-
యువత ‘కర్పూరి’ బాటన సాగాలి: మోదీ
న్యూఢిల్లీ: ఈసారి గణతంత్ర పరేడ్ మహిళా శక్తికి అద్దం పట్టడం ద్వారా ప్రత్యేకతను చాటనుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎన్సీసీ కేడెట్లు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లతో ఆయన బుధవారం ముచ్చటించారు. ‘‘బిహార్ మాజీ సీఎం దివంగత కర్పూరీ ఠాకూర్ జీవితం గురించి తెలుసుకోండి. ఆయన ఆచరించి చూపిన మానవీయ విలువలను పుణికిపుచ్చుకోండి. ఆయన ఆదర్శాలను జీవితంలో భాగంగా మలచుకోండి. తద్వారా మీ వ్యక్తిత్వం ఆకాశమంత ఎదుగుతుంది’’ అని యువతకు సూచించారు. దేశం ముందనే భావనతో సాగాలని పేర్కొన్నారు. దుర్భర దారిద్య్రంలో జన్మించినా మొక్కవోని కృషి, పట్టుదలతో ఠాకూర్ సీఎం స్థాయికి ఎదిగారని మోదీ చెప్పారు. -
జాతీయ జెండాను ఆవిష్కరించిన రామ్నాథ్ కోవింద్
సాక్షి, న్యూఢిల్లీ: భారత 73వ గణతంత్ర వేడుకలు ఢిల్లీలోని రాజ్పథ్లో బుధవారం అట్టహాసంగా జరిగాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సాయుధ దళాలు 21 తుపాకులతో సైనిక వందనం సమర్పించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ దంపతులు, కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్ సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో వీక్షకుల సంఖ్యను కుదించారు. 2500 మందిని రాజ్పథ్లో పరేడ్ చూసేందుకు అనుమతించారు. 15ఏళ్లలోపువారికి అనుమతి లేదు. కరోనా నేపథ్యంలో ఈసారి గణతంత్ర వేడుకలకు విదేశీ అతిథులను ఆహ్వానించలేదు. ఆకట్టుకున్న సైనిక పరేడ్ రాజ్పథ్లో సైనిక పరేడ్ అదరహో అనిపించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహిస్తున్న వేళ.. భారత సైనిక సామర్థ్యాన్ని, దేశ సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేలా రిపబ్లిక్ డే పరేడ్ సాగింది. 16 కవాతు విభాగాలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాయి. సైన్యం, నౌకాదళం, వాయుసేన, కేంద్ర పారామిలటరీ దళాలు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ సిబ్బంది మార్చ్ ఫాస్ట్లో పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75ఏళ్లు పూర్తవుతున్న సందర్బంగా.. భారతీయ వాయుసేన 75 యుద్ధవిమానాలతో గ్రాండ్ ప్లైపాస్ట్ నిర్వహించింది. రఫేల్, సుఖోయ్, జాగ్వర్, అపాచీ వంటి ఫైటర్ జెట్స్ ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. -
కిసాన్ పరేడ్కు గ్రీన్సిగ్నల్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో గణతంత్ర వేడుకలకు భంగం కలిగించకుండా కిసాన్ గణతంత్ర పరేడ్ నిర్వహించుకోవచ్చని ఢిల్లీ పోలీసులు ఆదివారం సాయంత్రం చెప్పారు. రైతుల డిమాండ్ల పట్ల ఉన్న గౌరవంతోనే ఈ కార్యక్రమానికి అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. రైతులు మంగళవారం ఢిల్లీ నగరంలోకి ప్రవేశించవచ్చని, అయితే, గణతంత్ర దినోత్సవాలకు ఎలాంటి విఘాతం కలిగించరాదని షరతు విధించారు. ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేశారు. రైతులు వాటిని కచ్చితంగా పాటించాలన్నారు. రాజ్పథ్లో పరేడ్ ముగిసిన తర్వాతే రైతుల ట్రాక్టర్ పరేడ్ ప్రారంభమవుతుందన్నారు. పోలీసు అధికారులు తాజాగా రైతు సంఘాల నేతలతో భేటీ అయ్యారు. శాంతియుతంగా ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తామని నేతలు స్పష్టం చేశారు. దీంతో పోలీసులు ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చారు. ట్రాక్టర్ ర్యాలీకి అనుమతిపై తుది నిర్ణయం ఢిల్లీ పోలీసులదే అని సుప్రీంకోర్టు తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. ర్యాలీ కోసం పోలీసులు బహుళ మార్గాలను సూచించారు. సింఘు, టిక్రీ, ఘాజీపూర్ బోర్డర్ పాయింట్ల నుంచి బయలుదేరే ట్రాక్టర్లు వేర్వేరు మార్గాల్లో ప్రయాణించి, కూండ్లీ మానేసర్ పాల్వాల్ ఎక్స్ప్రెస్ వే వద్ద కలుసుకుంటాయని వెల్లడించారు. ర్యాలీ సందర్భంగా జాతి వ్యతిరేక నినాదాలు చేయరాదని, అనుచితమైన, రెచ్చగొట్టే రాతలతో కూడిన పోస్టర్లు ప్రదర్శించరాదని ఆంక్షలు విధించారు. రైతు సోదరులపై తమకు నమ్మకం ఉందని, కిసాన్ గణతంత్ర పరేడ్ను శాంతియుతంగా నిర్వహిస్తారని విశ్వసిస్తున్నట్లు ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ట్రాక్టర్ పరేడ్పై పాక్ కుతంత్రం రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్ పరేడ్లో అలజడి సృష్టించేందుకు పాకిస్తాన్ కుట్రలు పన్నుతున్నట్లు ఢిల్లీ పోలీసులు ఆదివారం వెల్లడించారు. ఈ పరేడ్పై రెచ్చగొట్టే ప్రచారం సాగించి, ప్రజలను తప్పుదోవ పట్టించి, తద్వారా హింసను ప్రేరేపించడానికి పాకిస్తాన్లో జనవరి 13 నుంచి 18వ తేదీ వరకు 300 ట్విట్టర్ ఖాతాలను సృష్టించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పరేడ్ ప్రశాంతంగా జరగడానికి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ట్రాక్టర్ పరేడ్ విషయంలో పుకార్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దని ప్రజలకు సూచించారు. ట్రాక్టర్ పరేడ్లో రైతు శకటాలు ట్రాక్టర్ పరేడ్లో శకటాలను ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు చెప్పారు. గ్రామీణ జీవితం, సంప్రదాయ, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పశు పోషణ, మహిళా రైతుల భాగస్వామ్యం, భారత్లో రైతు ఉద్యమాల చరిత్ర, రైతన్నల ఆత్మహత్యలు, కొత్త సాగు చట్టాల వల్ల జరిగే నష్టాలు తదితర కీలక అంశాలను ప్రతిబింబించే శకటాలు పరేడ్లో ప్రధాన ఆకర్షణగా మారనున్నాయని వెల్లడించారు. అన్ని రాష్ట్రాల నుంచి ట్రాక్టర్లు తరలివస్తాయని, ఇందులో 30 శాతం శకటాలే ఉంటాయని పేర్కొన్నారు. ► మహారాష్ట్రలోని విదర్భలో రైతుల ఆత్మహత్యలు అధికం. ఈ అంశంపై శకటం రూపొందించేందుకు ఆ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల పిల్లలు సన్నద్ధమవుతున్నారు. ► ప్రతి ట్రాక్టర్, శకటంపై మూడు రంగుల జాతీయ జెండా ఉంటుంది. ► ట్రాక్టర్ పరేడ్లో రైతులను ఉత్తేజపర్చడానికి జానపద, దేశభక్తి గీతాలను వినిపిస్తారు. ► ట్రాక్టర్ ర్యాలీని సమన్వయం చేసుకోవడానికి ప్రతి నిరసన ప్రాంతం వద్ద ఒక వార్రూమ్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో వార్రూమ్లో 40 మంది సభ్యులను నియమిస్తున్నారు. వీరిలో డాక్టర్లు, సెక్యూరిటీ –సిబ్బంది, సోషల్ మీడియా మేనేజర్లు ఉంటారు. ► ట్రాక్టర్ పరేడ్ జరిగే మార్గంలో వేర్వేరు చోట్ల 40 అంబులెన్స్లను సిద్ధంగా ఉంచుతారు. ర్యాలీలో పాల్గొనేవారు అస్వస్థతకు గురైతే వెంటనే వైద్య సేవలు అందిస్తారు. ► మెకానిక్ల బృందాన్ని కూడా రంగంలోకి దించుతున్నారు. ర్యాలీలో ఎక్కడైనా వాహనం ఆగిపోతే వెంటనే మరమ్మతు చేస్తారు. ► వలంటీర్లకు బ్యాడ్జ్లు, గుర్తింపు కార్డులు అందజేస్తారు. ► భద్రతను పర్యవేక్షించడానికి మాజీ సైనికుల సేవలను వాడుకోనున్నారు. ► వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే రైతులు ఢిల్లీ నగరంలోకి ప్రవేశించడానికి వీలుగా సింఘు, టిక్రీ బోర్డర్ పాయింట్ల వద్ద బారికేడ్లను తొలగించడానికి పోలీసులు అంగీకరించారు. రివర్స్గేర్లో పంజాబ్ నుంచి ఢిల్లీకి.. ఢిల్లీలో జనవరి 26న ర్యాలీలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో రైతులు ట్రాక్టర్లపై తరలివస్తున్నారు. వివా దాస్పద కొత్త వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పంజాబ్కు చెందిన ఓ రైతు ట్రాక్టర్ను రివర్స్ గేర్లో వెనక్కి నడుపుతూ ఢిల్లీకి బయలుదేరాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రివర్స్ గేర్లో వెళ్తున్న ట్రాక్టర్ నేడు ముంబైలో భారీ ర్యాలీ ముంబై: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించేందుకు రంగం సిద్ధమయ్యింది. రైతుల ర్యాలీ జరిగే ఆజాద్ మైదాన్లో అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్, అధికార మహా వికాస్ అఘాడీ నేతలు ఈ ర్యాలీలో పాల్గొని, రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం రైతు సంఘాల నాయకులు రాజ్భవన్కు చేరుకొని గవర్నర్కు వినతిపత్రం సమర్పిస్తారు. సాగు చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని కోరుతారు. రైతుల పోరాటానికి ఎంవీఏ భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. ర్యాలీలో పాల్గొనే అన్నదాతలకు ఆహారం సరఫరా చేసేందుకు కార్మిక సంఘాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చాయి. సం యుక్త షేట్కారీ కామ్గార్ మోర్చా ఆధ్వర్యంలో ఆజాద్ మైదాన్లో జనవరి 26వ తేదీ వరకు బైఠాయించాలని, గణతంత్ర దినో త్సవం సందర్భంగా అక్కడే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించారు. ముంబైలో ఆదివారం జరిగిన ర్యాలీ దృశ్యం -
గణతంత్ర పరేడ్లో తెలంగాణకు నిరాశ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ఆవిర్భావం తరువాత తొలిసారిగా జరుగుతున్న గణతంత్ర పరేడ్లో పాల్గొనేందుకు తెలంగాణ శకటానికి అనుమతి లభించలేదు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాల్గొనడంతోపాటు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరుగుతున్న ఈ గణతంత్ర పరేడ్ ప్రత్యేకత సంతరించుకుంది. అయితే, తొలిసారి వేడుకల్లోనే తెలంగాణ శకటంనకు అనుమతి లభించకపోవడం తెలంగాణ ప్రజలను నిరాశకు గురిచేస్తోంది. తెలంగాణ నుంచి ‘బోనాలు పండుగ’ శకటం ప్రదర్శనకు అనుమతి కోరుతూ తెలంగాణ ప్రభుత్వం రక్షణ మంత్రిత్వశాఖకు ప్రతిపాదనలు పంపింది. దీనిపై సీఎం కేసీఆర్ ఆర్థికమంత్రి (అప్పటి రక్షణశాఖమంత్రి) అరుణ్జైట్లీకి లేఖ రాశారు. అయినప్పటికీ ఎంపిక కమిటీ తెలంగాణ శకటాన్ని తిరస్కరించింది. ఇదిలాఉండగా, ఏపీ పంపిన ‘సంక్రాంతి శకటం’కు రక్షణ మంత్రిత్వశాఖ అనుమతి లభించడం విశేషం. ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా 2009లో గణతంత్రవేడుకల్లో రాష్ట్రం నుంచి ‘అన్నమయ్య’ శకటాన్ని ప్రదర్శించారు. ఐదేళ్ల విరామం తరువాత కొత్తగా ఏర్పాటైన ఏపీకి 2015లో అవకాశం లభించింది. -
గణతంత్ర పరేడ్కు జిల్లా విద్యార్థుల ఎంపిక
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్లైన్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 26న హైదరాబాద్లో నిర్వహించే పరేడ్లో పాల్గొనేందుకు జిల్లాలోని స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగం విద్యార్థులను ఎంపిక చేశారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి తరలివచ్చిన విద్యార్థులకు గురువారం స్థానిక మెడికల్ కళాశాల పక్కనున్న భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యాలయ ప్రాంగణంలో ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ఎంపికైన వారిలో వై. రామకృష్ణ(మున్సిపల్ హైస్కూల్-బాపట్ల), డి. వ్యాసు (జెడ్పీ హైస్కూల్-గణపవరం), పి. జయరాజ్(జెడ్పీ హైస్కూల్-అబ్బినేని గుంటపాలెం), డీవీ సాయిమనోజ్( అశోక్ హైస్కూల్-పెదనందిపాడు), కె. వంశీకృష్ణ, సీహెచ్ కృష్ణవేణి, కె.స్వాతి, టి. అనిత(సన్ జాన్స్ హైస్కూల్-కారంపూడి) ఉన్నారు. కార్యక్రమంలో గుంటూరు డివిజన్ ఉప విద్యాశాఖాధికారి పి. రమేష్, స్కౌట్స్, గైడ్స్ రాష్ట్ర కార్వ నిర్వాహక కమిషనర్ పి. శ్రీనివాసరావు, జోనల్ కార్యదర్శి డీఎల్ నారాయణ, జిల్లా కోశాధికారి రత్నాకర్, వ్యాయామ ఉపాధ్యాయులు బి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
నేహా కుటుంబానికి అండగా అమిత్షా..
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కుమార్తెకు అరుదైన గౌరవం!
వరల్డ్కప్కు సెలక్టయ్యాడు.. తొలిసారి డకౌటయ్యాడు! వీడియో వైరల్
ఈవీఎంలపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
ఎందుకంత ఓవరాక్షన్.. వాళ్లతో పోలిస్తే నువ్వెంత?: పూరి
వడగళ్ల వానతో దెబ్బతిన్న విమానం.. ఒడిశాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement