-
ఉద్యోగులకు హెల్త్ స్కీం, రీయింబర్స్మెంట్ కూడా
తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు హెల్త్ స్కీంతో పాటు రీయింబర్స్మెంట్ను కూడా మరికొన్నాళ్ల పాటు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొత్త జీవో ఒకటి జారీ అయింది. ఈ ఏడాది చివరి వరకు ఈ రెండు పథకాలు సమాంతరంగా అమలు కానున్నాయి. వాస్తవానికి ఉద్యోగులకు ఆరోగ్య పథకాన్ని అమలుచేసిన తర్వాత ఇక రీయింబర్స్మెంట్ ఇవ్వకూడదని తొలుత భావించారు. కానీ, కొన్ని ఆస్పత్రులు ఇంకా ఈహెచ్ఎస్ పథకం పరిధిలోకి రాకపోవడంతో, ఉన్న ఆస్పత్రులలో ఈహెచ్ఎస్ పథకాన్ని అమలుచేయడంతో పాటు, అదే సమయంలో రీయింబర్స్మెంట్ పథకాన్ని కూడా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 30 వరకే ఈ రెండు అమలులో ఉండేలా ఇంతకుముందు ఉత్తర్వులిచ్చారు. అయితే సమస్య ఇంకా పరిష్కారం కానందున 2016 డిసెంబర్ 31 వరకు రీయింబర్స్మెంట్ను కూడా కొనసాగించేలా తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. -
ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు!
* రీయింబర్స్మెంట్ జాప్యంతో విద్యార్థులకు తిప్పలు * ‘స్థానికత నిర్ధారణ’ నేపథ్యంలో గందరగోళం * సర్టిఫికెట్ల కోసం కాలేజీల చుట్టూ ప్రదక్షిణలు సాక్షి, హైదరాబాద్: ఒక విద్యార్థి ఓ ప్రముఖ కాలేజీలో ఇటీవలే ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఎంటెక్లో చేరేందుకు సర్టిఫికెట్లు ఇవ్వాలంటూ కాలేజీ యాజమాన్యాన్ని కోరాడు. కానీ ఆ విద్యార్థికి సంబంధించి గత ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ ఇంకా రాలేదంటూ సర్టిఫికెట్లు ఇవ్వలేదు. ప్రభుత్వం నుంచి ఎలాగూ వస్తుంది కనుక ఇవ్వాలంటూ విద్యార్థి మళ్లీ కాలేజీకి వెళ్లినా.. యాజమాన్యం ఒప్పుకోలేదు. అంతగా కావాలంటే బకాయి పడిన ఫీజును చెల్లించి సర్టిఫికెట్లు తీసుకెళ్లాలని సూచించింది. ఫీజు చెల్లించలేక, పైకోర్సులో చేరే మార్గం లేక ఆ విద్యార్థి ఆందోళనలో మునిగిపోయాడు... రాష్ట్రంలో వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసుకున్న లక్షలాది మంది విద్యార్థుల పరిస్థితి ఇది. ‘స్థానికులకే ఫీజు’ అన్న తెలంగాణ ప్రభుత్వ విధానం నేపథ్యంలో.. ఇటు విద్యార్థులు, అటు కాలేజీల నిర్వాహకులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ప్రభుత్వం ఎవరిని స్థానికులుగా గుర్తిస్తుందో తెలియని పరిస్థితుల్లో తామేమీ చేయలేమంటూ కాలేజీల యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి బకాయిలు విడుదల కానందున మీరే ఫీజు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్, బకాయిల వ్యవహారం తేలేవరకు సర్టిఫికెట్లను ఇచ్చేది లేదని స్పష్టం చేస్తున్నాయి. దీంతో విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. స్పష్టత ఇవ్వని ఆంధ్రప్రదేశ్!.. ఏటా సీమాంధ్రకు చెందిన దాదాపు 40 వేల మంది విద్యార్థులు తెలంగాణ జిల్లాల్లోని కాలేజీల్లో వృత్తి విద్యా కోర్సులను చదువుతున్నారు. అటు సీమాంధ్ర జిల్లాల్లోని కాలేజీల్లో తెలంగాణకు చెందిన 11 వేల మంది విద్యార్థులు చదువుతున్నట్లు అంచనా. మొత్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ కింద చదువుతున్న వారు మరో 12 లక్షల మంది వరకూ ఉంటారు. అయితే ఈసారి తెలంగాణ విద్యార్థులకే ఫీజు రీయింబర్స్మెంట్, బకాయిలు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. స్థానికత నిర్ధారణపై కసరత్తు చేస్తోంది. మరోవైపు.. ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో.. విద్యార్థులకు కష్టాలు వచ్చి పడ్డాయి. తెలంగాణ విద్యార్థులకు బకాయిలు రావాలంటే స్థానికతపై స్పష్టత వస్తే చాలు.. కానీ ఇక్కడ చదివిన ఆంధ్రప్రదేశ్కు చెందినవారికి ఫీజు ఇస్తారా? లేదా అనేది ఏపీ ప్రభుత్వం స్పష్టం చేయలేదు. బకాయిల విషయంలో ప్రభుత్వాలు హామీ ఇస్తే సర్టిఫికెట్లు ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని యాజమాన్యాలు చెబుతున్నాయి. రీయింబర్స్మెంట్ ఎత్తి వేస్తే ఊరుకోం: కృష్ణయ్య ఫీజు రీయింబర్స్మెంట్పై నాన్చివేత ధోరణి విడనాడాలని, ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటం తగదని బీసీ సంక్షేమ సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రీయింబర్స్మెంట్పై అంతా మౌనం సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంటు మార్గదర్శకాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత గోప్యంగా వ్యవహరిస్తోంది. మంత్రివర్గసభ్యులకు కూడా ఈ అంశానికి సంబంధించిన సమాచారం ఉండడంలేదు. ఉన్నత స్థాయిలోని కొం దరు అధికారులకు, న్యాయ నిపుణులకు తప్ప ఎవరికీ మార్గదర్శకాల గురించి గానీ, కటాఫ్ సంవత్సరం గురించి కానీ వివరాలు తెలియనివ్వడంలేదు. అధికారికంగా ప్రకటించేవరకు ఫీజు రీయింబర్స్మెంటు మీద ఎలాంటి సమాచారం బయటకు పొక్కడానికి వీల్లేదని ముఖ్యమంత్రి కార్యాలయం గట్టిగా హెచ్చరించినట్టు తెలిసింది. అధికారులంతా మౌనం వహించడంతో ఈ వ్యవహారం ఉత్కంఠగా మారింది. రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న ఒక ఉన్నతాధికారి ఆధ్వర్యంలోనే ఫీజు రీయింబర్స్మెంటు విషయంలో మొదటినుంచి కసరత్తు జరుగుతోంది. తెలంగాణలో చదువుకుంటున్న ఆంధ్ర విద్యార్థులకు కూడా ఫీజులు చెల్లించాల్సిందేనని, లేదంటే కోర్టుకెళ్లడానికి సిద్ధమని ఏపీ ప్రభుత్వం వాదిస్తుండడం కూడా గోప్యతకు కారణమని తెలుస్తోంది. ఈ అంశాలన్ని పరిగణనలోకి తీసుకుంటూ పలువురు సీనియర్ అధికారులు మార్గదర్శకాలను సిద్ధం చేసినట్టు తెలిసింది. బుధవారం జరుగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిని చర్చకు పెట్టనున్నారని సమాచారం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement