్తున్నారు. సుమారు నెల రోజులుగా టాస్క్ఫోర్ృ బందం శేషాచలం అడవుల్లో విృస్తతంగా కూంబింగ్ నిర్వహించింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్మగ్లర్ బొడ్డె వెంకట రమణ(టీడీపీ నేత)ను చాకచక్యంగా పట్టుకుని కోట్లాది రూపాయల విలువైన చందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా హర్యానాలో అంతర్జాతీయ స్మగ్లర్ అయిన బదానీని శనివారం అరెస్టు చేశారు. రెండు, మూడు రోజుల్లో జిల్లాకు బదాని అంతర్జాతీయ స్మగ్లర్ ముఖేశ్ బదానీని రెండు, మూడు రోజుల్లో జిల్లాకు తీసుకు రానున్నట్లు ఎస్పీ డాక్టర్ నవీన్ గులాఠీ స్పష్టం చేశారు. అన్ని కోణాల్లో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఆయన శనివారం కలెక్టరేట్ వద్ద మీడియాకు వెల్లడించారు. కాగా, బదానీకి జిల్లాలో కొంత మంది స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. బదానీని కడపకు తీసుకు వచ్చి విచారిస్తే పలువురి గుట్టు రట్టుకానుంది. చైనా స్మగ్లర్ల కోసం కొనసాగుతున్న వేట వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లోని శేషాచలం అడవుల్లో నుంచి అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని స్థానిక స్మగ్లర్ల ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత మంది చైనాకు సంబంధించిన స్మగ్లర్లు కూడా ఢిల్లీలో మకాం వేసి స్థానిక స్మగ్లర్ల ద్వారా రవాణాసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం హర్యాన వెళ్లిన కడప ప్రత్యేక పోలీసృ బందం చైనా స్మగ్లర్ల కోసం కూడా వేట కొనసాగిస్తోందని సమాచారం. బెంగళూరుకు చెందిన అంతర్జాతీయ స్మగ్లర్ అహ్మద్ను పట్టుకునేందుకు కూడా నిఘా పెట్టినట్లు తెలియవచ్చింది. ఒంటిమిట్ట ఘటనపై సీరియస్ ఒంటిమిట్ట పోలీసుస్టేషన్ ఆవరణంలోనున్న సుమారు 18 ఎర్రచందనం దుంగలు మాయం కావడాన్ని ఎస్పీ డాక్టర్ నవీన్ గులాఠి సీరియస్గా తీసుకున్నారు. ఘటనకు బాధ్యులుగా భావిస్తూ తొలుత ఏఎస్ఐతోపాటు మరో కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు. ఎర్రచందనం దుంగలను దోచుకెళ్లిన దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. పలువురు కానిస్టేబుళ్లపై వేటు జిల్లాలోని పలు స్టేషన్లలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లపై శనివారం జిల్లా ఎస్పీ డాక్టర్నవీన్ గులాఠి కఠిన చర్యలు తీసుకున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారాలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై సంబేపల్లె పోలీసుస్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ మురళిరాజు, కానిస్టేబుళ్లు మోహ న్, నరేంద్రలను సస్పెండ్ చేశారు. ఇవే ఆరోపణలపై మరో ఇద్దరు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాయచోటికి చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లు విధుల్లో నిర్లక్ష్యం వహించడంతోపాటు సివిల్ పంచాయతీల్లో తల దూర్చడం మితిమీరడంతో ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. పోలీసులు.. ఎర్రలింకులు కడప అర్బన్ : ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలున్నాయనే కారణంతో ఇప్పటి దాకా పదుల సంఖ్యలో పోలీసులు, అటవీశాఖ సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. 2006లో సీఐలు, ఎస్ఐలు,ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లతో కలిపి 21 మందిని అప్పటి ఎస్పీ నాగిరెడ్డి సస్పెండ్ చేశారు. పలువురు అటవీ శాఖ సిబ్బందిపై కూడా అధికారులు చర్యలు తీసుకున్నారు. గత ఏడాది రాజంపేట డీఎస్పీ జీవీ రమణను పోలీసు ఉన్నతాధికారులు సస్పెన్షన్ చేశారు. తాజాగా ఒంటిమిట్ట, సంబేపల్లెలలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఒక ఏఎస్ఐ, ఒక హెడ్ కానిస్టేబుల్, ముగ్గురు పోలీసులు సస్పెన్షన్కు గురయ్యారు. లోతుగా విచారిస్తే మరికొంత మంది పోలీసు దొంగలు బయటపడే అవకాశం ఉంది. -
ఆ తొమ్మిది మంది ఎవరు ?
► ఎర్రస్మగ్లర్లలో సౌందర్రాజన్ పదో నిందితుడు ► జిల్లాకు చెందిన స్మగ్లర్లపై బిగుస్తున్న ఉచ్చు ► తమిళ తంబీలపై కేసులకు రంగం సిద్ధం చిత్తూరు (అర్బన్) : అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ సౌందర్రాజన్ అరెస్టు స్మగ్లర్లలో దడ పుట్టిస్తోంది. పశ్చిమ బెంగాల్లో పట్టుబడ్డ సౌందర్రాజన్ నుంచి పోలీసులు దాదాపు రూ.30 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. సౌందర్రాజన్ను గురువారం చిత్తూరు న్యాయస్థానంలో హాజరుపరచిన పోలీసులు అతడిని పదో నిందితుడిగా చూపించారు. సౌందర్ను పదో నిందితుడిగా చూపిస్తే మరి మిగిలిన తొమ్మిది మంది ఎవరు..? అనే ప్రశ్న ప్రధాన స్మగ్లరను కలవరపెట్టినట్టవుతోంది. ఎర్రచందనం దుంగలు ఎక్కడ దొరికినా... ఆ సంఘటనకు జిల్లాతో సంబంధం ఉంటోంది. శేషాచలం అడవుల్లో విస్తరించి ఉన్న ఎర్రచందనం దుంగలను జిల్లాకు చెందిన స్మగ్లర్ల సాయంతోనే ఇతర రాష్ట్రాలకు, దేశాలకు తరలిస్తుంటారు. జిల్లాలో ఆపరేషన్ రెడ్ ప్రారంభించి దాదాపు రెండేళ్లవుతోంది. ఈ రెండేళ్ల కాలంలో పట్టుబడ్డ ఎర్రచందనం దుంగలు, స్మగ్లర్లు ఒక ఎత్తయితే, ప్రస్తుతం పోలీసులు పట్టుకున్న అంతర్జాతీయ స్మగ్లర్ సౌందర్రాజన్ ఇంకో ఎత్తు. పశ్చిమ బెంగాల్లో ఇతనికి సంబంధించిన మూడు గోడౌన్లు, చెన్నైలోని ఇతని అనుచరుడు శరవణన్కు చెందిన రెండు గోడౌన్లలో దాదాపు రూ.30 కోట్లు విలువచేసే ఎర్రచందనం పట్టుబడింది. ఇది అసాధారణ విషయం. అయితే శరవణన్, సౌందర్రాజన్ అరెస్టుతో ఆపరేషన్ రెడ్ ముగిసిపోలేదు. సౌందర్రాజన్ రిమాండు రిపోర్టులో ఇతను పదో నిందితుడు కావడంతో ఈ కేసు ఇంకా కొనసాగుతున్నట్లు పోలీసు వర్గాలు చెప్పకనే చెప్పాయి. దీనికి తోడు జిల్లాకు చెందిన పోలీసులు ఐదు రోజులుగా తమిళనాడులోని తిరుత్తణి, చెన్నై, వేలూరు, వానియంబాడి తదితర ప్రాంతాల్లో స్మగ్లర్ల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో పేరు మోసిన మరో నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేసి జిల్లాకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక శేషాచలం అడవుల నుంచి స్థానికుల ప్రమేయం లేకుండా ఎర్రచందనం దుంగలు నేరుగా తమిళనాడుకు, పశ్చిమ బెంగాల్కు వెళ్లే ప్రసక్తేలేదు. ఈ వ్యవహారంలో జిల్లాకు చెందిన కొందరు స్మగ్లర్ల సాయంతోనే దుంగలు దేశం సరిహద్దులు దాటుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఆపరేషన్ రెడ్లో జిల్లాకు చెందిన వ్యక్తుల్లో దాదాపు 94 మందిని పోలీసులు అరెస్టు చేశారు. సౌందర్రాజన్ అరెస్టుతో ఇప్పటికే బెయిల్పై వచ్చిన జిల్లాకు చెందిన స్మగ్లర్లపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. మరోవైపు స్మగ్లర్లకు సహాయ సహకారాలు అందిస్తున్న ఇంటి దొంగలపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు వెనకడుగు వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు, అటవీశాఖ అధికారుల ప్రమేయం లేకుండా ఒక్క ఎర్రచందనం దుంగను జిల్లా సరిహద్దులు దాటించే ప్రసక్తేలేదు. అలాంటప్పుడు ఆపరేషన్ రెడ్లో వేల మందిని అరెస్టు చేస్తున్నారే తప్ప వీరికి సహరిస్తున్న ప్రభుత్వ అధికారుల వివరాలు మాత్రం బయటకు రాకపోవడం, వచ్చినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పోలీసుశాఖపై విమర్శలు వస్తున్నాయి.
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
సూర్యప్రభ వాహనంపై గోవిందుడు
బడి బస్.. ఫిట్నెస్
పది సప్లిమెంటరీ పరీక్షకు 1073 మంది హాజరు
కౌంటింగ్కు పటిష్టంగా భద్రత
No Headline
ఇంటర్ మ్యాథ్స్–బి, హిస్టరీ పరీక్షలు ప్రశాంతం
అవాంఛనీయ సంఘటనలకు తావివ్వొద్దు
తత్కాల్ ఫార్మ్స్పై నంబర్లు వేసి ఇవ్వాలి
రోడ్డు ప్రమాదంలో సిరికల్చర్ ఉద్యోగి మృతి
ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ
తప్పక చదవండి
- ఓటీటీలో మలయాళ హిట్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
- జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్రకు ప్రత్యేక రైలు
- ప్రపంచ క్రికెట్లో ఇద్దరే ఇద్దరు..!
- ఇప్పట్లో ‘స్థానిక’ ఎన్నికలు లేనట్టేనా?
- Kartikeya Gummakonda: ప్రేక్షకులు అప్పుడే హీరోలా చూస్తారు
- ఊపు తగ్గిన యూపీ ఎన్నికలు
- ప్రాణాలు తీస్తున్న గజరాజులు
- లయ తప్పుతున్న గుండె
- ‘స్కూటీ’అంటే పాప.. ‘బైక్’అంటే బాబు
- Lok Sabha Election 2024: ఒడిశాలో రసవత్తర పోటీ
Advertisement