-
జొమాటో డెలివరీ పార్ట్నర్స్కు ఎలక్ట్రిక్ స్కూటర్లు!
ముంబై: ఎలక్ట్రిక్ బైక్ షేరింగ్ కంపెనీ యూలూ, ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో చేతులు కలిపాయి. ఇందులో భాగంగా జొమాటో డెలివరీ భాగస్వాములకు యూలూ 25–35 వేల యూనిట్ల డీఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లను అద్దె ప్రాతిపదికన సరఫరా చేయనుంది. (రిలయన్స్ డిజిటల్ డిస్కౌంట్ డేస్: ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు) కంపెనీ అందించే పరిష్కారాలతో డెలివరీ భాగస్వాముల ఆదాయం 40 శాతం వరకు అధికం అవుతుందని యూలూ తెలిపింది. ఫిబ్రవరి నాటికి జొమాటో వేదికగా 4,000 పైచిలుకు డెలివరీ పార్ట్నర్స్ యూలూ ఈవీలను వినియోగిస్తున్నారని వెల్లడించింది. (రియల్ ఎస్టేట్కు తగ్గని డిమాండ్.. హైదరాబాద్లో భారీగా పెరిగిన అమ్మకాలు) -
ముంబైలో ‘రెంట్ ఏ ట్యాక్సీ’ పథకం
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రోజురోజుకూ జఠిలమవుతున్న ట్రాఫిక్ జామ్ సమస్యను పరిష్కరించేందుకు ‘రెంట్ ఏ బైక్’ అనే నూతన విధానాన్ని ఓ ప్రైవేటు కంపెనీ తెరమీదకు తెచ్చింది. అందుకు సంబంధించిన ప్రతిపాదన రవాణ శాఖకు పంపించింది. దీనిపై త్వరలో స్టేట్ ట్రాన్స్పోర్టు అథారిటీ (ఎస్టీఏ) సమావేశం ఏర్పాటుచేసి తుది నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర రవాణ శాఖ కమిషనర్ అవినాశ్ ఢాకణే తెలిపారు. ముంబైలో జరుగుతున్న మెట్రో పనులు వల్ల గత కొన్ని నెలలుగా రోడ్లన్నీ ఇరుకుగా మారాయి. ఫలితంగా వాహనాల వేగం మందగించి తరచూ ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తుతోంది. దీని ప్రభావం ముంబైకర్ల విలువైన సమయం, వ్యయంపై పడుతోంది. రోడ్లపై ప్రైవేటు కార్లు, ట్యాక్సీలు, ఆటోల సంఖ్య తగ్గించాలంటే రెంట్ ఏ బైక్ పథకం ఎంతో దోహదపడుతుందని ప్రైవేటు కంపెనీ ప్రతిపాదిస్తోంది. ఈ కంపెనీ అధికార వర్గాలు అందించిన వివరాల ప్రకారం రెంట్ ఏ బైక్ పథకం యాప్ బేస్డ్ సేవా తరహాలో ఉంటుంది. ఈ బైక్ల సేవలు రైల్వే స్టేషన్ నుంచి కార్యాలయాలకు చేరుకునే విధంగా ఉంటాయి. రోజు, వారం, నెల ఇలా వేర్వేరు రోజుల కోసం ఈ బైక్లు హెల్మెట్తోపాటు అందజేస్తాయి. బైక్ లైసెన్స్ ఉన్నవారు మాత్రమే ఈ సేవలను వినియోగించుకోవచ్చు. చదవండి: (ఆదిత్య ఠాక్రే సంకల్పం: ఉద్యాన వనంలో ‘ట్రీ–హౌస్’.. ప్రత్యేకతలివే..) లోకల్ రైలు దిగిన ప్రయాణికులు స్టేషన్ బయట అందుబాటులో ఉన్న రెంట్ ఏ బైక్ సేవలను వినియోగించుకోవచ్చు. సాధారణంగా లోకల్ రైలు దిగిన ప్రయాణికులు, ఉద్యోగులు, వ్యాపారులు షేర్ ట్యాక్సీలు, ఆటోలలో తమ కార్యాలయాలకు చేరుకుంటారు. ఆలస్యమైతే లేదా అత్యవసరమైతే సొంతంగా ట్యాక్సీలో లేదా ఆటోలో వెళతారు. దీంతో రోడ్డుపైకి ఎక్కువ వాహనాలు రావడంవల్ల ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తుతోంది. ఫలితంగా తమ గమ్యస్థానాలకు సకాలంలో చేరుకోలేకపోతున్నారు. అంతేగాకుండా ట్రాఫిక్ జామ్లో చిక్కుకోవడంవల్ల చార్జీలు కూడా ఎక్కువే అవుతాయి. ఇది మధ్యతరగతి వారికి ఆర్థికంగా భారం కూడా. అదే బైక్ను రెంట్కు తీసుకుంటే విలువైన సమయం ఆదా కావడంతోపాటు తక్కువ చార్జీలకే తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని ప్రైవేటు కంపెనీ అంటోంది. అంతేగాకుండా ట్యాక్సీ, యాప్ ఆధారిత ప్రైవేటు ఓలా, ఉబెర్టాంటి ఫోర్ వీలర్స్తో పోలిస్తే టూ వీలర్ ప్రయాణం వేగంగా, చార్జీలు గిట్టుబాటు అయ్యే విధంగా ఉంటుందని పేర్కొంది. ‘ర్యాపిడో’ వ్యవహారం ఇంకా తేలలేదు... ఇదిలాఉండగా 2020 ఆగస్టులోనే ర్యాపిడో అనే కంపెనీ ముంబైలో ట్యాక్సీ సేవలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. కానీ ఆ సేవలకు సంబం ధించిన బ్యాడ్జీ, లైసెన్స్ లేకపోవడంతో ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీఓ) స్పందించలేదు. అనుమతులు లేకుండా ట్యాక్సీ సేవలు ప్రారంభిస్తే ర్యాపిడో కంపెనీపై, డ్రైవర్లపై కఠిన చర్యలు తీసు కుంటామని ఆర్టీఓ హెచ్చరించింది. దీంతో ఈ పథ కం అటకెక్కింది. అయితే బైక్ టాక్సీ సేవలు కొనసాగుతుండగా, రెంటెడ్ బైక్ సేవలు మాత్రం అందుబాటులోకి రాలేదు. అప్పటికే కరోనా కారణంగా ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు, యజమానులు తీవ్రంగా నష్టపోయారు. తరుచూ పెరుగుతున్న సీఎన్జీ ధరలతో చార్జీలు పెంచివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో రెంట్ ఏ బైక్ సేవలు ప్రారంభిస్తే ట్యాక్సీ, ఆటోలలో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. అయితే ఎస్టీఏ దీనిపై క్షుణ్ణంగా ఆలోచించి సంబంధిత ఆర్టీఓ అధికారులతో సమగ్ర విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆదరాబాదరగా నిర్ణయం తీసుకుంటే ఆ తరువాత వచ్చే విమర్శలు, ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల నుంచి వచ్చే వ్యతిరేకతను చవిచూడాల్సి వస్తుంది. -
ఢిల్లీలో అద్దెకు టాక్సీ, బైక్ పథకాలు!
న్యూ ఢిల్లీః స్థానిక ప్రభుత్వ నిర్ణయంతో ఇకపై ఢిల్లీవాసుల కష్టాలు తీరనున్నాయి. బస్టాప్ లో, రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత ఆఫీసులకు, గమ్యస్థానాలకు చేరడానికి తిరిగి నడవాలంటే ఎంతో కష్టంగా అనిపిస్తుంది. ఓపక్క టైమ్ టెన్షన్, మరోపక్క ఎండవేడి వేధిస్తుంటాయి. అటువంటి సమయంలో పర్యాటకులు, ప్రయాణీకులకు సహాయ పడేందుకు త్వరలో ప్రభుత్వం బైక్ టాక్సీ, రెంట్ ఎ బైక్ పథకాలను ప్రవేశ పెడుతోంది. ఈ నూతన సౌకర్యంతో వినియోగదారులు గమ్యస్థానాలకు సులభంగా చేరుకునే అవకాశం ఉంటుంది. భారత రాజధాని నగరంలో ప్రభుత్వం కొత్త పథకాలను ప్రవేశ పెడుతోంది. గుర్గావ్, బెంగుళూరులోని అధికారుల కార్యకలాపాల్లో అతిక్రమణలను గమనించిన ప్రభుత్వం మరింత పటిష్ఠమైన నిబంధనలతో ఢిల్లీ ప్రజలకోసం కొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది. బెంగుళూరు, గుర్గావ్ లలో బైక్ టాక్సీ, రెంట్ ఎ బైక్ పథకాల ఆపరేటర్లు నిబంధనలను అతిక్రమించి ప్రైవేటు వాహనాలను నడుపుతున్నారు. నగరంలోని పర్యాటకులు, ప్రజలను గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా చేసుకున్న'ఆప్' ప్రభుత్వం ఫిబ్రవరి నెలలోనే 'రెంట్ ఎ బైక్' (అద్దెకు బైక్) పథకానికి ఆమోదం తెలిపినా నోటిఫై చేయలేదు. ప్రస్తుతం ఈ బైక్ టాక్పీ పథకం పరిశీలనలో ఉందని, ఈ పథకంలో కేవలం వాణిజ్య వాహనాలను మాత్రమే అనుమతిస్తారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పథకాన్ని రవాణా శాఖ అధ్యయనం చేసిన తర్వాత చివరి నోటిఫికేషన్ విడుదల చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ నగరంలో 'బైక్ టాక్సీ', 'రెంట్ ఎ బైక్' పథకాలపై దృష్టి పెట్టామని, త్వరలో అన్ని అంశాలను పరిశీలించి పథకాలపై చివరి ప్రకటనను విడుల చేస్తామని అధికారులు చెప్తున్నారు. అద్దెకు బైక్ పథకంలో పర్యాటకులు బైక్ కౌంటర్ల వద్ద వారి గుర్తింపును సమర్పించి బైక్ ను తీసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement