-
'కార్మికుల కష్టాలు నన్ను కదిలించాయి'
రంగు మెరుపుతో వచ్చే రాఖీల పండుగ.. దూర దేశం బోయిన మా అన్న చంద్రుడా.. రాఖీట్ల పున్నానికి వస్తవని వాకిట్ల కూసున్నరో మాయన్న.. అని జానపద గాయని అంకుల గంగాదేవి పాడిన పాట గల్ఫ్లో ఉన్న వలస కార్మికులతో పాటు ఇక్కడ ఉన్న వారి కుటుంబ సభ్యులను కన్నీళ్లు పెట్టించింది. జానపద పాటలకు ఆదరణ లభించేలా తన గానంతో విశేష కృషి చేసిన ‘రేలా రె రేలా ఫేం’ గంగాదేవి గల్ఫ్ దేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ఆయా సందర్భాల్లో అక్కడి కార్మికుల క్యాంపులను ఆమె సందర్శించి వారి జీవనశైలిని పరిశీలించారు. సంవత్సరాల కాలంగా కన్న తల్లిదండ్రులకు, కట్టుకున్న భార్యకు, రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలకు దూరంగా ఉంటూ కార్మికులు అనుభవిస్తున్న కష్టాలు తనను చలింపజేశాయని, అనేక మంది దుర్భర జీవితం గడుపుతున్నారని చెప్పారు. ఎడారి దేశాల్లో మన కార్మికుల జీవనంపై గంగాదేవి ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. నిజామాబాద్ జిల్లా ముల్లంగిలో జన్మించిన నాకు చిన్నతనంలోనే తండ్రి దూరమయ్యాడు. తల్లి, అమ్మమ్మ, అక్క ఆప్యాయతను పంచుకుని పెరిగిన నేను చిన్ననాటి నుంచి కష్టాలనే అనుభవించాను. జానపదాలను అందరికి వినిపిస్తూ గాయనిగా ఒక్కో మెట్టు ఎక్కాను. పల్లె పాట ద్వారా అందరి అభిమానం చూరగొన్న నేను గల్ఫ్ కార్మికుల కష్టాల గురించి చిన్ననాటి నుంచి వింటూనే ఉన్నా. జానపద గాయకురాలిగా స్వరాష్ట్రంలోనే కాకుండా గల్ఫ్ దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చే అవకాశం వచ్చింది. తద్వారా కార్మికుల జీవన విధానాన్ని పరిశీలించే అవకాశం కూడా లభించింది. యూఏఈ, కువైట్, ఖతార్, ఒమాన్ దేశాల్లో ఇప్పటి వరకు ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. సౌదీ అరేబియా, బహ్రెయిన్ దేశాల్లో మాత్రం ప్రదర్శనలు ఇవ్వడానికి అవకాశం రాలేదు. ప్రధానంగా తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా, బతుకమ్మ సంబరాల సమయంలో గల్ఫ్ దేశాలకు వెళ్లి పాటలు పాడుతుంటా. గల్ఫ్లో ప్రదర్శనల అనంతరం కార్మికుల క్యాంపులకు వెళ్లి వారితో మాట్లాడాను. ప్రధానంగా దుబాయి లోని సోనాపూర్ క్యాంపు, షార్జాలోని కార్మికుల క్యాంపులకు వెళ్లి తెలుగు రాష్ట్రాల కార్మికులను కలుసుకున్నా. కార్మికులు ఏజెంట్ల చేతుల్లో మోసపోవడం, కంపెనీ యాజమాన్యాల ద్వారా వంచనకు గురికావడం ఇలా ఎన్నో రకాలుగా కార్మికులు అవస్థలు పడటాన్ని తెలుసుకున్నా. ఖల్లివెళ్లి అయిన కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. కార్మికులు గల్ఫ్ దేశాల్లో మరణిస్తే వారి మృతదేహాలు ఇళ్లకు చేరుకోవడానికి కాలయాపన జరుగుతోంది. మరికొందరి మృతదేహాలు మార్చురీలలోనే మగ్గిపోతున్నాయి. ఇలా ఎన్నో సమస్యలు నా దృష్టికి వచ్చాయి. గల్ఫ్ కార్మికుల అంశాన్ని సామాజిక బాధ్యతగా స్వీకరించాను. వారిలో మనోధైర్యం కలిగించేందుకు కృషిచేస్తున్నా. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. గల్ఫ్లో ఏ కార్మికుడిని కదిలించినా మాతో ఒకే ఒక్కమాట చెప్పారు అదే.. ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేయాలని. ఎన్ఆర్ఐ పాలసీ అమలైతేనే గల్ఫ్ కార్మికులకు ప్రయోజనం కలుగుతుందని ఎంతో మందికి విశ్వాసం ఉంది. అలాగే ఎడారి దేశాల్లో నష్టపోయిన కార్మికులకు పునరావాస కార్యక్రమాలు అమలు చేయాలి. వారి జీవితాలపై ఆల్బమ్ చేయాలని ఉంది.. జానపద గాయనిగా ఎన్నో పాట లను ఆలపించిన నేను.. గల్ఫ్ కార్మికుల జీవితాలపై ఆల్బమ్ రూపొందించాలనుకుంటున్నా. అవకాశం వస్తే కచ్చితంగా కాల్బమ్ చేస్తా. ఆ ఆల్బమ్ను గల్ఫ్ కార్మికులకే అంకితం ఇస్తాం. మున్ముందు గల్ఫ్ కార్మికుల జీవితాలకు అద్దం పట్టే పాటలను ఆలపిస్తా. -
‘అభివద్ధి సూర్యుడు’ సీడీ విడుదల
బిజినేపల్లి : తెలంగాణ సాంస్కతిక సారధి కళాకారులు విజయకాంత్, శ్రీశైలం ఆధ్వర్యంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలకు సంబంధించి ‘అభివద్ధి సూర్యుడు’ సీడీని శనివారం పాలెం గ్రామంలో విడుదల చేశారు. రేలారే రేలా జానపద కవి గాయకుడు శివనాగులు రచించిన పాట స్వరకల్పనలో ఈ సీడీని తయారు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సర్పంచ్ పుప్పాల సుమలత, మాజీ సర్పంచ్ శ్రీనివాస్గౌడ్, ఈఓ బ్రహ్మచారి ఆధ్వర్యంలో సీడీని విడుదల చేశారు. నాలుగు కోట్ల అభిమానులే నీ ఆయుధం అనే ట్యాగ్లైన్పై మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా సీడీని రూపొందించినట్లు వివరించారు. కార్యక్రమంలో కాశిదాసు, శ్రావణ్కుమార్, డప్పు లక్ష్మణ్, బత్తుల వెంకటేష్, గ్రామస్తులు రాము, శ్రీనివాస్, నాగన్న, సత్యయ్య ఉన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నాన్న ఆశయమే నాకు ఆదర్శం
పేదలపై ఎందుకీ కక్ష
మూడో రోజు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రశాంతం
ఎన్నికల ప్రక్రియ ఉన్నతమైన బాధ్యత
వడగళ్ల వర్షం.. పంటకు నష్టం
జగన్తోనే సంక్షేమ పథకాల కొనసాగింపు
నర్రెడ్డి సునీత, రాజశేఖర్రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు
మేమంతా సీఎం వైఎస్ జగన్ వెంటే
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక
సుండుపల్లెలో టీడీపీకి షాక్
తప్పక చదవండి
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement