-
ఇక వర్క్ ఫ్రం ఆఫీస్.. ఫ్లాట్ అద్దె రూ.2.5 లక్షలు.. 25 లక్షల అడ్వాన్స్!
బెంగళూరు: ఫ్లాట్ అద్దె అడ్వాన్సు రూ.25 లక్షలంటూ వచ్చిన ట్వీట్పై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ అనంతరం టెక్ ఉద్యోగులు వర్క్ఫ్రం హోం నుంచి తిరిగి ఆఫీసులకు వస్తుండటంతో బెంగళూరులో ఇళ్ల అద్దెలు ఏ స్థాయిలో పెరిగాయనేందుకు ఉదాహరణ ఇది. నగరంలోని హెచ్ఎస్ఆర్ లేఔట్లో ఓ ఫ్లాట్కు అద్దె నెలకు రూ.2.5 లక్షలు కాగా, అడ్వాన్స్ రూ.25 లక్షలంటూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్కు పెద్ద సంఖ్యలో యూజర్లు ఛలోక్తులు సంధించడంతోపాటు మండిపోతున్న ధరలపై ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా అనంతరం ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోంతోపాటు ఆఫీసుల్లోనూ విధులకు హాజరవ్వాలంటూ ఉద్యోగులకు ఆప్షన్ ఇచ్చాయి. చాలా వరకు కంపెనీలు మళ్లీ ఆఫీసులకొచ్చి డ్యూటీ చేయాలంటూ ఆదేశాలిచ్చాయి. ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు చేరుతుండటంతో ఇళ్ల అద్దెలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ఖరీదైన ప్రాంతాల్లోనైతే యజమానులు మరీ ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని తేజస్వీ శ్రీవాస్తవ అనే టెక్ కంపెనీ సీఈవో ట్విట్టర్లో ప్రస్తావించారు. హెచ్ఎస్ఆర్ లేఔట్లోని 4 బీహెచ్కే ఫ్లాట్కు నెల వారీ రెంట్ రూ.2.5 లక్షలు, డిపాజిట్ రూ.25 లక్షలంటూ ఉన్న ప్రకటనను చూసి ఆయన షాకయ్యారు. అడ్వాన్స్కు అవసరమైన మొత్తానికి లోన్ ఆప్షన్ కూడా ఉండటం ఆయన్ను మరింత షాక్కు గురి చేసింది. ఆయన ఈ ప్రకటనను స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్లో పెట్టారు. ‘కిడ్నీ అమ్ముకోవడానికి కూడా ఆప్షన్ ఉంటే బాగుండేది’అంటూ శ్రీవాస్తవ క్యాప్షన్ ఇచ్చారు. ఆ ట్వీట్లపై కామెంట్లు పోటెత్తాయి. కొందరు నెటిజన్లు ఇంటి అద్దెలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా ఇంకొందరు రుణం కోసం దరఖాస్తు చేసుకునే ఆప్షన్పై మండిపడ్డారు. చివరి రెండు సున్నాల ముందు చుక్క పెట్టడం మరిచిపోయారేమో అంటూ మరో వ్యక్తి వ్యంగ్యంగా కామెంట్ చేశారు. They should add an option: Apply for Kidney Donation.#Bangalore #HouseRent#Bengaluru #HSRLayout@peakbengaluru pic.twitter.com/KPyeKmkfyF — Tejaswi Shrivastava (@trulytazz) July 27, 2023 -
పెరగనున్న మాల్స్ ఆదాయం..ఎందుకంటే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఏడాదితో పోలిస్తే 2022–23లో మాల్స్ అద్దె ఆదాయం 30 శాతం పెరుగుతుందని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా నివేదిక వెల్లడించింది. ‘ప్రధానంగా డిమాండ్ పెరగడం, కోవిడ్–19 వ్యాక్సిన్లు అత్యధికులకు ఇవ్వడం, మల్టీఫ్లెక్స్లు పునఃప్రారంభం ఇందుకు కారణం. 2021 ఆగస్ట్ నుంచి రిటైల్ మాల్స్ కార్యకలాపాల రికవరీ ప్రారంభమైంది. ఒమిక్రాన్ కారణంగా క్లుప్త విరామం మినహా 2021–22 అర్ధ భాగం మెరుగ్గా కొనసాగింది. మూడవ త్రైమాసికంలో రిటైల్ వ్యాపారం విలువ పరంగా కోవిడ్ ముందస్తు స్థాయికి చేరుకుంది. నాల్గవ త్రైమాసికంలో ఈ వ్యాపార విలువను మించిపోయింది. 2022–23 మూడవ త్రైమాసికంలో కోవిడ్ పూర్వ స్థాయిలో వినియోగదార్ల రాక ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మాల్స్కు 2019–20 స్థాయి కంటే 4–6 శాతం అధిక అద్దె ఆదాయం సమకూరుతుంది. ఆక్యుపెన్సీ మరింత మెరుగు అవుతుంది’ అని ఇక్రా వివరించింది. -
విత్తన ’గూడు’కు స్థలం కరువు..!
► ఏళ్ల తరబడి అద్దె భవనంలో అవస్థలు ►మూలుగుతున్న రూ.50 లక్షల నిధులు ► అద్దెల రూపంలో ఏటా లక్షల ఖర్చు ►స్థలం కోసం ఏడేళ్లుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు ►ఇబ్బందులు పడుతున్న రైతులు ► స్థల సేకరణలో నిలువెల్లా నిర్లక్ష్యం ఒంగోలు టూటౌన్ : జిల్లాలో విత్తనాభివృద్ధి సంస్థకు గూడు కరువైంది. అధికారులు, సిబ్బంది ఏళ్ల తరబడి అద్దె భవనాల్లో నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వం అద్దెలకు లక్షలు వ్యయం చేస్తున్నారు తప్పితే సొంతగూడు గురించి పట్టించుకోలేదు. నెలకు కార్యాలయానికి రూ.11 వేలు, విత్తన గోడౌన్కు రూ.85 వేలు అద్దె చెల్లిస్తున్నారు. సొంత భవనాలకు స్థలం కేటారుుంచడంలో పాలకులు సంవత్సరాల పాటు కాలయాపన చేస్తున్నారు. అసలు విత్తనాభివృద్ధి సంస్థ ఎప్పుడు ఎక్కడికి మారుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. ఫలితంగా ఏటా రైతులు విత్తనాల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అద్దె భవనం కష్టాలు: జిల్లాలో విత్తనాభివృద్ధి సంస్థకు సొంత గూడు లేకపోవడంతో దశాబ్దాలుగా అద్దె భవనంలో నెట్టుకొస్తున్నారు. అదీ కార్యాలయం ఒక చోట ఉంటే విత్తన గోడౌన్ మరొక చోట ఉండేది. తొలుత బైపాస్రోడ్డులోని ఫ్లైఓవర్ బ్రిడ్జికి ఉత్తరవైపున ఒక అద్దెభవనంలో కొంతకాలం నడిచింది. అక్కడ నుంచి మారి దక్షిణం వైపున మరొక అద్దెభవనంలోకి మార్చాల్సి వచ్చింది. అక్కడ గోదాములు సరిపోక తిరిగి పండరీపురంలో ఒక అద్దె కార్యాలయంలో కొంతకాలం నిర్వహించారు. మళ్లీ అక్కడ నుంచి ఒంగోలు సమీపంలోని త్రోవగుంట వద్దకు మార్చారు. దాదాపు ఆరేళ్లలో ఐదు చోట్లకు కార్యాలయం మారిందంటే విత్తన గూడుకు అద్దె కష్టాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కార్యాలయాన్ని అధికారులు ఎప్పుడు ఎక్కడికి మారుస్తారో రైతులు వెతుక్కొని వెళ్లాల్సిన పరిస్థితి జిల్లాలో నెలకొంది. ప్రస్తుతం ఇప్పుడు దక్షిణ బైపాస్కు తూర్పున అంజయ్య రోడ్కు కొద్ది దూరంలో ఉంది. విత్తనగోడౌన్ ఒంగోలుకు సమీపంలోని త్రోవగుంట వద్ద ఒక అద్దె భవనంలో ఏర్పాటు చేశారు. అందుబాటులో రూ.50 లక్షల నిధులు: విత్తనాభివృద్ధి సంస్థ సొంత కార్యాలయం ఏర్పాటుకు 2010వ సంవత్సరంలో ప్రభుత్వానికి విత్తనాభివృద్ధి సంస్థ అధికారులు ప్రపోజల్స్ అప్పటి కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి వెళ్లారుు. విత్తన ప్రాసెసింగ్ యూనిట్, స్టోరేజ్ గోడౌన్, కోల్డ్ స్టోరేజ్, ఆఫీస్ మొత్తానికి ఐదు ఎకరాలు స్థలం అవసరమని తేల్చారు. 2013వ సంవత్సరంలో భవన నిర్మాణానికి రూ.2. 62 కోట్లు అవసరమని ఏపీఎంఐడీసీ ఇంజనీరింగ్ శాఖ అధికారులు అంచనాలు వేశారు. అప్పటి నుంచి నేటి వరకు స్థలం కోసం కలెక్టర్లు, పాలకుల దృష్టికి విత్తనాభివృద్ధి సంస్థ అధికారులు తీసుకెళ్తూనే ఉన్నారు. ఆ క్షణాన ఉన్నతాధికారులు రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం.. ఆ తరువాత వదిలేయడం పరిపాటిగా మారింది. కానీ స్థల సేకరణను రెవెన్యూ అధికారులు ఒక కొలిక్కి తీసుకురాలేకపోతున్నారు. ఏడేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. అప్పటి నుంచి కేంద్రం విడుదల చేసిన రూ.50 లక్షల నిధులు మూలుగుతూనే ఉన్నారుు. అద్దెల రూపంలో లక్షల వ్యయం: విత్తనాభివృద్ధి సంస్థకు ఏటా అద్దెలకు లక్షలు ఖర్చుపెడుతున్నారు. కార్యాలయానికి నెలకు రూ.11 వేలు, గోడౌన్కు రూ.85 వేల నెలకు చెల్లిస్తున్నారు. వీటితో పాటు రారుుతీ విత్తన సరఫరా సమయంలో విత్తనాలు ప్రైవేట్ కోల్డ్ స్టోరేజ్లలో నిల్వ ఉంచాల్సి వస్తోంది. ప్రస్తుత రబీసీజన్లో రైతులకు 60 వేల క్వింటాళ్లను సరఫరా చేశారు. వీటిని మూడు నెలలుగా ప్రైవేట్ కోల్డ్ స్టోరేజ్లో పెట్టాల్సి వచ్చింది. క్వింటాకు రూ.112 అద్దె చొప్పున వేల రూపాయాలు చెల్లిస్తున్నారు. ఇలా మొత్తం దాదాపు ఏటా రూ.12 లక్షల వరకు అద్దెలకే చెల్లించాల్సి వస్తోంది. ఈ అదనపు భారం అంతా రైతులపైనే పడుతుంది. నాణ్యమైన విత్తనం కొరత : జిల్లా మొత్తం మీద 6 లక్షలకు పైగా రైతులు ఉన్నారు. 5.40 లక్షల వరకు పట్టాదారు భూములు కలిగిన అన్నదాతలు ఉన్నారు. 70 శాతం వరకు వ్యవసాయంపైనే ఆధారపడి కుటుంబాలు జీవిస్తున్నారుు. ఏటా రబీ, ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వం అందించే లక్షలాది రూపాయల రారుుతీ విత్తనాలను ఈ కార్యాలయం నుంచే రైతులకు సరఫరా చేస్తారు. అన్నదాతకు చెందిన పొలాల్లోనే మూలవిత్తనాన్ని పెట్టిచ్చి..పంటకొచ్చాక తిరిగి మళ్లీ సేకరిస్తుంటారు. వీటిని ప్రాసెసింగ్ చేసి మొలక శాతం పరీక్షించి అనంతరం బాగుంటే తిరిగి రైతులకు సరఫరా చేస్తారు. ఇంత ప్రాముఖ్యం ఉన్న విత్తనాభివృద్ధి సంస్థ ప్రభుత్వ నిర్లక్ష్యంలో కొట్టుమిట్టాడుతోంది. ఏపీ సీడ్స్ మేనేజర్ ఏమన్నారంటే ... కార్యాలయం స్థలం కోసం రెవెన్యూ అధికారులను సంప్రదిస్తూనే ఉన్నామని ఏపీ సీడ్స మేనేజర్ కె.బుచ్చమ్మ తెలిపారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ దృష్టికి ఇటీవల తీసుకెళ్లామని వివరించారు. స్థలం కేటారుుంచేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఒంగోలు ఆర్డీవోకి చెప్పారన్నారు. ఏపీ సీడ్స్ కు సహకరించని సర్వేయర్లు విత్తనాభివృద్ధి సంస్థ భవన నిర్మాణానికి సొంత స్థల సేకరణలో ఆ శాఖ సిబ్బందికి స్థానిక సర్వేయర్లు సహకరించడం లేదన్న ఆరోపణలు ఉన్నారుు. జిల్లా కేంద్రానికి సమీపంలోని కొత్తపట్నం, మద్దిపాడు, మార్టూరు, ఎస్ఎన్పాడు, ఒంగోలు మండలాల పరిధిలోని ప్రభుత్వ స్థలాలను పలు మార్లు పరిశీలించినా.. ఎక్కడా స్థలం కొలిక్కిరాలేదు. అన్ని చోట్ల ప్రభుత్వ స్థలాలకు స్థానికులు అడ్డుంకుల నుంచి ఎదురవడం.. తిరిగి రావడం.. పాలకులు పట్టించుకోకపోవడం పరిపాటిగా మారింది. ఇటీవల సంతనూతలపాడు మండలం మైనంపాడువద్ద ఉన్న డొంకపోరంబోకు, అసైన్డ భూమిని స్వాధీనం చేసుకొని ఇవ్వడంలో రెవెన్యూ అధికారులు తాత్సారం చేసినట్లు సమాచారం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు
డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం
చంద్రబాబూ 14 ఏళ్లు ఏం చేశావు?
నీట్కు ఏర్పాట్లు పూర్తి
‘పోస్టల్ బ్యాలెట్’ను వినియోగించుకోండి
పార్లమెంట్లో గళం వినిపిస్తా..
స్వర్ణకవచాలంకరణలో రామయ్య
హామీలపై ఆశలు..
నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement